
సింధు మరో నెల తర్వాత...
హైదరాబాద్: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ రజత పతక విజేత పీవీ సింధు మరో నెల రోజుల తర్వాత తొలి టోర్నీ ఆడనుంది. అక్టోబరు 18 నుంచి జరిగే డెన్మార్క్ ఓపెన్లో ఆడుతుంది. ఈ లోగా జరిగే రెండు పెద్ద టోర్నీలు జపాన్ ఓపెన్, కొరియా ఓపెన్లో ఆడటం లేదు. గతేడాది డెన్మార్క్ ఓపెన్లో సింధు రన్నరప్గా నిలిచింది. సూపర్ సిరీస్ టోర్నీలలో తనకు ఇదే ఉత్తమ ప్రదర్శన.