జపాన్ ఓపెన్‌కు సైనా డుమ్మా | Saina Nehwal to skip Japan Open | Sakshi
Sakshi News home page

జపాన్ ఓపెన్‌కు సైనా డుమ్మా

Published Fri, Sep 6 2013 1:34 AM | Last Updated on Thu, Jul 11 2019 8:00 PM

జపాన్ ఓపెన్‌కు సైనా డుమ్మా - Sakshi

జపాన్ ఓపెన్‌కు సైనా డుమ్మా

న్యూఢిల్లీ: యూరోపియన్ సర్క్యూట్‌లో బరిలోకి దిగే ముందు విశ్రాంతి కావాలని భావించిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జపాన్ ఓపెన్‌కు డుమ్మా కొట్టనుంది. సెప్టెంబరు 17 నుంచి 22 వరకు టోక్యోలో జరిగే ఈ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారులు పి.వి.సింధు, కశ్యప్ బరిలో దిగుతున్నారు.

 

మొత్తం మీద ఈ టోర్నీకి భారత్ నుంచి 8 మంది షట్లర్లు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయిప్రణీత్, శ్రీకాంత్ కూడా ఇందులో ఉన్నారు.  ‘ఐబీఎల్‌లో ఆడటం వల్ల అలసిపోయాను. కాబట్టి జపాన్ ఓపెన్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాను’ అని సైనా చెప్పింది. సైనా డెన్మార్క్ ఓపెన్ ద్వారా తిరిగి పోటీలు మొదలుపెట్టనుంది. ఆ టోర్నీలో ఈ భారత స్టార్ డిఫెండింగ్ చాంపియన్. కోచ్ గోపీచంద్ సలహా మేరకు సైనాకు విశ్రాంతి ఇచ్చేందుకు ‘బాయ్’ అంగీకరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement