సిడ్నీ టెస్టులోనూ మెరిసిన 'విరాట్' | virat kohli gets century | Sakshi
Sakshi News home page

సిడ్నీ టెస్టులోనూ మెరిసిన 'విరాట్'

Published Thu, Jan 8 2015 10:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

సిడ్నీ టెస్టులోనూ మెరిసిన 'విరాట్'

సిడ్నీ టెస్టులోనూ మెరిసిన 'విరాట్'

సిడ్నీ : ఆస్ట్రేలియాతో  ఇక్కడ గురువారం జరుగుతున్న చివరి,  నాల్గో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి మెరిశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ.

 

ఈ రోజు ఉదయం   వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (110) పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన రాహుల్ తన ఆడిన రెండో టెస్టులోనే సెంచరీ మార్కును చేరాడు.  అంతకుముందు టీమిండియా రోహిత్ శర్మను వికెట్ ను చేజార్చుకుంది.  రోహిత్ (53) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement