'రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు' | cm kcr asks minsters and mla's, mlc's to attend assembly without fail | Sakshi
Sakshi News home page

'రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు'

Published Thu, Dec 15 2016 4:51 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

'రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు' - Sakshi

'రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు'

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సూచించారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ఎల్ పీ సమావేశంలో అసెంబ్లీ కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన మార్గాలపై నేతలతో చర్చించారు.
 
సభలో ఎవరూ నోరు జారొద్దని, విపక్షాలు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని చెప్పారు. మంత్రులు పూర్తి తమ శాఖలను సంబంధించిన పూర్తి సమాచారంతో సభకు హాజరుకావాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా సభకు హాజరుకావాలని సూచించారు. పెద్దనోట్ల రద్దు చర్చలో అందరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు చెప్పుకోవాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement