ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండిపడటంతో.. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లా మానాల సమీపంలో గల ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు మంగళవారం రాత్రి భారీ గండి పడింది. దీంతో పెగడపల్లి, గొల్లపల్లి మండలాల పరిధిలోని చెరువులన్ని నిండిపోయాయి. సుద్దపల్లిలోని కొయ్యచెరువు, రాఘవపట్నంలోని మొగుళ్ల చెరువుకు గండి పడటంతో.. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద తగ్గు ముఖం పట్టడంతో సహాయక చర్యలు చేపట్టడానికి, పంటనష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు రంగంలోకి దిగారు.
ఎస్సారెస్సీ ప్రధాన కాలువకు గండి
Published Wed, Sep 21 2016 10:41 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement
Advertisement