హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బడ్జెట్లో కనబడకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణ బీజేఎల్పీ నేత డా.లక్ష్మణ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మంగళవారం హైదరాబాద్లో డా.కె.లక్ష్మణ్ సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మాటల గారడీతో కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులపై మరోసారి ఆలోచించాలని ఈ సందర్భంగా కె.లక్ష్మణ్... టీఆర్ఎస్ పార్టీకి సూచించారు.