సాక్షి, హైదరాబాద్: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపా రు. సోమవారం ఉదయం ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. ప్రజల పక్షాన నిలిచే బాధ్యతాయుత ప్రతి పక్ష పాత్రలో పార్టీని నిర్మాణాత్మకంగా నడపడంలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.