ఐదో ఏడాది ఇక్కడికి వచ్చా: నరసింహన్ | ESL Narasimhan Perform Puja for Khairatabad Maha Ganapathi | Sakshi
Sakshi News home page

ఐదో ఏడాది ఇక్కడికి వచ్చా: నరసింహన్

Published Fri, Aug 29 2014 12:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఐదో ఏడాది ఇక్కడికి వచ్చా: నరసింహన్ - Sakshi

ఐదో ఏడాది ఇక్కడికి వచ్చా: నరసింహన్

హైదరాబాద్: గవర్నర్‌గా ఐదో సంవత్సరం ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం సతీసమేతంగా ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకున్నారు. 60 అడుగుల శ్రీ కైలాస విశ్వరూపమహాగణపతికి ప్రథమపూజ చేశారు.

వినాయక చవితి రోజు ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటే సర్వవిజ్ఞాలు తొలగిపోతాయని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు భారీ గణనాథుడిని దర్శించుకునేందు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement