ఇద్దరు సీఎస్‌లకు కుందన్‌బాగ్‌లో నివాసాలు | in kudanbag residences two cs | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఎస్‌లకు కుందన్‌బాగ్‌లో నివాసాలు

Published Fri, May 2 2014 1:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు గ్రీన్‌ల్యాండ్స్ కుందన్‌బాగ్‌లోని ప్రభుత్వ భవనాల్లో అధికార నివాసాలను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు గ్రీన్‌ల్యాండ్స్ కుందన్‌బాగ్‌లోని ప్రభుత్వ భవనాల్లో అధికార నివాసాలను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఎస్ మహంతి అధికార నివాసంగా ఉన్న కుందన్‌బాగ్‌లోని నంబర్ 10 భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్‌కు, అక్కడే ఖాళీగా ఉన్న నంబర్ 4 భవనాన్ని తెలంగాణ రాష్ట్ర సీఎస్‌కు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్ 2 నుంచి రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో ఆయా భవనాలను ఇరు రాష్ట్రాల సీఎస్‌ల ప్రైవేట్ కార్యదర్శులకు అప్పగించాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement