
ఇనుగుర్తిలో కాకతీయుల ఆనవాళ్లు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో కాకతీయుల ఆనవాళ్లు బయటపడ్డాయి.
సుమారు 6 ఫీట్ల వైశాల్యంతో రెండు ఫీట్ల మందంతో ఉన్న ఈ రాతి విగ్రహం పైన వృత్తాకారంలో చెక్కిన తీరు చూసి గర్భగుడిలోని కల్యాణ మండపాల రాయిగా భావిస్తున్నారు. ఈ రాయితో పాటు మరో రెండు చిన్న రాళ్లు వాటిపై పుప్పాల చిత్రాలు ఉన్నాయి. ఈ బండరాయి కింద పెద్ద మొత్తంలో ఇసుక ఉండడం, మరో రాయి కూడా తీయరాని విధంగా ఉండడంతో ఇక్కడ కాకతీయుల నాటి నిర్మాణాలు ఉన్నట్లు భావిస్తున్నారు.