ఆలయంలోకి చొరబడిన నాగుపామును చూసిన భక్తులు భయంతో గుడి బయటకు పరుగులు తీశారు.
కుసుమంచి (ఖమ్మం) : ఆలయంలోకి చొరబడిన నాగుపామును చూసిన భక్తులు భయంతో గుడి బయటకు పరుగులు తీశారు. అయితే ఆలయంలోకి ప్రవేశించిన పాము ఎంతకూ వెళ్లకుండా గర్భగుడి బయట ఉన్న ద్వార పాలకుని విగ్రహాల చెంతే పడుకుండిపోయింది. దీంతో దాన్ని భగవంతుని పాముగా భావించిన ఆలయ పూజారి పాముకు పాలు పోసి పూజలు నిర్వహించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మంగళవారం జరిగింది. కాగా ఈ విషయం దావానలంలా పాకడంతో గ్రామస్తులు ఆలయం వద్దకు పోటెత్తారు.