king cobra
-
Video: కింగ్ కోబ్రాను చంపి పిల్లలను రక్షించిన పిట్ బుల్
పిట్బుల్ జాతికి చెందిన కుక్కలను ప్రమాదకరమైనవి పేర్కొంటారు. అనేకసార్లు మానవులపై ఇవి దాడికి పాల్పడటమే ఇందుకు కారణం. పెంచుతున్న యజమానులతో పాటు ఇతరులపై సైతం ఉన్నట్టుండి దాడి చేసి గాయపర్చుతుండటంతో వీటిని పెంచుకోవడంపై భారత్లో నిషేధం కూడా విధించారు. అయితే తాజాగా ఓ పిట్ బుల్ కుక్క.. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా దాడి నుంచి చిన్నారుల ప్రాణాలను కాపాడింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘాన్సీలో జరిగింది. శివగణేష్ కాలనీలో ఇంటి ముందు తోటలో పనిమనిషి పిల్లలు ఆడుకుంటుండా ఒక్కసారిగా పాము ప్రవేశించింది. కోబ్రాను గుర్తించిన పిల్లలు సాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు. చిన్నారుల అరుపులు విన్న పిట్ బుల్ జెన్నీ.. వెంటనే దాన్ని కట్టేసిన తాడును తెంచుకొని వారిని రక్షించేందుకు వచ్చింది.కుక్క దాని దవడల మధ్య కింగ్ కోబ్రాను బంధించి ముప్పుతిప్పలు పెట్టింది. తలతో వేగంగా తప్పుతూ దాన్ని చంపేందుకు ప్రయత్నించింది. దాదాపు అయిదు నిమిషాలపాటు పాముతో పోరాడింది. చివరికి పామును వేగంగా కొట్టడం ద్వారా అది చనిపోయింది. पिटबुल ने बचाई बच्चों की जान: झाँसी के एक घर के गार्डन में बच्चे खेल रहे थे, तभी एक साँप आ गया और देखते ही देखते पिटबुल डॉग साँप से भिड़ गया। पिटबुल ने साँप को पटक पटक कर मार डाला।#Pitbull #Jhansi pic.twitter.com/fqB77XW3Q6— Aviral Singh (@aviralsingh15) September 25, 2024ఇక ఈ ఘటనపై జెన్నీ యజమాని పంజాబ్ సింగ్ మాట్లాడుతూ.. తమ పిట్ బుల్ పామును చంపి ప్రాణాలను రక్షించడం ఇది మొదటిసారి కాదని తెలిపారు. తమ ఇల్లు పొలాల మధ్య ఉండటం వల్ల తరచుగా పాములు వస్తుంటాయిని, అయితే జెన్నీ ఇప్పటివరకు ఎనిమిది నుంచి, పది పాములను చంపినట్లు ఆయన తెలిపారు. -
పడక గదిలో కింగ్ కోబ్రా
శివమొగ్గ: ఇంటిలో ఒక చిన్న ఎలుక సంచరిస్తేనే మనకు రాత్రంతా భయంగా ఉంటుంది. అలాంటిది పడకగదిలోనే మహాసర్పం ఒకటి తిష్ట వేస్తే ఇక ఆ ఇంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తీర్థహళ్లి తాలూకా ఆగుంబె సమీపంలోని సిగువ సోమేశ్వర గ్రామంలో ఎదురైంది. అక్కడి ఇంటి పడకగదిలోకి సుమారు 9 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా ఒకటి చేరింది. ఒక పాత్రలో చేరి దర్జాగా పడకేసింది. ఇంటివారు చూసి వణికిపోయారు. అటవీసిబ్బంది పాములు పట్టే వ్యక్తిని పిలుచుకొచ్చి సురక్షితంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. -
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. 12 అడుగుల కింగ్ కోబ్రా పట్టివేత
బెంగుళూరు: కర్నాటకలో సుమారు 12 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రానుఅటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అగుంబే గ్రామంలో ఓ ఇంటి ముందున్న పొదల్లో సంచరిస్తూ కనిపించిన ఆ భారీ నల్లత్రాచు పామును వన్యప్రాణి అధికారులు చాలా చాకచక్యంగా బంధించి.. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. ఈ మేరకు అగుంబే రెయిన్ఫారెస్ట్ రీసర్చ్ స్టేషన్లో ఫీల్డ్ డైరెక్టర్గా చేస్తున్న అజయ్ గిరి పామును రెస్యూ చేసిన వీడియోను ఎస్స్లో పోస్టు చేశారు. దీనిని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా కూడా ఆ షేర్ చేశారు.కాగా అగుంబే గ్రామంలో ఇంటి కాంపౌండ్లోని పొదల్లో నక్కిన నాగుపాము.. రోడ్డు దాటుతుండగా గ్రామస్థులు గుర్తించారు. వెంటనే ఇంటి యజమాని కి తెలియజేయగా.. ఆయన అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు వచ్చే సరికి పాము ఓ చెట్టుపైకి ఎక్కి దాక్కుంది. అక్కడకు వచ్చిన వన్యప్రాణి సంరక్షణ అధికారి గిరి, టీమ్తో కలిసి పామును పట్టుకున్నారు.. ఓ రాడ్డు సాయంతో చెట్టు మీద నుంచి పామును కిందకు దించి, ఆ తర్వాత రెస్క్యూ బ్యాగ్లోకి పంపించారు. అనంతరం దానిని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు. View this post on Instagram A post shared by Ajay Giri (@ajay_v_giri) అయితే పామును పట్టుకుంటున్న వీడియోను గిరి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. చెట్టుమీద నెమ్మదిగా కదులుతున్న నల్లత్రాచు పాము ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పడుకు గురిచేస్తున్నాయి. ఇక పోతే కింగ్ కోబ్రాను పట్టుకున్న అజయ్ గిరిపై ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ప్రశంసలు వ్యక్తం చేశారు. -
శ్రీశైలంలో అద్భుతం..
-
పాతికేళ్ల అనుభవం.. పాముకాటుకే బలి
సాక్షి, బెంగళూరు: కాఫీనాడు చిక్కమగళూరులో వందలాది పాములను పట్టుకుని ప్రజలకు సహాయకారిగా ఉండే స్నేక్ నరేశ్ (55) చివరికి పాము కాటుకే మరణించాడు. చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా స్నేక్ నరేశ్గా పేరు గడించారు. ప్రత్యేకించి భారీ సైజులో ఉండే కింగ్ కోబ్రాలను ఆయన అలవోకగా పట్టుకుని బంధించేవాడు. వృత్తిపరంగా టైలర్ అయినప్పటికీ పాములను పట్టుకోవడంలో నేర్పరి అయ్యాడు. 2013 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు కూడా. జిల్లావ్యాప్తంగా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాముల సంరక్షణపై అవగాహన కల్పించేవాడు. పాములు మన స్నేహితులని, వాటిని చంపరాదని బోధించేవాడు. ఏం జరిగిందంటే కొద్దిరోజుల క్రితం చిక్కమగళూరులో హౌసింగ్ బోర్డులో ఒక నాగుపామును పట్టుకుని స్కూటీ వాహనంలో పెట్టి మరో పామును పట్టుకునేందుకు వెళ్లాడు. ఈ సమయంలో స్కూటీ సీటు తెరిచి పామును సంచి లోపలికి వేస్తుండగా చేతిపై నాగుపాము కాటు వేసింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. అయితే పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూశాడు. -
కర్ణాటక బీజేపీ ఆఫీస్లో కింగ్ కోబ్రా.. సీఎం బసవరాజ్ బొమ్మై పక్కనే..
బెంగళూరు: కర్ణాటక శిగ్గావ్లోని బీజేపీ క్యాంప్ ఆఫీస్లో కింగ్ కోబ్రా కన్పించడం కలవరపాటుకు గురిచేసింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఆఫీస్లో ఉన్న సమయంలో కోబ్రా కన్పించడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. పామును పట్టుకునే సమయంలో సీఎం బొమ్మై అక్కడే ఉన్నారు. అయితే కింగ్ కోబ్రా వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు. #WATCH Karnataka CM Basavaraj Bommai reaches the BJP camp office in Shiggaon, a snake found in the building compound slithers away The snake was later captured and the building compound secured pic.twitter.com/FXSqFu0Bc7 — ANI (@ANI) May 13, 2023 #WATCH A snake which had entered BJP camp office premises in Shiggaon, rescued; building premises secured amid CM's presence pic.twitter.com/1OgyLLs2wt — ANI (@ANI) May 13, 2023 కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. కేవలం 60-65 స్థానాలకే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మంచి 130 స్థానాల్లో మెజార్టీలో దూసుకుపోతోంది. అటు కింగ్ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్ కేవలం 22 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. చదవండి: కాంగ్రెస్ను గెలిపించిన ఆరు మంత్రాలివే.. -
వైరల్ వీడియో: ఈ కోబ్రా కాటేస్తే అంతే సంగతి
-
మూడు కింగ్ కోబ్రాలు.. ఒకే చోట తారసపడితే..
అనకాపల్లి: కింగ్ కోబ్రా(రాచనాగు).. ఒకటి ఎదురుపడితేనే గుండెల్లో దడదడ మొదలవుతుంది. అలాంటిది ఒకేసారి మూడు కింగ్ కోబ్రాలు.. ఒకే చోట తారసపడితే.. చెప్పేందుకేముంది..? హడలెత్తుతూ పరుగులు తీయడమే..! దేవరాపల్లి మండలంలోని తారువ గ్రామానికి ఆనుకుని ప్రవహిస్తున్న ఏటి బాడవ గెడ్డలో మంగళవారం మధ్యాహ్నం స్థానికులకు ఇదే పరిస్థితి ఎదురయింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటుగా వెళ్లిన యువకులకు మూడు కింగ్ కోబ్రాలు బుసలు కొడుతూ కనిపించాయి. దీంతో వారు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని చోడవరం అటవీశాఖ రేంజర్ బి.వి.వర్మకు ఫోన్లో తెలిపారు. ఆయన విశాఖపట్నానికి చెందిన ఈస్ట్రన్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు కంఠిమహంతి మూర్తికి సమాచారం అందించారు. అటవీశాఖకు చెందిన బీట్ ఆఫీసర్ పి.శివకుమార్, ఎఫ్డీవో ఎం.నారాయణ తదితరులతో కలిసి పాములు ఉన్న ప్రాంతానికి మూర్తి చేరుకున్నారు. నీరు ప్రవహిస్తున్న గెడ్డకు ఆనుకుని పొదల్లో ఉన్న మూడు రాచ నాగులను సుమారు మూడు గంటల పాటు శ్రమించి అతి కష్టం మీద పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వీటిలో రెండు ఆడ జాతి పాములు కాగా ఒకటి మగ జాతికి చెందినదిగా నిర్ధారించారు. ఒక్కొక్కటి 13 నుంచి 15 అడుగుల పొడవు ఉన్నాయి. వీటిని చింతలపూడి పంచాయతీ సమ్మెద సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టినట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. -
కింగ్ కోబ్రాలు గూడు కట్టి.. గుడ్లు పెట్టి..
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన కింగ్ కోబ్రాలు గుడ్లు పెట్టేందుకు దిబ్బల మాదిరిగా నేలపై గూళ్లు కడతాయి. ఇందుకోసం ఆడ కింగ్ కోబ్రా గర్భం దాల్చిన వెంటనే ఎండిపోయిన వెదురు ఆకులను సేకరించి గూట్లో గుడ్లు పెట్టేందుకు అనువుగా సర్దుతుంది. అందులో 30 నుంచి 40 గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో నెల నుంచి నెలన్నర పాటు ఆహారం మానేసి గూట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత 15 నుంచి 30 రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు వస్తాయనగా తల్లిపాము గూడు విడిచి వెళ్లిపోతుంది. ఆ గూళ్లను అడవి పందులు, ముంగిసలు ఇతర జంతువులు తవ్వి గుడ్లను తినేస్తాయి. ఫలితంగా కింగ్ కోబ్రాల జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. ఎలా రక్షిస్తున్నారంటే.. మన రాష్ట్రంలో వెదురు పొదలు ఎక్కువగా ఉండే చోట కింగ్ కోబ్రా గూళ్లు ఎక్కువగా పెడుతున్నట్టు తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ గుర్తించాయి. పిల్లలు బయటకు వచ్చేంత వరకు వీటి గుడ్లను సంరక్షించేందుకు వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాయి. గిరి నాగులు గుడ్లు పెట్టే దశ మార్చిలో ప్రారంభమై జూలై, ఆగస్టులో ముగుస్తుంది. ఆగస్టు నెలలో గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి. ఆ గూళ్లను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అనకాపల్లి జిల్లా మాడుగులలో మొదటిసారి ఒక గూడును పరిరక్షించి గుడ్లలోంచి పిల్లలు వచ్చాక వాటిని అడవిలో వదిలేశారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ గూళ్లపై సర్వే పూర్తి చేయగా.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆడ గిరి నాగులు గుడ్లు పెట్టిన గూళ్లను వదిలి వెళ్లిపోయిన తరువాత గూళ్ల చుట్టూ వెదురు బొంగుల్ని పాతి ఇతర జీవులేవీ గుడ్లను తాకలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపై గూళ్ల చుట్టూ దోమ తెరలను ఆమరుస్తున్నారు. గుడ్లలోంచి గిరి నాగు పిల్లలు బయటకు వచ్చిన తరువాత వెదురు బొంగులు, దోమ తెరలను తొలగించి.. ఆ పిల్లల్ని స్వేచ్ఛగా అడవిలో వదిలేస్తున్నారు. వీటిని ఎందుకు కాపాడుకోవాలంటే.. కింగ్ కోబ్రా ఆహార గొలుసులో అగ్ర స్థానంలో ఉంటుంది. అంటే గిరి నాగులు ఇతర అన్ని రకాల పాముల్ని ఆహారంగా తీసుకుంటాయి. వీటి వల్ల ఇతర పాముల జనాభా నియంత్రణలో ఉంటుంది. పర్యావరణంలో కింగ్ కోబ్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. గిరి నాగులు ఉన్నచోట జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్టు లెక్కిస్తారు. సాధారణంగా ఇవి మనుషులు వస్తే.. తప్పించుకుని పోతాయి. ఈ పాముల కాటు వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు తక్కువ. కింగ్ కోబ్రాల రక్షణ కోసం పని చేస్తున్నాం ఐదారేళ్ల క్రితం వరకు గిరి నాగుల్ని స్థానికులు ఎక్కువగా చంపేసేవారు. ఆ సమయంలో అటవీ శాఖతో కలిసి కింగ్ కోబ్రా కన్జర్వేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టాం. వాటి సంరక్షణ, ఇతర పాము జాతులపై అధ్యయనం, పాము కాటు నివారణే లక్ష్యంగా పని చేశాం. మేం చేపట్టిన చర్యలు ఫలించి గిరి నాగుల్ని చంపడం చాలా వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం వాటి గూళ్లు, వాటి సంతతి పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నాం. – కంఠిమహంతి మూర్తి, అధ్యక్షుడు, తూర్పు కనుమల వైల్డ్ సొసైటీ -
వీడియో: అర్ధరాత్రి దుప్పట్లో దూరిన నాగుపాము.. తెల్లారి లేచేసరికి..
సాధారణంగా మనం సడెన్గా పామును చూడగానే ఒక్కసారిగా షాకై.. భయంతో దూరంగా పరుగుతీస్తాము. ఈ క్రమంలో ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. అలాంటిది ఓ నాగుపాము ఏకంగా మన దుప్పట్లోనే ఉంటే.. ఇకేంముంది దాదాపు ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే అనుకుంటారు కదా. పాపం ఓ యువకుడికి ఇలాంటి ఘటనే ఎదురైంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని సిరోజం గ్రామానికి చెందిన ఓ యువకుడు రాత్రి వేళ తన రూమ్లోకి వెళ్లి నిద్రపోవడానికి రెడీ అయ్యాడు. కింద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు. ఇంతలో ఓ నాగుపాము.. ఎక్కడినుంచి వచ్చిందో కానీ.. అతడి దుప్పట్లో దూరిపోయింది. కానీ, అతడిని మాత్రం కాటు వేయలేదు. అలా రాత్రంతా దుప్పట్లోనే ఉండిపోయింది. తీరా.. మరుసటి రోజు ఉదయం సదరు యువకుడికి మెలకువ వచ్చింది. బుసలు కొడుతున్న శబ్దం వినిపించడంతో ఎంటబ్బా అని నిద్రలోనే ఒక్కసారిగా అటువైపు తిరిగిచూశాడు. పడగవిప్పిన నాగుపాము కనిపించడంతో భయంతో బయటకు పరుగులు తీశాడు. సడెన్ షాక్ నుంచి వెంటనే తేరుకుని పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో, అక్కడికి వచ్చిన స్నేక్ క్యాచర్ దుప్పట్లో దూరిన నాగుపామును పట్టేశాడు. -
కింగ్ కోబ్రా, ముంగీస ఫైట్.. వీడియో వైరల్
కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన విషసర్పం. ఇది కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ ముంగీసకు కోబ్రా అంటే అసలు భయమే ఉండదు. ఎప్పుడూ దాంతో విరోచితంగా పోరాడుతుంది. ఎక్కువ సందర్భాల్లో కోబ్రాపై పైచేయి సాధిస్తుంది. ఈ రెండు భీకరంగా తలపడిన వీడియోలు అరుదుగా లభిస్తాయి. ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది తెగ వైరల్గా మారింది. లక్షల వ్యూస్, వేల లైక్స్తో దూసుకుపోతుంది. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే.. కింగ్ కోబ్రా, ముంగీస నేలపై కాకుండా బురద నీటిలో తలపడ్డాయి. కోబ్రా ఎన్నిసార్లు కాటేసేందుకు ప్రయత్నించినా.. ముంగీస మాత్రం చురుగ్గా తప్పించుకుంది. అంతేకాదు దాని వెంటపడి మరీ కయ్యానికి కాలుదువ్వింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇలాంటి ఫైట్ తాము ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. నీటిలో దాచుకోవడం ఎలాగో కోబ్రా నేర్చుకోవాలి, ఇలాంటి పోరాటల్లో ఎప్పుడూ ముంగీసదే విజయం అని మరో జూయర్ కామెంట్ చేశాడు. ఆ వీడియో మీరు చూసేయండి. View this post on Instagram A post shared by Animalia - Animal (@wildanimalia) చదవండి: కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి -
ఇదెక్కడి వింత.. వ్యక్తిని కాటేసి ప్రాణాలు కోల్పోయిన కింగ్ కోబ్రా!
ప్రపంచములో చాలా ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా(నల్లత్రాచు) ఒకటి. ఇవి అత్యంత విషపూరితమైనవి కూడా. కింగ్ కోబ్రా కాటు వేస్తే దాదాపు 15- 20 నిమిషాల్లోనే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ఉత్తర ప్రదేశ్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కింగ్ కోబ్రా మనిషిని కాటేసి చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. బాగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఖుషీనగర్ జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చాడు. వైద్యుల వద్దకు వెళ్లి కింగ్ కోబ్రా తనని రెండు సార్లు కాటు వేసిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే అది చనిపోయిందని తెలిపాడు. వైద్యులను నమ్మించేందకు ఆ వ్యక్తి చనిపోయిన కింగ్ కోబ్రాను పాలిథిన్ కవర్లో వేసి తన వెంట హాస్పిటల్కు తీసుకొచ్చి వైద్యులకు చూపించాడు. దీంతో పామును చూసిన వైద్యులు షాక్కు గురయ్యారు. అనంతరం సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ మీమ్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇందులో తాగిన వ్యక్తి హాస్పిటల్ బెడ్పై పడుకొని వైద్యులతో మాట్లాడటం కనిపిస్తోంది. తన పాదంపై ఉన్న పాము కాటుని చూపించి అవసరమైన వైద్యం చేయాలని వైద్యులను కోరాడు. నెట్టింట్లో ఈ వీడియో వైరల్గా మారింది. ఈఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shivam Kashyap (@kashyap_memer) -
నాగుపాము నుదుట ముద్దు! రివర్స్లో..
వైరల్: విషం ఉందని తెలిసి కూడా ప్రేమతో ఆ నాగుపాముకు ముద్దు పెట్టబోయాడు ఆ వ్యక్తి. కానీ, ఆ నాగుకి అతగాడి ప్రేమ నచ్చలేదేమో!. అందుకే ఒక్కపెట్టున మూతి మీద కాటుతో ఆ ప్రేమను అదే రేంజ్లో తిప్పి కొట్టింది. పాముల్ని పట్టి సురక్షితంగా వదిలేసి ఓ వ్యక్తి.. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకుని ఓ నాగుపామును ఒడిసి పట్టేసుకున్నాడు. అయితే.. అందరూ వీడియో తీస్తున్నారనే అత్యుత్సాహంలో అతగాడు.. ఆ పాము తల మీద ముద్దు పెట్టబోయాడు. కర్ణాటక శివమొగ్గ జిల్లా భద్రావతి బొమ్మనకట్టేలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ పాము అతని మూతిపై కాటేసింది. దీంతో అతగాడు పామును వదిలేశాడు. ఆపై ఒకతను ఆ పామును పట్టే యత్నం చేయగా.. అది అక్కడి నుంచి పారిపోయింది. కాటేయించుకున్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. పాము చిన్నది కావడం, విషం మోతాదు తక్కువగా ఉండడం, సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఈ లిప్ టు లిప్ ఘాటు ముద్దుపై సోషల్ మీడియాలోనూ అంతే రేంజ్లో ‘అలా జరగాల్సిందే..’ అంటూ సెటైర్లు పేలుతున్నాయి. -
కింగ్ కోబ్రా బుసలు.. రోషిణి ధైర్యానికి నెటిజన్లు ఫిదా
Kerala Lady Forest Officer: సాధారణంగా మనం పామును చూడగానే భయంతో వణికిపోతాం. మనకు దూరంగా పాము వెళ్తున్నా ఆగిపోతాం. అలాంటిది ఓ మహిళ ఎంతో చాకచక్యంగా ఓ పామును పట్టుకొని శభాష్ అనిపించుకుంది. ఆమె ధైర్యం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురం జిల్లాలోని ఉన్న కట్టక్కడ గ్రామంలోని ఓ ఇంటి వద్ద స్థానికులు పామును గుర్తించారు. దీంతో వారు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో అటవీ శాఖ ఉద్యోగి రోషిణి తన బృందంతో అక్కడికి చేరుకుంది. పామును కింగ్ కోబ్రాగా గుర్తించి ఎంతో చాకచక్యంగా ఆమె ఆ పామును పట్టుకున్నారు. అనంతరం పామును సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ సందర్భంగా రోషిణి ధైర్యాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. ఇదిలా ఉండగా రోషిణి పామును పట్టిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామేన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రోషిణి తిరువనంతపురంలోకి పారుతిపల్లి రేంజ్ ఆఫీసులో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లో ఉద్యోగం చేస్తోందన్నారు. ఆమె పాములను పట్టడంతో శిక్షణ పొందారని వెల్లడించారు. ఈ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి ఫిదా అయిపోయి.. ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. A brave Forest staff Roshini rescues a snake from the human habitations at Kattakada. She is trained in handling snakes. Women force in Forest depts across the country is growing up in good numbers. VC @jishasurya pic.twitter.com/TlH9oI2KrH — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) February 3, 2022 -
ఒకే చోట మూడు నాగుపాములు.. బహుశా ట్రయాంగిల్ లవ్ స్టోరీనా!
సాధారణంగా పాములను టీవీలో చూడటం తప్ప నేరుగా చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. కొందరైతే పాము పేరు విన్నా వణికిపోతారు. ఎందుకంటే అవి ప్రాణాంతకం కాబట్టి. అలాంటి పాముల జాతులలో నాగుపాముల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి అత్యంత విషపూరితమైనవి, పడగ విప్పి కాటేశాయంటే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనడంతో ఎలాంటి సందేహం లేదు. అందుకే అవి ఉండే చోట కనీసం కిలోమీటర్ దూరం ఉంటుంటాం. అలాంటిది ముడు నాగుపాములు ఒకే చోట చూస్తే... ఇంకేమైనా ఉందా ఆ సన్నివేశాన్ని చూడాలంటే గుండె జారిపోయినంత పని అవుతుంది. కానీ ఓ వ్యక్తి ధైర్యంగా చూడటమే కాకుండా చిత్రీకరించాడు కూడా. ప్రస్తుతం అలాంటి వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో..మూడు నాగుపాములు ఓ చోటకి చేరి పడగ విప్పి మనకి కనిపిస్తాయి. వాటిని చ్తూస్తుంటే సరిగ్గా అవి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనట్లు అనిపిస్తుంది. అందులో ఒక పాము మాత్రం బుసులు కొడతూ ఏదో చెబుతోంది. మిగిలిన రెండు పాములు శ్రద్ధగా వింటున్నాయి. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెట్టింట దీనిపై.. మూడు నాగుపాములు అలా కలవడం చూస్తే ట్రయాంగిల్ లవ్స్టోరీలా ఉందని ఒకరు, సమావేశం జరుగుతుందెమోనని మరొకరు, బహుశా టాప్ సీక్రెట్స్ అయ్యుండచ్చని ఇంకో నెటిజన్ కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by SACHIN AWASTHI (@helicopter_yatra_) -
Dangerous Snake: అమ్మో ఎంత పెద్ద పామో.. బుసలు కొడుతూ..
మాడుగుల: నాగ జాతిలో అత్యంత ప్రాణాంతకర పాము గిరి నాగు విశాఖ జిల్లా మాడుగుల మండలం కృష్ణంపాలెం గ్రామంలో బుధవారం కనిపించింది. ఓ ఇంటి నుంచి పాము పామాయిల్ తోటలోకి వెళ్తుండగా స్థానికులు వణ్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే రంగంలోకి దిగి 14 అడుగుల గిరి నాగును పట్టుకున్నారు. దాన్ని వంట్లమామిడి మహా అడవిలో వదిలారు. వన్యప్రాణి సంరక్షణ అధికారి కంఠిమహంతి మూర్తి, మాడుగుల గ్రామానికి చెందిన స్నేక్ కేచర్ పి.వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
మీడియాతో ఎస్పీ మాట్లాడుతుండగా... ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షం
సాక్షి, బరంపురం : ఒడిశా రాష్ట్రంలోని బరంపురం ఎస్పీ కార్యాలయంలో 12 అడుగుల నాగుపాము హల్చల్ చేసింది. విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతుండగా అక్కడే ఉన్న విలేకరి స్వధీన్ పండా పామును గుర్తించి అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా సర్పాన్ని పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. అనంతరం కిరండమల్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
Viral Video: దాహంగా ఉంది.. కొంచెం నీళ్లు ఇస్తారా.. వామ్మో కోబ్రా..!!
మీకు పాములంటే చచ్చేంత భయమా? ఏమడుగుతున్నారండి.. పాములంటే భయపడనివారెవరన్నా ఉంటారా? ఇదేనా మీ సమాధానం.. ఐతే ఈ వీడియోను మీరు చూడాల్సిందే.. అట్లాంటి ఇట్లాంటి పాము కాదు కింగ్ కోబ్రా.. జంతువులు మనుషులకు సహాయం చేసే వీడియోలు వందలకొద్దీ చూసుంటారు. కానీ ఈ వీడియోలో మనిషే కింగ్ కోబ్రాకి హెల్ప్ చేస్తున్నాడు. అంత కష్టమేమొచ్చిందా పాముకు..! అసలేంజరిగిందంటే.. వాతావరణం బాగా వేడిగా ఉండటంతో దాహమేసిన కోబ్రా ఒక కాలనీలోకి ప్రవేశించింది. దాన్ని చూసిన వారంతా భయంతో పరుగులు తీశారు. ఐతే ఒకతను మాత్రం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బకెట్తో నీళ్లు నింపి కోబ్రాకి స్నానం చేయించాడు. అంతేకాకుండా తాగడానికి నీళ్లు కూడా అందించడం ఈ వీడియోలో కన్పిస్తుంది. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం కామెంట్ల రూపంలో అతన్ని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. పాముకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత యేడాది జరిగిన సంఘటన ఇది. ఇప్పటికీ ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఏకంగా 33 లక్షల మంది వీక్షించారు. మానవత్వం ఇంకా బతికేఉందని దీనిని చూసిన వారంతా అంటున్నారు. ఐతే ఇటువంటి విషపూరిత జంతువులతో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే వ్యవహారం బెడిసికొట్టి మొదటికేమోసం వస్తుందనేది వాస్తవం. మీ అభిప్రాయమేమిటి..!! చదవండి: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే! View this post on Instagram A post shared by Sachin Sharma (@helicopter_yatra_) -
వైరల్ వీడియో: వాషింగ్ మెషీన్లో బుసలు కొట్టిన నాగుపాము
-
వాషింగ్ మెషీన్లో బుసలు కొట్టిన నాగుపాము, వీడియో హల్చల్
సాక్షి, తూర్పు గోదావరి: టీవీ, సినిమాల్లో పాముతో కనిపించే భయానక దృశ్యాలను చూస్తేనే జడుసుకుంటాం. ఇక పాము ఇంట్లో కనిపిస్తే సరేసరి. భయంతో వణికిపోయి పరుగులు పెడతాం. అలాంటిది పామును చాలా దగ్గరగా అంటే.. అలవాటుగా ఇంటి పనులు చేస్తున్న సమయంలో.. సరాసరి అది మీద దూకే పరిస్థితే ఉంటే.. వామ్మో!.. తలుచుకుంటేనే అదోలా ఉంది కదా. (చదవండి: దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి) జిల్లాలోని ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామంలో కుంచే శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంట్లోని వాషింగ్ మెషీన్లో దూరిన ఓ పొడవాటి నాగుపాము ఆ ఇంటి మహిళను హడలెత్తించింది. వాషింగ్ మెషీన్లో బట్టలు వేద్దామని దాని డోర్ తెరవగా.. అక్కడే తిష్ట వేసిన నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి దానిని చాకచక్యంగా డబ్బాలో బంధించి అడవిలో వదిలిపెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. (చదవండి: నిమజ్జనాలకు అనుమతి లేదనడంతో హైదరాబాద్లో ఆగమాగం..) -
King Cobra: 13 అడుగుల గిరినాగు
-
కింగ్ కోబ్రా కలకలం: అమ్మో ఎంత పెద్దదో..
ప్రత్తిపాడు రూరల్: తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని చింతలూరులో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. 12 అడుగుల పొడవైన ఈ పాము గ్రామంలో బొడ్డు లోవరాజు, సూరిబాబుకు చెందిన సరుగుడు తోటలో సంచరిస్తుంది. ఈ పాము మనుషులను చూస్తూ ఆగి ఆగి వెళ్తూ భయాందోళనకు గురిచేస్తుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు పాము ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. తమకు ఎటువంటి అనవాళ్లు లభించలేదని తెలిపారు. -
తూర్పు గోదావరి జిల్లాలో 12 అడుగుల కింగ్ కోబ్రా
-
భయానకం: పామును మరో పాము తినడం చూశారా?
సాధారణంగా పాముకు ఆకలేస్తే.. ఏ కప్పనో, ఎలుకనో తినడం మనం చూస్తూనే ఉంటాం. . కానీ ఓ పాము మరో పాముని తినడం ఎప్పుడైనా చూశారా? వినడానికి కొంచెం విచిత్రంగానే ఉన్న.. నిజంగానే ఓ పాము మరో పాముని గబుక్కున తినేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. పర్వీన్ పోస్టు చేసిన ఈ ఫోటోలో అడవుల్లోని ఓ కోబ్రా ఇంకో కోబ్రాను అమాంతం నోటిలో కరుచుకొని మింగుతోంది. ఇది చూడటానికి తీవ్ర భయంకరంగా కనిపిస్తోంది. ‘ అద్భుతమైన కోబ్రా ఓఫియోఫాగస్ హన్నా.. మరో కింగ్ కోబ్రాను తింటోంది’. అంటూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా మరో పోస్టులో పర్వీన్ కశ్వాన్ ఒఫియోఫాగస్ హన్నా అర్థాన్ని వివరించారు. ఈ కింగ్ కోబ్రా యొక్క శాస్త్రీయ నామం; ఓఫియోఫాగస్ హన్నా. ఓఫియోఫాగస్ గ్రీకు భాషా పదం ఉద్భవించింది, దీని అర్థం ‘పాము తినడం’. అలాగే గ్రీకు పురాణాలలో చెట్టు, నివాస వనదేవతల పేరు నుంచి హన్నా ఉద్భవించింది. కాబట్టి కింగ్ దాని పేరుకు తగట్టు ఉంటుంది. ఇది గూళ్ళు నిర్మించే ఏకైక పాము.’ అని పేర్కొన్నారు. పాము ఇంకో పామును మింగటాన్ని చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. The scientific name of this king cobra is; Ophiophagus hannah. “Ophiophagus” is derived from Greek, meaning “snake-eating” and hannah is derived from the name of tree-dwelling nymphs in Greek mythology. So king living true to its name. The only snake which build nests. — Parveen Kaswan (@ParveenKaswan) July 19, 2021 Ophiophagus hannah. A king cobra eating a spectacled cobra. They feed on lesser mortals. pic.twitter.com/LL8xzQoIww — Parveen Kaswan (@ParveenKaswan) July 19, 2021 -
అమ్మో...! ఎంత పెద్ద పాముతో..
బెంగళూరు: ఇదేదో సినిమా కోసం ఇచ్చిన పోజు కాదు. ముమ్మాటికి వాస్తవ సంఘటనే. భారీ సర్పాన్ని అలవోకగా ఎత్తిపట్టుకున్న ఈ యువకుడు ఏ సినిమా హీరోగా తక్కువ కాడనే చెప్పాలి. గురువారం కర్ణాటకలోని కాఫీసీమ కొడగు జిల్లా మూర్నాడులో చోటుచేసుకుంది. ఒక కాఫీ తోటలోకి 13 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా పాము చొరబడడంతో యజమాని స్థానిక పాముల నిపుణుడు సూర్యకీర్తికి కాల్ చేశాడు. అక్కడకు చేరుకున్న సూర్యకీర్తి కొంతసేపటికే దానిని వట్టి చేతులతో పట్టుకుని చూపరుల కోసం ఇలా ఆడించాడు. తరువాత సమీప భాగమండల అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశాడు. -
హడలెత్తించిన నాగుపాము.. నాగరాజుకు ఫోన్..
సింధియా: జీవీఎంసీ 63వ వార్డు పరిధి జయేంద్రకాలనీ లో 6 అడుగుల నాగుపాము స్థానికులను హడలెత్తించింది. శుక్రవారం మధ్యాహ్నం పాము కనిపించిన వెంటనే కాలనీవాసులు స్నేక్ క్యాచర్ నాగరాజుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో నాగరాజు అక్కడికి చేరుకుని ఆ పామును ఎంతో చాకచక్యంతో పట్టుకుని నిర్మానుష్య ప్రదేశంలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
వైరల్ వీడియో: హిమాచల్ ప్రదేశ్లో తొలిసారి కింగ్ కోబ్రా ప్రత్యక్షం..
-
కింగ్ కోబ్రా: భయంతో జనం పరుగులు
-
అమ్మో ఎంత పెద్ద పామో..!
కంచిలి: కింగ్ కోబ్రా గురువారం రాత్రి హల్చల్ చేసింది. డోల గోవిందపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గణేష్.. పోలేరు గ్రామానికి చీకటి పడిన తర్వాత తన మోటారు సైకిల్ మీద వెళుతుండగా, గ్రామం ప్రారంభంలో ఆంజనేయస్వామి విగ్రహం జంక్షన్లో ఈ పాము ఎదురుపడింది. అంత పెద్ద పామును చూసి ఆయన భయపడి బైక్ వదిలేశారు. దీంతో బైక్ పాము మీద పడింది. అంతలోనే స్థానికులు అక్కడకు చేరుకున్నారు. సోంపేటలో ఉండే పాములు పట్టే రాజారావుకు ఫోన్ చేశారు. ఆయన వచ్చి పామును పట్టుకున్నారు. సర్పం 13 అడుగుల పొడవు, 16 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. -
15 అడుగుల కింగ్ కోబ్రా కలకలం
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని కంచిలి మండలం పెద్ద పోలేరు గ్రామంలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. గత రాత్రి ఓ బైక్లోకి చొరబడిన కోబ్రాను స్నేక్ క్యాచర్ సాయంతో పట్టుకున్నారు. అనంతరం కింగ్ కోబ్రాను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కాగా 15 అడుగుల పొడవున్న కోబ్రా జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు కోబ్రాను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పాముతో పోరాటం...! యజమానిని రక్షించి శునకం మరణం చెన్నై : ఇంట్లోకి వచ్చిన పాముతో పోరాడి ఓ శునకం మరణించింది. తమను రక్షించిన పెంపుడు జంతువు మృతి చెందడం ఆ యజమాని కుటుంబాన్ని తీవ్ర వేదనలో పడేసింది. తంజావూరు ఈబి కాలనికి చెందిన ఎలిల్ మారన్(58), మాల దంపతులు రియో, స్వీటీ అనే రెండు శునకాల్ని పెంచుతున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి ఆ ఇంట్లోకి ఓ పాము చొరబడింది. దీనిని గుర్తించిన రియో ఆ పాముతో పోరాటం చేసింది. ఆ పామును రెండు ముక్కలు చేసి హతమార్చి, తాను మరణించింది. గురువారం ఉదయాన్నే రియో మరణించి ఉండటాన్ని చూసిన యజమాని ఆందోళన చెందాడు. కూత వేటు దూరంలో పాము రెండు ముక్కలుగా పడి మరణించి ఉండటంతో తమను రక్షించి రియో ప్రాణాలు విడిచినట్టు భావించి తీవ్ర మనో వేదనలో పడ్డారు. ఇంటి వద్దే ఆ శునకాన్ని పాతి పెట్టారు.రియో మరణంతో అన్నాహారాల్ని మానేసిన స్వీటి పాతి పెట్టిన ప్రాంతం వద్దే పడుకుని రోదిస్తుండటం ఆ పరిసర వాసుల్ని కలచి వేస్తున్నది. -
హిమాలయాల్లో కింగ్ కోబ్రా.. అసాధారణ విషయం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అటవీ శాఖ అధికారులు మొట్టమొదటి సారి ఓ సంచలన విషయాన్ని గుర్తించారు. హిమాలయాల్లో సుమారు 2400 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రా సంచారాన్ని గుర్తించారు. మంచు వాతావరణంలో ఇంత ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాల సంచారాన్ని గుర్తించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో దీని గురించి పూర్తి స్థాయిలో శాస్త్రీయ పరిశోధన జరగాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ అటవి శాఖ అధికారులు ఓ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం పాములు వంటి శీతల రక్త జీవులు టెరాయి ప్రాంతంలో 400 మీటర్ల ఎత్తులో కనిపించగా.. కొండ ప్రాంతాల్లో 2400 మీటర్ల ఎత్తులో కనిపిస్తాయి. కానీ హిమాలయాల వంటి మంచు ప్రాంతంలో ఇంత ఎత్తులో కింగ్ కోబ్రాల సంచారం కనిపించడం ఇదే ప్రథమం కాక అసాధరణ విషయం అని నివేదిక తెలిపింది. దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన జరగాలని సూచించింది. (చదవండి: వైరల్: కింగ్ కోబ్రాతో ఆట అదుర్స్!) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో భాగంగా ఉత్తరాఖండ్ అటవిశాఖ అధికారులు నైనిటాల్ జిల్లాలోని ముక్తేశ్వర్ పర్వత ప్రాంతంలో దాదాపు తొమ్మిది నెలల పాటు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో వీరు అనేక చోట్ల కింగ్ కోబ్రా నివాసాలను గుర్తించారు. సాధారణంగా పాములు వంటి శీతర రక్తం కల జీవులు బయటి వేడి మీద ఆధారపడతాయి. ఈ క్రమంలో అవి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలను తమ ఆవాసాలుగా చేసుకుంటాయి. ఈ సందర్భంగా సంజీవ్ చతుర్వేది అనే అధికారి మాట్లాడుతూ.. ‘ముక్తేశ్వర్ పర్వత ప్రాంతంలో దాదాపు 2400 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రా గూళ్లను(పుట్టలు) చూశాం. ఇంత ఎత్తులో మంచు ప్రాంతంలో ఇవి కనిపించడం నిజంగా రికార్డే. గతంలో డెహ్రాడూన్లో 2,303 మీటర్ల ఎత్తులో, సిక్కింలో 1088 మీటర్ల ఎత్తులో, మిజోరాంలో 1170 మీటర్ల ఎత్తులో.. నీలగిరిలో 1830 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రాల సంచారాన్ని గుర్తించాము. ప్రస్తుతం నైనిటాల్లో గుర్తించిన కింగ్ కోబ్రా తన ఆవాసంగా పైన్ చెట్ల ఆకులను వినియోగించుకుంది. వీటికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మంటలు వ్యాపించడంలో ప్రతి ఏటా ఈ ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి’ అన్నారు. (చదవండి: ‘ఉస్సెన్ బోల్ట్ కూడా నన్ను పట్టుకోలేడు’) సాధారణంగా కింగ్ కోబ్రాలు ఎక్కువగా పశ్చిమ, తూర్పు కనుమల ప్రాంతంలో, సుందర్బన్స్ మాంగ్రూవ్స్, ఒడిశాలో కనిపిస్తాయి. అయితే కోబ్రాలు ఏ వాతావరణంలో అయినా త్వరగా కలిసిపోతాయని.. అక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు తమను తాము మార్చుకుంటాయంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితులకు గ్లోబల్ వార్మింగ్ కూడా కారణం అంటున్నారు నిపుణులు. దీని కారణంగా చల్లని ప్రదేశాలు కూడా వేడిగా మారుతున్నాయని.. ఫలితంగా పాములు మంచు ప్రాంతాల్లో కూడా నివసించగల్గుతున్నాయన్నారు. అంతేకాక ఇంత ఎత్తు ప్రాంతంలో జనసంచారం పెరగడం.. ఫలితంగా చెత్తా చెదారం పెరుకుపోవడంతో ఎలుకలు ఇక్కడ ఉంటున్నాయని.. ఇవి పాములను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఏది ఏమైనా ఈ అరుదైన విషయంపై సమగ్ర శాస్త్రీయ పరిశోధన జరగాలంటున్నారు. -
బాత్రూమ్లో ఐదడుగుల కొండచిలువ
న్యూఢిల్లీ: బాత్రూమ్లో కొండచిలువ కనిపించడంతో ఓ కుటుంబం షాక్ తిన్న ఘటన న్యూఢిల్లీలోని ఓక్లహాలో చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఓ కుటుంబం ఇంట్లోకి, సరాసరి బాత్రూమ్లోకి ఐదడుగుల కొండచిలువ వచ్చి చేరింది. దీంతో భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ అనే ఎన్జీవోను సంప్రదించి వారికి సమాచారం అందించారు. దీంతో వెంటనే వారు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని బాత్రూమ్లో నక్కిన కొండచిలువను పట్టుకున్నారు. అయితే అది అనారోగ్యంతో ఉన్నందువల్ల అబ్జర్వేషన్లో పెట్టినట్లు ఎన్జీవో ప్రతినిధులు తెలిపారు. వర్షాల వల్ల పాములు తరచూ ఇళ్లలోకి వస్తున్నాయని వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ ప్రతినిధి వసీమ్ అక్రమ్ పేర్కొన్నారు. వర్షపు నీరు వాటి ఆవాసాల్లోకి ప్రవేశించినప్పుడు రక్షణ కోసం పొడిగా ఉండే ప్రాంతాన్ని వెతుకుతూ, అనుకోకుండా గృహ సముదాయాల్లోకి చేరుతాయని తెలిపారు. (నిజంగా ఇది నమ్మశక్యం కాని విషయం) ఫొటో(ఏఎన్ఐ సౌజన్యంతో) పొడవైన నాగుపామును రక్షించిన అధికారులు ఒడిశాలోని బురుఝరి గ్రామంలో భారీ నాగుపాము బావిలో చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు స్నేక్ హెల్ప్లైన్ టీమ్ను ఆ ప్రాంతానికి పంపించారు. వారు సుమారు గంటపాటు కష్టపడి ఎట్టకేలకు దాన్ని బయటకు తీశారు. నాగుపాము పొడవు 12-15 అడుగులుగా ఉంది. అనంతరం దీన్ని అడవిలో వదిలిపెట్టారు. (ఒకేలా ఉండటమే కాదు ఫలితాలు కూడా ఒకటే!) -
వైరల్: కింగ్ కోబ్రాతో ఆట అదుర్స్!
టిక్టాక్లో పాపులర్ కావడానికి పిచ్చి పిచ్చి ఫీట్లతో ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నవారి ఘటనలు చూస్తూనే ఉన్నాం. రైలుకు ఎదురెళ్లి కొందరు, చెరువు కుంటల్లో టిక్టాక్ చేసి కొందరు లైవ్లోనే బలయ్యారు. అయితే, పాములు పట్టడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఓ యువకుడు మాత్రం.. 10 అడుగుల కింగ్ కోబ్రా (నల్ల తాచు)ను ఆడించి ఔరా అనిపించాడు. భారీ పాముతో విన్యాసాలు చేసిన అతని టిక్టాక్ వీడియో వైరల్ అయింది. కాగా, నల్లతాచు అత్యంత విషపూరిత సర్పమని, నిపుణుల పర్యవేక్షణలోనే ఈ విన్యాసాన్ని చేయాలని ఆ యువకుడు విజ్ఞప్తి చేశాడు. ఎన్నోరోజుల శ్రమ ఫలితంగానే తాను స్నేక్ స్నాచింగ్లో రాణిస్తున్నానని తెలిపాడు. పాపులర్ కోసం ప్రాణాలు పణంగా పెట్టడం అవసరమా అని కొందరు ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: టిక్ టాక్ మోజులో ఐదుగురు యువకుల అదృశ్యం) -
కోతి, కింగ్ కోబ్రాల ఒళ్లు గగుర్పొడిచే ఫైట్
-
కోబ్రాతో ఫైట్: కోతి పోరాటానికి ఫిదా!
హైదరాబాద్ : కోతి, కింగ్ కోబ్రాల పోరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుశాంత నందా అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విటర్లో ఈ వీడియో షేర్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియో చాలా ఉత్కంఠగా ఉందని, శ్వాస కూడా తీసుకోకుండా వీక్షించినట్లు పేర్కొన్నారు. ఇక కోతి, కింగ్ కోబ్రా పోరులో అంతిమంగా కోతే గెలిచిందని, అంతేకాకుండా అద్భుత పోరాట స్పూర్థిని ప్రదర్శించిందని సుశాంత నంద ట్వీట్లో పేర్కొన్నాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ అడవిలో కోతి, కింగ్ కోబ్రాలు ఎదురెదురుపడ్డాయి. ఈ క్రమంలో పాము పడగెత్తి, కసిగా బుసలు కొడుతుంటే తొలుత కోతి భయపడుతూనే ఎదురుదాడి చేసింది. అనంతరం ఒక్కసారిగా రెచ్చిపోయిన కోతి పాము తలను కొరకడానికి ప్రయత్నించింది. కోతి అసాధారణ పోరాటానికి కింగ్ కోబ్రా తోక ముడుచుకొని వెళ్లిపోయింది. థ్రిల్లింగ్ యాక్షన్ ఫైట్కు సంబంధించిన ఈ వీడియో చూసిన నెటిజన్లు కోతి పోరాటానికి ఫిదా అవుతున్నారు. -
‘ఉస్సెన్ బోల్ట్ కూడా నన్ను పట్టుకోలేడు’
కింగ్ కోబ్రా పేరు వింటేనే కాళ్లల్లో వణుకు, గుండెల్లో దడ వచ్చేస్తాయి. దాన్ని దగ్గర నుంచి చూడటం అంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవడం లాంటిదే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సర్పం కింగ్ కోబ్రా. దాని పేరు తలుచుకోవడానికే మనం వణికిపోతుంటే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా దానికి తలస్నానం చేయిస్తున్నాడు. వినడానికి ఏ మాత్రం నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం పచ్చి నిజం. వివరాలు.. కేరళకు చెందిన వావా సురేష్ అని వ్యక్తి పాములను పట్టడంలో, వాటిని పరిరక్షిచడంలో నిపుణులు. ఈ నేపథ్యంలో సురేష్ కింగ్ కోబ్రాకు తల స్నానం చేయించాడు. ఓ బకెట్లో నీళ్లు తెచ్చి కింగ కోబ్రా తల మీద పోస్తాడు. ఆ పాము నీళ్లు పోసిన వ్యక్తిని ఏమి అనకుండా, ఎలాంటి భావాలు పలికించకుండా కామ్గా ఉంటుంది. అలా రెండు బక్కెట్ల నీటిని పోసి కింగ్ కోబ్రాకు తలస్నానం చేయిస్తాడు సురేష్. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Summer time.. And who doesn’t like a nice head bath🙏 Can be dangerous. Please don’t try. pic.twitter.com/ACJpJCPCUq — Susanta Nanda IFS (@susantananda3) May 24, 2020 ‘వేసవి కాలం.. తలస్నానం ఎవరికి ఇష్టం ఉండదు. అయితే ఇలాంటివి చాలా ప్రమాదం. ఇంటి దగ్గర ప్రయత్నించకండి’ అంటూ ఈ వీడియోను ట్వీట్ చేశారు సుశాంత నంద. దాదాపు 51 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 70 వేల మంది పైగా వీక్షించారు. ‘నిజంగా అతడి ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే.. ఈ వీడియో చూసి నేను పరిగెట్టడం మొదలు పెట్టాను. ఉస్సెన్ బోల్ట్ సైతం నన్ను పట్టుకోలేడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. భూమి పైన ఉన్న పొడవైన విషపు పాముల జాతి. నేషనల్ జీయోగగ్రాఫిక్ వారు చెప్పిన దాని ప్రకారం ఈ పాము నిలబడటమే కాక తన కళ్లతో పూర్తిగా ఎదిగిన ఓ మనిషిని చూడగలదు. దీని ఒక్క కాటులో వెలువడే విషంతో 20 మందిని ఒక్కసారే చంపవచ్చు. -
తూర్పులో అరుదైన కింగ్ కోబ్రా హల్చల్..
-
తూర్పులో అరుదైన కింగ్ కోబ్రా హల్చల్..
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో అరుదైన కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. తొలుత గ్రామంలోని ఓ చెట్టుపై 15 అడుగుల పొడవు ఉన్న పాము ఉండటాన్ని స్థానికులు గమనించారు. అది అరుదైన కింగ్ కోబ్రా కావడంతో.. పెద్ద ఎత్తున గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం గ్రామస్తులు కింగ్ కోబ్రా గురించి విశాఖ వైల్డ్ లైఫ్ అదికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న విశాఖ అటవీశాఖ అధికారులు బృందం.. కింగ్ కోబ్రాను బంధించి తీసుకెళ్లిపోయారు. కాగా, కింగ్ కోబ్రా చెట్టుపై తిరుగుతున్న దృశ్యాలను పలువురు తమ ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు స్థానికంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
'షర్ట్ విప్పితేనే విమానం ఎక్కనిస్తాం'
జోహన్నెస్బర్గ్ : జోహన్నెస్బర్గ్లోని ఓఆర్ టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 ఏళ్ల బాలుడికి వింత అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్ వెళ్లే విమానం ఎక్కేందుకు వచ్చిన బాలుడిని బోర్డింగ్ వద్ద విమాన సిబ్బంది అడ్డుకొని నువ్వు వేసుకున్న షర్ట్ను విప్పితేనే విమానంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇంతకీ షర్ట్ ఎందుకు విప్పమన్నారనేగా మీ డౌటు.. అక్కడికే వసున్నాం ! న్యూజిలాండ్లో ఉండే తమ బంధువులను కలిసేందుకు దంపతులు తమ 10 ఏళ్ల స్టీవ్తో కలిసి ఎయిర్పోర్టుకు వచ్చారు. అయితే విమానం ఎక్కడానికి బోర్డింగ్ దగ్గరకు వచ్చారు. విమాన సిబ్బంది స్టీవ్ను అడ్డుకొని షర్ట్ మార్చుకోవాలని సూచించారు. కాగా స్టీవ్ వేసుకున్న షర్ట్పై కింగ్ కోబ్రా పాము బొమ్మ ముద్రించబడి ఉంది. ఆ బొమ్మ చూడడానికి కాస్త భయంకరంగా ఉండడంతో తోటి ప్రయాణికులు బొమ్మను చూసి భయానికి లోనవుతారంటూ అందుకే సిబ్బంది షర్ట్ను మార్చుకోవాలని సలహా ఇచ్చారు. కానీ మొదట ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగినా చేసేదేం లేక స్టీవ్ వేరే షర్ట్ను తొడిగి విమానం ఎక్కారు. అయితే అధికారులు తాము చేసిన పని సరైందేనంటూ సమర్థించుకున్నారు. ఆ అబ్బాయి వేసుకున్న షర్టువల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే, అయినా అలాంటి దుస్తులను మేం అంగీకరించబోమని వెల్లడించారు. దీనిపై ఒక సంస్థ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ' ఆ బాలుడిని అడ్డగించి బలవంతంగా షర్టు మార్చుకోమని ఒత్తిడి తెచ్చారు. అతను వేసుకున్న షర్టుపై ఒక పాము బొమ్మ ఉండడమే దీనికి కారణం' అంటూ ట్వీట్ చేశారు. ట్విటర్లో షేర్ చేసిన ఫోటోలను చూసి ' ఇవేం రూల్స్రా బాబు...దుస్తులపై బొమ్మలు ఉంటే విమానం ఎక్కనివ్వరా అంటూ' నెటిజన్లు మండిపడుతున్నారు. A Boy, 10, is forced to take his shirt off before boarding a flight from #NewZealand to #SouthAfrica because it had a picture of a reptile on it ✈️😬 pic.twitter.com/T0O6DqfBDo — aviation-fails (@aviation07fails) 26 December 2019 -
రైల్వేస్టేషన్లో కింగ్కోబ్రా కలకలం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని కత్తగోడెం రైల్వే స్టేషన్లో ఓ నల్లత్రాచు పాము కలకలం సృష్టించింది. 10 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా(నల్లత్రాచు)ను అటవి అధికారులు పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. ఉత్తరాఖండ్ ‘కత్తగోడెం రైల్వే స్టేషన్లో రైలు కింది భాగంలో చుట్టలుగా చుట్టుకుని ఉన్న నల్లత్రాచు పామును చూసి ప్రయాణికులంతా బెంబెలేత్తిపోయారు. దీంతో రైల్వే అధికారుల ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పామును పట్టుకుని అడవిలో వదిలి పెట్టిన వీడియోను ధఖ్తే అనే ఓ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. 28 సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 వేలకు పైగా వ్యూస్ రాగా.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి. అలాగే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పామును పట్టుకున్న ఆటవీ అధికారులను నెటిజన్లంతా అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్లున్నారు. ఇక ‘కత్తగోడెం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలు కింది భాగంలో నల్లత్రాచును గుర్తించిన అధికారులు వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులు, అటవీ అధికారులు కలిసి ప్రయాణికులను అప్రమత్తం చేసి పామును సునాయాసంగా పట్టుకున్న అటవీ అధికారులు దానిని అడవిలో వదిలిపెట్టారంటూ’ ధఖ్తే తన ఇన్స్టా పోస్టులో రాసుకోచ్చారు. -
చీఫ్ సెక్రటరీ.. హోం సెక్రటరీ.. ఓ పాము!
రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది గురువారం ఓ విషసర్పాన్ని బంధించారు. ప్రశాసన్ నగర్లోని ఉన్నతాధికారుల క్వార్టర్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నివసిస్తున్నారు. ఆయన నివాసం వెనుక ఉన్న స్థలంలో పాము తారసపడింది. పడగ విప్పి బుసకొడుతున్న పామును చూసిన వాళ్లు భయాందోళనలకు లోనయ్యారు. ఇంతలో విషయం తెలుసుకున్న రాజీవ్ త్రివేది అక్కడకు చేరుకున్నారు. తన వద్ద ఉన్న ఉపకరణంతో ఆ పామును చాకచక్యంగా పట్టుకుని ప్లాస్టిక్ జార్లో బంధించారు. దానికి ఎలాంటి హానీ తలపెట్టనని, జనావాసాలకు దూరంగా వదిలివేస్తానని ఆయన పేర్కొన్నారు. – సాక్షి, హైదరాబాద్ -
రియల్ నాగుపాముతో సినిమా
బ్యాంకాక్కు చెందిన పామును నీయా–2 చిత్రంలో నటింపజేసినట్లు చిత్ర దర్శకుడు ఎల్.సురేశ్ తెలిపారు. జంబూ సినిమాస్ పతాకంపై ఏ.శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం నీయా–2. నటుడు జై హీరోగా నటించిన ఇందులో రాయ్ లక్ష్మి, వరలక్ష్మీశరత్కుమార్, క్యాథిరిన్ ట్రెసా హీరో యిన్లుగా నటించారు. ప్రియదర్శిని, బాలశరవణన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతాన్ని షబ్బీర్, ఛాయాగ్రహణం రాజవేల్ మోహన్ అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కా ర్యక్రమంలో పాల్గొన్న నటి రాయ్లక్ష్మి మాట్లాడుతూ తాను రెండేళ్ల తరువాత తమిళంలో నటించిన చిత్రం నీయా–2 అని చెప్పింది. దర్శకుడు సురేశ్ కథ చెప్పినప్పుడు మూడు గంటల సేపు విన్న తరువాత ఇది భారీ చిత్రం లాగుందనిపించిందన్నారు. దీంతో కాస్త ఎక్కువగానే ఆలోచించి చివరికి నటించాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పిం ది. ఇది పాము ఇతివృత్తంతో కూడిన చిత్రం అని తెలిపింది. ఇంతకు ముందు దెయ్యం ఇతివృత్తంతో కూడిన హర్రర్ కథా చిత్రాల అవకాశాలు చాలా వచ్చినా అంగీకరించలేదని, థ్రిల్లర్తో కూడిన ప్రేమ, పాము కథాంశంతో కూడిన నీయా–2లో తానూ ఒక భాగం కావడం సంతోషంగా ఉందని అంది. అ నంతరం చిత్ర దర్శకుడు ఎల్.సురేశ్ మాట్లాడుతూ దర్శకుడు బాలుమహేంద్ర వద్ద తానూ, వెట్రిమారన్ సహాయ దర్శకులుగా పని చేశామని తెలిపారు. తాను తెలుగులో దర్శకత్వం వహించిన చిత్రం తమిళంలో ఎత్తన్ పేరుతో రీమేక్ అయ్యిందని తెలిపారు. ఈ చిత్ర నిర్మాత పాము ఇతివృత్తంతో చిత్రం చేద్దాం అని అన్నప్పుడు పాముతో ఎలాంటి కథ చేయాలని ఆలోచిస్తుండగా టీవీలో నందిని సీరియల్ చూశానన్నారు. అది మంచి ప్రేక్షకాదరణను పొందడంతో ఈ నీయా–2 కథను రెడీ చేశానని చెప్పారు. అయితే ఇందులో రాజనాగం (పాము)ను నటింపజేయాలని భావించామన్నారు. అందుకోసం ఆ పాము గురించి తెలుసుకోవడానికి బ్యాంకాక్ వెళ్లినట్లు చెప్పారు. అక్కడ ఒక ఇంట్లో రాజనాగంను పెంచుతుండడం చూశానన్నారు. అలా ఈ చిత్రంలో నిజ నాగపామునే నటింపజేశామని చెప్పారు. తమ చిత్రానికి విలన్ వర్షమేనని అన్నారు. దీంతో చాలా శ్రమించి చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఇందులో నటి వరలక్ష్మీశరత్కుమార్కు చాలా కఠినమైన పాత్రను ఇచ్చామని, ఆమె అద్భుతంగా నటించారని అన్నారు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. నీయా–2 భారీ చిత్రంగా అమరడానికి నటుడు జై, వరలక్ష్మీశరత్కుమార్, రాయ్లక్ష్మి, క్యాథరిన్ట్రెసా వంటి నటీనటులను నిర్మాత అందించడమేనని అన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు వెట్రిమారన్ అతిథిగా పాల్గొన్నారు. -
కొండ చిలువ, నాగుపాముల భీకర పోరు
కొండ చిలువ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు కదా. దాన్ని చూస్తేనే మనకు వణుకు పుడుతుంది. ఇక కొండ చిలువ కంటే బలం తక్కువగా ఉన్నా నాగు పాము విషానికి పవర్ ఎక్కువ. ఇది కరిచిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది ఈ రెండిటి మధ్య హోరా హోరి పోరు జరిగితే ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే. అయితే ఇటీవలే కొండ చిలువకు నాగుపాముకు మధ్య జరిగిన భీకర పోరులో రెండు సర్పాలు మత్యుఒడికి చేరాయి. కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొండ చిలువ తన బలంతో నాగుపామును చుట్టి హత మారిస్తే, నాగుపాము తన చివరి క్షణాల్లో వేసిన కాటుకు కొండ చిలువ ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనే విషయంలో ఓ క్లారిటీ లేకపోయినా.. కచ్చితంగా ఆగ్నేయాసియాలో చోటు చేసుకొని ఉండొచ్చని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి చెందిన కోలెమన్ షీహీ, నేషనల్ జియోగ్రఫీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. -
రాచనాగు వర్సెస్ కొండచిలువ
బ్యాంకాక్ : పదిహేడు అడుగులు పొడవు కలిగిన కింగ్ కోబ్రా.. కొండచిలువను తన ఆహారంగా చేసుకుని మింగేసింది. ఈ ఘటన థాయ్లాండ్లోని ఓ రిసార్ట్కు చేరువలో చోటు చేసుకుంది. కేవలం ఐదే అడుగులు పొడవున్న కొండచిలువ తనను తాను కాపాడుకునేందుకు రాచనాగు తలను చుట్టేసినా ఫలితం లేకపోయింది. పాముల మధ్య భీకర పోరును చూసిన స్థానికులు ఎమర్జెన్సీ సర్వీసెస్కు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకునేందుకు మూడు గంటల సమయం పట్టింది. ఈలోగా పదునైన పళ్లతో కొండచిలువ శరీరాన్ని రాచనాగు చీరేసింది. స్థానికులు పెద్ద ఎత్తున పాముల పోరాట స్థలం వద్దకు చేరుకోవడంతో అప్రమత్తమైన రాచనాగు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడికి చేరుకున్న సంరక్షక బృందాలు రాచనాగును పట్టుకుని సంరక్షణ కేంద్రానికి తరలించాయి. -
కింగ్ కోబ్రా కలకలం..
-
కింగ్ కోబ్రా కలకలం..
కంచిలి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం భొగాబేనిలో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన దామోదర ప్రధాన్ ఇంట్లోకి దాదాపు 18 అడుగుల భారీ కింగ్ కోబ్రా కనిపించడంతో భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు. గ్రామస్థులు సోంపేటకు చెందిన పాములు పట్టే వ్యక్తిని రప్పించి కోబ్రాను పట్టుకున్నారు. అనంతరం దాన్ని దగ్గర్లోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
ఈ నల్లత్రాచు కాటేస్తే బతకడం కష్టం
► జనావాసాల్లో కింగ్ కోబ్రా శివమొగ్గ: కింగ్ కోబ్రా.. అదే నల్లత్రాచు. విషపూరిత పాముల్లోకెల్లా ఇది అతి పెద్దది. దీని విషం కూడా ఎక్కువే. కాటు వేస్తే బతకడం కష్టం. కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి ఇది. ఇవి అప్పుడప్పుడు జనావాసాల్లో చొరబడుతూ కలకలం సృష్టిస్తుంటాయి. శివమొగ్గ జిల్లాలో ఇదే మాదిరి జరిగింది. శివమొగ్గ నగరంతో పాటు తీర్థహళ్ళి తాలూకాలో రెండు ప్రత్యేక ప్రాంతాల్లో రెండు భారీ నల్ల త్రాచు పాములను స్నేక్ కిరణ్ పట్టుకుని అడవిలో వదలిపెట్టిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. శివమొగ్గ తాలూకా సమీపంలోని చోరడి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ముందు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా సర్పం చేరింది. భయాందోళనకు గురైన ఇంటి యçజమాని ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలియగా, వారు వచ్చినప్పటికీ పట్టుకోవడం సాధ్యం కాలేదు. దీంతో స్నేక్ కిరణ్కు సమాచారం ఇచ్చారు. దాంతో అక్కడికి చేరుకున్న స్నేక్ కిరణ్ సుమారు 45 నిమిషాల పాటు శోధించి లాఘవంగా పామును పట్టుకున్నారు. అటవీ అధికారులతో కలిసి దానిని తుప్పూరు అడవిలో వదిలేశారు. తోటలో పాము తీర్థహళ్ళి తాలూకాలోని మండగద్దె సమీపంలో ఉన్న కణగలసర గ్రామంలో ఉన్న సహన్సాబ్ అనే వ్యక్తి ఇంటి పక్కనున్న తోటలో సుమారు 7 అడుగుల నల్ల త్రాచు కనిపించింది. స్థానికుల సహకారంతో స్నేక్ కిరణ్కు తెలుపడంతో సంఘటన స్థలానికి వచ్చిన స్నేక్ కిరణ్ అర్దగంట పాటు శ్రమింర్దా సర్పాన్ని పట్టుకుని దగ్గరిలోని అడవుల్లో వదిలారు. -
కారులో పదడుగుల కింగ్ కోబ్రా
బీజింగ్: ఏంచక్కా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళదామనుకున్న యజమానికి పెద్ద షాక్ ఎదురైంది. కారు ఇంజిన్ను చెక్ చేద్దామనుకున్న ఆ వ్యక్తికి ఓ పదడుగుల భారీ కింగ్ కోబ్రా దర్శనం ఇచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఎగిరిపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది. దీంతో నలుగురు పోలీసులు అక్కడికొచ్చి ఆ పామును బయటకు తీసేందుకు నానా తంటలు పడ్డారు. పామును పట్టే స్టిక్లతో కారు వద్దకు చేరుకుని మూడు మీటర్లు పొడవుండి దాదాపు ఐదు కేజీల బరువున్న(4.6కేజీలు) పామును ఎట్టకేలకు బంధించారు. దానిని చూసిన అక్కడి వారంతా బెదిరిపోయారు. ఈ వీడియోను ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేయగా దాదాపు 70వేలమంది వీక్షించగా వెయ్యిమంది తిరిగి కామెంట్లు చేశారు. -
ఫ్రిజ్ తీసి..పరుగో పరుగు..
కేసముద్రం: సూర్యుడి ప్రతాపానికి మనుష్యులే విలవిలలాడుతుంటే.. ఇక సర్పాలు ఏంచేస్తాయి.. ఏంచక్కా ఫ్రిజ్ లో దూరుతాయి. అవును వేడికి తాళలేక రక్తపింజర ఫ్రిజ్లో దూరిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ధన్నసరిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మిర్యాల యాకయ్య ఇంట్లోని ఫ్రిజ్లో మంగళవారం రాత్రి రక్తపింజర పాము దూరింది. బుధవారం తెల్లవారుజామున యాకయ్య కూతురు మంచినీళ్ల కోసం ఫ్రిజ్ డోర్ తీయగా పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ బాలిక కేకలు పెడుతూ బయటకు పరుగెత్తింది.కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలున్న వారంతా కలిసి వచ్చి ఆ పామును బయటకు తీసుకువచ్చి చంపేశారు. -
జీవితాన్ని కాటేసిన పాము
కేకేనగర్ : పాలు పోసి పెంచినా పాము కాటేస్తుందనే విషయం అక్షరాలా నిజమైంది. పెంచుకున్న పాము యజమాని జీవితాన్నే కాటేసిన ఈ విషాద సంఘటన కడలూరు జిల్లాలో ఓ కుటుంబాన్ని అనాథగా మార్చిం ది. వివరాల్లోకి వెళితే.. ఏ జాతి పామైనా సరే నిమిషాల్లో పట్టుకుని రెండు వారాలు జాగ్రత్తగా పెంచి సురక్షితంగా ప్రాణాలతో అడవిలోకి వదిలే మహత్తరమైన పని చేసేవాడు పూనంచంద్(45). అర్ధరాత్రైనా సరే పామును పట్టాలని ఫోన్కాల్ వచ్చిందంటే నిమిషాల్లో అక్కడికి చేరుకుని పని పూర్తి చేసి అందరి మన్ననలు పొందేవాడు. పూనంచంద్ పూర్వికులది రాజస్థాన్. కొన్నేళ్ల క్రితం కడలూరుకు వలస వచ్చిన పూనంచంద్ ఉపాధి కోసం పాములు పట్టే వృత్తిని ఎంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం విదిష్టను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి గోవర్ధిని, గోముది అనే మూడేళ్ల కవలలు ఉన్నారు.ధనుశ్రీ అనే ఏడు నెలల చంటి బిడ్డ ఉంది. ప్రభుత్వ అనుమతితో పూనంచంద్ తాను పట్టే పాములను పాలు పోసి పోషించి, కొన్ని రోజులపాటు ఇంట్లోనే ఉంచుకుని అనంతరం వేప్పూర్లోని అడవుల్లో వదిలేసేవాడు. ఇతనికి కడలూరు కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ ప్రభుత్వ వాహనాలను ఇచ్చి పాములు పట్టడానికి, అడవుల్లోకి వదలడానికి సహాయం చేసేవారు. 19 సార్లు పాము కాటుకు గురైన పూనంచంద్ 18 సార్లు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే 19వ సారి మాత్రం విషపూరితమైన కింగ్ కోబ్రా కాటుకు బలయ్యాడు. డిసెంబరు 15నుంచి తాబేళ్ల గుడ్లను సేకరించే పనిని అటవీ శాఖ అధికారులు పూనంచంద్కు కేటాయించి తాత్కాలిక వేతనం కింద నెలకు రూ. 5,500 ఇచ్చేవారు. ఇదిలాఉండగా ఈ మార్చి 15న మూడు ప్రాంతాల్లో పాములను పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. తర్వాత వాటిని భద్రపరుస్తున్న సమయంలో ఒక పాము అతని వీపు మీద కాటేసింది. స్పృహ తప్పిన పూనం చంద్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. పాములు పట్టే వృత్తికి జీవితాన్ని అంకితం చేసిన పూనంచంద్ జీవితం చివరికి ఆ పాము కాటుతోనే ముగిసింది. కుటుంబ పోషణకు చేతిలో చిల్లిగవ్వ లేక అతని భార్య, పిల్లలు నడిరోడ్డున పడ్డారు. తమను ఆదుకోవాలంటూ విదిష్ట శనివారం అధికారులకు వినతి పత్రాన్ని అందజేసింది. -
దాహం బాబోయ్ దాహం: జనాల్లోకి నల్లత్రాచు!
-
దాహం బాబోయ్ దాహం: జనాల్లోకి నల్లత్రాచు!
కరువు కటకటలాడుతోంది. ఎక్కడ చూసినా తాగడానికి నీళ్లు లేవు. దీంతో దాహంతో అలమటించిపోయిన ఓ నల్లత్రాచు (కింగ్ కోబ్రా) ఏకంగా జనావాసాల్లోకి చొచ్చుకొచ్చింది. అదృష్టం బావుండి అది.. పాముల గురించి తెలిసిన ఓ వ్యక్తి కంట పడింది. దాహంతోనే అది అడవిని వదిలి గ్రామానికి వచ్చిందని గుర్తించిన ఓ వ్యక్తి స్థానిక అటవీ పోలీసుల సాయంతో ఆ నల్లత్రాచుకు నీళ్లు తాగించాడు. కర్ణాటకలోని కైగా టౌన్షిప్ సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో కొంతకాలంగా కరువు తాండవిస్తున్నది. ఈ నేపథ్యంలో నీళ్లు దొరకక బాగా దాహంతో పాములు అప్పుడప్పుడు ఇలా జనావాసాల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే దాహంతో అలమటించిన ఓ నల్లత్రాచు ఇటీవల జనావాసాల్లోకి వచ్చింది. పాములు పట్టే వ్యక్తి సాయంతో దానిని పట్టుకున్న స్థానిక పోలీసులు.. దానికి మినరల్ వాటర్ బాటిల్తో నీళ్లు తాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. నీళ్లు తాగించిన అనంతరం జంతు సంరక్షణ కేంద్రానికి ఆ నల్లత్రాచును తరలించారు. -
కోయంబత్తూరులో నల్లత్రాచు కలకలం
-
పాఠశాలలోకి నాగుపాము
భయభ్రాంతులకు గురైన పిల్లలు చౌడేపల్లె(చిత్తూరు): తరగతి గదిలోకి నాగుపాము రావడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురైన సంఘటన బుధవారం చౌడేపల్లె మండలంలోని బూరగపల్లె ప్రాథమిక పాఠశాలలో చోటచేసుకుంది. ఈ పాఠశాలలో 36 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బుధవారం తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్న సమయంలో ఉన్నట్టుండి ఓ పెద్ద నాగుపాము తరగతిలోకి వచ్చింది. టీచర్లు అప్రమత్తమై విద్యార్థులను చాకచక్యంగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం స్థానికులు పామును గుర్తించి చంపేశారు. పాఠశాలకు సరైన దారి, ప్రహరీ లేకపోవడంతో పాములు తరగతి గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. సమయానికి ఏం జరుగుతుందోనని హడలిపోతున్నారు. అధికారులు స్పందించి పాఠశాలకు దారి ఏర్పాటుచేసి ప్రహరీ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో కింగ్ కోబ్రా పిల్లలు!
చిత్తూరు: జిల్లాలోని ప్రధాన వైద్యశాలలోకి శనివారం తాచుపాములు రావడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలోని మెడికల్ వార్డులో గత మూడు రోజులుగా నల్లతాచుపాము(కింగ్ కోబ్రా) తిరుగుతోందని రోగులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు. అయితే శనివారం మధ్యహ్నాం సమయంలో ఆసుపత్రిలోని టాయిలెట్ నుంచి తాచుపాము పిల్లలు బయటికివచ్చాయి. దీంతో ఒక్కసారిగా హడలిపోయిన రోగులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమయిన ఆసుపత్రి సిబ్బంది పాము పిల్లల్ని చంపేశారు. మరికొద్దిసేపటి తర్వాత మరో నాలుగు తాచుపాము పిల్లలు వార్డులోకి వచ్చాయి. దాంతో అక్కడే పడకలపై ఉన్న వాళ్లంతా వార్డు నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న సిబ్బంది మళ్లీ పాము పిల్లల్ని చంపి, దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాములు, ఎలుకలు కారణంగా రోగులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. -
బస్సులో ప్రత్యక్షమైన నాగుపాము
చిత్తూరు : బస్సులో బుస్సుమంటూ నాగుపాము ప్రత్యక్షమవడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. కదులుతున్న బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బోయకొండ నుంచి కర్ణాటకకు బయలుదేరిన బస్సులో ఉన్నట్టుండి ఓ నాగుపాము ప్రత్యక్షమైంది. పామును చూసి ప్రయాణికులు భయంతో బస్సు దూకి పరుగులు తీశారు. -
ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం
మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఓ నాగుపాము కలకలం రేపింది. చిన్నపిల్లల వార్డు బయట సీసీ రోడ్డు పక్కన నాగు పాము ప్రత్యక్షం కావడంతో దాన్ని చూసిన వారు భయాందోళనకు లోనయ్యారు. పాములు పట్టడంలో నేర్పరి అయిన ఇందిరానగర్ ప్రాంతవాసి ప్రమీద్ అనే యువకుడికి కబురుపెట్టారు. అతడు వచ్చి నాగుపామును చాకచక్యంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఆలయంలో నాగుపాము
కుసుమంచి (ఖమ్మం) : ఆలయంలోకి చొరబడిన నాగుపామును చూసిన భక్తులు భయంతో గుడి బయటకు పరుగులు తీశారు. అయితే ఆలయంలోకి ప్రవేశించిన పాము ఎంతకూ వెళ్లకుండా గర్భగుడి బయట ఉన్న ద్వార పాలకుని విగ్రహాల చెంతే పడుకుండిపోయింది. దీంతో దాన్ని భగవంతుని పాముగా భావించిన ఆలయ పూజారి పాముకు పాలు పోసి పూజలు నిర్వహించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మంగళవారం జరిగింది. కాగా ఈ విషయం దావానలంలా పాకడంతో గ్రామస్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. -
కోయంబత్తూర్లో కింగ్కోబ్రా కలకలం
-
అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం
నరసన్నపేట రూరల్: బొరిగివలస అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం సృష్టించింది. పిల్లలతో పాటు అంగన్వాడీ కార్యకర్త, ఆయాలు పరుగులు తీశారు. సోమవారం ఉదయం కేంద్రం తెరిచేటప్పటికే పాము లోపల ఉంది. అయితే ముందుగా దీనిని ఎవరూ గుర్తించ లేదు. కొద్ది సమయం అయిన తర్వాత పాము బుసలు వినిపించడంతో అనుమానంతో కార్యకర్త, ఆయాలు లోపల వెతికారు. నాగుపాము ఒక్కసారిగా బయటకు వచ్చింది. కేంద్రంలో పిల్లల కోసం ఉంచిన గుడ్లును అప్పటికే అధికంగా పాము తాగింది. దీంతో కదలలేని స్థితిలో ఉండడంతో ఇబ్బంది కలగలేదు. సుమారు గంట పాటు కేంద్రంలోనే పాము ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వచ్చి పామును పట్టుకొని తీసుకువెళ్లారు. దీంతో కేంద్రంలోని పిల్లలు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా కేంద్రంకు ఆనుకొని ముళ్లతుప్పలు ఉండటమే ఈ పరిస్థితికి కారణమని గ్రామస్తులు అంటున్నారు. పాము వల్ల ఒకవేళ ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యులని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, సిబ్బంది మేల్కొని అంగన్ వాడీ కేంద్రాల చుట్టూ ముళ్ల తుప్పలు, పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని కోరుతున్నారు.