మెట్రో రైలు టెస్ట్ రన్ సక్సెస్
హైదరాబాద్: భాగ్యనగరం మరో అరుదైన ఘనతను సాధించింది. జంట నగరాలలో ట్రాఫిక్ రద్దీ సమస్యను తగ్గించేందుకు ప్రారంభించిన మెట్రో రైలు ప్రాజెక్ట్ ఓ మైలు రాయిని అధిగమించింది. హైదరాబాద్లోని నాగోల్ స్టేషన్ నుంచి సర్వే ఆఫ్ ఇండియా వరకు మెట్రో రైలు టెస్ట్ రన్ అధికారులు నిర్వహించారు.
కిలో మీటర్ పరిధి వరకు ట్రాక్, కోచ్ల పనితీరును అధికారులు పరిశీలించారు. ట్రాక్, కోచ్ పనితీరుపై అధికారులు సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.