'స్కాలర్‌షిప్' ల కోసం మౌన ప్రదర్శన | students silent protest for scholership in medak | Sakshi
Sakshi News home page

'స్కాలర్‌షిప్' ల కోసం మౌన ప్రదర్శన

Published Thu, Jan 22 2015 5:04 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

మెదక్ జిల్లా రామాయం పేటలో గురువారం వివిధ కళాశాలల విద్యార్థులు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని నిరసన ప్రదర్శన నిర్వహించారు.

రామాయంపేట (మెదక్‌జిల్లా) : మెదక్ జిల్లా రామాయం పేటలో గురువారం వివిధ కళాశాలల విద్యార్థులు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్నేహ, సాయికృప, వాసవి కళాశాలలకు చెందిన వందలాది మంది జూనియర్ కళాశాలల విద్యార్థులు వందల సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

 

ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2014-15 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాల కోసం తాము దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. అనంతరం వారు స్థానిక తహశీల్దార్ శంకర్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement