
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి
ఈ రోజు ఇక్కడ జరుగుతున్న టీడీపీ బహిరంగ సభలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
మహబూబ్నగర్: ఈ రోజు ఇక్కడ జరుగుతున్న టీడీపీ బహిరంగ సభలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించే సమయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. దాంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. సభాప్రాంగణం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.