మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారానే ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందని ఎలక్షన్ కమీషన్ మాజీ కార్యదర్శి హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు.
హైదరాబాద్: మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారానే ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ మాజీ కార్యదర్శి హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు, అసెంబ్లీ సిబ్బందికి అధికారులు శనివారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమలో హెచ్ఎస్ బ్రహ్మ పాల్గొన్నారు. సరైన కోటా ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తామని ఆయన తెలపారు. ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా సుదుపాయం కూడా ఉన్నట్టు తెలిపారు. జూన్ 1 వతేది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు.