గురువింద చందంగా చంద్రబాబు తీరు.. | thanks to all who were come and success our meeting: jagadeesh reddy | Sakshi
Sakshi News home page

గురువింద చందంగా చంద్రబాబు తీరు..

Published Tue, Apr 28 2015 11:37 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM

గురువింద చందంగా చంద్రబాబు తీరు.. - Sakshi

గురువింద చందంగా చంద్రబాబు తీరు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు, ప్రజానీకానికి టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. భారీ మొత్తంలో ఈ సభకు హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. సభ నుంచి తిరిగి వెళుతూ ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన చెప్పారు. గాయపడిన వారికి ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తామని చెప్పారు.

అనంతరం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు తీరు గురువింద చందంగా ఉందని విమర్శించారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీ కొనుగోలు చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో ఎందుకు రాజీనామా చేయించలేదని కూడా ఆయన మరో ప్రశ్న వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement