మూతపడిన 'చాయ్ పే చర్చా' టీ స్టాల్ | Ahmedabad tea stall where Modi held ‘Chai pe Charcha’ shuts down | Sakshi
Sakshi News home page

మూతపడిన 'చాయ్ పే చర్చా' టీ స్టాల్

Published Mon, Aug 22 2016 1:46 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

మూతపడిన 'చాయ్ పే చర్చా' టీ స్టాల్ - Sakshi

మూతపడిన 'చాయ్ పే చర్చా' టీ స్టాల్

ప్రధానమంత్రి అభ్యర్థిగా రెండేళ్ల క్రితం నరేంద్రమోదీ నిర్వహించిన పాపులర్ క్యాంపెయిన్ ఛాయ్ పే చర్చా అన్నీ వార్తపత్రికల్లో బ్యానర్గా నిలిచింది.

ప్రధానమంత్రి అభ్యర్థిగా రెండేళ్ల క్రితం నరేంద్రమోదీ నిర్వహించిన పాపులర్ క్యాంపెయిన్ చాయ్ పే చర్చా అన్నీ వార్తపత్రికల్లో బ్యానర్గా నిలిచింది. ఈ క్యాంపెయిన్తో పాటు మోదీ మొదటిసారి ఎక్కడైతే చాయ్ పే చర్చను ప్రారంభించారో ఆ టీ స్టాల్కూ ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే ప్రస్తుతం ఆ స్నాక్ అవుట్లెట్ను మున్సిపల్ అధికారులు మూసేశారట. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఈ టీ స్టాల్ ఉండటంతో పాటు, సరియైన భవన వాడక అనుమతులు లేకపోవడంతో దీన్ని సీజ్ చేసినట్టు మున్సిపల్ అధికారులు వెల్లడించారు.

ఈ ఇస్కోన్ గాంతియా టీ స్టాల్తో పాటు మొత్తం ఎనిమిది స్నాక్ అవుట్లెట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దుకాణాలకు సరియైన పార్కింగ్ స్థలం లేకపోవడంతో పాటు హైవే అంతా కస్టమర్లతో గందరగోళంగా మారుతోంది. దీనిపై అహ్మదాబాద్ మున్సిపల్ అథారిటీలు వివిధ నోటీసులు పంపినప్పటికీ ఈ అవుట్లెట్లు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేయలేదు. నోటీసులు పంపినా స్పందించని అవుట్లెట్లపై సీరియస్ అయిన మున్సిపల్ అధికారులు వీటిని సీజ్ చేశారు. చట్టాలను అతిక్రమించి ఈ అవుట్లెట్లను రన్ చేస్తున్నారని, అవసరమైన భవన వాడక అనుమతులు లేవని మున్సిపల్ అథారిటీలు పేర్కొన్నారు.

ఈ స్నాక్ అవుట్లెట్లోనే ప్రధాని అభ్యర్థిగా మోదీ మొదటిసారి చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాయ్ పే చర్చ అనంతరం ఆ టీ స్టాల్కు భారీగా డిమాండ్ పెరిగింది. కస్టమర్లు కుప్పలు తెప్పలుగా విచ్చేస్తున్నారు. దీంతో హైవేపై గందరగోళ వాతావరణం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement