అసెంబ్లీ లాంజ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో తొలగింపుపై బుధవారం ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన తెలిపారు.
హైదరాబాద్ : అసెంబ్లీ లాంజ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో తొలగింపుపై బుధవారం ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన తెలిపారు. తొలగించిన వైఎస్ఆర్ ఫోటో తిరిగి అదే స్థానంలో ఉంచాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.