నిజామాబాద్ జిల్లా నందిపేటలో శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. నందిపేటకు చెందిన ఓ మహిళ నవీపేట మండలం జన్నెపల్లి
ఓ వర్గం మహిళను వేధించిన మరో వర్గం యువకులు
నందిపేట : నిజామాబాద్ జిల్లా నందిపేటలో శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. నందిపేటకు చెందిన ఓ మహిళ నవీపేట మండలం జన్నెపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. నాలుగు రోజుల నుంచి నందిపేటకు చెందిన ఓ వర్గం యువకులు సదరు మహిళను వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలపడంతో స్నేహితులతో కలిసి వేధించిన యువకుల కోసం శుక్రవారం రాత్రి నుంచి గాలించారు. శనివారం ఉదయం వారు దొరకగా.. చితక బాదారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ఈ తోపులాటలో ఎస్సై జాన్రెడ్డి సృ్పహ తప్పి పడిపోయాడు. దీంతో స్థానికులు ఆయనకు స్థానిక ప్రైవేట్ వైద్యుడితో వైద్యం చేయించారు. గణపతి ఉత్సవాల్లో నైట్ డ్యూటీతో నిద్ర సరిగా లేకపోవడంతోనే బీపీ తక్కువై ఎస్సై జాన్రెడ్డి కింద పడిపోయినట్లు ఆ వైద్యుడు తెలిపారు. మహిళపై వేధింపులకు నిరసనగా ఓ వర్గం యువకులు నందిపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో మహిళను వేధించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వర్గం వారంతా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆందోళన చేశారు. కాగా, ఈ ఘర్షణల విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ చంద్రశేఖర్రె డ్డి నందిపేటలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.