ఒరిస్సాలో 8 మంది మావోయిస్టులు లొంగుబాటు | Eight Maoists surrender in Odisha | Sakshi
Sakshi News home page

ఒరిస్సాలో 8 మంది మావోయిస్టులు లొంగుబాటు

Published Wed, Aug 14 2013 4:30 PM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

ఒరిస్సాలోని ఎనిమిది మంది మావోయిస్టులు బుధవారం మల్కాన్గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ ఎదుట లొంగిపోయారు.

ఒరిస్సాలోని ఎనిమిది మంది మావోయిస్టులు బుధవారం మల్కాన్గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. అయితే ఆ మావోయిస్టులందరిది మల్కాన్గిరి జిల్లాలోని అత్యంత మారుమూలప్రాంతమైన చిత్రకొండ ప్రాంతమని జిల్లా ఎస్పీ వివరించారు.

 

2009 నుంచి వారు మావోయిస్టు కార్యకలపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. మొత్తం ఎనిమిది మంది మావోయిస్టుల్లో ముగ్గురు ఏరియా దళ కామాండర్లుగా ఉన్నారని చెప్పారు.  లొంగిపోయిన మావోయిస్టులు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... తామంతా జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement