surrender
-
మావోలకు లొంగుబాటే శరణ్యమా?
సాక్షి, హైదరాబాద్: భద్రతా బలగాల భారీ వేట.. వృద్ధాప్యానికి చేరిన మావోయిస్టు (Maoist) అగ్ర నాయకులు.. తరుముకొస్తున్న ఆపరేషన్ కగార్ డెడ్లైన్... వెరసి అన్నల్లో అంతర్మథనం మొదలైందనే చర్చ జరుగుతోంది. దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టులకు గత మూడేళ్లుగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్గఢ్లో పూర్తి పట్టున్న ప్రాంతాలు సైతం సాయుధ పోలీసు బలగాల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో కొందరు మావోయిస్టులు లొంగుబాట పట్టారు. గత నెలన్నరరోజుల్లో తెలంగాణ (Telangana) పోలీసుల ఎదుట కొందరు కీలక నాయకులు లొంగిపోయిన విషయం తెలిసిందే.ఇటీవల మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈమె దివంగత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య. పద్మ 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు కొందరు ఆకర్షితులవుతున్నారు.మరోవైపు మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేషా లొంగిపోయిందని...ఆమె లొంగుబాటు సందర్భంగా అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేషాతోపాటు ఇటీవల కొందరు మావోయిస్టుల లొంగుబాట్ల వెనుకున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా పలు కీలక స్థానాల్లో పనిచేసిన మావోయిస్టు సీనియర్ నాయకులు వరుస లొంగుబాట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో గతేడాది 41 మంది సరెండర్ 2024లో తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ, ఒకరు స్టేట్ కమిటీ సభ్యుడు, 16 మంది ఏరియా కమిటీ సభ్యులు, మిగిలినవారు పలు కేడర్లకు చెందినవారు. 85 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. నాయకుల వయో‘భారం’మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి సెంట్రల్ కమిటీ సభ్యుల్లో దాదాపు అంతా ఐదు పదుల వయసు దాటినవారే ఉన్నారు. మావోయిస్టులను ముందుండి నడిపించాల్సిన అగ్రనాయకత్వం వయోభారంతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. పైగా తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ స్థానికులకంటే ఇతర రాష్ట్రాలవారే ఎక్కువగా ఉన్నారు. వీరిలోనూ కీలక నేతలు కూడా వయసులో పెద్దవారే. వీరంతా ప్రస్తుతం సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితి. ఇలా ప్రతి అంశంలోనూ మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కిందిస్థాయి నాయకత్వానికి భరోసా ఇచ్చి నడిపించేవారు లేకుండాపోయారు. మరికొన్ని ప్రధాన లొంగుబాట్లు ఇలా...ఈ ఏడాది ఫిబ్రవరి 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్రాజ్ ఎదుట ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 18న చర్ల పోలీస్స్టేషన్లో కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్రాజ్ ఎదుట ఛత్తీస్గఢ్కు చెందిన 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ఖేర్ ఎదుట ఒక మావోయిస్టు లొంగిపోయాడు. ఈ ఏడాది జనవరి 2న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సీదం అలియాస్ తారక్క గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ 2024 డిసెంబర్ 25న ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. అక్టోబర్ 2, 2024లో పెదబయలు ఏరియా కమిటీకి చెందిన 17 మంది మావోయిస్టులు పాడేరు జిల్లా ఎస్పీ అమిత్బర్దర్ ఎదుట లొంగిపోయారు. డిసెంబర్ 10 2023న ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాల్లో 20 మంది మావోయిస్టులు స్థానిక ఎస్పీ ఎదుట లొంగిపోయారు. జనవరి 1, 2022న సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 44 మంది లొంగిపోయారు. జనవరి 28, 2022న విశాఖపట్నం పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. -
కర్ణాటకలో లొంగిపోయిన చివరి మావోయిస్టు
బెంగళూరు:కర్ణాటక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఇటీవల చేసిన ప్రకటన నిజమైంది. రాష్ట్రంలో చివరి మావోయిస్టుగా భావిస్తున్న తొంబట్టు లక్ష్మీ ఆదివారం(ఫిబ్రవరి2) పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉడుపి పోలీసు ఉన్నతాధికారుల ముందు సరెండర్ అయ్యారు.తనకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వానికి లక్ష్మీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.లక్ష్మీ స్వగ్రామం కుందపుర తాలుకాలోని మచ్చట్టు.దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి మావోయిస్టు పార్టీలోకి వెళ్లింది. సమీప ప్రాంతాల్లో మావోయిస్టు సాహిత్యం ప్రచారం చేయడంతోపాటు పోలీసులపై దాడి ఘటనల్లో ఆమెపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి.చాలా ఏళ్లుగా ఆమె ఏపీలో తలదాచుకున్నట్లు సమాచారం.ఇటీవల లక్ష్మీ లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.సరెండర్ కమిటీ సభ్యుడు,గతంలో లొంగిపోయిన ఆమె భర్త సలీంతో కలిసి ఉడుపి పోలీసుల ముందుకు వచ్చారు.కాగా, కర్ణాటకను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మావోయిస్టుల సరెండర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో లొంగిపోయే మావోయిస్టులకు మార్గం సుగమం అయింది. రెండురోజుల క్రితమే శృంగేరి తాలూకా కిగ్గా గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకుడు రవీంద్ర నెమ్మార్ చిక్కమగళూరులో అధికారుల ముందు లొంగిపోయాడు. -
పాలసీ సరెండర్ చేస్తే.. ఇక ఊరట!
ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ ఎంతో అవసరం. జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి మన సమాజంలో ఎక్కువగానే ఉంది. నేటికీ సంప్రదాయ బీమా పాలసీలు (ఎండోమెంట్, మనీబ్యాక్/జీవించి ఉన్నా రాబడులు వచ్చేవి) ఎక్కువగా విక్రయమవుతుండడం దీనికి నిదర్శనం. నిజానికి ఈ తరహా ప్లాన్లలో తక్కువ రక్షణకే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ప్రీమియం భారంగా మారి కట్టలేని పరిస్థితుల్లో అర్ధాంతరంగా విడిచిపెట్టేసేవారు ఉన్నారు. ఇక పాలసీ వద్దనుకుని వెనక్కి ఇచ్చేస్తే (సరెండర్) బీమా సంస్థలు నిబంధనల మేరకు కొంత మొత్తాన్ని వెనక్కి ఇస్తుంటాయి. పాలసీ తీసుకున్న తొలినాళ్లలో రద్దు చేసుకుంటే చేతికి వచ్చేది పిసరంతే. ఇది గమనించిన బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. కనుక పాలసీని సరెండర్ చేస్తే ఎంత మొత్తం వెనక్కి వస్తుందన్న దానిపై పాలసీదారులు అవగాహన కలిగి ఉండడం అవసరం. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.సరెండర్ వేల్యూ? జీవిత బీమాలో సరెండర్ వేల్యూ అంటే.. గడువు తీరకుండానే పాలసీని రద్దు చేసుకుంటే పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లించే మొత్తం. పాలసీ కాల వ్యవధి మధ్యలో వైదొలిగితే కట్టిన ప్రీమియంల నుంచి కొంత మొత్తాన్ని బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. సరెండర్ చార్జీల (స్వాధీనపు చార్జీలు) పేరుతో కొంత మినహాయించుకుంటుంది. సరెండర్ చేయడం కంటే పాలసీని కొనసాగించడమే నయమనే విధంగా, పాలసీ ముందస్తు రద్దును నిరుత్సాహపరిచే స్థాయిలో సరెండర్ చార్జీలు ఇంతకుముందు అమల్లో ఉండేవి. ఇది అసమంజసమని భావించిన ఐఆర్డీఏఐ పాలసీదారుల ప్రయోజనాల కోణంలో నిబంధనలు మార్చింది. సరెండర్ వేల్యూ అన్నది.. గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూ (జీఎస్వీ), స్పెషల్ సరెండర్ వ్యాల్యూ (ఎస్ఎస్వీ) అని రెండు రకాలుగా ఉంటుంది. గ్యారంటీడ్ అంటే పాలసీ రద్దుతో బీమా సంస్థ చెల్లించాల్సిన కనీస మొత్తం. ఇందులో పాలసీ గడువు తీరినప్పుడు ఇచ్చే బోనస్లను కలపరు. అదే స్పెషల్ సరెండర్ వేల్యూలో అప్పటి వరకు సమకూరిన బోనస్లు, ఇతర ప్రయోజనాలు కూడా కలుస్తాయి. బీమా సంస్థలతో సంప్రదింపుల మీదట ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు తీసుకొస్తూ జూన్ 12న జీవిత బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానంగా స్పెషల్ సరెండర్ వ్యాల్యూ నిబంధనల్లో కీలకమైన మార్పును ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది.ఎంతొస్తుంది..? పాలసీ తీసుకున్న ఏడాది తర్వాత వైదొలిగితే గతంలో ఏమీ వచ్చేది కాదు. కానీ, ఇక మీదట కొంత మొత్తం చెల్లించక తప్పదు. అలాగే పాలసీ తీసుకున్న మొదటి ఐదేళ్లలో సరెండర్ చేస్తే గతంలో పెద్దగా తిరిగొచ్చేది కాదు. కానీ ఇప్పుడు బీమా సంస్థలు అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వారీగా గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ, స్పెషల్ సరెండర్ వేల్యూ, చెల్లింపుల సరెండర్ వేల్యూ గురించి పాలసీ ఇల్రస్టేషన్ (ప్రయోజనాల) పత్రంలో పేర్కొనాలని ఐఆర్డీఏఐ నిర్దేశించింది. ఈ పత్రంపై పాలసీ కొనుగోలుదారు, బీమా ఏజెంట్ లేదా బీమా సంస్థ అ«దీకృత మధ్యవర్తి లేదా పంపిణీ ఉద్యోగి సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీని సరెండర్ చేస్తే ఎంతొస్తుందన్నది ఉదాహరణ ద్వారా సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవికిరణ్ రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తో పదేళ్ల కాలానికి (టర్మ్) పాలసీ తీసుకున్నాడని అనుకుందాం. ఏటా రూ.50,000 ప్రీమియం చెల్లించాలి. నాలుగేళ్లపాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత అతడు పాలసీని సరెండర్ చేద్దామనుకున్నాడు. అప్పటి వరకు ప్రీమియం రూపంలో అతడు బీమా సంస్థకు రూ.2,00,000 చెల్లించాడు. ఏటా రూ.10,000 చొప్పున బోనస్ అతడికి జమ అయింది. గత నిబంధనల ప్రకారం పాలసీ తీసుకున్న తర్వాత నాలుగో ఏడాది నుంచి ఏడో ఏడాది మధ్య సరెండర్ చేస్తే అప్పటి వరకు తాము వసూలు చేసిన ప్రీమియంలలో 50 శాతాన్ని బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేవి. ‘అంటే పాత నిబంధనల ప్రకారం రవికిరణ్ నాలుగేళ్ల తర్వాత పాలసీని సరెండర్ చేస్తే వచ్చే మొత్తం రూ.1,20,000 అవుతుంది. చెల్లించిన ప్రీమియంతోపాటు బోనస్లు కూడా కలుపుకుని చూస్తే అప్పటికి రూ.2,40,000 సమకూరింది. అంటే ఇందులో సగం కోల్పోవాల్సి వచ్చేది. కానీ, నూతన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనల కింద నాలుగేళ్ల తర్వాత సరెండర్ చేస్తే ఇదే ఉదాహరణ కింద రవికిరణ్కు రూ.1.55 లక్షలు వెనక్కి వస్తాయి’ అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, సహజ్మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్ కుమార్ వివరించారు. ఆయా అంశాలకు సంబంధించి నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరమన్నారు. ఒకవేళ ఇదే పాలసీని మొదటి ఏడాది ప్రీమియం రూ.50,000 చెల్లించిన తర్వాత రవికిరణ్ సరెండర్ చేస్తే పాత నిబంధనల కింద రూపాయి కూడా వెనక్కి రాదు. కానీ, కొత్త నిబంధల కింద రూ.31,295 వెనక్కి వస్తుంది. అంటే చెల్లించిన ప్రీమియంలో 62.59 శాతానికి సమానం. ఇలా ఏటా పెరుగుతూ వెళుతుంది. రెండో ఏడాది సరెండర్ చేస్తే అప్పటికి చెల్లించిన ప్రీమియంలో 67.28 శాతం వెనక్కి వస్తుంది. మూడో ఏట 72.33 శాతం, నాలుగో ఏట 77.76 శాతం, ఐదో ఏటా 83.59 శాతం, ఆరో ఏట 89.86 శాతం, ఏడో ఏట 96.60 శాతం, ఎనిమిదో ఏడాది ప్రీమియం చెల్లించిన తర్వాత అప్పటికి చెల్లించిన ప్రీమియంపై 103.84 శాతం, తొమ్మిదో ఏట 111.63 శాతం బీమా సంస్థ వెనక్కి ఇస్తుంది. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీలు, సింగిల్ ప్రీమియం పాలసీల్లోనూ ఒక్కసారి ప్రీమియం చెల్లించినా సరే స్పెషల్ సరెండర్ వేల్యూ వెనక్కి ఇవ్వాల్సిందేనని ఐఆర్డీఏఐ కొత్త నిబంధనల్లో నిర్ధేశించింది. ఎప్పటి నుంచి..? స్పెషల్ సరెండర్ వేల్యూ కొత్త నిబంధనలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమలు చేయాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు కొత్తగా తీసుకునే ఎండోమెంట్ పాలసీలకే వర్తిస్తాయని బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో బి.సతీశ్వర్ తెలిపారు. నూతన నిబంధనలు అమల్లోకి వచి్చన తర్వాత తీసుకునే పాలసీలకే ఐఆర్డీఏఐ తీసుకొచి్చన స్పెషల్ సరెండర్ వేల్యూ నిబంధనలు అమలవుతాయి.ప్రత్యామ్నాయాలు... ఎండోమెంట్ ప్లాన్లను తీసుకుని కొన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత, ఆపై కొనసాగించడం భారంగా మారిన వారికి సరెండర్ చేయడం ఒక్కటే ఆప్షన్ కాదు. ఆ పాలసీని పెయిడప్గా మార్చుకోవచ్చు. పెయిడప్గా మార్చుకోవడం వల్ల బీమా రక్షణ కొనసాగుతుంది. అప్పటి నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియం కూడా చెల్లించనక్కర్లేదు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు, ఎంత మేర ప్రీమియం చెల్లించారన్న దాని ఆధారంగా బీమా కవరేజీని నిర్ణయిస్తారు. ఉదాహరణకు రూ. 5 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఏటా రూ. 50వేల చొప్పున ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. ఆ తర్వాత ఇక కొనసాగించడం వీలు కాని వారు పెయిడప్గా మార్చుకుంటే, అదే పాలసీ రూ.5 లక్షలకు బదులు రూ.1–1.5 లక్షల సమ్ అష్యూర్డ్తో 20 ఏళ్ల వరకు కొనసాగుతుంది. గడువు తీరిన తర్వాత నిబంధనల మేరకు, అప్పటి వరకు సమకూరిన బోనస్ ప్రయోజనాలతో కలిపి చెల్లింపులు లభిస్తాయి. మరో మార్గంగా పెయిడప్గా మార్చి, సమ్ అష్యూర్డ్ తగ్గించుకుని, అప్పటి నుంచి తక్కువే ప్రీమియం చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల పెయిడప్ సమ్ అష్యూర్డ్ కవరేజీ కొంత పెరుగుతుంది. కాకపోతే పెయిడప్ చేసేందుకు బీమా సంస్థలు చార్జీలు వసూలు చేయడమే ప్రతికూలం. ఒకవేళ నిధుల అవసరం ఏర్పడి, పాలసీని సరెండర్ చేస్తే తిరిగొచ్చే మొత్తం ఆదుకుంటుందని భావిస్తే అప్పుడు అదే ఆప్షన్ను పరిశీలించొచ్చు. ప్రయోజనాలునూతన నిబంధనలు పాలసీదారులకు ప్రయోజనమన్నది నిపుణుల విశ్లేషణ. ఏజెంట్ చెప్పిన మాటలు విని లేదా తెలిసిన వారు చెప్పారనో ఏదైనా పాలసీ కొనుగోలు చేసిన తర్వాత.. అది తమకు సరిపడేది కాదని గుర్తించిన సందర్భాల్లో దాన్ని సరెండర్ చేసి బయటకు రావచ్చు. తమ అవసరాలకు తగిన మరో ప్లాన్ను కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నారు. అనుచిత వ్యాపార విధానాలపై (బీమా కంపెనీలకు సంబంధించి) పాలసీదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు 1.5 శాతం పెరిగినట్టు ఐఆర్డీఏఐ 2022–23 నివేదిక సైతం తెలియజేస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు బీమా కంపెనీలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. పాలసీదారులను తప్పుదోవ పట్టించి, వారితో పాలసీలు కొనుగోలు చేయించే అనైతిక ధోరణలకు చెక్ పెట్టడం కూడా సరెండర్ వేల్యూ పెంచడంలోని ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ పాలసీలు / టర్మ్ ప్లాన్లుఎండోమెంట్ ప్లాన్లలో పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)తోపాటు అప్పటి వరకు సమకూరిన బోనస్లు చెల్లిస్తారు. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నప్పటికీ.. ఈ ప్లాన్లలో నిర్దేశిత మొత్తం తిరిగొస్తుంది. ఇది సమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువే ఉంటుంది. అంటే ఒకవైపు బీమా రక్షణతోపాటు, రాబడి ప్రయోజనం కూడా ఈ ప్లాన్లలో భాగంగా ఉంటుంది. అందుకే ఈ ప్లాన్ల ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే తాము అప్పటి వరకు కట్టిన దానికంటే ఎక్కువే వస్తుందని చాలా మంది ఈ తరహా ప్లాన్లకే మొగ్గు చూపిస్తుంటారు. కానీ, 20 ఏళ్లు, అంతకు మించిన కాలవ్యవధి గల ఎండోమెంట్ ప్లాన్లలో వచ్చే నికర వార్షిక రాబడి 5 శాతంగానే ఉంటుందని అంచనా. అంటే ద్రవ్యోల్బణం రేటుకు సమానం. కనుక పాలసీదారులకు ఈ ప్లాన్లపై వచ్చే నికర రాబడి సున్నాయే అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వీటికి భిన్నం. ఇవి అచ్చమైన బీమా రక్షణకే పరిమితం అవుతాయి. అంటే పాలసీ కాల వ్యవధిలో (టర్మ్) పాలసీదారు మరణించినట్టయితే సమ్ అష్యూర్డ్ మొత్తం నామినీ లేదా వారసులకు లభిస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ రాదు. పాలసీదారు జీవించి ఉన్నా, అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలను వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వచ్చాయి. కాకపోతే అచ్చమైన టర్మ్ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియం 50–100 శాతం ఎక్కువే ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి జీవిత బీమా కవరేజీని కేవలం రూ.10 వేల వార్షిక ప్రీమియానికే టర్మ్ ప్లాన్తో సొంతం చేసుకోవచ్చు. -
మావోయిస్టు కీలకనేత బిచ్చు లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలకనేతల్లో ఒకరైన నంగ్సు తుమ్రెట్టి అలియాస్ గిరిధర్ ఆలియాస్ బిచ్చుతోపాటు ఆయన భార్య లలితా ఉసెండీ అలియాస్ సంగీత ఆదివారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాకు చెందిన బిచ్చు 1997లో మావోయిస్టు పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. దాడులు చేయడంలో దిట్టగా పేరున్న కంపెనీ–4కు కమాండర్గా బిచ్చు వ్యవహరించారు. ఆ తర్వాత దక్షిణ గడ్చిరోలి జిల్లా కార్యదర్శి, కమాండర్ హోదాలో బిచ్చు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. ఇప్పటి వరకు ఆయనపై 179 కేసులు నమోదు కాగా, అందులో ఎదురుకాల్పులకు సంబంధించినవి 86 వరకు ఉన్నాయి. బిచ్చుపై రూ.25లక్షల రివార్డు ఉంది. బిచ్చు భార్య సంగీతపై 18 కేసులుండగా, రూ.16 లక్షల రివార్డు ఉంది. రిక్రూట్మెంట్లు తగ్గిపోయాయి : ఫడ్నవిస్గడిచిన నాలుగేళ్లలో గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్లు గణనీయంగా తగ్గిపోయాయని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గడిచిన నాలుగేళ్లలో పోలీస్ రిక్రూట్మెంట్లకు ఈ జిల్లా నుంచి 28 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. మావోయిస్టుల కంటే ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉందనేందుకు ఇది ఉదాహరణ అన్నారు. డీఐజీ అంకిత్గోయల్ మాట్లాడుతూ 2021 నుంచి జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో గడ్చిరోలి జిల్లాలో 65 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఉన్నారన్నారు. -
జూన్-2న తీహార్ అధికారుల ఎదుట లొంగిపోనున్న కేజ్రీవాల్
-
Bilkis Bano Case: సుప్రీంను ఆశ్రయించిన దోషులు
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ ముగ్గురు దోషులు పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దోషులలో ఒకరైన గోవింద్భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడిగింపును కోరాడు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని, ఆరు వారాల పొడిగింపును కోరాడు. మూడవ దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం చోటు జరిగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
‘నా భార్యను అందుకే హత్య చేశాను’ అంటూ..!
భార్యాభర్తల మధ్య గొడవలనేవి సహజం. అయితే దంపతులలో ఎవరైనా వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంటే వారి బాంధవ్యం బీటలు వారుతుంది. అప్పుడు పరిస్థితులు ఎంతవరకైనా దారితీస్తాయి. ఇలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యూపీలోని కాన్పూర్ దెహాత్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు అనుమానంతో తన భార్య గొంతునులిమి హత్యచేశాడు. తరువాత నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి, జరిగిన విషయాన్ని చెప్పి సరెండర్ అయ్యాడు. అతను పోలీసులకు ఈ విషయం చెబుతున్నప్పుడు అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని, సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రసూల్బాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని కండవర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రామానికి చెందిన ములాయం సంఖ్వార్ భార్య ఖుష్బూ కొన్ని రోజుల క్రితం వారి ఎదురింటిలో ఉంటున్న ఆమె ప్రేమికుడు వివేక్తో పాటు ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ నేపధ్యంలో ములాయం సంఖ్వార్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ ఉదంతం పోలీస్స్టేషన్ వరకూ చేరుకుంది. అక్కడ భార్యాభర్తల మధ్య రాజీ కుదిరింది. దీంతో వారిరిద్దరూ తిరిగి కలిసివుండసాగారు. అయితే భార్య గతంలో ప్రియుడితో వెళ్లిపోయిన విషయాన్ని ములాయం సంఖ్వార్ మరచిపోలేకపోయాడు. దీంతో గత మూడు రోజులుగా భార్యాభర్తలమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ములాయం తన భార్య ఖుష్బూ గొంతు నులిమి హత్యచేశాడు. తరువాత పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మొక్కుబడి
ఇద్దరు గ్రామస్తుల మధ్యన తమలో ఎవరు గొప్ప భక్తుడనే వాదన మొదలయ్యింది. వందలాది పుణ్య క్షేత్రాలు తిరిగి వచ్చిన తను గొప్ప భక్తుడినని ఒక గ్రామస్తుడు వాదించాడు. ఎన్నో ఉపవాసాలు, వ్రతాలు, దీక్షలు చేసిన తానే నిజమైన భక్తుడని మరో గ్రామస్తుడు వాదించసాగాడు. వాదనలు తీవ్ర రూపం దాల్చడంతో గ్రామం గుండా పోతున్న ఓ గురువును వారు ఆశ్రయించారు. ‘‘మా భక్తి నిరూపించుకోడానికి ఏమైనా చేస్తాం, ఎన్ని సాహసకార్యాలైనా చేయగలం’’ అని గట్టిగట్టిగా అరిచి చెప్పారు. వారిద్దరి వాదనలూ ఓపికగా విన్నాడు గురువు. చిన్న నవ్వు నవ్వి ‘‘మీలో ఎవరు నిజమైన భక్తుడో సులభంగా తెలుసుకోవచ్చు. మీరు నాతోపాటు రండి, ఎన్నో మహిమలను చూపే దేవుడు మా ఆశ్రమంలో ఉన్నాడు. ఆ దేవుడికి మీలో ఎవరు తలనీలాలు సమర్పిస్తారో వారే నిజమైన భక్తులు’’ అని సెలవిచ్చాడు. ‘‘అదెంత పని?’’ అని వారిద్దరూ ముందుకు వచ్చారు. ‘‘అయితే మా దేవుడికి తలనీలాలు ఎవరైతే సమర్పిస్తారో వారికి ఆ తదనంతరం తల పైన ఒక్క వెంట్రుక కూడా మొలకెత్తదు. దానికి సంసిద్ధులైనవారు మాత్రమే నాతో రాగలరు’’ అని గురువు చెప్పాడు. అంతే... అప్పటిదాకా గొప్ప భక్తులమని చెప్పుకున్న ఇద్దరూ, చల్లగా అక్కడినుంచి జారుకోబోయారు. వారిని ఆపిన గురువు ‘‘భవిష్యత్తులో వెంట్రుకలు రావని చెప్పేసరికి మీరు తలనీలాలు ఇవ్వడానికే సుముఖత చూపడం లేదు. బాహ్య సౌందర్యంలో చిన్న మార్పుకు సైతం అంగీకరించని మీరు అంతః సౌందర్యంలో మార్పులకు అంగీకరిస్తారా..? నిజమైన భక్తుడు ఎప్పుడూ లాభనష్టాలు బేరీజు వేయడు. సంపూర్ణంగా తనను నమ్మి సర్వస్వ శరణాగతి కోరే వారి వెంటే దేవుడు సర్వకాల సర్వావస్థలలోనూ ఉంటాడు’’ అని వివరించాడు. తప్పు తెలుసుకున్న ఆ ఇద్దరు గ్రామస్తులు గురువును క్షమాపణ కోరారు. అమృత బిందువులు ♦ ఎవరికీ తల వంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందూ చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు ఆత్మలు కూడిన మనిషి జీవితం సఫలం. ♦ వేడినీరు ఒకటే... కాని కోడిగుడ్డును ఉడికిస్తే గట్టిపడుతుంది. ఆలుగడ్డను ఉడికిస్తే మెత్తబడుతుంది. రాగద్వేషాలు ఒక్కటే కాని ... ఆనందం కలిగినప్పుడు ఆనంద బాష్పాలు అవే. దుఃఖం కలిగినప్పుడు కన్నీటి ఓదార్పులు అవే. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
లొంగిపోనున్న ట్రంప్..ఫుల్ బందోబస్తుకు ప్లాన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాసిక్యూటర్ల ముందు లొంగిపోయే అవకాశం ఉన్నందున న్యూయార్క్ పోలీసులు గట్టి బంధోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. రహదారులను బారికేడ్లతో బ్లాక్ చేయడమే గాక కోర్లులోని ఇతర గదులను సైతం మూసేస్తన్నట్లు సమాచారం. శృంగార తారతో సంబంధం బయటపడుకుండా ఉండేందుకు చెల్లించిన డబ్బు కేసులో ట్రంప్పై వచ్చిన నేరారోపణ రుజువ్వడంతో.. ట్రంప్ అరెస్టు ఖాయమైన నేపథ్యంలో ముందుగానే కోర్టు ముందు స్వచ్ఛందంగా లొంగిపోయి విచారణకు హాజరు అవ్వాలని ట్రంప్ భావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మంగళవారం మధ్యాహ్నం మాన్హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ముంగిట హాజరుకానున్నారు. ఆయన లొంగుబాటు నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులు ఎలాంటి హింసాత్మక నిరసనలకు పాల్పడకుండా ఉండేలా ముందుస్తుగా గట్టి బంధోబస్తును ఏర్పాటు చేశారు న్యూయార్క్ పోలీసులు. అంతేగాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా భద్రతను మరింత కఠినతరం చేసేలా వ్యూహం సిద్దం చేసినట్లు పేర్కొన్నారు. అయితే న్యూయార్క్ నగరానికి ప్రస్తుతానికి ఎలాంటి భద్రత బెదిరింపులు రాలేదని తెలిపారు. తమ డిపార్ట్మెంట్ చాలా అప్రమత్తంగా ఉందని, ప్రతి ఒక్కరూ తమ హక్కులను శాంతియుతంగా వినయోగించుకోవాలని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్పై నమోదైన కేసును రిపబ్లికన్ శాసన సభ్యుడు మార్జోరీ టేలర్ గ్రీన్మాత్రం రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. ఆమె కోర్ట్కి సమీపంలో ఉన్న పార్క్ వద్ద నిరసనను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో.. న్యాయ వ్యవస్థ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా నిరశిస్తాను. అలాగే హింసను ప్రేరేపించేలా లేదా చేసే వారిని వ్యతిరేకిస్తాను అని టేలర్ ట్వీట్లో పేర్కొంది. కాగా 2021 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మద్దతదారులు వైట్ హైస్పై దాడి చేసి అల్లర్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ పోలీసులు ముందస్తుగా గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. (చదవండి: లైంగిక ఒప్పందం కేసు.. అరెస్ట్ తప్పించుకునేందుకు కోర్టులో లొంగిపోనున్న ట్రంప్!) -
తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్/ మద్దూరు: మావోయిస్టు పార్టీ కీలక నేత, ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు రావుల సావిత్రి అలియాస్ మాధవి హెడెమె (46) డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. తొలితరం పీపుల్స్వార్ నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసి 2019లో గుండెపోటుతో చనిపోయిన రావుల రామన్న అలి యాస్ శ్రీనివాస్ భార్య సావిత్రి. ఆమె లొంగిపోయిన విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. సావిత్రి 13 ఏళ్ల వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. రావుల రామన్న 1992లో మావోయిస్టు పార్టీ (పీపుల్స్వార్)లో చేరిన సావిత్రిని 1994లో వివాహం చేసుకున్నారు. జనజీవన స్రవంతిలో కలిసినందుకు సావిత్రికి తక్షణ సాయం కింద రూ.50 వేల నగదును అందించారు. తెలంగాణలో లొంగిపోయిన సావిత్రికి రూ. 5 లక్షల చెక్ను అందజేయనున్నట్లు చెప్పారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు ‘మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మావోయిజానికి ఆదరణ తగ్గింది. మావోయిస్టులు బలవంతపెట్టి కొంతమందిని దళంలో చేర్చుకుంటున్నారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు. నేను ఎవరికి తెలియకుండా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయానని సావిత్రి చెప్పారు’అని డీజీపీ వివరించారు. పోలీసులపై జరిగిన తొమ్మిది దాడుల్లో సావిత్రి పాల్గొన్నారని, ఛత్తీస్గఢ్లో ఆమెపై రూ. 10లక్షల రివార్డు ఉందని తెలిపారు. కేంద్ర కమిటీలో 13 మంది తెలుగోళ్లే.. ‘మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 20 మందిలో 13 మంది తెలుగువాళ్లే. అందులో తెలంగాణ వాళ్లు 11 మంది కాగా, ఇద్దరు ఏపీకి చెందినవారు. ఛత్తీస్గఢ్ నుంచి వాళ్లు తెలంగాణలోకి ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉంది. వారు ఎప్పుడు తెలంగాణలోకి వచ్చినా.. వెంటనే పట్టుకుంటాం. లొంగిపోయే వారికి పునరావాసం కల్పిస్తాం. 135 మంది తెలంగాణకు చెందిన వాళ్లు బస్తర్లో అజ్ఞాతంలో ఉన్నారు. మహిళా నాయకుల్లో గణపతి భార్య సుజాతక్క, కోటేశ్వర్ రావు భార్యతోపాటు మరో మహిళ మావోయిస్టు రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నారు’అని డీజీపీ వివరించారు. కాగా, పోలీసులకు లొంగిపోయినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా సావిత్రిని కుటుంబంలోకి ఆహ్వానిస్తామని రామన్న పెద్దన్నయ్య రావుల చంద్రయ్య పేర్కొన్నారు. -
కృష్ణయ్య హత్యకేసులో ఆ ఇద్దరూ లొంగుబాటు
ఖమ్మం లీగల్: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో మిగిలిన ఇద్దరు నిందితులు శుక్రవారం కోర్టులో లొంగిపోయారు. గతనెల 15న జరిగిన కృష్ణయ్య హత్యకేసులో చార్జీషీట్లో నిందితులుగా పది మందిని చేర్చారు. హత్య జరిగాక 3 రోజుల వ్యవధిలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఏ9గా ఉన్న తమ్మినేని కో టేశ్వరరావు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు), ఏ10గా ఉన్న ఎల్లంపల్లి నాగయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరి అరెస్టులో జాప్యం జరగడంతో పోలీసుల తీరుపై కృష్ణయ్య కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మౌనిక ఎదుట కోటేశ్వరరావు, నాగయ్య లొంగిపోయారు. న్యాయవాది కొల్లి సత్యనా రాయణ వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయగా న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఇద్దరినీ జిల్లా జైలుకు తరలించారు. -
కూతురు ఓ నిరుపేదను పెళ్లి చేసుకుందని..
చెన్నై: పెద్దగా చదువుకోని, నిరుపేద యువకుడిని తన కూతురు పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమె తండ్రి వారిద్దరినీ హత్య చేశాడు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లా ట్యుటికోరిన్లో ఈ పరువు హత్య దారుణం చోటుచేసుకుంది. ఎస్సీ వర్గానికి చెందిన మానిక్రాజ్(26), రేష్మా(20) జూన్ 29న వివాహం చేసుకుని, ఎటో వెళ్లిపోయారు. చివరికి గ్రామస్తులు జోక్యం చేసుకుని ఆ దంపతుల జోలికి వెళ్లవద్దని రేష్మా కుటుంబాన్ని ఒప్పించారు. దీంతో, వారు నాలుగు రోజుల క్రితం తిరిగి సొంతూరులోని మానిక్రాజ్ ఇంటికి వచ్చి ఉంటున్నారు. సోమవారం వారు ఆ ఇంట్లోనే హత్యకు గురయ్యారు. రేష్మా తండ్రి ముత్తుకుట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేష్మా కాలేజీలో చదువుకుంటుండగా, రోజుకూలీగా పనిచేసుకునే మానిక్రాజ్ స్కూలు విద్యతోనే ఆపేశాడు. అతడు నచ్చకనే రేష్మా కుటుంబీకులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: అనుమానం పెనుభూతమై! భార్య పై పాశవిక దాడి) -
Russia-Ukraine war: శరణమో, మరణమో
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్లోని సెవెరోడొనెట్స్క్ నగరంలో మారియూపోల్ దృశ్యమే పునరావృతం అవుతోంది. నగరంపై రష్యా సేనలు పట్టు బిగించాయి. 800 మందికిపైగా పౌరులు ఓ కెమికల్ ప్లాంట్లో తలదాచుకుంటున్నారు. వారికి, నగరంలోని వారికి లొంగిపోవడం లేదా మరణించడం ఏదో ఒక్క అవకాశమే మిగిలి ఉందని సమాచారం. డోన్బాస్లో భారీ సంఖ్యలో ఉక్రెయిన్ ఆయుధాలను, సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని రష్యా సోమవారం తెలియజేసింది. వుహ్లెదర్ థర్మల్ పవర్ ప్లాంట్పై ఉక్రెయిన్ వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. 40,000 మంది రష్యా జవాన్లు బలి! జూన్ ఆఖరు నాటికి రష్యా సైన్యం 40,000 మంది జవాన్లను కోల్పోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. డోన్బాస్లోకి రిజర్వు బలగాలను దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్నారు. యుద్ధం మరో రెండేళ్లపాటు కొనసాగుతుందని రష్యా మాజీ ప్రధాని కాస్యనోవ్ అంచనా వేశారు. 20 మంది మహిళలపై వేధింపులు: అధ్యక్షుడు పుతిన్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారన్న ఆనుమానంతో రష్యా పోలీసులు 20 మంది మహిళలను అదుపులోకి తీసుకొని, అమానవీయంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ రష్యాలోని నిజ్నీ నొవోగొరోడ్లో ఈ దారుణం జరిగిందని బాధితుల తరపు న్యాయవాది చెప్పారు. రష్యా పోలీసులు 18 నుంచి 27 ఏళ్ల వయసున్న 20 మంది మహిళలను వివస్త్రలను చేసి, ఐదుసార్లు స్క్వాట్స్ చేయించారని తెలిపారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని ఫోన్లలో వీడియో తీశారని పేర్కొన్నారు. -
Navjot Sidhu: పటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ
ఛండీగఢ్: మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేతనవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం మధ్యాహ్నం పటియాల జిల్లా కోర్టు ముందు లొంగిపోయారు. 1988లో నమోదైన ఓ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా తక్షణమే కోర్టు ముందు లొంగిపోవాలని కూడా సిద్ధూకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు ముందు లొంగిపోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన సిద్ధూ... అనారోగ్య కారణాల వల్ల తాను లొంగిపోయేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన బెంచ్.. ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చినందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చేసింది. సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ ను ఆశ్రయించాలని సూచించింది. సుప్రీంకోర్టు నుంచి ఈ మాట వినిపించినంతనే శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరిన సిద్ధూ..పటియాల కోర్టు ముందు లొంగిపోయారు. Patiala, Punjab | He (Navjot Singh Sidhu) has surrendered himself before Chief Judicial Magistrate. He is under judicial custody. Medical examination and other legal procedures will be adopted: Surinder Dalla, media advisor to Congress leader Navjot Singh Sidhu pic.twitter.com/U13TDDOPju — ANI (@ANI) May 20, 2022 -
Russia-Ukraine war: రష్యా చేతికి మారియుపోల్
కీవ్: ఉక్రెయిన్లో వరుస ఎదురుదెబ్బలతో డీలా పడ్డ రష్యాకు ఎట్టకేలకు చిన్న ఊరట. కీలక రేవు పట్టణం మారియుపోల్పై రష్యా సైన్యాలు పూర్తిగా పట్టు సాధించాయి. దాదాపు మూడు నెలల పోరాటంలో రష్యాకు చిక్కిన అతి పెద్ద నగరం ఇదే! వాస్తవానికి అజోవ్స్తల్ స్టీల్ ఫ్యాక్టరీ మినహా నగరమంతా ఎప్పుడో రష్యా గుప్పెట్లోకి వెళ్లింది. ఫ్యాక్టరీలో దాగున్న ఉక్రెయిన్ సైనికులు మాత్రం రెండు నెలలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆహారం తదితర వనరులన్నీ నిండుకోవడంతో ఇక పోరాడలేక వారంతా సోమవారం నుంచి లొంగుబాట పట్టారు. అది బుధవారంతో ముగిసిందని రష్యా ప్రకటించింది. 959 మంది లొంగిపోయినట్టు వెల్లడించింది. వారిని బస్సుల్లో డోన్బాస్లో వేర్పాటువాదుల అధీనంలోని ఒలెనివ్కా నగరానికి తరలించారు. ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా వారికి ఉక్రెయిన్ కూడా మంగళవారమే పిలుపునిచ్చింది. ఖైదీల మార్పిడి కింద వారిని తమకు అప్పగిస్తారని ఉక్రెయిన్ భావిస్తుండగా, రష్యా మాత్రం కొందరినైనా యుద్ధ నేరాల కింద విచారిస్తామని చెబుతోంది. దాంతో లొంగిపోయిన వారి భవితవ్యంపై అయోమయం నెలకొంది. మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా అందజేసిన అత్యాధునిక ఆయుధాలతో కూడిన పలు నిల్వలను ధ్వంసం చేసినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ చెప్పారు. వాటిలో ఎం777 హొవిట్జర్లు తదితరాలున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యా విడుదల చేసింది. చరిత్రాత్మక క్షణం: నాటో చీఫ్ మారియుపోల్ చిక్కిన ఆనందంలో ఉన్న రష్యాకు మింగుడు పడని పరిణామం చోటుచేసుకుంది. నాటో సభ్యత్వం కోసం స్వీడన్, ఫిన్లాండ్ బుధవారం లాంఛనంగా దరఖాస్తు చేసుకున్నాయి. దీన్ని చరిత్రాత్మక క్షణంగా నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్బర్గ్ అభివర్ణించారు. ‘‘ఈ క్షణాన్ని వదులుకోబోం. ఆ రెడు దేశాలకు తక్షణం సభ్యత్వం ఇచ్చేందుకు చర్యలు చేపడతాం’’ అని ప్రకటించారు. మామూలుగా ఏడాది పట్టే దరఖాస్తు పరిశీలన ప్రక్రియను రెండు వారాల్లో ముగించాలని నాటో నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఫిన్లండ్, స్వీడన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రష్యా మరోసారి హెచ్చరించింది. అయితే అమెరికా, ఇంగ్లండ్తో పాటు పలు నాటో దేశాలు ఇందుకు దీటుగా స్పందించాయి. దరఖాస్తులు ఆమోదం పొందేలోపు ఆ దేశాలపై రష్యా దుందుడుకు చర్యలకు దిగితే వాటికి అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని ప్రకటించాయి. వాటి చేరికకు మొత్తం నాటో సభ్య దేశాలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది. టర్కీ వ్యతిరేకత నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నాటోలో చేరే ఉద్దేశం లేదని ఆస్ట్రియా వెల్లడించింది. ప్రతీకార చర్యల్లో భాగంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. ఉక్రెయిన్ పునరుద్ధరణకు 950 కోట్ల డాలర్ల రుణం మంజూరు చేయాలని యూరోపియన్ కమిషన్ ప్రతిపాదించింది. ఉక్రెయిన్కు ఇప్పటికే 410 కోట్ల యూరోల సాయాన్ని సేకరించినట్టు కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ చెప్పారు. సైనికుడి నేరాంగీకారం యుద్ధ నేరాల విచారణ ఎదుర్కొంటున్న ఓ రష్యా సైనికుడు తనపై మోపిన అభియోగాలను అంగీకరించాడు. ఫిబ్రవరి 28న సమీ ప్రాంతంలో కార్లో కూర్చుని ఉన్న ఓ నిరాయుధ ఉక్రెయిన్ పౌరున్ని తలలో కాల్చి చంపినట్టు సార్జెంట్ వడీం షిషిమారిన్ (21) వెల్లడించాడు. -
తెలంగాణ: సరెండర్ సెలవుల డబ్బులేవి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న వేలాది మందికి రావాల్సిన సరెండర్ సెలవుల డబ్బులను ఇప్పటివరకు చెల్లించకపోవడంతో సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా 30 రోజుల పాటు ఉండే సరెండర్ (ఆర్జిత సెలవులు) లీవులను ఉపయోగించుకోలేని వారికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే గత ఏడాదికి సంబంధించి జూన్ నెలలో చెల్లించాల్సిన సరెండర్ లీవుల డబ్బులు ఇప్పటివరకు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. పోలీస్ హెడ్క్వార్టర్ల చుట్టూ తిరిగి అలసి పోతున్నామే తప్ప సమస్య మాత్రం తీరడం లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్ ఉన్నా.. ఉపయోగించుకోలేని పరిస్థితి పోలీస్ శాఖ అంటేనే అత్యవసరమైన విభాగం. పండుగలు, అనుకోని ఘటనలు, సభలు, సమావేశాలప్పుడు రోడ్డుపై బందోబస్తు నిర్వహించాల్సిందే. అది శాంతి భద్రతల విభాగమైనా, బెటాలియన్లు అయినా.. తప్పనిసరిగా విధుల్లో ఉండాల్సిందే. దీని వల్ల డబుల్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు ఉండే సాధారణ సెలవులనే వాడుకునే అవకాశం దక్కదని, కనీసం సరెండర్ లీవులకు సంబంధించిన డబ్బులైనా చెల్లిస్తే పిల్లల ఫీజులు లేదా ఇతరత్రా ఖర్చులకు ఉపయోగకరంగా ఉంటుందని వేడుకుంటున్నారు. ప్రతీ పోలీస్ ఉద్యోగికి రెండు సార్లు సరెండర్ లీవ్లకు డబ్బులు చెల్లిస్తారు. చదవండి: కేసీఆర్కు కలిసి రాని ముహూర్తం.. విజయ గర్జన సభ మళ్లీ వాయిదా.. ఏటా మొదటి ఆరునెలల కాలానికి వచ్చే 15 సెలవులకు జూన్ లేదా జూలైలో, ఆ తర్వాతి ఆరు నెలల్లో ఉండే 15 రోజుల సెలవులకు జనవరిలో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే ఈ ఏడాది సిబ్బందికి జనవరి నుంచి ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల మంది సిబ్బందిలో 80 శాతం మందికి సరెండర్ సెలవుల బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే పెండింగ్ బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
వనం నుంచి జనంలోకి..
-
లొంగుబాటలో అన్నలు
సాక్షి, హైదరాబాద్: తుపాకీ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం సాధ్యం కాదని మావోయిస్టులు గ్రహించారని, దీంతో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆజాద్, రాజిరెడ్డిలాంటి అగ్రనేతలు సైతం జన జీవన స్రవంతిలో కలవాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన మావోయిస్టు కీలక నేత హరిభూషణ్ సతీమణి సమ్మక్క అలియాస్ శారద పోలీసులకు లొంగిపోయారు. శుక్రవారం ఆమెకు రూ.5 లక్షల చెక్కును డీజీపీ అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అనారోగ్యం, కోవిడ్ సహా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టడంతో లొంగుబాటుకు మావో యిస్టుల నుంచి పెద్ద ఎత్తున సంకేతాలు వస్తున్నాయని వివరించారు. మహబూబ్బాద్ జిల్లా గంగారం గ్రామానికి చెందిన సమ్మక్క మైనర్గా ఉన్నప్పుడే హరిభూషణ్ ప్రోద్బలంతో పార్టీలో చేరింది. ఆ తర్వాత అతన్నే వివాహం చేసుకుంది. పార్టీ సిద్ధాంతాలతో విభేదించి 2008లో లొంగిపోయింది. అయితే, మరో పెళ్లి చేసుకుంటా నని హరిభూషణ్ బెదిరించడంతో 2011లో మళ్లీ పార్టీలోకి వెళ్ళింది. హరిభూషణ్ ఇటీవల చనిపోవడంతో తిరిగి లొంగిపోయింది. రాజు మృతిపై సందేహాలకు తావులేదు బాలికపై హత్యాచారానికి పాల్పడిన రాజు మృతిపై సందేహాలకు ఏమాత్రం తావు లేదని డీజీపీ స్పష్టం చేశారు. ‘మత్తుమం దుల వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’అని తెలిపారు. -
డీజీపీ ఎదుట లొంగిపోనున్న మావోయిస్టు నేత శారదక్క
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ నేత హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ భార్య శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శారదక్క డీజీపి ఎదుట లొంగిపోనున్నారు. శారదక్క లొంగుబాటుపై డీజీపీ మహేందర్రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. (చదవండి: చిన్నచూపు చూపడంతో.. వనం నుంచి జనంలోకి..) గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారదక్క.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం బెజ్జరి. ఇటీవల శాదరక్క భర్త హరిభూషణ్ కరోనాతో మృతిచెందిన సంగతి తెలిసిందే. నాటి నుంచి శారదక్క మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. దానికి తోడు కరోనా పాజిటివ్ రావడం తో కొంతకాలంగా అస్వస్థతకు గురై చికిత్స పొందారు. కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యం కారణంగా లొంగుబాటు కు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు
-
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది.మావో అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ కుమారుడు రావుల రంజిత్ బుధవారం రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం రంజిత్ దండకారణ్యం బెటాలియన్ కమిటీ చీఫ్గా కొనసాగుతున్నాడు. కాగా రెండు సంవత్సరాల క్రితం తండ్రి రామన్న ఆనారోగ్య సమస్యతో రామన్న చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రంజిత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ముగ్దుర్ మండలం బెక్కల్ గ్రామం.ఈ సందర్భంగా రావుల రంజిత్ను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడారు. '' మావోయిస్టు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ ప్రస్తుతం ప్లాటున్ కమిటి మెంబర్గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా కు చెందిన మావోయిస్టు నేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న కుమారుడు రంజిత్ 1998లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించాడు. తండ్రి రామన్న ఆధ్వర్యంలో రంజిత్ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2017లో రామన్న సలహా మేరకు సెకండ్ బెటాలియన్ లో రంజిత్ జాయిన్ అయి 2019 వరకు మెంబర్గా వ్యవహరించాడు. అయితే తండ్రి మరణం తర్వాత రంజిత్ అనేక అవమానాలకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో పార్టీ మాత్రం అతని లొంగుబాటుకు అంగీకరించలేదు. ఈ మధ్యన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తనంతట తాను లొంగిపోవాలని రంజిత్ భావించాడు. 2017 నుండి 2019 ఆమ్స్ బెటాలియన్ లో పని చేసాడు.2018 కాసారం అటాక్ లో కీలక పాత్ర పోషించాడు..2021 లో జీరం అటాక్తో పాట 2020 మినప అటాక్లో సైతం రంజిత్ చురుగ్గా వ్యవహరించాడు. కరోనా పాండమిక్ సమయంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నారు. తెలంగాణ రాష్టం నుంచి 11 మంది, ఆంద్రప్రదేశ్ నుంచి 3 మంది సెంట్రల్ కమి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న 14 మంది మావోయిస్టులు లొంగిపోవాలి. 4 లక్షల పరిహారం తో పాటు ప్రస్తుత ఖర్చులకు 5 వేలు అందజేస్తున్నాం.'' అంటూ తెలిపారు. -
మావోయిస్టుల్లారా.. లొంగిపోండి: డీజీపీ పిలుపు
జయపురం: ఉద్యమం వీడి జనస్రవంతిలో కలిసిపోవాలని రాష్ట్ర డీజీపీ అభయ్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన నవరంగపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతలపై సు«దీర్ఘ చర్చలు జరిపారు. ముఖ్యంగా ఒడిశా–ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల చర్యలు లేకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే మావోయిస్టుల దుశ్చర్యల కట్టడికి చేపట్టాల్సిన పలు వ్యూహాలను అధికారులకు వివరించారు. అనంతరం జిల్లాలోని ఆదర్శ పోలీస్స్టేషన్, రిజర్వ్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఆయా ప్రాంతాల జవానులు, పోలీసుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆయన కరోనా కష్టకాల పరిస్థితులతో భయాందోళనలో ఉన్న ప్రజలను మరింత భీతి కలిగించవద్దని మావోయిస్టులకు సూచించారు. ప్రజలంతా ప్రస్తుతం బాగానే ఉన్నారని, దీనిని అర్థం చేసుకుని స్వచ్ఛందంగా లొంగిపోవాలని మావోయిస్టులను కోరారు. తమ వద్దకు వచ్చిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలన్నీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో ఆయనతో పాటు నవరంగపూర్ ఎస్పీ ప్రహ్లాద్ సహాయి మీనా, విజిలెన్స్ విభాగం డైరెక్టర్ ఆర్.కె.శర్మ, నవరంగపూర్ తహసీల్దారు రవీంద్రకుమార్ రౌత్, పట్టణ పోలీస్ అధికారి తారిక్ అహ్మద్ ఉన్నారు. -
దంతెవాడలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ
చత్తీస్గఢ్: రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన దంతెవాడలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 32 మంది లొంగిపోయినట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. వారిలో 10 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ డొల్ల సిద్ధాంతాలతో విసిగి.. పోలీసులు ప్రకటించిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు. లొంగిపోయిన 32 మంది దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్, క్రాంతికారి మహిళా ఆదివాసీ సంఘటన్, చేత్న నాట్య మండలి, జనతనా సర్కార్ గ్రూప్స్ తదితర విభాగాలకు చెందిన వారని ఎస్పీ తెలిపారు. తాజాగా లొంగిపోయిన వారిలో పలువురికి గతంలో పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై దాడికి పాల్పడిన నేపథ్యం ఉంది. నలుగురిపై తలో లక్ష రూపాయల చొప్పున రివార్డు కూడా ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10వేలు చొప్పున అందించారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీని అందించనున్నారు. మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నవారు ప్రజా జీవనంలోకి రావాలని కోరుతూ స్థానిక పోలీసులు 'లాన్ వర్రటు' పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు నక్సల్ ప్రభావిత గ్రామాల్లో పెద్దఎత్తున పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 150 మంది వరకు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. -
లొంగిపోయిన ఉగ్రవాది
-
కోయి గోలి నహీ చలేగా..
కశ్మీర్: ఉమ్మడి ఉగ్రవాద నిరోధక చర్యల సందర్భంగా జమ్మూ కశ్మీర్లో ఓ ఉగ్రవాది.. భద్రతా దళాల ముందు లొంగిపోయినట్లు ఆర్మీ శుక్రవారం తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. సరెండర్ సందర్భంగా అధికారులు అతని నుంచి ఏకే 47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలో ఒక సైనికుడు, పోరాట భద్రతా సామగ్రిని ధరించి, చేతిలో రైఫిల్ పట్టుకుని ఉన్నాడు. ఇక లొంగిపోయిన వ్యక్తిని జహంగీర్ భట్గా గుర్తించారు. ఈ సంఘటన ఓ తోటలో జరిగింది. కేవలం ప్యాంట్ మాత్రమే ధరించిన ఉగ్రవాది చేతులు పైకి లేపి, సైనికుడిని సమీపించడం వీడియోలో చూడవచ్చు. ఈ సందర్భంగా సైనికుడు అతడికి ఎటువంటి హాని జరగదని భరోసా ఇస్తాడు. "కోయి గోలి నహీ చలేగా" (ఎవరూ కాల్పులు జరపవద్దు) అని అతను తన సహచరులకు చెప్పడం వీడియోలో చూడవచ్చు. అనంతరం ఉగ్రవాదిని ఉద్దేశించి ‘కుమారా నీకు ఏమీ జరగదు’ అని చెప్తాడు. అంతేకాక అతడికి మంచినీళ్లు ఇవ్వండి అని మరో సైనికుడిని ఆదేశిస్తాడు. (చదవండి: బీజేపీ సర్పంచ్ను కాల్చి చంపారు) ఆర్మీ విడుదల చేసిన మరో వీడియో క్లిప్లో.. ఉగ్రవాది తండ్రి తన కొడుకును కాపాడినందుకు భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలపడం చూడవచ్చు. ఆ సమయంలో సిబ్బంది "అతన్ని మళ్ళీ ఉగ్రవాదులతో వెళ్లనివ్వవద్దు" అని జహంగీర్ తండ్రికి సూచిస్తారు. ఈ సందర్భంగా జీఓసీ 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది అతడిని సజీవంగా తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. "అక్టోబర్ 13 న, ఒక ఎస్పీఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) మరణించారు. అతడి వద్ద ఉన్న రెండు ఏకే -47 (రైఫిల్స్) తో కనిపించకుండా పోయాయి. అదే రోజు, చాదూరాకు చెందిన జహంగీర్ భట్ తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం జరిపిన ఉమ్మడి ఆపరేషన్లో అతడిని గుర్తించాము. ప్రోటోకాల్ ప్రకారం, భారత సైన్యం వ్యక్తిని లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నాలు చేసింది. జహంగీర్ లొంగిపోయాడు" అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: పాక్ ఉగ్రవాదులపై దొరబాబు వీరత్వం) "జహంగీర్ని కార్నర్ చేసినప్పుడు అతని తండ్రి అక్కడే ఉన్నాడు. భద్రతా దళాలు, అతడి తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అతడిని ప్రమాదం నుంచి కాపాడాము. భారత సైన్యం ఉగ్రవాద నియామకాలను నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. యువత ఉగ్రవాదంలో చేరినట్లయితే, వారు తిరిగి రావడానికి అవకాశం కల్పిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. -
లొంగిపోతాడన్న వార్తల్లో వాస్తవమెంత?
-
గణపతి ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు ఆచూకీపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో లొంగిపోతాడని వస్తున్న వార్తలపై ఏపీ– తెలంగాణతోపాటు జాతీయ మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లొంగుబాటులోని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంగీకరించినంత మాత్రాన ఈ వ్యవహారానికి తెరపడుతుందా అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. 13 రాష్ట్రాలు, 2 జాతీయ దర్యాప్తు సంస్థలు గణపతి నేతృత్వంలోనే దేశంలో మావోయిస్టు పార్టీ బాగా విస్తరించిందనే అభిప్రాయం ఉంది. దేశ విదేశాల నుంచి నిధులను సమీకరించడంలో, పార్టీ కేడర్కు ఆధునిక టెక్నాలజీ, నవీన ఆయుధాలు సమకూర్చడంలో, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ విధానాలు మార్చుకోవడంలో ఆయన వ్యూహాలు చాలా ముందుచూపుతో ఉంటాయి. అనవసర హింసాచర్యలకు ఈయన వ్యతిరేకం. పీపుల్స్ వార్ గ్రూపు (పీడబ్ల్యూజీ), మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ) విలీనంలో గణపతి కీలక పాత్ర పోషించారు. 13 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతిపై వేలాది కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కోసం జాతీయ దర్యాప్త సంస్థ(ఎన్.ఐ.ఏ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్(రా) వంటి జాతీయదర్యాప్తు సంస్థలు వెదుకుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. గణపతి లొంగిపోవడానికి అంగీకరించాడునుకున్నా.. ఒక్క తెలంగాణ పోలీసులు పాత కేసులు మాఫీ చేసినా.. మిగిలిన 12 రాష్ట్రాల పోలీసులు కేసుల ఎత్తివేతకు సుముఖంగా ఉంటారా? ఎన్,ఐ.ఏ, రా వంటి సంస్థల విచారించకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులన్నీ ఎత్తేయాలంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా 43 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెట్టి, దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వాలు నడిపిన గణపతి తన లొంగుబాటుకు షరతులకు విధించకుండా ఉంటారా? వాటిని కేంద్రం ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తారా? అన్నది అనుమానమే. ఖండించని మావోయిస్టు పార్టీ.. ఈ మొత్తం వ్యవహారంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు మౌనం వహించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు గణపతి ఇప్పటికే లొంగిపోవడానికి అంగీకరించాడని, మరికొన్ని రోజుల్లో లొంగుబాటు చూపుతారంటూ సాగుతున్న ప్రచారంపై పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయన లొంగిపోతే మాత్రం స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని భరోసా ఇస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం పోలీసులు వేసిన ఎత్తగడ అన్న ప్రచారమూ ఉంది. మావోయిస్టు కేడర్ను గందరగోళంలో నెట్టేయడానికి, అగ్రనేతల ఫోన్ సంభాషణలను విని, గణపతి ఉనికి కనుక్కునేందుకు బిగించిన ఉచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గణపతి లొంగిపోనున్నారనే ప్రచారాన్ని ఖండిస్తూ ఇంతవరకూ మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. లొంగిపోతాడని అనుకోవడం లేదు: జంపన్న సాక్షి, హైదరాబాద్: గణపతి లొంగుబాటుపై మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న స్పందించారు. గణపతి వంటి అగ్రనేత లొంగిపోతాడని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తల విశ్వసనీయతపై కూడా అనుమానాలు వ్యక్తంచేశారు. గత 40 ఏళ్లుగా గణపతి తన కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలూ కలిగి లేడని, ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. -
కీలక నిర్ణయం తీసుకోనున్న మావో గణపతి
సాక్షి, కరీంనగర్: మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయేందుకు యత్నిస్తున్నట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయసురిత్యా పోరాటానికి స్వస్తి పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్న ఆయన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా, 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మోకాళ్ల నొప్పులు, మధుమేహంతో సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం. ఇక ఎంపీసీ, నక్సలైట్ పార్టీల విలీనం తర్వాత కేంద్ర కార్యదర్శిగా గణపతి పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2018 లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అనంతరం నంబాల కేశవరావు కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అనారోగ్య సమస్యలతో సతమవుతున్న గణపతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి రాగానే లొంగుబాటుకు సిద్ధమవుతారని గత రాత్రి నుంచి కరీంనగర్ వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన లొంగుబాటు నిజమే అయితే విప్లవోద్యమ చరిత్రలో పెద్ద కుదుపుగానే భావించాలి. మరోవైపు గణపతితోపాటు మరో నలుగురు మవోయిస్టు నేతలు కూడా లొంగుబాటు దిశగా పయనిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. (చదవండి: మావోయిస్టు కేంద్ర కమిటీ.. 10 మంది వారే..!) -
రూ.8 లక్షల రివార్డు.. చెల్లి కోసం లొంగిపోయాడు
రాయ్పూర్: రాఖీ పండగ అనేది ప్రధానంగా తోబుట్టువుల పండుగ. ఒకరి క్షేమం ఒకరు కోరుతూ జరుపుకునే పండుగ. ఆడపడుచు.. నిండు నూరేళ్లు తన సోదరులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాఖీ కడుతుంది. రక్ష కట్టించుకున్న సోదరులు జీవితాంతం వారికి తోడుగా ఉంటానని మాటిస్తారు. ఈ రాఖీ పండుగ నాడు.. రక్షా బంధన్ గొప్పతనాన్ని నిజం చేసే సంఘటన ఒకటి చత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. నక్సలైట్గా మారి.. ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్న ఓ అన్నను.. రాఖీ కట్టి.. జనజీవన స్రవంతిలో కలిసేలా చేసింది అతడి సోదరి. వివరాలు.. దంతెవాడ జిల్లా పల్నార్ గ్రామానికి చెందిన మల్లా అనే వ్యక్తి తన 12 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. (రక్షాబెహన్) గత 14 ఏళ్లుగా మల్లా ఇంటికి తిరిగి రాలేదు. దాంతో అతని చెల్లెలు లింగేతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. తన అన్నయ్య ఇంటికి రావాలని ఎందరో దేవుళ్లకు మొక్కింది లింగే. ఈ క్రమంలో 2016లో మల్లా, ప్లాటూన్ డిప్యూటీ కమాండర్ అయ్యాడు. భైరవ్ఘడ్ ఏరియా కమిటీ నక్సలైట్ కమాండర్గా పనిచేస్తున్న మల్లా తలపై పోలీసులు 8 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. సోదరుడి క్షేమం కోసం ప్రార్థిస్తోన్న లింగే.. దీనితో మరింత భయాందోళనకు గురయ్యింది. హిట్ లిస్ట్లో చేరిన తన సోదరుడు ఏదో ఒక రోజు పోలీసుల కాల్పుల్లో మరణిస్తాడని.. అలా కాకుండా తన అన్నను కాపాడుకోవాలని నిర్ణయించుకుది. (సోదరులకు రక్షాపూర్ణిమ) ఈ క్రమంలో లింగే రక్షాబంధన్ సందర్భంగా సోదరుడు మల్లాను కలిసింది. రాఖీ కట్టి.. పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత సోదరిని కలుసుకున్న లింగే ఆమె కట్టిన రాఖీకి విలువ ఇచ్చాడు. నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాడు. దాంతో మల్లాకు పునరావాసం కల్పిస్తామని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. -
ఆయన ‘సరెండర్’ మోదీ: రాహుల్
న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారు(సరెండర్ చేశారు) అంటూ ప్రధాని మోదీపై శనివారం నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం మరో అడుగు ముందుకేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలు పేరు సరెండర్ మోదీ అని ఎద్దేవా చేశారు. అయితే, ఇంగ్లిష్ పదం సరెండర్ స్పెల్లింగ్ను surrenderకు బదులు surender అని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు ఆయన ‘చైనాతో భారత్ బుజ్జగింపు విధానం బట్టబయలు’అనే శీర్షికతో ఉన్న విదేశీ పత్రికలోని కథనాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేదని ప్రధాని చెబుతున్నప్పటికీ పాంగాంగ్ త్సో సమీపంలోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడవుతోందని చెప్పారు. ఇందుకు సంబంధించిన టీవీ వార్తా కథనం క్లిప్పింగ్ను కూడా జత చేశారు. -
లొంగు‘బాట’లో దళ కమాండర్
ఛత్తీస్గఢ్: దండకారణ్యంలో మన్పూరు ప్రాంతానికి చెందిన మావోయిస్టు నేత గాండ్ సింగ్ కొవాసి.. తన భాగస్వామితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ నెల 8 నుంచి నక్సలైట్ సంస్థకు దూరంగా ఉన్నారని.. వారి కోసం మావోయిస్టులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా గాండ్ సింగ్ జన జీవన స్రవంతిలోకి రావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఛత్తీస్గఢ్ ఇంటలిజెన్స్ విభాగం విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం గాండ్ సింగ్ ఇప్పుడు ప్రధాన జీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నట్లు సమాచారం. -
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన జేసీ దివాకర్ రెడ్డి
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కాగా జేసీ పోలీసులపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చాక ‘పోలీసులతో బూట్లు నాకిస్తా...గంజాయి కేసులు పెడతాం’ అంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే రెచ్చిపోయారు. దీంతో అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ ఫిర్యాదు మేరకు 153, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సొంత పూచీకత్తుతో పాటు నెలకు రెండు సార్లు పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని న్యాయస్థానం షరతు విధించింది. చదవండి: పోలీసుల జోలికి వెళ్లే పతనమయ్యావ్! జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు జేసీకి కౌంటర్; మాధవ్ అనూహ్య చర్య బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా : జేసీ టీడీపీ బానిసలం కాదు: పోలీసు సంఘం జేసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి -
చిదంబరానికి ఢిల్లీ కోర్టు షాక్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం(73)కు మరోసారి షాక్ తగిలింది. తీహార్ జైలు నుంచి బయటపడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను ఢిల్లీలోని ఓ కోర్టు తిరస్కరించింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి అప్పగించాలని చిదంబరం శుక్రవారం ఓ న్యాయస్థానంలో సరెండర్ పిటిషన్ దాఖలుచేశారు. దీంతో చిదంబరం దాఖలుచేసిన సరెండర్ పిటిషన్ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ దాన్ని తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఈడీ అధికారుల తీరుపై చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తీవ్రంగా మండిపడ్డారు. చిదంబరాన్ని మరింత వేధించేలా ఈడీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో సీబీఐ న్యాయస్థానం చిదంబరాన్ని సెప్టెంబర్ 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. సరైన సమయంలో అరెస్ట్ చేస్తాం: ఈడీ ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన అవినీతి కేసులో చిదంబరం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ‘చిదంబరం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయలేరు. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించేముందు కొన్ని అంశాల్లో మేం దర్యాప్తును పూర్తిచేయాల్సి ఉంది. కనీసం ఆరుగురు వ్యక్తులను విచారించాకే మేం చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకోగలం. ఎందుకంటే ఈ అక్రమ నగదు చెలామణి కేసు దేశాన్ని దాటి విస్తరించింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో చిదంబరం అరెస్ట్ తప్పనిసరి. దాన్ని మేం సరైన సమయంలో చేపడతాం. తనను కస్టడీలోకి తీసుకోవాలని ఓ నిందితుడు విచారణ సంస్థను ఆదేశించలేడు. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం విచారణ సంస్థదే. మేం చిదంబరాన్ని అరెస్ట్ చేశాక, అప్పటివరకూ సేకరించిన ఆధారాల్ని ఆయనముందు పెడతాం’ అని చెప్పారు. చిదంబరాన్ని వేధించాలనే: సిబల్ ఈ ఏడాది ఆగస్ట్ 20–21 తేదీల మధ్య చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. ‘కానీ ఇప్పుడు ఈడీ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఆయన మరింతకాలం జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగేలా, బాధపెట్టేలా ఈడీ అధికారులు దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు’ అని సిబల్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, చిదంబరం దాఖలుచేసిన సరెండర్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నేతను ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నది ఈడీ విచక్షణాధికారానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఈ సందర్భంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతుల కోసం భారీగా ముడుపులు చేతులుమారాయని సీబీఐ కేసు నమోదుచేసింది. -
మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు..!
నిర్మల్: తెలంగాణకు చెందిన మరో మావోయిస్టు అగ్రనేత పోలీసులకు లొంగిపోయాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు సట్వాజీ అలియాస్ (సుధాకర్/బుర్యార్/ కిరణ్) దళంలోనే పరిచయమైన తన భార్య నీలిమ అలియాస్ మాధవితో కలసి రాంచీలో పోలీసులకు లొంగిపోయారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జార్ఖండ్లో మావోయిస్టు కార్యకలాపాల విస్తరణ, అమలు లో క్రియాశీలకంగా వ్యవహరించారు. తన తమ్ముడు నారాయణ రాంచీలో పోలీసులకు పట్టుబడటం, నిర్మల్ జిల్లా పోలీసులు తన తల్లి ద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్యతో సహా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఇంటర్లోనే ఆకర్షితుడై.. సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన దేవుబాయి, కాశీరాం దంపతుల పెద్ద కుమారుడు ఒగ్గు సట్వాజీ పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివారు. 1981–83 మధ్య ఇంటర్మీడియెట్ నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ) నాయకులతో సంబంధాలు కొనసాగించారు. వారి మాటలు, పాటలతో పాటు విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడయ్యారు. అప్పటి నుంచే ఆర్ఎస్యూ(అండర్గ్రౌండ్) కొరియర్గా, రాడికల్స్ ఆర్గనైజర్గా వ్యవహరించారు. 1984లో పూర్తిస్థాయిలో అడవి బాట పట్టి పీపుల్స్వార్లో చేరి నక్సలైటుగా మారారు. ఈయనపై దాదాపు రూ.కోటి రివార్డ్ ఉన్నట్లు తెలిసింది. జనంలోకి వచ్చి..మళ్లీ దళంలోకి.. పీపుల్స్వార్లో చేరిన రెండేళ్లకే కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో 1986లో కర్ణాటకలోని గుల్బర్గాలో సట్వాజీ పోలీసులకు చిక్కారు. 1989 చివరి వరకు జైలులోనే ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపుల్స్వార్పై నిషేధం ఎత్తివేయడంతో బయటకు వచ్చారు. అప్పుడు ఇంటి వద్దే ఉంటూ నిర్మల్లో భారీ స్తూపం నిర్మింపజేశారు. మళ్లీ ప్రభుత్వం నక్సల్స్పై నిషేధం విధించడంతో 1991నుంచి తిరిగి దళంలోకి వెళ్లారు. ఇక అప్పటి నుంచి ఆయన జనంలోకి రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ దళాల కమాండర్గా, జిల్లా కమాండర్గా కొనసాగారు. 2001 నుంచి రాష్ట్ర కమిటీలో చేరి దండకారణ్య మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అక్కడి నుంచి కేంద్ర కమిటీకి, జార్ఖండ్ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలకు వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు సింగరేణిలో జరిగిన దాదాపు అన్ని హింసాత్మక ఘటనల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతుంటారు. చెన్నూరు, జైపూర్, నీల్వాయి, కోటపల్లి తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఈయనపై కేసు లు ఉన్నాయి. సట్వాజీపై జార్ఖండ్ ప్రభుత్వం రూ. కోటి రివార్డు కూడా ప్రకటించింది. దళంలోనే మూడున్నర దశాబ్దాలు సట్వాజీ దాదాపు మూడున్నర దశాబ్దాల తన జీవితాన్ని అజ్ఞాతంలోనే గడిపారు. 1998లోనే తండ్రి కాశీరాం చనిపోయినా ఇంటికి రాలేదు. తమ్ముళ్లు నారాయణ, రామన్నలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్లు కాల్వ పోసవ్వ, దాసరి పోసవ్వలకు పెళ్లిళ్లయ్యాయి. తల్లి దేవుబాయి ఒక్కరే సారంగపూర్లో ఉంటున్నారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన ఆమెను నిర్మల్ ఎస్పీ శశిధర్రాజు, ఏఎస్పీ దక్షిణామూర్తి స్వయంగా ఆమె వద్దకు వెళ్లి పలకరించారు. తన అన్నను కలసి వస్తుండగా సట్వాజీ తమ్ముడు నారాయణ మరో వ్యక్తితో కలసి 2017 ఆగస్టులో రాంచీ రైల్వేస్టేషన్లో పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరగడం, పార్టీలో అంతర్గత సంక్షోభాల కారణంగా తన భార్య మాధవి అలియాస్ నీలిమతో పాటు సట్వాజీ అలియాస్ సుధాకర్ రాంచీలో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. జార్ఖండ్లో సుధాకర్ లొంగిపోయినట్లు తమకు అధికారిక సమాచారం రాలేదని నిర్మల్ ఎస్పీ శశిధర్రాజు పేర్కొన్నారు. కేంద్ర కమిటీ దాకా ఎదిగి.. పీపుల్స్వార్ (మావోయిస్టు పార్టీ)లో తెలంగాణ నుంచి ఎదిగిన కీలక నేతల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కూడా ఉన్నారు. రాష్ట్ర కమిటీ కొరియర్గా పని ప్రారంభించిన సట్వాజీ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి దాకా ఎదిగారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం జిల్లా కమాండర్ (కార్యదర్శి)గా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ సభ్యుడయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ దండకారణ్యంలో మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం 2013 నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తూనే సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. -
మూడోసారీ మువ్వా సరెండర్
నెల్లూరు (టౌన్): డైట్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న మువ్వా రామలింగాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేశారు. ఆయన్ను జిల్లా నుంచి వరుసగా పాఠశాల విద్యాశాఖకు మూడుసార్లు సరెండర్ చేశారు. 2016 ఆగస్ట్లో డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ 2017 సెప్టెంబర్లో డీఈఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యాశాఖ కార్యాలయంలో రికార్డుల్లో అవకతవకలు, కార్యాలయ నిర్వహణ సక్రమంగా లేదంటూ పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేశారు. అనంతరం రెండు నెలల తర్వాత బీఈడీ కళాశాల ప్రిన్సిపల్గా ఉత్తర్వులు తీసుకొచ్చి వెంటనే బాధ్యతలు స్వీకరించారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపల్గా నాలుగు నెలల పాటు పనిచేశారు. ఆ సమయంలో ఓ ఉపాధ్యాయుడి విషయంలో డైరెక్టర్ ఉత్తర్వులను పాటించలేదనే ఫిర్యాదుతో మువ్వా రామలింగాన్ని రెండోసారి పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేశారు. తదనంతరం 2018 ఆగస్ట్ మొదటి వారంలో డైట్ కళాశాల ప్రిన్సిపల్గా ఉత్తర్వులు తీసుకొని వెంటనే బాధ్యతలు స్వీకరించారు. సరెండర్ చేసినా మళ్లీ జిల్లాకు రావడంపై సీరియస్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ మువ్వా రామలింగాన్ని రెండు సార్లు పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేసినా మళ్లీ జిల్లాకు రావడంపై కలెక్టర్ ముత్యాలరాజు సీరియస్గా తీసుకున్నారు. డైట్ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకునే సమయంలో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలవలేదు. దీంతో మువ్వా వ్యవహారాన్ని కలెక్టర్ సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. అప్పుడే మువ్వా ఆర్డర్ను కలెక్టర్ వ్యతిరేకించినట్లు చెప్తున్నారు. అయితే కలెక్టర్ మాత్రం మువ్వాను సరెండర్ చేయాలనే నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైల్ను జిల్లా విద్యాశాఖ ద్వారా రహస్యంగా నడిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ నెల ఆరున మువ్వా రామలింగాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు సరెండర్ చేస్తూ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు అందాయి. మువ్వాకు మంత్రి నారాయణ అండదండలు మువ్వా రామలింగానికి మంత్రి నారాయణ అండదండలు ఉన్నాయి. ఆయన డీఈఓగా పనిచేస్తున్న సమయంలో నారాయణ విద్యాసంస్థలపై సానుకూల ధోరణిని అవలంబించారనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో నగరంలోని ధనలక్ష్మీపురంలో గల నారాయణ స్కూల్లో ఫిజిక్స్ పేపర్ను లీక్ చేశారు. ఈ వ్యవహారంలో నారాయణ యాజమాన్యానిదే పూర్తి బాధ్యత ఉన్నా, అప్పటి డీఈఓగా పనిచేసిన రామలింగం సదరు విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సస్పెండైనా, సరెండర్ చేసినా నెలలు తిరగకుండానే మళ్లీ అదే జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. -
సీబీఐ కోర్టులో లొంగిపోయిన లాలూ
రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలడంతో జైలు శిక్ష అనుభవించేందుకు బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఎదుట లొంగిపోయారు. మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు వెంటరాగా లాలూ సీబీఐ న్యాయస్ధానానికి చేరుకున్నారు. రాంచీ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆయన ఈ రోజు సీబీఐ న్యాయస్ధానంలో లొంగిపోయారు. లాలూకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ముంబై) వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిస్తారని లాలూ న్యాయవాది ప్రభాత్ కుమార్ వెల్లడించారు. జార్ఖండ్ హైకోర్టు లాలూను త్వరగా ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ముంబైలో మూడు వారాల పాటు వైద్య చికిత్సలు పొందిన లాలూ శనివారం అక్కడినుంచి పట్నా చేరుకున్నారు. లాలూ ప్రాధమిక బెయిల్ను పొడిగించేందుకు నిరాకరించిన జార్ఖండ్ హైకోర్టు ఆగస్ట్ 30లోగా సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని కోరింది. వైద్యపరమైన కారణాలతో మే 11న లాలూకు ఆరు వారాల ప్రాధమిక బెయిల్ను మంజూరు చేసిన హైకోర్టు ఆ తర్వాత పలు సందర్భాల్లో ఆగస్ట్ 27 వరకూ పొడిగించింది. మరోవైపు రాంచీ విమానాశ్రమయంలో పార్టీ అనుచరులతో కలిసి వెలుపలికి వచ్చిన లాలూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తన ఆరోగ్యం బాగాలేదని, తానిప్పుడు మాట్లాడేదేమీ లేదన్నారు. -
50 మంది ఉగ్రవాదుల లొంగుబాటు
కాబూల్: బాడ్ఘిస్ ప్రావిన్స్లో ఆదివారం 50 ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ అధికారుల ఎదుట లొంగియారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు ధృవీకరించారు. లొంగిపోయిన వారిలో తాలిబన్ కీలక కమాండర్ ముల్లా తూపాన్ కూడా ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ముల్లా తూపాన్ సుమారు 300 మంది ఉగ్రవాదులను పెంచిపోషించాడు. ముల్లా తూపాన్ లొంగుబాటు బాడ్ఘిస్ ప్రావిన్స్తో పాటు పక్కనున్న ప్రాంతాల్లో కూడా తాలిబన్కు కోలుకోని దెబ్బ అని అధికారులు చెబుతున్నారు. ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు. -
మావోయిస్టుల లొంగుబాటు
పెదవాల్తేరు(విశాఖతూర్పు): మావోయిస్టులు ఇద్దరు, మిలీషియా సభ్యులు నలుగురు లొంగిపోయినట్టు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మ తెలిపారు. పెదవాల్తేరులో గల ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెదబయలు మండలం బురికిపనస గ్రామానికి చెందిన తాంబేలు లక్ష్మి ఇâష్టంలేని పెళ్లి కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చి, పెదబయలు దళం నాయకుల మాటలకు ఆకర్షితులై 2014లో మావోయిస్టులలో చేరిందన్నారు. 2016 వరకు దళంలో పనిచేసిందని చెప్పారు. ఈమె కిల్లంకోట వద్ద బాలకృష్ణ హత్య కేసు, ఎగువవలస పల్లి గ్రామంలో కరువుదాడి, వాకపల్లి వద్ద రోడ్డు యంత్రాల దహనం, బూసిపుట్టులోపాంగి రామయ్య, జి.మాడుగుల పరిధిలో ఎం.సత్యారావుల హత్య కేసులతో సంబంధం ఉందని చెప్పారు. ఇష్టంలేని పెళ్లి కారణంగా జి.మాడుగుల మండలం గూనలోవకు చెందిన పాంగి శీలు అలియాస్ లత పెదబయలు దళం సభ్యురాలిగా చేరిందన్నారు. ఈమె 2014 నుంచి 2015 వరకు దళంలో పనిచేసిందని తెలిపారు. కిల్లంకోట వద్ద బాలకృష్ణ హత్యకేసు, ఒడిశాలో కరువుదాడి, బూసిపుట్టు వద్ద బ్యాలెట్బాక్సుల చోరీ, వాకపల్లిలో రోడ్డు యంత్రాల దహనం, చెరువూరు వద్ద ఎస్ఆర్ పైప్లైన్ దహనం కేసులతో సంబంధం ఉందన్నారు. మిలీషియా సభ్యుల్లో చింతపల్లి మండలానికి చెందిన మండేపల్లి రామకృష్ణ, గెమ్మిలి కొండబాబు, పూజారి సింహాచలం, గుంట ఆనందరావు లొంగిపోయిన వారిలో ఉన్నారని చెప్పారు. వీరికి కాఫీ తోటల పంపకం, కాఫీ గొడౌన్ల దహనం, కరువు దాడులు, పోస్టర్ల, కరపత్రాల తయారీ, గెమ్మిలి సంజీవరావు హత్య, గొంపలోవ శ్రీను హత్య తదితర కేసులతో సంబంధం ఉందన్నారు. మావోయిస్టులు, మిలీషియా సభ్యులంతా స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలు అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సీఆర్పీఎఫ్ 234 బెటాలియన్ కమాండెంట్ కసంఖాన్, 198 బెటాలియన్ డెప్యూటీ కమాండెంట్ అనిల్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టు ప్రేమజంట లొంగుబాటు
మల్కన్గిరి : అనుగుల్ జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో ఎదుట ఓ మావోయిస్టు ప్రేమజంట మంగళవారం స్వచ్ఛందంగా లొంగిపోయింది. వివరాలిలా ఉన్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి చెందిన చోట్టు గుంజు(28) 2000వ సంవత్సరంలో చంద్రగుంజు అనే దళ కమాండర్ ఆధ్వర్యంలో దళంలో చేరి అంచెలంచెలుగా సబ్జోనల్ కమిటీ, ఏరియా కమిటీ, ప్రస్తుతం దళ కమాండర్ స్థాయికి ఎదిగాడు. ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్స్ వాడేవాడు. మావోయిస్టు దళంలో ఉంటూ పలు హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నాడు. పోలీసు వాహనాల పేల్చివేత, ఇన్ఫార్మర్ నెపంతో హత్యలు, ఎదురుకాల్పుల్లో పాల్గొనేవాడు. ఈ క్రమంలో 2017లో దళంలో చేరిన అమృత అనే మహిళను చోట్టు గుంజు ప్రేమించాడు. వారిద్దరూ పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దళంలో ప్రేమ, పెళ్లిని అగ్రనేతలు ఒప్పుకోరని, అందుకే దళం వదిలి వచ్చి లొంగిపోతున్నామని ఎస్పీకి మావోయిస్టు ప్రేమజంట తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో మాట్లాడుతూ చోట్టు గుంజు పేరిట రూ.4 లక్షల రివార్డు ఉందని, చోట్టు గుంజుకు అందవలసిన ప్రభుత్వ సహాయాన్ని త్వరలోనే అందజేస్తామని చెప్పారు. అలాగే అమృతకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని అన్నారు. -
వనం నుంచి జనంలోకి..
శ్రీకాకుళం సిటీ: జిల్లాకు చెందిన ఓ మహిళా మావోయిస్టు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం) ఇరోతు సుందరమ్మ ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆమెపై ఉన్న రివా ర్డును ఎస్పీ ఆమెకే అందజేశారు. కుటుంబ నేపథ్యం.. ఇరోతు సుందరమ్మ వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన ఇరోతు అప్పన్న(లేటు), గున్నమ్మల కుమార్తె. సుందరమ్మ సోదరులు ఈశ్వరరావు, జానకిరావులు అప్పటికే ఎప్పటి నుంచో మా వోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. వీరి ద్వారా ఉద్యమానికి ఆకర్షితురాలైన సుందరమ్మ 2002లో గార వల్లభరావు అలియాస్ చిన్నమురళి, జానకి అలియాస్ అప్పలనాయుడు, వెంకటరావు అలియాస్ త్రినాథ్, శశిల ప్రోద్బ లంతో మావోయిస్టు పార్టీలో చేరారు. చిన్న స్థాయి నుంచి.. మావోయిస్టు పార్టీలో దళం మెంబర్ స్థాయి నుంచి ఏసీఎం స్థాయికి సుందరమ్మ ఎదిగారు. తొలుత ఈమె విజయనగరం జిల్లా కొండబారిడి ఏరియాలో దళం మెంబరుగా పనిచేశారు. అలాగే గొట్టా ఏరియాలో, దేరువాడ ఏరియాలో పనిచేస్తూ తర్వాత ఒడిశాలోని ఆర్ ఉదయగిరి దాడిలో మెడికల్ బృందంలో దళం సభ్యులకు ప్రథమ చికిత్స చేసేందుకు నియమితులయ్యారు. 2006లో కొరాపుట్ ఏసీఎంగా ప్రమోట్ అయ్యారు. 2008 నుంచి 2009 వరకు జంఝావతి దళ కమాండర్గా పనిచేశారు. 2012లో హైకమాండ్ ఆదేశాల మేరకు దండకారణ్యంలో 8 నెలల మెడికల్ ట్రైనింగ్ కోసం వెళ్లారు. ఆమె దళంలో పనిచేసినప్పుడు 303 తుపాకీ ఉపయోగించారు. బయటకు వచ్చి.. మళ్లీ కొంతకాలం కిందట సైద్ధాంతిక విభేదాల కారణంగా ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అయితే హైకమాండ్ ఆదేశాలతో మళ్లీ పార్టీలోకి చేరారు. అయినా అక్కడి పరిస్థితులకు తలొగ్గలేక జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అన్నయ్య ఇరోతు ఈశ్వరరావును వెంటపెట్టుకుని ఎస్పీ సమక్షంలో ఆదివారం లొంగిపోయారు. ఈమె పాల్గొన్న సంఘటనలు: - దమన్జోడీ ఎన్ఏఎల్సీఓ కంపెనీపై దాడిలో పాల్గొన్నారు. - ఒడిశాలోని నారాయణపట్నం బ్లాక్లో పాలూరు అంబూష్లో పాల్గొని నలుగురు సీఆర్పీఎఫ్ జవా నుల మృతికి కారణమయ్యారు. - దాయిగూడ అంబూష్ మెట్టకమరవలస దాడిలో పాల్గొన్నారు. - కేడవాయి, చిన్నదొడ్డ, జరుడ తదితర సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రివార్డును అందజేస్తాం: ఎస్పీ ఇరోతు సుందరమ్మ మీద ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డు నగదును ప్రభుత్వం నుంచి ఈమెకు ఇప్పించే ఏర్పాటు చేస్తూ, మిగిలిన రాయితీలు కలెక్టర్ నుంచి ఇప్పించే ఏర్పాట్లను చేస్తానని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ హామీ ఇచ్చారు. ఈమె మాది రిగానే ఇంకా ఎవరైనా మాజీ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే వారి రివార్డు, నగదును వారి జీవన ఉపాధి కోసం ప్రభుత్వం నుంచి ఇప్పించే ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. మిగిలిన మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. -
కొడుకా.. ఎట్ల బతుకుతవురా..
సాక్షి, కాజీపేట: పుట్టి పెరిగిన ఊర్లో ఇల్లు కూలిపోయే.. భూములు లేవయే ఏట్లా బతుకువుతారా కొడుకా అంటూ జంపన్న తల్లి యశోదమ్మ ఉద్వేగానికి లోనవుతూ ప్రశ్నించడం చూపరుల హృదయాలను కలచివేసింది. మావోయిస్టు అగ్రనేతగా పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసిన జినుగు నర్సింహరెడ్డి అలియాస్ జంపన్న సోమవారం రాత్రి సహృదయ ఆశ్రమంలో ఉంటున్న తల్లి యశోదమ్మను భార్య రజితతో కలిసి వచ్చి పరామర్శించారు. మూడున్నర దశాబ్దాల కాలం తర్వాత కళ్ల ముందు కనిపించిన కుమారుడిని చూసిన యశోదమ్మ తల్లడిల్లిపోయింది. చివరి చూపునకు నోచుకుంటానో లేదోనని నిత్యం మదనపడ్తుండేదాన్నని ఇంత కాలానికైనా నా దగ్గరికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ప్రేమపూర్వకంగా కుమారుడిని దగ్గరకు తీసుకుని ముద్దాడింది. ప్రజల కోసమంటూ మళ్లీ ఎక్కడికి వెళ్లొద్దని, భార్యతో హాయిగా ఉండుమంటూ కన్నీళ్ల పర్యంతమవుతూ దీవించింది. ఆశ్రమంలోనే ఉంటా.. ఎక్కడికి రాను.. ఇక నుంచి నీతోనే ఉంటాను రమ్మని తల్లిని కోరగా నాలుగేండ్లుగా ఆశ్రయం కల్పించిన సహృదయను వదిలి ఎక్కడికీ రానని తనకు మొదటి నుంచి సీతక్క, అలీ సాయం చేస్తున్నట్లుగా చెప్పింది. తన ప్రాణం ఆశ్రమంలోనే పోవాలని ఇంత కాలానికి బయటకు వచ్చిన మీకు భారంగా మారడం ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పింది. తల్లీకుమారుడు ఒకరికొకరు గోరుముద్దలు తిన్పించుకుంటూ భోజనం చేస్తుండడం చూసి ఆశ్రమంలో ఉన్న వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. తల్లీకొడుకుల బంధుత్వం విలువ కట్టలేనిది.. అనంతరం జంపన్న విలేకరులతో మాట్లాడుతూ మా అమ్మకు ఆశ్రయం కల్పించి చక్కగా చూసుకుంటున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. తల్లీబిడ్డల ప్రేమ, అప్యాయతకు విలువ కట్టలేనిదని, ఉద్యమంలో ఉన్నపుడు మా అమ్మ ఇచ్చే ప్రకటనలు చూసినప్పుడు బాధ అన్పించినా.. ఎంతో మంది తల్లులు పిల్లలకు దూరమై భారంగా బతుకుతున్నారని వారి ఆవేదన, ప్రజల కష్టాలను తీర్చడం కోసమే ఉద్యమబాట పట్టినట్లు చెప్పారు. తల్లిని చూసుకోవడానికి తరచు వచ్చిపోతుంటానని తెలిపారు. కొడుకును చూడటం ఆనందంగా ఉంది.. బతికి ఉండగా జంపన్నను చూస్తాననుకోలేదని, భగవంతుడు నా ప్రార్థనను ఆలకించడం సంతోషంగా ఉందని చెప్పింది. తల్లి కోరిక ప్రకారమే సోమవారం రాత్రి ఆగమేఘాల మీద జంపన్న సహృదయ ఆశ్రమాన్ని సందర్శించినట్లు బంధువులు ‘సాక్షి’కి తెలిపారు. సోమవారం మంచి రోజు కాబట్టి వెంటనే రావాలని లేకపోతే రెండు, మూడు రోజులు ఆగాలని చెప్పడంతో తల్లి కోరిక మేరకు వరంగల్కు వచ్చినట్లు వివరించారు. -
డీఆర్డీఏ పీడీపై ఉద్యోగుల తిరుగుబాటు
- ఏఓను సెర్ప్కు సరెండర్ చేయడంపై ఆగ్రహం - అధికారి తిట్లు భరించలేమని ఆవేదన కర్నూలు(హాస్పిటల్): ప్రతి చిన్న విషయానికి గట్టి గట్టిగా కేకలు వేయడం, అరవడం, కింది స్థాయి ఉద్యోగులను దూషించడం చేస్తున్నారంటూ డీఆర్డీఏ పీడీ వై. రామకృష్ణపై ఆ శాఖ ఉద్యోగులు తిరుగుబాటు చేసినంత పనిచేశారు. మంగళవారం సాయంత్రం ఉద్యోగులంతా కలిసి వెళ్లి సదరు అధికారిని నిలదీశారు. ఆ శాఖ ఏఓ షరీఫ్ను సెర్ప్ సీఈఓకు సరెండర్ చేస్తారన్న ప్రచారం జరగడంతో గందరగోళం నెలకొంది. సామాజిక భద్రత పింఛన్ల విషయంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కర్నూలు వెనుకబడి ఉందన్న కారణంతో నెలరోజుల క్రితం ఏఓ షరీఫ్ను పీడీ రామకృష్ణ మందలించారు. దీంతో కలత చెందిన షరీఫ్ ఎలాగూ రంజాన్ పండుగ ఉంది కాబట్టి 20 రోజుల పాటు సెలవుపై వెళ్లిపోయారు. అయితే మధ్యలోనే పీడీ వై. రామకృష్ణ కలుగజేసుకుని వెనక్కి పిలిపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. మూడురోజులుగా ఏఓ షరీఫ్ విధుల్లో చేరేందుకు రావడం, పీడీ చేర్చుకోకపోవడం జరుగుతోంది. విషయంపై మంగళవారం పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పీడీని కలిశారు. అయినా పీడీ వై. రామకృష్ణ శాంతించకుండా ఇప్పటికే తాను సెర్ఫ్ సీఈఓకు లేఖ రాశానని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను బట్టి నిర్ణయం తీసుకుంటానని, ఇప్పటికిప్పుడు షరీఫ్ను విధుల్లో తీసుకోలేనని తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో కార్యాలయ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. పీడీ తన వైఖరి మార్చుకోకపోతే సామూహిక సెలవులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. విషయమై పీడీని వివరణ కోరగా పింఛన్ల పంపిణీ విషయంలో జిల్లా వెనుకబడి ఉందని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉందని, ఈ నేపథ్యంలో ఆ విషయం చెప్పి మందలించిన మాట వాస్తవమేనన్నారు. పనిచేయాలని సూచిస్తే సెలవుపై వెళ్తే తానే చేయలేనని తెలిపారు. -
అలా అయితే అమ్మాయిలు హీరోల్లా చూస్తారని!
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సబ్జార్ భట్ అంత్యక్రియల్లో హల్చల్ చేసిన అనుమానిత ఉగ్రవాది డానిష్ అహ్మద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. త్రాల్లో జరిగిన సబ్జార్ అంత్యక్రియల ఫొటేజీతో డానిష్ అహ్మద్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీసుల వద్ద డానిష్ అహ్మద్ వెల్లడించిన విషయాలు విస్తుగొల్పుతున్నాయి. హంద్వారాలోని కులంగావ్ ప్రాంతానికి చెందిన డానిష్.. డూన్ పీజీ కాలేజీలో అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2016లో హంద్వారా ప్రాంతంలో సైన్యంపై జరిగిన రాళ్లదాడుల్లో అతడు పాల్గొన్నట్లు వెల్లడైంది. ఉగ్రవాదం వైపు మళ్లిన చాలా మంది యువత అసంతృప్తితో ఉన్నారని, అయితే స్థానిక కమాండర్ల నుంచి ప్రాణహాని ఉండటం వల్ల వారు లొంగిపోవడానికి భయపడతారని డానిష్ తెలిపాడు. అలాగే.. ఉగ్రవాదులతో చేతులు కలిపినవారిని లోకల్ అమ్మాయిలు హీరోలుగా చూస్తారన్న భావనతో.. వారితో ఫ్రెండ్షిప్ చేసేందుకు కొంత మంది యువత ఉగ్రవాదం వైపు వెళ్తున్నారని డానిష్ వెల్లడించాడు. స్థానికంగా తగాదాలను పరిష్కరించడంతో పాటు.. ధనవంతుల నుంచి ఉగ్రవాదులు ’ప్రొటెక్షన్ మనీ’ వసూలు చేస్తారని విచారణలో డానిష్ అహ్మద్ తెలిపాడు. -
ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు
రాయ్పూర్: చత్తీస్గఢ్ రాష్ట్రంలో ముగ్గురు మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. జగదల్పూర్ జిల్లాలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది వద్ద శుక్రవారం వీరు లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన ముగ్గురు సుక్మా ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారని బస్తర్ జిల్లా ఇన్స్పెక్టర్ జనరల్ వివేకనంద సిన్హా వెల్లడించారు. ఎప్రిల్ 24న సుక్మా ప్రాంతంలోనే జరిగిన ఎన్కౌంటర్లో 24 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ అనంతరం దర్బా డివిజన్ కటెకళ్యాణ్ ఏరియా కమిటీలో కీలక సభ్యుడు హుంగా(30) సైతం మే 4న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. -
400 మంది ఉగ్రవాదుల లొంగుబాటు!
ఇస్లామాబాద్: సుమారు 400 మంది ఉగ్రవాదులు తమ ఆయుధాలను వదిలేసి జనజీవనస్రవంతిలో కలిసిపోయారు. పాక్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని నగరం క్వెట్టాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఆయుధాలను వదిలేసి లొంగిపోయిన నేపథ్యంలో బలూచిస్తాన్ అసెంబ్లీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి నవాబ్ సనావుల్లా జెహ్రీ, సినియర్ ఆర్మీ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెహ్రీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను జనజీవన స్రవంతిలో కలపడానికి అవసరమైన అన్నిచర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అమాయక ప్రజలను చంపడానికి ఉగ్రవాదులు బలూచ్ ప్రావిన్స్లోని అమాయక ప్రజలను ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. లొంగిపోయిన ఉగ్రవాదుల్లో బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఆర్మీతో పాటు పలు సంస్థలకు చెందిన వారు ఉన్నారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. -
మహిళా మావోయిస్టు లొంగుబాటు
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు పార్టీ కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గెమ్మెలి చంద్రమ్మ అలియాస్ అఖిలతో పాటు నలుగురు ఆర్ముడ్ మిలీషియా సభ్యులు ఎస్పీ రాహుల్దేవ్ శర్మ ఎదుట శనివారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో చంద్రమ్మతో పాటు లాసింగి మచ్చయ్య, కొర్రా లక్ష్మణరావు, కొర్రా సుబ్బారావు, తక్కిరి హెడెబీన్ ఉన్నారు. జీకే వీధి మండలం గూడెం పంచాయతీ, పెదఅగ్రహారం గ్రామానికి చెందిన చంద్రమ్మ 1998 నుంచి గాలికొండ, కోరుకొండ దళాల్లో సభ్యురాలిగా పనిచేసింది. ప్రస్తుతం కలిమెల ఏరియా కమిటీ మెంబర్(ఏసీఎమ్)గా ఉంది. పప్పులూరు దళం (ఒడిశా)లో ఆమె భర్త నాగేశ్వరరావు అలియాస్ సురేష్ పనిచేస్తున్నాడు. చిన్న వయసులోనే చంద్రమ్మకు తల్లిదండ్రులు ఒక తాగుబోతుతో పెళ్లి చేసేం దుకు ప్రయత్నించడంతో మొదలైన ప్రతిఘటన ఆమెను మావోయిస్టు ఉద్య మం వైపు నడిపించింది. 2005లో భర్తతో పాటు చంద్రమ్మను ఒడిశా పోలీసులు అరె స్టు చేశారు. 2007లో జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రమ్మ...టెకుపోదార్లో టైలరుగా పనిచేస్తూ మావో యిస్టుల దుస్తులు కుట్టేది. అక్కడ పోలీసుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో భయపడి స్వ గ్రామం పెదఅగ్రహారం వచ్చేసింది. ఇక్కడ కూడా పోలీ సులు అరెస్టు చేస్తారనే భయంతో స్వచ్ఛందంగాలొంగిపోయింది. చింతపల్లి మండలం బల పం పంచాయతీ, ఎగువలసపల్లి గ్రామానికి చెందిన లాసింగి మచ్చయ్య కోరుకొండ దళంలో ఆర్ముడ్ మిలీషియా సభ్యునిగా పనిచేస్తున్నాడు. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ, సరియావీధి గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మణరావు అలియాస్ విన్జు, కొర్రా సుబ్బారావు పెదబయలు దళంలో ఆర్ముడ్ మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారు. -
పరారీలోనే మంత్రి, అనుచరుడి లొంగుబాటు
లక్నో: పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రీ ప్రజాపతి ప్రధాన అనుచరుడు, హెడ్ కానిస్టేబుల్ చంద్రపాల్ సోమవారం లక్నో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే గ్యాంగ్ రేప్ తో పాటు తల్లీకూతుళ్లపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ కేసులో గాయత్రీ ప్రజాపతి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రజాపతి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. కాగా అజ్ఞాతంలో ఉన్న మంత్రితోపాటు మరో ఆరుగురిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. ఆయన పాస్పోర్టుపై నాలుగు వారాలపాటు నిషేధం విధించి లుక్ ఔట్ నోటీసులు కూడా ఇచ్చింది. కాగా ఒక మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ప్రజాపతి, మరో ఆరుగురిపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మంత్రిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తొలుత నిరాకరించడంతో బాధిత మహిళ సుప్రీంను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ సమాజ్వాదీ పార్టీపై విమర్శల దాడి గుప్పిస్తోంది. -
కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ
బెంగళూరు : మాగడి తాలూకాలోని కూదూరు పోలీస్స్టేషన్లో ఎస్ఐ, సీఐలను అసభ్యపదజాలాలతో దూషించిన కేసులో మాగడి ఎంఎల్ఏ బాలకృష్ణ శుక్రవారం మాగడిలోని ఒకటవ జేఎంఎఫ్సీ కోర్టులో లొంగిపోయారు. వివరాలు..తాలూకాలోని అయ్యండనహళ్లిలో ఇటీవల జరిగిన జాతరలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో తమ పార్టీకి చెందిన వారిపై దాడులకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సదరు ఎమ్మెల్యే ఎస్ఐ, సీఐలను బుధవారం అసభ్యపదజాలాలతో దూషించినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు కూదురు సీఐ నందీశ్ జిల్లా ఎస్పీ రమేశ్కు ఫిర్యాదు చేశాడు. దీనికితోడు ఎంఎల్ఏ బాలకృష్ణ పోలీసు అధికారులను దూషిస్తున్న దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. దీంతో ఎస్పీరమేశ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై కూదురు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారన్న విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన లాయర్తో కలసి శుక్రవారం మాగడిలోని జేఎంఎఫ్సీ కోర్టులో లొంగిపోయారు. -
ఇద్దరు అంతర్జిల్లా నేరస్తుల అరెస్ట్
కొవ్వూరు : ఇద్దరు అంతర్జిల్లా నేరస్తులను కొవ్వూరు రూరల్ పోలీసులు మంగళ వారం అరెస్ట్ చేశారు. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కొవ్వూరు మండలంలోని సీతంపేటలో నవంబర్ 26న రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీ అపహరణకు గురైంది. దీంతో లారీ యాజమాని మచ్చా సూర్యనారాయణ అప్పట్లో రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విజయవాడ పోరంకికి చెందిన కడియాల శ్రీనివాసుతో పాటు అతని సోదరుడు కడియాల ఓకార్ ఈ చోరీకి పాల్పడ్డారని గుర్తించి వారిని మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి లారీతోపాటు చోరీ సమయంలో వినియోగించిన అంబాసిడర్ కారును స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలతో గుట్టురట్టు ఈ కేసును సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఛేదించారు. లారీ చోరీకి గురైన రోజు కొవ్వూరు పట్టణంలోని టోల్గేట్తోపాటు పలుప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో లారీ వెనుక అంబాసిడర్ కారు యర్నగూడెం వరకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఆ కారు నంబర్ సీసీ కెమెరాల్లో పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో విజయవాడకు చెందిన నిపుణుల సాయంతో కారు నంబర్ను గుర్తించారు. కారు ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందినదిగా కనుగొన్నారు. దానిని జంగారెడ్డిగూడెంకు చెందిన నిందితుడు శ్రీనివాస్కు అమ్మినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ విజయవాడలో ఉంటున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అతని గురించి ఆరా తీశారు. శ్రీనివాస్తో, అతని తమ్ముడు ఓంకార్ పాతనేరస్తులని గుర్తించారు. గతంలో లారీల రికార్డులు మార్పు చేసి లోడ్లు అమ్ముకుని వీరిద్దరూ పట్టుబడినట్టు తెలుసుకున్నారు. జంగారెడ్డిగూడెం, చాగల్లు, పెనమలూరు, కాకినాడల్లో వీరిపై కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిందితులపై నిఘా ఉంచిన పోలీసులు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు యర్నగూడెం సమీపంలో పోలేరమ్మ ఆలయం వద్ద లారీతో ఉండగా వారిద్దరినీ పట్టుకున్నారు. లారీకి రంగు మార్చివేసి కర్నాటక రిజిస్ట్రేషన్తో దొంగనంబర్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎం.శ్యాం సుందరరావు, హెచ్సీ ఏకే సత్యనారాయణ, కానిస్టేబుల్ ఎల్.చిరంజీవిని అభినందించారు. వీరికి రివార్డుల నిమిత్తం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. -
నోట్ల మార్పిడి నిందితుల లొంగుబాటు
వెలుగోడు: పెద్ద నోట్ల మార్పిడి ముఠా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. స్థానిక ఎస్ఐ ప్రవీణ్కుమార్రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన నోట్ల మార్పిడికి ప్రయత్నించిన ముఠాను అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో నలుగురు నిందితులు పారిపోగా గత వారంలో ఇద్దరు లొంగిపోయారు. శనివారం ఈ కేసులో 5వ నిందితుడైన సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, 6వ నిందితుడైన నంద్యాలకు చెందిన పీవై ఆంజనేయులు వెలుగోడు పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. వీరిని ఆత్మకూరు సీఐ కృష్ణయ్య విచారించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్ఐ బాషా, హెడ్కానిస్టేబుల్స్ దశరథరామిరెడ్డి, షాషావలీ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఐడుగురు మావోయిస్టులు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరిపై రూ. లక్ష నగదు రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల పేరిట ఉన్నరివార్డును పోలీసులు వారికే అందించారు. జనజీవన స్రవంతిలో కలిసి కొత్త జీవితాన్ని ప్రాంభించాలని పోలీసులు వారికి సూచించారు. -
నోట్ల రద్దుతో భారీగా దెబ్బతిని తిరుగుముఖం..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం సామాన్య జనం మీదే కాదు.. ఆ జనం కోసం పోరాడుతున్నామని చెప్పే మావోయిస్టులపై కూడా పడుతోంది. కేంద్రం అనూహ్యంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో వాటిని ఉపయోగించే తమ అవసరాలను తీర్చుకునే మావోయిస్టులకు ఇప్పుడు అవసరాల విషయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ చివరకు వాస్తవిక పరిస్థితుల్లోకి వచ్చి లొంగిపోతున్నారని పోలీసులు చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్క నోట్ల రద్దు అనంతరం 28 రోజుల్లో 564మంది మావోయిస్టులు వారి సానుభూతి పరులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఇతది గతంతో పోలిస్తే చాలా ఎక్కువ అని పోలీసులు చెబుతున్నారు. ఓ పక్క సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు గాలింపులు జరుపుతున్న దొరకని మావోయిస్టులు ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రభావానికి గురై స్వయంగా లొంగిపోతున్నారని తెలిసింది. ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఒక్క ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా నుంచే 70శాతం మంది మావోయిస్టులు లొంగిపోయారంట. గత నెలలో ఇక్కడే ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ బలగాలు 23 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్లో చంపేశారు. గత రికార్డులతో పోలీస్తే పెద్ద మొత్తంలోనే మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిసింది. 2011 నుంచి ఈ నెల 15 వరకు ఉన్న గణాంకాల ప్రకారం 3,766మంది లొంగిపోగా వారిలో ఈ ఒక్క ఏడాదిలోనే 1,399మంది ఉన్నారు. అది కాకుండా ఈ ఒక్క నెల(నవంబర్)లోనే 564మంది లొంగిపోయినట్లు కేంద్ర హోంశాఖ వద్ద వివరాలు ఉన్నాయి. గత ఆరేళ్లలో ఇదే ఎక్కువని కూడా హోంశాఖ చెబుతోంది. పాత కరెన్సీ ఉపయోగించి తమ అవసరాలు తీర్చుకోవడం అంత సులువు కాదని, ఆయుధ సామాగ్రి, మందులు, నిత్యావసరాలు, ఇతరుల నుంచి ఆయుధాల కొనుగోళ్లవంటివి జరగబోవని, ముఖ్యంగా నిత్యవసరాలు కూడా తీరని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారు చేసేది లేక లొంగిపోతున్నారని ఓ సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి తెలిపారు. -
'ఆర్కే కాళ్లకు గాయాలు.. లొంగిపోతే మంచిది'
-
'ఆర్కే కాళ్లకు గాయాలు.. లొంగిపోతే మంచిది'
మల్కన్గిరి: ఇప్పటికైనా మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే లొంగిపోయి సరైన వైద్యం చేయించుకోవాలని ఒడిశా పోలీసులు కోరారు. వైద్య సేవలు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆర్కే గాయపడ్డారని, ఆయన కాళ్లకు గాయాలయ్యాయని, ఇప్పటికైనా లొంగిపోయి శస్త్ర చికిత్సలాంటివి చేయించుకోవచ్చని మల్కన్ గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్ర చెప్పారు. ప్రస్తుతం ఆయన ఒడిశా -ఆంధ్ర సరిహద్దులోని ఏదో గుర్తు తెలియన వైద్య శిబిరంలో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని అన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ఆస్పత్రులన్నింటిలో అప్రమత్తత ప్రకటించినట్లు సమాచారం. ఏక్షణమైనా వైద్యం కోసం ఆర్కే వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అలా రాకుంటే ఆయనకు మెరుగైన వైద్యం అందే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. కీలక సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం నాటు వైద్యం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆర్కే తన కుమారుడు మున్నా, ఇతర బృందం మధ్యలో ఉన్నాడని, చాలా చాకచక్యంగా తప్పించుకున్నారని మహాపాత్ర తెలిపారు. -
వేల కోట్లను అప్పగించిన బడా వ్యాపారి?
సూరత్: నల్లధనం నిరోధం కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ మనీ లో మరో సంచలన ఘటన నమోదైంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు అనేక ఇబ్బందులుపడుతుండగా.. గుజరాత్ కు చెందిన బడా వ్యాపారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ బడా వ్యాపారవేత్త మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. భారీ సంఖ్యలో వేలకోట్ల సొమ్మును ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. గుజరాత్లోని సూరత్కు చెందిన బిల్డర్, వజ్రాల వ్యాపారి లాల్ జీ భాయ్ పటేల్ ఇపుడు వార్తల్లో నిలిచారు. రూ 500 నుంచి రూ 1000 నోట్లు రద్దు ప్రభావంతో దాదాపు రూ.6 వేల కోట్లను నగదును అధికారులకు అప్పగించారు. భూరి విరాళాలకు , స్వచ్ఛంద దాతృత్వానికి ప్రసిద్ధి చెందిన పటేల్ ఈనిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు కార్లు, ఇల్లు లాంటి విలువైన బహుమతులను అందించిన చరిత్ర కూడా పటేల్ కు ఉంది. (సూరత్ కేంద్రంగా పనిచేస్తున్న హరే కృష్ణ డైమండ్ ఎక్స్పోర్ట్స్ సంస్థ యజమాని వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలకియా కాదు) అలాగే దాదాపు రూ.200 కోట్ల రూపాయలను బాలికా విద్యా కోసం ఆయన విరాళమిచ్చారు. కాగా కరెన్సీ బ్యాన్ ఎఫెక్ట్ తో చాలామంది నల్లధనం కుబేరులు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తుండగా, మరికొంతమంది కోట్లాది రూపాయలను గంగపాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
బ్లాక్మనీ యుద్ధం..జ్యువెలర్స్కు షాక్!
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ బ్లాక్ మనీ’ నల్లధనం కుబేరులగుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రకటనతో తమ నిధులను బంగారం కొనుగోళ్లపై మళ్ళిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్నివైపుల నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నవంబరు 8 రాత్రి 8 గం.టల నుంచి సీసీటీవీ ఫుటేజీ సమర్పించాలంటూ జ్యువెల్లరీ షాపు యజమానులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు చోటు చేసుకుంటున్నాయన్న ఫిర్యాదులతో ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీ (నవంబరు 8) ప్రకటన రోజు రాత్రి రాజధాని నగరంలోని మూరుమూల షాపులతో సహా అన్ని ప్రముఖ నగల దుకాణాలన్నీ ఎక్కువసేపు తెరిచే వున్నాయనీ, పెద్ద మొత్తంలో బంగారు కొనుగోళ్లు జరిగాయన్నవార్తలో ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది. ఒకే రోజు వివిధ నగల షాపులో ఒక వ్యక్తి ఎన్నిసార్లు షాపింగ్ చేశాడు. లేదా ఒకే కుటుంబంలోని పలువురు.. వివిధ నగల దుకాణాల్లో చేసిన షాపింగ్ తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇలాంటి సమాచారాన్ని అందించినట్టు తెలుస్తోంది. అలాగే కొన్ని నగల వ్యాపారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఐటీ అధికారులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. నల్లధనంతో బంగారం కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో, ఐటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీబీడీటీ ఆదేశాలపై ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో కరోల్ బాగ్, దారిబా కలాన్, చాందినీ చౌక్, ముంబై జవేరీ బజార్ సహా మూడు ప్రముఖ వ్యాపార కేంద్రాలలో ఈ దాడులు నిర్వహించారు. చండీగఢ్, లుధియానా, అమృత్సర్, జలంధర్, కోలకతా, అహ్మదాబాద్ తదితర నగరాల్లో కూడా తనిఖీ చేశారు. ఈ దాడులు ఇంకా కొనసాగనున్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ నగదు లావాదేవీలపై కఠిన చర్యలకు తమకు స్పష్టమైన ఆదేశాలందాయని స్పష్టం చేశారు. కాగా అక్రమ పసిడి అమ్మకాల్లో బుధవారం పది గ్రా. పుత్తడి ధర రూ..35 వేల నుంచి మొదలై రూ.49 వేల దగ్గర ముగిసింది. ఇది గురువారం నాటికి మరింత ఎగిసి రూ.40 వేల దగ్గర ప్రారంభమై సుమారు 55 వేల రూపాయలు పలకడం కలకలం రేపింది. మరోవైపు బంగారు కొనుగోళ్లపై కచ్చితంగా ప్యాన్ కార్డు నమోదును తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. -
కోర్టులో లొంగిపోయిన రాఖీ యాదవ్
పట్నా: టీనేజ్ యువకుడి హత్య కేసులో నిందితుడు రాకేశ్ రంజన్ అలియాస్ రాఖీ యాదవ్ శనివారం ఉదయం గయా సివిల్ కోర్టులో లొంగిపోయాడు. కాగా రాఖీ యాదవ్కు బెయిల్ మంజూరు చేస్తూ బిహార్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో రాఖీ యాదవ్ లొంగిపోవడంతో అతడికి న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కుమారుడితో పాటు బహిష్కృత జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి, ఆమె భర్త కూడా కోర్టుకు వచ్చారు. ఈ ఏడాది మే నెలలో తన కారును ఓవర్ టేక్ చేసినందుకు నడిరోడ్డుపై ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని రాఖీ యాదవ్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. అనంతరం పరారీలో ఉన్న అతడిని అదే నెల 11న పోలీసులు అరెస్ట్ చేయగా, పట్నా హైకోర్టు ఈ నెల 19న బెయిల్ మంజూరు చేసింది. కాగా రాఖీ యాదవ్కు పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ బిహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. -
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
రాయ్పూర్: చత్తీస్ఘడ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో 57 మంది మావోయిస్టులు, 297 మంది సానుభూతి పరులు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో 17 మందిపై ఉన్న క్యాష్ రివార్డును వారికే అందిస్తామని, మిగతావారికి ప్రోత్సాహకంగా నగదును అందిస్తామని సుక్మా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులు కెర్లాపాల్, మజిపరా, పొటాంపురా.బోర్గుడా, గొండ్ పల్లి మొసంపురా, జీరాంపల్, బాదేసట్టి, పొందుపరా గ్రామాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. బస్తర్ ప్రాంతంలో లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని ఎస్పీ తెలిపారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 1,400 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు. -
అసైన్డ్ భూములు సరెండర్ చేయాలి
దుబ్బాక: జీవనోపాధి కోసం ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుపేద కుటుంబాలకు గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఆసైన్డ్ భూములను ఇతర వర్గాలు బలవంతంగా లాక్కున్నాయని, అక్రమించిన ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి సరెండెర్ చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తౌడ శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం దుబ్బాక విలేకరులతో ఆయన మాట్లాడుతూ జీవనోపాధి కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను అగ్రవర్ణాలు స్వాధీనం చేసుకుని, తహశీల్దార్ కార్యాలయాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తుల పేరున ఆసైన్డ్ భూములు వెళ్లిపోయాయని ఆరోపించారు. దళితుల అవసరాలను ఆసరా చేసుకున్న ఆగ్రవర్ణాలు అప్పులిచ్చి ఎస్సీ, ఎస్టీ భూములను స్వాధీనం చేసుకున్నారన్నారు. గత ప్రభుత్వాలు దళితులకిచ్చిన భూముల రికార్డులు, ఇప్పుడు ఎవరిపేరున మోటేషన్ అవుతున్నాయో రెవెన్యూ అధికారులు లెక్కలు తేల్చాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల నుంచి ఇతర వర్గాలకు మారిన భూ రికార్డులను సరి చూసి, సర్వే చేయాలని రెవెన్యూ అధికారులకు ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ భూములను అక్రమించిన ఇతర వర్గాలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేయాలని, లేనియెడల చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. -
న్యూడెమోక్రసి దళ సభ్యుని లొంగుబాటు
ఇల్లందు: న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళ సభ్యుడు జూడి వీరాస్వామి పోలీసులకు లొంగిపోయాడు. ఖమ్మం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం లొంగిపోయాడు. 24 తూటాలు, రెండు తుపాకులను పోలీసులకు అప్పగించాడు. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన రతన్
న్యూఢిల్లీ: సహ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు అన్మోల్ రతన్(29) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి సరెండయ్యాడు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)లో ముఖ్యనేతగా ఉన్న రతన్ ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అతడిని పట్టుకునేందుకు ఐదు పోలీసు బృందాలను నియమించారు. అత్యాచారం చేసిన తర్వాత తనను బెదిరించాడని ఎంఫిల్ విద్యార్థిని(28) ఫిర్యాదు చేయడంతో అతడు అదృశ్యమయ్యాడు. హాస్టల్ గదిలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి రతన్ 13 సార్లు తనకు ఫోన్ చేసి విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించినట్టు ఆమె చెప్పింది. క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న రతన్ ను ఏఐఎస్ఏ బహిష్కరించింది. -
అధికారులకు నెమలి అప్పగింత
భువనగిరి అర్బన్ జాతీయ పక్షి నెమాళ్లను కొంత మంది వ్యక్తులు వేటాడుతూ వాటికి మత్తు,విషపదార్థలు ఇచ్చి మట్టు బెడుతున్నారు. శనివారం పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలోని కాస్మాని కుంట వద్ద కదల లేని నెమలిని చూసిన చిన్నారులు కొలుపుల సహాన, సోహన్లు భువనగిరి అటవీశాఖ బిట్ అధికారి సోమ నర్సయ్యకు కార్యాలయంలో అప్పగించారు. దీంతో అధికారులు నెమలికి వైద్యం అందించి ఫారెస్ట్లో వదిలి పెట్టారు. -
ఆలయాన్ని అప్పగించాలని ఆత్మహత్యాయత్నం
దిగొచ్చిన దేవాదాయ శాఖ అధికారులు పోచమ్మమైదాన్ : భక్తుల సహకారం, కాయకష్టం కలుపుకుని నిర్మించిన ఆలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వెంటనే తమకు అప్పగించాలనే డిమాండ్తో ఆలయ వ్యవస్థాపకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొద్దిరోజుల నుంచి ఈ వివాదం సాగుతుండగా, బాధ్యులు గురువారం ఆత్మహత్యకు యత్నించడంతో అధికారులు దిగొచ్చి ఆలయ తాళాలు అప్పగించారు. వరంగల్ రంగంపేటలోని అయ్యప్ప ఆలయాన్ని సుబ్రమణ్యశర్మ, గణేష్శర్మ నిర్మించినట్లు చెబుతుండగా వారి ఆధ్వర్యంలో నిర్వహ ణ సాగింది. కొన్నినెలల క్రితం ఆలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా, నిరక్షరాస్యులమైన తమతో అన్యాయంగా సంతకాలు చేయించుకున్నారని వ్యవస్థాపకులు ఆరోపిస్తూ హైకోర్టుకు వెళ్లారు. దీంతో అధికారుల నిర్ణయంపై స్టే విధిస్తూ, ఆలయ నిర్వహణను సుబ్రమణ్యశర్మకే అప్పగించాలని ఆదేశిం చింది. దీంతో సుబ్రహ్మణ్య శర్మ, గణేష్ శర్మలు దేవాదా య శాఖ కమిషనర్ కృష్ణవేణిని కలిసి ఆలయ తాళాలు ఇప్పించాలని కోరగా ఆమె ఏసీ వీరస్వామికి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయన ఇవ్వకపోవడంతో విసిగిపోయి న వారు దేవాదాయ శాఖ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకని ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డారు. దీంతో దిగొచ్చిన అధికారులు ఆలయ తాళాలు అప్పగించడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం వారు ఆలయంలో పూజలు నిర్వహించారు. -
నయూం అనుచరుల లొంగుబాటు
మూడు నెలల క్రితమే పాశం శ్రీను, సుధాకర్పై పీడీ యాక్ట్ కేసు అనారోగ్య కారణాలతోనే లొంగిపోయినట్లు పాశం వెల్లడి రాజకీయ కుట్రలో భాగంగానే కేసులో ఇరికించారని సుధాకర్ ఆవేదన నల్లగొండ : మావోయిస్టు వ్యతిరేక ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన నయీం అనచరులు పాశం శ్రీనివాస్, భువనగిరి జెడ్పీటీసీ సందెల సుధాకర్ శుక్రవారం నల్లగొండ ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి ఎదుట లొంగిపోయారు. మూడు నెలల క్రితం వీరిపై పీడీయాక్టు కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి వీరు అజ్ఞాతంలో ఉన్నారు. పాశం శ్రీనివాస్కు పది రోజుల క్రితం కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో గుండెపోటు వచ్చిందని వదంతులు వచ్చాయి. ఆ తర్వాత అదృశ్యమైన శ్రీనివాస్ తిరుపతి, మహానంది, ఒరిస్సా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. టీఆర్ఎస్ నాయకుడు కొనపురి రాములు హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అడ్వకేట్ ఛత్రపతి ద్వారా ఎస్పీ దగ్గర ఇద్దరు లొంగిపోయారు. అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నట్లు పాశం శ్రీనివాస్ వెల్లడించగా రాజకీయ కుట్ర, శ్రీనివాస్ దగ్గరకి తరచుగా వెళ్లడం వలన తనపై పీడీ యాక్టు కేసు పెట్టినట్లు జెడ్పీటీసీ సుధాకర్ తెలిపారు. దళిత నాయకుడిగా ఎదగడాన్ని ఓర్వలేకనే కేసులో ఇరికించారని ఆయన మీడియా ఎదుట వాపోయాడు. వీడిన సస్పెన్స్ భువనగిరి : మాజీ మావోయిస్టు ఎండీ నయీం ముఖ్య అనుచరుడు భువనగిరికి చెందిన పాశం శ్రీనివాస్, భువనగిరి జెడ్పీటీసీ సందెలసుధాకర్ పోలీసులకు లొంగిపోయారు. దీంతో నెల రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. భువనగిరి, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పట్టణానికి చెందిన ఎస్కె షకీల్, పాశం శ్రీను, సందెల సుధాకర్పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. గత ఏప్రిల్ నుంచి ముగ్గురి కోసం గాలిస్తున్నా చిక్కకుండా రహస్య ప్రాంతానికి తరలిపోయారు. అయితే భువనగిరి పట్టణంలోని రిసార్టులో ఇటీవల పాశం శ్రీను పోలీసులకు పట్టుబడినప్పటికీ చాకచక్యంగా తప్పించుకుపోయారని సమాచారం. ముగ్గురి సెల్ఫోన్లు, అనుచరులపై నిరంతర నిఘా కొనసాగించారు. ఈ నేపథ్యంలో తిర్మలగిరిలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారని స మాచారం రావడంతో ఏప్రిల్ రెండవ వారంలో అప్పటి ఎస్పీ దుగ్గల్ ఆదేశాల మేరకు భువనగిరి డివిజన్కు చెందిన సీఐ లు వీరిని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నిందితులు ఉన్నారన్న సమాచారంతో తాళం పగులగొట్టినా ఇంట్లో ఎవరు దొరకకపోవడంతో పెద్ద దుమారం లేచింది. షకీల్ మరణంతో సంచలనం పీడీ యాక్టు నమోదు అయిన ముగ్గురిలో ప్రధాన నిందితుడు ఎస్కే షకీల్ గత జూన్ 14న గుండెపోటుతో మృతిచెందాడు. మెదక్ జిల్లాలో ఉంటున్న సమయంలో గుండెపోటు రావడం అస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆయన మరణంపై పలు ఆరోపణలు వచ్చాయి. పాశం శ్రీను మృతిచెందాడంటూ... ఎస్కె షకీల్ మరణం తర్వాత మరో నిందితుడు పాశం శ్రీను కూడా గుండెపోటుతో మృతి చెందాడని గత నెలలో సోషల్మీడియా, టీవీ చానెళ్లలో స్క్రోలింగ్లు, వార్తలు వచ్చాయి. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో ఉండగా పాశం శ్రీనుకు గుండెపోటు రాగా ఆయన స్నేహితుడు ఒకరు అక్కడే ఆస్పత్రిలో చేర్పించాడని, కోమాలోకి వెళ్లిన శ్రీనివాస్ అప్పటికే ప్రాణాలుకోల్పోయాడని నాలుగురోజుల పాటు ప్రచారం జరిగింది. మృతదేహాన్ని నలుగురు వ్యక్తులు తీసుకుపోయారని వారు పోలీస్లేనన్న అనుమానం వ్యక్తం అయ్యింది. అయితే ఈ మేరకు తన భర్తను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకుపోయారని ఆయ న అదృశ్యంపై అనుమానాలున్నయని పాశం శ్రీను భార్య నళిని హెచ్ఆర్సీలో జూన్30న ిఫిర్యాదు చేశారు. అయితే శ్రీను అదృశ్యం వెనుక అయన అనారోగ్యమే కారణమని మరో వాదన విన్పించింది. గుండెపోటు రావడంతో వైద్యం కోసం రహస్యంగా మరో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.వైద్యం అందించడానికి ఆయనకు సంబంధించిన వ్యక్తులే తీసుకుపోయినట్లు ప్రచారం సాగింది. ఒక దశలో ఆయనతో పాటు మరో నిందితుడు చనిపోయాడని ప్రచారం జరిగింది. మరో వైపు పాశం శ్రీను విదేశాలకు వెళ్లాడన్న ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో శ్రీనుతో పాటు జెడ్పీటీసీ సందెల సుధాకర్ కూడా ఎస్పీ ఎదుట లొంగిపోవడంతో ఇంతకాలం భువనగిరి ప్రాంతంలో నెలకొన్న సస్పెన్సకు తెరపడింది. -
లొంగిపోయిన 20 మంది ఉగ్రవాదులు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు లొంగిపోయారు. బదక్షన్ ప్రావిన్స్ ప్రాంతంలో 20 మంది ఉగ్రవాదులు లొంగిపోయినట్టు ఆదివారం పోలీసు అధికారులు తెలిపారు. మౌలావి ఇక్రముద్దీన్ నాయకత్వంలోని వీరు తమ ఆయుధాలతో ఫజియాబాద్ లో పోలీసుల ఎదుట లొంగిపోయారని ఆ దేశ మీడియా వెల్లడించింది. రఘిస్థాన్ జిల్లాలో పోలీసులతో జరిగిన భీకర పోరు అనంతరం వీరు పోలీసులకు లొంగిపోయారు. -
తాండూరు టీపీఓకు చుక్కెదురు
♦ ప్రభుత్వానికి సరెండర్ చేసిన కమిషనర్ ♦ టౌన్ ప్లానింగ్ విభాగం గదికి తాళం తాండూరు : స్థానిక మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారిణి (టీపీఓ)కు చుక్కెదురైంది. పక్షం రోజుల అనంతరం తిరిగి విధుల్లో చేరాలనే టీపీఓ ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రితం రోజు విధులో చేరడానికి మున్సిపల్ మేనేజర్ శ్రీహరికి ఇచ్చిన లేఖను మున్సిపల్ కమిషనర్ సంతోష్కుమార్ శనివారం తిరస్కరించడంతోఆమెకు భంగపాటు తప్పలేదు. ఏడాది క్రితం ఇక్కడ టీపీఓగా శైలజ విధుల్లో చేరారు. అయితే పట్టణంలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తుండడం, ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై గత నెల 30న మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు చర్యలకు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీఓను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కౌన్సిల్లో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సంతోష్కుమార్ రెండు రోజుల క్రితం ఆమెను సరెండర్ చేస్తున్నట్లు డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీసీ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈనెల 3న టీపీఓ విధులు చేరేందుకు మున్సిపాలిటీకి వచ్చారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్కు లేఖ అందించారు. ఈ లేఖను కమిషనర్ తిరస్కరించారు. ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ డీటీసీపీకి ఇచ్చిన లేఖ ప్రతిని శనివారం కమిషనర్ టీపీఓకు అందించారు. దీంతో ఆమె కార్యాలయం నుంచి వెనుతిరిగారు. కొసమెరుపు ఏమిటంటే.. ముఖ్యమైన ఫైళ్లు గల్లంతు కావొద్దనే యోచనతో మున్సిపాలిటీలోని టౌన్ప్లానింగ్ విభాగం గదికి కమిషనర్ తాళం వేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కొత్తగా ఇద్దరు బీఐలు, ఒక టీపీఎస్లు వస్తున్నారని చెప్పారు. -
సరిత.. కీలక నేత
ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళా మవోస్టులు లొంగుబాటు ఇద్దరిపై నాలుగేసి లక్షలు, మరొకరిపై రూ.లక్ష రివార్డు పెదవాల్తేరు (విశాఖ): పోలీసులకు బుధవారం లొంగిపోయిన ముగ్గురు మహిళా మవోయిస్టులపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. వీరంతా దళంలో చురుగ్గా పనిచేసిన వారే. లొంగిపోయినవారిలో ఫస్ట్ సి ఆర్ సి కంపెనీ కమాండర్ కుడబాల లక్ష్మి ఎలియాస్ సరిత, ఏసీఎం కేడర్ నేత బోనంగి రాములమ్మ ఎలియాస్ భారతి, దళ సభ్యురాలు తాంబేలు తుమ్ము, ఎలియాస్ విజయకుమారి ఉన్నారు. వీరిలో సరిత అత్యంత కీలక మహిళా నేతగా పనిచేశారు. వీరి వివరాలను ఎస్పీ రాహుల్దేవ్ శర్మ బుధవారం మీడియాకు వివరించారు. సరితపై 33 కేసులు, రూ.4 లక్షల రిమాండ్ డీసీఎం స్థాయి నేత సరిత (29) ఎంతో చురుగ్గా పనిచేశారు. ఏవోబీ తొలి మహిళ కమాండర్ స్థాయికి ఎదిగారు. జి.కె.వీధి మండలం, వంచుల పంచాయితీ శ్యామగెడ్డ ఈమె స్వగ్రామం. 2000లో దళంలో చేరారు. ఏకే 47 కలిగిన తొలి మహిళా నేత. సీలేరు సంతలో 2008 మే 28న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేసి తుపాకులు ఎత్తుకు వె ళ్లడం, 2004లో కోరాపుట్ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్క్వార్టర్ పైదాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లడం, 2015 జనవరి 1న జై సర్పంచ్ సాగిన వెంకటరమణ హత్య తదితర సంఘటల్లో ఆమె పాల్గొంది. భారతక్క కూడా కీలక నేతే : మరో మహిళా కీలకనేత, జి.కె.వీధి మండలం బలపం పంచాయతీ లబడంపల్లి గ్రామానికి చెందిన బోనంగి రాములమ్మ ఎలియాస్ భారతక్క, ఎలియాస్ సరోజపై కూడా రూ.4 లక్షల రివార్డ్, 34 కేసులున్నాయి. అనకాపల్లి పోలీసుస్టేషన్ పైదాడి, దారకొండ పోలీసు అవుట్పోస్ట్పై దాడి వంటి కేసులున్నాయి. కోరుకొండ, గాలికొండ, పెదబయలు, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో పనిచేసింది. 2005లో ఏసీఎం క్యాడర్గా పదోన్నతి పొంది 20 ఏళ్ళు విశాఖ ఏవోబీలో పనిచేసింది. విజయపై లక్ష రివార్డ్ : జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయితీ పనసగొంది గ్రామానికి చెందిన తాంబేలు తుమ్ము, ఎలియాస్ విజయ సొంత అన్న తాంబేలు నాగేశ్వరరావు, బావ అప్పారావు మావోయిస్టు పార్టీలో ఉండడంతో దళంలో చేరింది. ఈమెపై రూ. లక్ష రివార్డుతో పాటు 8 నేరాలున్నాయి. -
లొంగిపోయిన 40 మంది మావోయిస్టులు
రాయ్ పూర్: మావోయిస్టు ఉద్యమంలో ఒక పెద్ద కుదుపు. ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ కు చెందిన 40 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు. వీరిలో రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు కూడా ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. 40 మంది నక్సల్స్ బస్తర్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు. దర్భా డివిజన్ కు చెందిన 19 మంది, కాంగెర్ వాలీ కమిటీకి చెందిన ఇద్దరు, దక్షిణ బస్తర్ డివిజన్ కు చెందిన 19 మంది ఉన్నారు. దక్షిణ బస్తర్ డివిజన్ కు చెందిన సుబ్లి కష్యప్ తలపై రూ.8 లక్షల రివార్డు ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్లు, ఆయధాలను దొంగిలించారనే ఆరోపణ వీరిపై ఉన్నట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వీరికి రూ.10 వేల చొప్పున బస్తర్ జిల్లా కలెక్టర్ ఇవ్వనున్నారు. -
ఆఫీస్ నుంచి లాక్కెళ్లి రేప్: నిందితుడి లొంగుబాటు
ముక్త్సర్: దేశవ్యాప్తంగానేకాక పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు సైతం దునుమాడిన పంజాబ్ అత్యాచార సంఘటనకు సంబంధించిన కేసులో నిందితుడు ఎట్టకేలకు లొంగిపోయాడు. ముక్త్సర్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఫిర్యాదుచేసి పాతిక రోజులైనా పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితురాలైన దళిత యువతి జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించడంతో శుక్రవారం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నిందితుడు గుర్జిందర్ సింగ్ శనివారం ఉదయం తమకు లొంగిపోయాడని, అతణ్ని న్యాయస్థానంలో హాజరుపరుస్తామని ముక్త్సర్ పోలీసులు తెలిపారు. కాగా, ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసేంతవరకు చేష్టలుడిగి చూస్తుండిపోయిప పోలీసులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. (చదవండి: ఆఫీస్ నుంచి ఈడ్చుకుపోయి అత్యాచారం చేశాడు) -
పుట్టంగల్ ఘటనలో ఐదుగురి లొంగుబాటు
కొల్లాం: పుట్టంగల్ ఆలయంలో అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి అయిదుగురు ఆలయ అధికారులు మంగళవారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆలయ ట్రస్టీ అధ్యక్షుడు జయలాల్, సెక్రటరీ జె కృష్ణకుట్టీ, ట్రెజరర్ శివప్రసాద్తో పాటు మరో ఇద్దరు సురేంద్రన్ పిళ్ళై, రవీంద్రన్ పిళ్ళై లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం వీరంతా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. కొల్లాంలో ఉన్న పుట్టింగల్ ఆలయంలో జరిగే కాళికా దేవి ఉత్సవాల్లో ఆదివారం నిర్వహించిన బాణసంచా వేడుక వికటించి 110మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 383మంది తీవ్రగాయాలతో ఆసుపత్రులపాలయ్యారు. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనపై క్రైం బ్రాంచ్ విచారణ జరుపుతోంది. ఇందుకు సంబంధించి ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జితో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కేసు ఇవాళ కేరళ హైకోర్టులో విచారణకు రానుంది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
ఒకరు కొయ్యూరు ఏరియా కమిటీ సభ్యురాలు మరొకరు దళ సభ్యుడు విశాఖపట్నం: సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం విశాఖ జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒకరు ఏరియా కమిటీ సభ్యురాలు గెమ్మెలి బందో అలియాస్ కమల అలియాస్ రస్సో కాగా.. మరొకరు దళ సభ్యుడు వంతల సాయి అలియాస్ బాలయ్య. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న కమలపై రూ.4 లక్షలు, సాయిపై రూ. లక్ష రివార్డు ఉన్నాయి. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ తూములోవ గ్రామానికి చెందిన కమల ఏఓబీ ఎస్జెడ్సీ పరిధిలోని కోరాపుట్ డివిజన్ జెఎన్ఎమ్ ఏరియా కమిటీ సభ్యురాలు. 2007 ఏప్రిల్లో ఆర్మ్డ్ మిలీషియా సభ్యురాలిగా గాలికొండ దళంలో చేరి పలు హింసాత్మక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంది. తర్వాత 2010 వరకు కలిమెల దళ సభ్యురాలిగా రస్సో పేరుతో పనిచేసింది. 2010 జూన్ నుంచి 2013 వరకూ మల్కన్గిరి ఏరియాలో జననాట్య మండలిలో పని చేసింది. 2013-15 మధ్య కోరాపుట్-నారాయణపట్నం డివిజన్లో పనిచేస్తున్న సమయంలో ఆ డివిజన్ కమిటీ సభ్యుడైన సునీల్ అలియాస్ రైనాతో ఆమెకు వివాహం జరిగింది. 2015 తర్వాత అనారోగ్యానికి గురై దళం నుంచి బయటకు వచ్చేందుకు ఎస్జెడ్పి మెంబరైన ‘దయ’ను అడిగితే నిరాకరించడంతో నాలుగు నెలల క్రితం రహస్యంగా బయటకు వచ్చేసింది. 2010 జూలైలో కోరాపుట్ జిల్లా నారాయణపట్న బ్లాక్ సామాన గ్రామం ప్రాంతంలో, 2013 నవంబర్లో పనికి గ్రామం వద్ద పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో కమల పాల్గొంది. 2014లో దిగువ గొల్లూరు అమ్మావాలి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఇద్దరు గ్రామస్తుల హత్య ఘటనలోనూ ఈమె ప్రమేయం ఉందని ఎస్పీ ప్రవీణ్ తెలిపారు. ఇక జి.కె.వీధి పంచాయతీకి చెందిన వంతల సాయి గాలికొండ దళ సభ్యుడు మోహన్ ప్రోద్బలంతో 2014లో ఆర్మ్డ్ మిలీషియాలో చేరాడు. ఆరు నెలల తర్వాత దళంలోకి సెంట్రీగా వచ్చాడు. కానీ అక్కడి పరిస్థితులను చూసి ఆరు నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేశాడు. -
మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు
వరంగల్ క్రైం : ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ సభ్యురాలు కుంజమ్ ఇడుమన్ అలియాస్ కవిత శుక్రవారం వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్కిషోర్ఝా ఎదుట లొంగి పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం నీలంపల్లి గుంపు (బుట్టాయిగూడెం)కు చెందిన కుంజమ్ ఇడుమన్ అలియాస్ కవిత తల్లిదండ్రులకు పెద్దకుమార్తె. ఈమెకు ముగ్గురు తమ్ములు ఉన్నారు. కవితను పెళ్లిచేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడితేవడంతో ఇంటి నుంచి వెళ్లిపోరుుంది. 2011-12 మధ్య కాలం లో మేకల రాజు అలియాస్ మురళి ప్రోద్బలంతో వెంకటాపూర్ ఏరియా కమిటీలో దళసభ్యురాలిగా చేరింది. 2013 జూలై వరకు అదే కమిటీలో కొనసాగింది. ఆ తర్వాత కెకెడబ్ల్యు (కరీంనగర్, ఖమ్మం, వరంగల్) డివిజన్ కమిటీలోఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీకి బదిలీ అయింది. కవిత కెకెడబ్ల్యు కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్తో మావోయిస్టు పార్టీ కార్యాక్రమాలలో చురుకుగా పాల్గొన్నట్టు ఎస్పీ తెలిపారు. కవిత రెండు సార్లు పోలీసు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నదని, ఒక సారి పోలీసు ఔట్పోస్టుపై దాడి చేసిందని ఎస్పీ తెలిపారు. ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించిన మినాపా సీఆర్పీఎఫ్ అంబుష్లో పాల్గొన్నదని, దీపల్లి గ్రామం భద్రకాళి తహసిల్, చత్తీస్గడ్ రాష్ట్రంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పులలో పాల్గొన్నదని, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కంబాలపేట అటవీ ప్రాం తంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె తప్పించుకున్నదని వివరించారు. అనారోగ్య కారణాలతో పాటు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక లొంగిపోయినట్లు కవిత తెలిపింది. -
మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు
శ్రీకాకుళం: ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లాలో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 39 మావోయిస్టు మద్దతుదారులు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మిలీషియా సభ్యులు , గ్రామ కమిటీల సభ్యులు 12 మంది ఉన్నారు. -
23 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తిస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో 23 మంది మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిశారు. 23 మంది మావోయిస్టులు ఆదివారం జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు ఎస్పీ విలేకరుల సమావేశంలో తెలిపారు. -
'అసలు మేమెందుకు సరెండర్ కావాలి?'
న్యూఢిల్లీ: అసలు తామెందుకు పోలీసులకు సరెండర్ కావాలని రాజద్రోహం కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు జేఎన్యూ విద్యార్థులు ప్రశ్నించారు. ఇప్పటికే ముగ్గురు జేఎన్యూ విద్యార్ధులు జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్లగా వీరు మాత్రం తాము సరెండర్ అయ్యే సమస్యే లేదని అంటున్నారు. జేఎన్యూ విద్యార్థులు కన్హయ్య కుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన అనంతరం ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, రామనాగా, అశుతోష్ కుమార్ కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. అయితే, కోర్టు ఆదేశాలతో ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య పోలీసులకు లొంగిపోయారు. కానీ, జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్(జేఎన్యూఎస్యూ) జనరల్ సెక్రటరీ రామ నాగా, అశుతోష్ కుమార్, అనంత్ ప్రకాశ్ మాత్రం పోలీసులకు లొంగిపోయేందుకు నిరాకరించారు. 'మేం ఎందుకు సరెండర్ కావాలి? మేం పోలీసులకు హాస్టల్ నెంబర్ ఇచ్చాం. రూమ్ నెంబర్, కాంటాక్ట్ వివరాలు కూడా ఇచ్చాం. మేం క్యాంపస్లోనే ఉన్నాం. నిర్ణయించుకోవాల్సింది పోలీసులే' అంటూ ప్రకాశ్ మీడియా సమావేశంలో చెప్పాడు. -
'ఎలుక దాడి' కేసులో లొంగిపోయిన నిందితులు
గుంటూరు లీగల్: సంచలనం సృష్టించిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల దాడి కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు సోమవారం కోర్టులో లొంగిపోయి అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. వివరాలు... విజయవాడకు చెందిన చావలి లక్ష్మి 2015 ఆగస్టు 17న విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు ఆరోగ్య సమస్య రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అదేరోజు రాత్రి 10.30 గంటలకు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జీజీహెచ్లో చికిత్స పొందుతుండగా అదే నెల 25న లక్ష్మి తన బిడ్డ ఎలుక కాటుకు గురైనట్లు గమనించి వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లింది. పరిశీలించిన వైద్యుడు గాయానికి ఆయింట్మెంట్ పూయమని చెప్పారు. తిరిగి 26వ తేదీ తెల్లవారుజామున తన బిడ్డ ఎలుక కాటుకు గురైన విషయాన్ని మరోసారి ఆస్పత్రి సిబ్బందికి తెలిపింది. అక్కడ ఉన్న సిబ్బంది గాయాలకు కట్టుకట్టారు కానీ, ఏవిధమైన చికిత్స అందించలేదు. అదేరోజు మద్యాహ్నం 2.45 గంటలకు బాలుడు మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తూ లక్ష్మి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి వార్డు స్టాఫ్నర్స్ జి జయజ్యోతి కుమారి, హెడ్నర్స్ సీహెచ్ విజయలక్ష్మి, స్టాఫ్నర్స్ వి.విజయలక్ష్మి, నర్సింగ్ సూపరింటెండెంట్ కె.పుష్పావతి, శానిటరీ ఇన్స్పెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు, కార్పెంటర్ చందోలు వెంకటప్పయ్య, ఇన్చార్చి ఆర్ఎంవో డాక్టర్ అనంత శ్రీనివాసులు నిందితులుగా పేర్కొన్నారు. వీరందరూ సోమవారం తమ న్యాయవాది కొమ్మా రమేష్ ద్వారా కోర్టులో లొంగిపోయారు. అనంతరం న్యాయమూర్తి కె.ప్రత్యూష కుమారి వీరందరికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ నెల15వ తేదీకి వాయిదా వేశారు. -
మావో నేత అశోక్ లొంగుబాటు
దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్న అశోక్ 1991లో సోదరుడు ఆజాద్ ప్రోద్బలంతో పీపుల్స్వార్లోకి.. అప్పట్నుంచీ పలు కమిటీల్లో కీలక పాత్ర వరంగల్ క్రైం: మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు మంగళవారం వరంగల్ డీఐజీ మల్లారెడ్డి ఎదుట లొంగిపోయారు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామానికి చెందిన అశోక్ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీలో పనిచేస్తున్నాడు. ఐదుగురు అన్నదమ్ముల్లో అశోక్ చిన్నవాడు. ఐటీఐ చదివిన ఈయన.. 18 ఏళ్ల ప్రాయంలోనే తన సోదరుడు గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ప్రోద్బలంతో 1991లో అప్పటి పీపుల్స్వార్ గ్రూపులో చేరాడు. తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న నేతృత్వంలో వరంగల్లో పనిచేశాడు. అనంతరం పాలకుర్తి, భూపాలపల్లి, స్టేషన్ఘన్పూర్ ఏరియూ కమిటీలతోపాటు రాష్ట్రంలోని పలు కమిటీలలో పని చేశాడు. 1996లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో అశోక్ కుడిచేతిలోని మూడు వేళ్లను కోల్పోయాడు. 2000లో వరంగల్ డివిజనల్ కమిటీ మెంబర్గా బాధ్యతలు చేపట్టాడు. తర్వాత పాలెం సుదర్శన్రెడ్డి అలియాస్ ఆర్కే, జంపన్న నేతృత్వంలో పనిచేశాడు. 2001 నుంచి 2006 వరకు కిషన్జీ భార్య సుజాతక్క నేతృత్వంలో పనిచేశాడు. 2008 నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాడు. అశోక్ సోదరుడు సారయ్య అలి యాస్ ఆజాద్ 2009లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోగా, మరో సోదరుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ ప్రస్తుతం ఆంధ్రా-ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అనారోగ్య కారణాల వల్లే: గాజర్ల అశోక్ అనారోగ్య కారణాలతోనే తాను లొంగి పోయినట్లు గాజర్ల అశోక్ తెలిపాడు. లొంగుబాటు వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఏడాదిగా ఆరోగ్యం సహకరించడం లేదని వివరించాడు. రిక్రూట్మెంట్ జరుగుతోంది: డీఐజీ మావోయిస్టుల రిక్రూట్మెంట్ జరుగుతోందన్న సమాచారం తమ వద్ద ఉందని వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి తెలిపారు. మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితులవుతున్న వారు పునరాలోచించుకోవాలని కోరారు. అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లు లొంగిపోతే పునరావాసం కల్పిస్తామన్నారు. -
మావోయిస్టునేత లొంగుబాటు
వరంగల్: మావోయిస్టు నేత గాజర్ల అశోక్ మంగళవారం వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి సమక్షంలో లొంగిపోయాడు. సీపీఐ మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా, దక్షిణ బాస్తర్ డివిజనల్ కమిటీలో పనిచేశాడు. అశోక్ పై 25 కేసులు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో అంతర్గత విభేదాలు, నాయకత్వ లోపాలు, మావోయిస్టు పార్టీకి ప్రజలలో వ్యతిరేకత పెరగడంతో అశోక్ లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. -
ఇదో పోలీసుల ‘లొంగుబాటు’ డ్రామా!
రాయ్పూర్: నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారంటూ పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం పెట్ట మరీ గర్వంగా చెప్పుకోగా, ఇది మావోయిస్టులకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో పోలీసులు సాధించిన ఘన విజయమంటూ కొన్ని జాతీయ వార్తా పత్రికలు డిసెంబర్ 9వ తేదీన ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. కానీ వాస్తవాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. లొంగిపోయిన 26 మందిలో ఎవరూ మావోయిస్టులు కాదు. కనీసం సానుభూతిపరులు కూడా లేరట. అదంతా పోలీసు ఉన్నతాధికారుల స్క్రీన్ ప్లే ప్రకారం జరిగిన హైడ్రామా అని తాజాగా మీడియా దర్యాప్తులో వెల్లడైంది. సుక్మా జిల్లాలోని చింతల్నార్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మెకానిక్ బుద్రుకు డిసెండర్ 8వ తేదీన దోర్నపాల్ పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా అంతకుముందు రోజు కబురొచ్చింది. తనపై 2010 నాటి పాత రేప్ కేసు ఒకటి పెండింగ్లో ఉండడంతో పోలీసుల ఆదేశం మేరకు 45 కిలోమీటర్ల దూరంలోని దోర్నపాల్ పోలీసు స్టేషన్కు బుద్రు వెళ్లాడు. అక్కడ పోలీసులు ‘మావోయిస్టుగా లొంగిపోతావా లేదా రేప్ కేసులో అరెస్ట్ చేయమంటావా?, పైగా మావోయిస్టుగా లొంగిపోతే పదివేల రూపాయల జీవన భృతి కూడా లభిస్తుంది’ అని బెదరించారు. అసహాయుడైన బుద్రు అలాగే చేశాడు. చింతల్నార్లోనే ఓ చిన్న వ్యాపారం చేసుకుంటున్న రమేశ్ అనే 24 ఏళ్ల యువకుడికి మావోయిస్టులు హత్య చేసినట్టుగా భావిస్తున్న ప్రత్యేక పోలీసు అధికారి నగేష్ హత్య కేసులో ఇరికిస్తామంటూ పోలీసులు ఫిక్స్ చేశారు. ఇక గోవింద్ అనే మరో షాప్ కీపర్ను ఇలాంటి ఆరోపణలతో ఠాణాకు పోలీసులు పిలిపించారు. ఎప్పడో గోవింద్ షాప్ ముందు నక్సలైట్లు ఓ వ్యక్తిని చంపిన కేసులో అతను ప్రత్యక్ష సాక్షి. అతనికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు. సాక్షిగా ఉన్న అతడు విచారణలో దోషిగా తేలాడని కేసు మారుస్తామంటూ పోలీసులు బెదిరించారు. చేసేదేమిలేక మావోయిస్టుగా లొంగిపోయేందుకు గోవింద్ కూడా అంగీకరించాడు. పోలీసుల ఆదేశం మేరకు బుద్రు, రమేశ్, గోవింద్లు డిసెంబర్ 8వ తేదీన దోర్నపాల్, చింతల్నార్ గ్రామాలకు మధ్యనున్న పోలంపల్లి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ 23 మంది యువకులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్లను కూడా ఇలాగే పాత కేసులు లేదా తప్పుడు కేసుల్లో ఇరికించినట్టు బుద్రు, రమేశ్, గోవింద్లకు తెలిసిపోయింది. బస్తర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఆర్పీ కల్లూరి, పోలీసు, పౌర ఉన్నతాధికారుల సమక్షంలో మావోయిస్టుల లొంగుబాటు డ్రామా రసవత్తరంగా నడిచింది. పోలీసులు ఎలా చెబితే అలా నడుచు కోవాల్సిన దారుణ పరిస్థితుల్లో తాము బతుకుతున్నామని, అందుకే ఈ లొంగుబాటు నాటకానికి లొంగిపోవాల్సి వచ్చిందని చింతల్నార్ వాసులు వాపోతున్నారు. నక్సల్స్ ఏరివేత పేరిట 2011లో భద్రతా దళాలు ప్రజల ఇళ్లను, దుకాణాలను తగులబెట్టినప్పటి నుంచి వారు మరీ భయపడుతున్నారు. 2010లో మావోయిస్టులు 76 మంది భద్రతా సిబ్బందిని కాల్చి చంపిన సంఘటను ప్రతీకారంగా భద్రతా సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ లొంగుబాటు నాటకం గురించి ఆ ఏరియా పోలీస్ సూపరింటెండెంట్ డీ. శ్రావణ్ వద్దకు తీసుకెళ్లగా ఏదీ నాటకం కాదని, అంతా వాస్తవమేనంటూ సమర్ధించుకున్నారు. కేవలం ఆయుధాలు పట్టుకున్న మావోయిస్టులే కాదని, మావోయిస్టు సానుభూతిపరులైన, మావోయిస్టు సిద్ధాంతపరమైన ఆలోచన కలిగివున్న వారు కూడా చట్టం ముందు నేరస్థులేనని ఆయన కొత్త సిద్ధాంతం చెప్పారు. పైగా మావోయిస్టులుగా లొంగిపోయిన వారికి పదివేల రూపాయలు అందజేశామని, ఇందిర ఆవాస్ యోజన పథకం కింద వాళ్లకు ఇళ్లు కూడా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు వాళ్లంతా ఇంటికెళ్లి హాయిగా ఉన్నారని, లేకపోతే ఈ పాటికి అరెస్టై జైళ్లలో ఊచలు లెక్కబెట్బేరాని వ్యాఖ్యానించారు. వారిపైన కేసులను ఎత్తివేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు కేసులు ఎత్తివేయడం కుదరదని, ఆ కేసుల పట్ల ఉదాసీన వైఖరిని అవలంబిస్తామని చెప్పారు. -
18 మంది మావోయిస్టుల లొంగుబాటు
అడవుల్లో పోలీసుల కదలికలు ఎక్కువవడంతో.. ప్రాణ రక్షణకోసం జన జీవన స్రవంతి కలిసి పోవాలని నిర్ణయించుకున్న 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తిస్గఢ్ రాష్ట్రంలోని కొండగావ్ పోలీస్స్టేషన్లో ఈ రోజు 18 మంది మావోలు లొంగిపోయారు. వీరిలో హేమచందర్ అనే మావోయిస్టు పేరిట రూ. 3 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారి పై పలు స్టేషన్లలో వందలాది కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
18 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని కొండగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో హేమచందర్ కూడా ఉన్నాడు. అతని పై ఇప్పటికే రూ. 3 లక్షల రివార్డు ఉంది. -
రేపిస్టును చంపేసి...లొంగిపోయింది
రాంచి: తనపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగుడిని హత్యచేసి అనంతరం పోలీసులకు లొంగిపోయిందో మహిళ. జార్ఖండ్ లోని రాంచిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు ఇళ్లల్లో పనిచేసుకుంటూ స్థానిక హౌసింగ్ సొసైటీలో నివసిస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన మనోజ్ కుమార్(24) ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో తన చేతికందిన సుత్తితో అతడి తలపై బలంగా కొట్టింది. ఆవేశంతో రగిలిపోయి అతడి మొహాన్ని ఛిద్రం చేసింది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఆ మరునాడు ఉదయం, డెడ్ బాడీని ఇంట్లోపెట్టి తాళం వేసి యధావిధిగా పనికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏమనుకుందో ఏమో తెలియదుగానీ, అదేరోజు అర్థరాత్రి స్థానిక పోలీసు స్టేషన్ లో లొంగి పోయింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను పోలీస్ కస్టడీకి తరలించారు. -
లొంగిపోనున్న న్యూడెమొక్రసీ దళ కమాండర్..!
ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంత న్యూడెమొక్రసీ దళ కమాండర్ జగన్ పోలీసుల ముందు లొంగిపోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. బయ్యారం ప్రాంతానికి చెందిన జగన్ మూడేళ్ల క్రితం పోరు బాట పట్టాడు. ఇతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి. బయ్యారం లేదా ఇల్లెందు పోలీసుల ముందు జగన్ లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. -
502మంది మావోయిస్టులు లొంగిపోయారు
నాగ్పూర్: మహారాష్ట్రలో 502మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం సానూకూల ఫలితాలను ఇస్తున్నట్లయింది. ఇప్పటి వరకు పదేళ్లలో 502మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో 482మంది నిత్యం మావోయిస్టుల అలజడి ఉండే గడ్చిరోలి ప్రాంతం నుంచే ఒంటరిగా పోలీసులకు సరెండర్ అయినట్లు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 29, 2005న నక్సల్ సరెండర్ పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీని ప్రారంభించిన తర్వాత లొంగిపోయిన తొలి మావోయిస్టు మదన్ అన్నా అలియాస్ బాలన్ బల్యా. కాగా ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టులకు వివిధ పరిశ్రమల్లో నైపుణ్య శిక్షణలు ఇప్పించడం ద్వారా, స్వయం ఉపాధి కల్పించడం ద్వారా పునరావాసం కల్పించారు. -
డ్రైవర్ లొంగి పోయాడు
-
నక్సల్ కమాండర్ లొంగుబాటు
కరీంనగర్ : మావోయిస్టు డిప్యూటీ దళ కమాండర్ లింగయ్య అలియాస్ మల్లేశ్ పోలీసులకు లొంగిపోయాడు. ఆరోగ్యప్రభుత్వం గతంలో అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డెవీస్ మాట్లాడుతూ లింగయ్యపై సుమారు 15 కేసులు ఉన్నాయని తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్కు పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అతని పేరు మీద ఉన్న రూ. లక్ష రివార్డును త్వరలోనే అతనికే అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా లింగయ్యపై ఛత్తీస్గఢ్లో ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యలతో పాటు తెలంగాణ రీ రీజయన్ పరిధిలోని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురు గ్రామస్తులను హత్య చేసిన కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. 2010 లో మావోయిస్టు గ్రూప్ చేరిన మల్లేష్, 2014 లో మహదేవ్పూర్ మండలం ఏటూరు నాగారం మావోయిస్టు డిప్యూటీ కమాండర్ పదవి చేపట్టాడు. అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతోనే లొంగిపోయినట్లు లింగయ్య పేర్కొన్నాడు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
పెదవాల్తేరు (విశాఖపట్నం) : ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులతోపాటు వారికి సహకరిస్తున్న మరో తొమ్మిదిమంది మిలీషియా సభ్యులు సోమవారం విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు. విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10 వేలు చొప్పున అందించారు. వారి ఉపాధికి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామన్నారు. లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులు పి.చిన్నారావు, జి.మల్లేశ్వరరావు ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు. -
ఓ రాజా లొంగుబాటు
చెన్నై : మాజీ ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రజా పనుల శాఖ మంత్రి ఓ పన్నీరు సెల్వం సోదరుడు ఓ రాజ కోర్టు లో లొంగి పోయారు. పూజారి ఆత్మహత్య కేసు విచారణానంతరం ఆయనకు బెయిల్ మంజూరైంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు శిక్ష నేపథ్యంలో రాష్ట్రం ఓ పన్నీరు సెల్వం సీఎం పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పన్నీరు సోదరుడు రాజ ఆగడాలకు హద్దేలేదన్న ఆ రోపణలు బయలు దేరాయి. అలాగే పెరియకుళం సమీపంలోని ఓ గ్రామం లో పూజారిగా ఉన్న నాగముత్తు ఆత్మహత్య చేసుకోవడం వివాదానికి దారి తీసింది. పన్నీరు బ్రదర్ రాజ అండ్ బృందం ఒత్తిళ్లు తాళలేక నాగముత్తు ఆత్మహత్య చేసుకున్నట్టుగా విచారణలో తేలింది. వ్యవహారం మదురై హైకోర్టుకు వెళ్లి అక్కడి నుంచి తేని జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు చేరింది. విచారణ బృందం రాజ, అక్కడి అన్నాడీఎంకే నాయకులు పాండి, మన్మారన్, శివకుమార్, జ్ఞాన లోగు, శరవణన్ తదితర ఏడు మందిపై కోర్టులో చార్జ్ షీట్ దాఖలైంది. విచారణకు రావాలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లకు నోటీసులు జారీ అయినా, ఖాతరు చేయలేదు. ఇక వారెంట్ల జారీ కాబోతుందన్న సమాచారంతో అన్నాడీఎంకే నేత పాండి మేల్కొన్నారు. రెండు రోజుల క్రితం కోర్టులో లొంగిపోయి, అనంతరం బెయిల్ తీసుకుని బయటకు వచ్చేశారు. రాజా లొంగుబాటు : పాండికి బెయిల్ లభించడంతో తనకూ వస్తుందన్న ఆశతో కోర్టులో లొంగి పోయేందుకు ఓ రాజ నిర్ణయించారు. అయితే, నాగముత్తు కేసులో ప్రధాని నిందితుడిగా ఆయన పేరు చేర్చి ఉండడంతో బెయిల్ లభించేనా అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో చడీ చప్పుడు కాకుండా కోర్టులో లొంగి పోయేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యవహారం మీడియా కంటపడకుండా అన్నాడీఎంకే వర్గాలు జాగ్రత్తలు పడ్డారు. బుధవారం రాజ కోర్టులో లొంగిపోయే సమయంలో పెరియకుళంలో పార్టీ నేతృత్వంలో భారీ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. దీంతో మీడియ వర్గాలంతా పెరియకుళంకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావిం చిన రాజ కోర్టు వెనుక ద్వారం గుండా లోనికి వెళ్లారు. న్యాయమూర్తి శివజ్ఞానం ఎదుట హాజరై ఈ కేసులో తాను లొంగి పోతున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఆయన్ను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నాగముత్తు ఆత్మహత్య వ్యవహారం విచారణ కాసేపు సాగినానంతరం తనకు బెయిల్ మం జూరు చేయాలని కోర్టుకు రాజ విన్నవించారు. బెయిల్ మంజూరులో జాప్యం నెలకొనడంతో ఉత్కంఠ నెల కొంది. ఎట్టకేలకు మధ్యాహ్నం భోజన విరామానంతరం రాజకు బెయిల్ లభించడంతో పన్నీరు సెల్వం మద్దతు శిబిరంలో ఆనందం వికసించింది. -
పోలీసుల ఎదుట లొంగిపోనున్న మిలీషియా సభ్యులు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోకు చెందిన 20 మంది మావోయిస్టు పార్టీకి చెందిన మిలీషియా సభ్యులు పోలీసులు ఉన్నతాధికారులు ఎదుట లొంగిపోనున్నారు. శనివారం ఉదయం 11.00 గంటలకు విశాఖ డీఐజీ ఎ.రవిచంద్ర, జిల్లా ఎస్పీ కొయ్య ప్రవీణ్ ఎదుట వారు లొంగిపోనున్నారు. లొంగిపోతున్న వారంతా జి.మాడుగుల మండలానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. -
దావుద్ లొంగిపోతానంటే వదిలేస్తామా?..
హైదరాబాద్ : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం లొంగబాటు గురించి ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను అప్పటి సీబీఐ చీఫ్ విజయ రామారావు తీవ్రంగా ఖండించారు. తాను సీబీఐ చీఫ్గా ఉన్నప్పుడు దావుద్కు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఆయన శనివారమిక్కడ స్పష్టం చేశారు. దావుద్ కోసం ఇప్పటికీ అనేక దేశాలు వెతుకుతున్నాయని లొంగిపోతానంటే వదిలేస్తామా అని విజయ రామారావు ప్రశ్నించారు. దావుద్ లొంగుబాటుపై అప్పట్లో తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అతని గురించి చాలా సమాచారం మాత్రం వచ్చిందని, అయితే లొంగుపోతానని దావుద్ ప్రతిపాదన చేయలేదన్నారు. తాను సీబీఐ చీఫ్గా ఉన్నప్పుడు దావుద్ కోసం దుబాయ్ సహా అనేక దేశాల్లో ఎంతో గాలించామని విజయ రామారావు తెలిపారు. దావుద్ సరెండర్ అవుతానన్న విషయం తనకు ఏ అధికారి చెప్పలేదని, ఏ సమాచారం ఇచ్చినా రికార్డు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా ముంబై వరుస పేలుళ్లు జరిగిన 15 నెలలకే ప్రధాన సూత్రదారి దావుద్ లొంగిపాతానని రాయబారం నడిపినట్టు నీరజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి సీబీఐ డీఐజీగా ఉన్న తనకు దావుద్ మూడుసార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు ఆయన చెప్పారు. భారత్ వస్తే ప్రత్యర్థులు తనని హతమారుస్తారెమోననే భయంతోనే దావుద్ లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు నీరజ్ తెలిపారు. కానీ అతను లొంగిపోతానన్న ప్రతిపాదనని అప్పటి సీబీఐ చీఫ్ విజయ రామారావు అంగీకరించలేదని అన్నారు. -
దావుద్ లొంగుతానంటే వదిలేస్తామా?
-
'దావుద్ ఎప్పుడో లొంగిపోతా అన్నాడు'..
-
'దావుద్ ఎప్పుడో లొంగిపోతా అన్నాడు'..
ముంబై: భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ సంచలన విషయాలను బయట పెట్టారు. ముంబై వరుస పేలుళ్లు జరిగిన 15 నెలలకే ప్రధాన సూత్రదారి దావుద్ లొంగిపాతానని రాయబారం నడిపినట్టు నీరజ్ తెలిపారు. అప్పటి సీబీఐ డీఐజీగా ఉన్న తనకు దావుద్ మూడుసార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు నీరజ్ కుమార్ చెప్పారు. భారత్ వస్తే ప్రత్యర్థులు తనని హతమారుస్తారెమోననే భయంతోనే దావుద్ లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు నీరజ్ తెలిపారు. కానీ అతను లొంగిపోతానన్న ప్రతిపాదనని సీబీఐ అంగీకరించలేదని చెప్పారు. భారత్ వచ్చి లొంగిపోతానని దావుద్, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానితోనూ రాయభారం సాగించారు. 2013లో ఢిల్లీ పోలీస్ కమిషనర్గా రిటైర్ అయిన నీరజ్ కుమార్ తన అనుభవాలను పుస్తకంలో రాయనున్నారు. మార్చి 12,1993న ముంబైలో జరిగిన పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మందికి పైగా గాయాలయ్యాయి. -
లొంగిపోయిన మావోయిస్ట్
విశాఖపట్నం : కోరుకొండ ఏరియా కమిటీలో డిప్యూటీ కమాండర్గా పనిచేసిన మావోయిస్ట్ నేత మల్లేష్ (40) శుక్రవారం విశాఖ రేంజ్ డీఐజీ ఎ.రవిచంద్ర ఎదుట లొంగిపోయారు. మల్లేష్ 41 కేసులలో నిందితుడుగా ఉన్నాడు. మల్లేష్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 లక్షల రివార్డు ప్రకటించింది. కాగా మల్లేష్ ఆరోగ్య సమస్యలతోనే లొంగిపోయినట్లు తెలుస్తోంది. -
సరెం‘డర్’
♦ విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించినా చార్జి మెమోలు జారీ ♦ ఉన్నతాధికారులను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు ♦ ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఉద్యోగుల్లో ఆందోళన విధి నిర్వహణలో తప్పులు చేస్తే ఏమాత్రం క్షమార్హం కాదు. అయితే విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన పాపానికి జిల్లా ఉన్నతాధికారి నుంచి మెమోలు.. సరెండర్ ఉత్తర్వులు అందుకోవాల్సిన దుస్థితి జిల్లాలోని ఉద్యోగులకు దాపురించింది. ఇప్పటికే చేయని నేరానికి వివిధ శాఖలకు చెందిన ముగ్గురు ఎస్ఈలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సరెండర్ కాగా, నలుగురు సిబ్బంది అకారణంగా ఛార్జి మెమోలు అందుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఉద్యోగులు వణుకుతున్నారు. సాక్షి ప్రతినిధి, కడప : ఇటీవల జిల్లాలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారని జీఎన్ఎస్ఎస్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈలను ఇరువుర్ని సరెండర్ చేస్తూ ఉత్తర్వులు అందాయి. గ్రీవెన్స్సెల్కు సక్రమంగా హాజరు కాలేదని ఆర్ అండ్ బి ఎస్ఈని సరెండర్ చేస్తూ ఉత్తర్వులు అందాయి. శాఖాపరంగా అవినీతి చోటుచేసుకుందని సంబంధంలేని వ్యవహారంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని సరెండర్ చేశారు.ఇలా ఒకరి తర్వాత మరొకరిపై వేటు పడటమనేది జిల్లాలో క్రమం తప్పకుండా జరుగుతోంది. దీంతో ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. చేయని తప్పుకు ఛార్జి మెమోలు... రిమ్స్ రేడియాలజీ విభాగానికి వివిధ పరికరాలు కొనుగోలు విషయమై రూ.15లక్షలు వెచ్చించాలని అందులో అడ్వాన్సు ట్యాక్స్ రూపేనా 90శాతం చెల్లించాలని గత నెల 19న కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. 20వతేదీన రిమ్స్ అధికారులు ఫైల్ సమర్పించాలని ఆదేశించారు. 21,22 తేదీలు సెలవులు వచ్చాయి. 23న ఫైల్ రాసి, 24న ఆమేరకు బిల్లులు చెల్లించారు. కలెక్టర్ ఉత్తర్వులు అందగానే 90శాతం అడ్వాన్సు బిల్లులు చెల్లించలేదని నాలుగురోజులు ఆలస్యం చేశారనే కారణంగా రిమ్స్ డీడీ, ఏఓ, సూపరింటెండెంటు, సీనియర్ అసిస్టెంట్లకు చార్జి మెమో జారీ చేశారు. చేయని నేరానికి రిమ్స్ ఉద్యోగులు శిక్ష అనుభవించారు. ఇంతవరకూ ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎప్పుడూ చవిచూడలేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. కలెక్టర్కు శృంగభంగం.... జెడ్పీ వ్యవహారంలో కలెక్టర్కు శృంగభంగం తప్పలేదు. ఎంపీడీఓల బదిలీల వ్యవహారంలో అవినీతి చోటుచేసుకుందని సీఈఓ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు. ఈ కారణంగా 26 మంది ఎంపీడీఓల బదిలీలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులపై జెడ్పీ చైర్మన్ గూడూరు రవి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ ఎంపీడీఓల బదిలీలు చెల్లుబాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దాంతో కలెక్టర్ చర్యలకు బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే ఇరువురు సరెండర్ అయినా జీఎన్ఎస్ఎస్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈలను అదే స్థానాలకు కేటాయిస్తూ ఆయా శాఖల ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. కడప ఆర్అండ్బి ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన నాలుగు మాసాల్లోపే వెంకటేశ్వరరావును సరెండర్ చేస్తూ ఉత్తర్వులివ్వడంపై ఉద్యోగవర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో వరుసగా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కారణంగా ప్రభుత్వం అభాసుపాలవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారి అందరినీ కలుపుకుని సమర్థవంతంగా యంత్రాంగాన్ని నడిపించాలని ఆ దిశగా చర్యలు ఉండాలని పలు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. -
లొంగిపోయిన దళ కమాండర్
కొత్తగూడెం :తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు దళ కమాండర్ లొంగిపోయినట్లు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ తెలిపారు. స్థానిక ఓఎస్డీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం టేకులూరు గ్రామానికి చెందిన శ్యామల ధర్మయ్య ఆలియాస్ ధర్మన్న(38) 2010వ సంవత్సరంలో మావోయిస్టు పార్టీ జాతీయ నాయకుడు సుఖ్దేవ్ ఆధ్వర్యంలో దళంలో చేరాడు. తొలుత దళ సభ్యుడిగా పనిచేసిన ధర్మన్న 2012 నుంచి 2013 వరకు సుఖ్దేవ్కు గన్మెన్గా వ్యవహరించాడు. 2014లో శబరి ఏరియా కమిటీ దళ సభ్యుడిగా పనిచేశాడు. 2014 జూన్ నుంచి 2015 జనవరి వరకు డిప్యూటీ దళ కమాండర్గా కొనసాగాడు. 2015 జనవరిలో చర్ల దళ కమాండర్గా నియమితుడయ్యాడు. చర్ల మండలం ఉయ్యాలమడుగు గ్రామంతోపాటు సమీపంలో తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని టేకులూరు గ్రామంలో మావోయిస్టు దళంలో చురుగ్గా పనిచేశాడు. ధర్మన్న కంచర్ల, కూరపల్లి, సింగం గ్రామాల్లోని టెలిఫోన్ ఎక్స్చేంజ్లను పేల్చివేసిన ఘటనల్లో పాల్గొన్నాడు. -
మహిళా మావోయిస్టు లొంగుబాటు
వరంగల్ : మావోయిస్టు పార్టీ పశ్చిమ బస్తర్ ఏరియా డివిజనల్ కమిటీ సభ్యురాలు నిమ్మల సారమ్మ అలియాస్ జ్యోతి అలియాస్ శారద బుధవారం వరంగల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా జనగామ మండలం షామీర్పేటకు చెందిన నిమ్మల సారమ్మ తన 12వ ఏటనే మావోయిస్టు పార్టీ సాహిత్యానికి ఆకర్షితురాలై 1990-91లో ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ దళం సభ్యురాలిగా చేరింది. ఏటూరునాగారం-గుండాల దళ సభ్యురాలిగా కూడా పనిచేసింది. పలు హత్యలు, పేలుళ్ల ఘటనల్లో నిందితురాలైన ఆమె బుధవారం వరంగల్ ఎస్పీ ఎదుట లొంగిపోయింది. పార్టీలో అంతర్గత విభేదాలు, అనారోగ్య సమస్యలే ఆమె లొంగుబాటుకు కారణమని తెలుస్తుంది. కాగా ఆమెపై ఉన్న రూ.5 లక్షల రివార్డును ఆమెకు అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. -
పోలీసుల అదుపులో అవినాష్ అనుచరులు
-
పోలీసుల అదుపులో అవినాష్ అనుచరులు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవినాష్ అనుచరులు రామకృష్ణ, వేణుగోపాల్లను కాకినాడ పోలీసులు శుక్రవారం కృష్ణాజిల్లా చిల్లకల్లు టోల్గేట్ వద్ద అరెస్ట్ చేశారు. కాగా అవినాష్ నిన్న డీజీపీ జేవీ రాములు ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో వీరిద్దరూ హైదరాబాద్ పరారవుతున్నట్లు సమాచారంతో కాకినాడ పోలీసులు వారిని చేజ్ చేసి పట్టుకున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అవినాష్ అనుచరులను మీడియా కంట పడకుండా చిల్లకల్లు నుంచి కాకినాడకు తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు లొంగిపోయిన అవినాష్ను నార్త్ కోస్టల్ ఐజీ అతుల్ సింగ్ ప్రత్యేక ఎస్కార్ట్తో తూర్పు గోదావరి జిల్లాకు పంపించారు. -
డీజీపీ ఆఫీసులో లొంగిపోయిన అవినాష్
ఉప ముఖ్యమంత్రితో సంబంధం లేదని వెల్లడి సాక్షి, హైదరాబాద్: హోం శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర గురువారం ఓ మీడియా చానల్ ద్వారా పోలీసులను ఆశ్రయించి డీజీపీ జేవీ రాముడు ముందు లొంగిపోయాడు. అతణ్ని నార్త్ కోస్టల్ ఐజీ అతుల్ సింగ్ ప్రత్యేక ఎస్కార్ట్తో తూర్పు గోదావరి జిల్లాకు పంపించారు. అవినాష్ ఓ బాధితుడిని గదిలో బంధించి, చిత్రహింసలకు గురి చేస్తున్న వీడి యో బహిర్గతమవడంతో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. అవినాష్పై పలు కేసులు నమోదు కావడం, అతని వ్యవహారం సంచలనం సృష్టించడంతో అరెస్టు చేయడం కోసం తూ.గో. జిల్లా అధికారులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డీజీపీ ఎదుట లొంగిపోవడానికి ముందు అవినాష్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఉప ముఖ్యమంత్రితో సంబంధాలు లేవని, కేవలం ఓ కార్యక్రమంలో అనుకోకుండా ఆయన పక్కన కూర్చున్నప్పుడు దిగిన ఫొటోనే మీడియాలో వచ్చిందన్నాడు. తాను ఉపముఖ్యమంత్రి పేరును ఎక్కడా వాడలేదని వివరించాడు. గతంలో తనకు సహాయం చేసిన ఓ మహిళా టీచర్ ద్వారా కొందరు కావాలనే వివాదంలోకి లాగారని అవినాష్ ఆరోపించాడు. రాష్ట్రంలో తాను నేతృత్వం వహిస్తున్న అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఢిల్లీలో ఉందని, దాని పూర్తి రికార్డులు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. మీడియాలో హల్చల్ సృష్టించిన ‘దాడి వీడియో’ రెండేళ్ల క్రితం నాటిదని చెప్పాడు. ఈ వ్యవహారానికి సంబంధించి పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్బాబు, ఎస్సై శివకృష్ణలకు ఉన్నతాధికారులు చార్జిమెమోలు జారీ చేశారు. -
డీజీపీ ఆఫీసులో లొంగిపోయిన అవినాష్
-
గన్మెన్ను సరెండర్ చేసిన ఎమ్మెల్యే!
సీఐని బదిలీ చేయలేదని కినుక పోలీసు శాఖను తాకిన టీడీపీ వర్గపోరు విశాఖపట్నం: జిల్లా పోలీసు శాఖలో టీడీపీ ప్రజాప్రతినిధుల పెత్తనం పతాకస్థాయికి చేరింది. టీడీపీలో వర్గపోరు సెగ జిల్లా పోలీసు శాఖకూ తగిలింది. తాము చెప్పినట్లుగా అధికారులను బదిలీ చేయకపోతే ఏకంగా పోలీసు ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేయడానికి కూడా ప్రజాప్రతినిధులు వెనుకాడటం లేదు. అందుకు తాజా నిదర్శనం యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు తన ఇద్దరు గన్మెన్ను పోలీసులకు సరెండర్ చేయడం. ఎమ్మెల్యే చెప్పినట్లుగా ఓ సీఐని బదిలీ చేయకపోవడమే ఇందుకు కారణం. సీఐని బదిలీ చేయమన్న ఎమ్మెల్యే యలమంచిలి సీఐ హెచ్.మల్లికార్జునరావును బదిలీ చేయాలని ఎమ్మెల్యే పంచకర్ల కొన్ని రోజుల క్రితం పోలీసు ఉన్నతాధికారులపై వత్తిడితెచ్చినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో పనిచేస్తూ తన రాజకీయ ప్రత్యర్థి, డెయిరీ చైర్మన్ అడారి తులసీరావుకు సీఐ సన్నిహితంగా ఉండటమే ఆయన ఆగ్రహానికి కారణం. దాంతో ఆయనను బదిలీ చేయాలని ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు గట్టిగా చెప్పారు. కానీ ఆయన మాట చెల్లుబాటు కాలేదు. సీఐని ఉన్నతాధికారులు బదిలీ చేయలేదు. సరైన కారణం లేకుండా అధికారులను బదిలీలు చేసుకుంటూపోతే పోలీసు శాఖ మనోస్థైర్యం దెబ్బతింటుందని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. మరోవైపు ఈ విషయాన్ని ఎమ్మెల్యే పంచకర్ల మంత్రి గంటా దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఆయన కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. దాంతో ఎమ్మెల్యే పంచకర్లలో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. భగ్గుమన్న ఎమ్మెల్యే తాను చెప్పిటన్లు సీఐని బదిలీ చేయకపోవడంపై ఎమ్మెల్యే పంచర్ల తీవ్రంగా స్పందించారు. తన మాట నెగ్గించుకునేందుకు ఆయన ఎదురుదాడికి దిగారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కల్పించిన ఇద్దరు గన్మెన్ తనకు అవసరం లేదని వారిద్దరిని సరెండర్ చేశారు. ఈమేరకు వారిని కొన్నిరోజుల క్రితం జిల్లా పోలీసు కార్యాలయానికి పంపించివేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కొన్నిరోజులుగా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఈలోగా ఎమ్మెల్యే పంచకర్లకు సర్దిచెప్పాలని భావించారు. కానీ తాను చెప్పినట్లుగా సీఐని బదిలీ చేయకుంటే ఇద్దరు గన్మెన్ సేవలను ఉపయోగించుకోనని ఎమ్మెల్యే కరాఖండిగా చెబుతున్నారు. ఈ పరిణామం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై జిల్లా పోలీసు అధికారులు ఇప్పటికే రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి సమాచారం అందించారు. ఈ వ్యవహారం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో చూడాల్సిందే. -
మావోయిస్టు దంపతుల లొంగుబాటు
బైరబోయిన భిక్షపతి(30) అలియాస్ కిరణ్, పడా రుక్మిణి(25) అలియాస్ సునీత అనే మావోయిస్టు దంపతులు వరంగల్ జిల్లా పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇద్దరూ దండకారణ్య దళ కమిటీ సభ్యులుగా పనిచేశారు. పీపుల్స్వార్ గ్రూపు దళ కమాండర్ పోలమ్ సుదర్శన్ రెడ్డి అలియాస్ ఆర్కే, భారతక్క, లతక్కల ప్రోత్సాహంతో 2001లో పరకాల దళంలో చేరారు. 2002లో భిక్షపతిని దళ సభ్యుడిగా గుర్తించిన ఆర్కే.. అతడిని తన గన్మాన్గా నియమించుకున్నారు. భిక్షపతి 2007లో లొంగిపోయి మళ్లీ 2008లో మావోయిస్టుల్లో చేరాడు. భిక్షపతిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. అతని భార్య రుక్మిణిపై చత్తీస్గఢ్ ప్రభుత్వం రూ. లక్ష రివార్డు ప్రకటించింది. మావోయిస్టు అధినాయకత్వం వైఖరి నచ్చకపోవడం వల్ల, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడినైన కారణంగా లొంగిపోతున్నట్లు బిక్షపతి ప్రకటించాడు. ప్రభుత్వం తక్షణ సాయం కింద లొంగిపోయిన మావోయిస్టులిద్దరికి చెరో రూ. 5వేలు సాయం అందించింది. -
ప్రియుడికి భార్యను అప్పగించిన భర్త
చెన్నై: వివాహం చేసుకున్న భార్యను కన్యాదానంగా ప్రియునికి ఇచ్చి భర్త వివాహం జరిపించాడు. తిరుచ్చి జిల్లా, తురైయూరు సమీపం ఉప్పిలియాపురం వద్ద ఓ గ్రామానికి చెందిన దేవి, తురైయూర్ యూనియన్లోని మరో గ్రామానికి చెందిన నందకుమార్ (26)కు పెళ్లి చేయూలని పెద్దలు నిశ్చరుుంచారు. 20 రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. బుధవారం ఉదయం వరుడి ఇంట్లో వీరిద్దరి వివాహం అట్టహాసంగా సాగింది. వరుని ఇంటికి వచ్చిన తర్వాత మొదటి రాత్రి దేవి... నందకుమార్ కాళ్లపైపడి భోరున విలపించింది. నందకుమార్ ఏమి జరిగిందని ఆమెను ప్రశ్నించాడు. నవ వధువు మాట్లాడుతూ తన ఊరికి చెందిన లారీ డ్రైవర్ను ప్రేమిస్తున్నానని, తల్లిదండ్రులు బలవంతంగా ఈ వివాహం జరిపించారని తెలిపింది. తనను అతనితో కలపాలని ప్రాథేయపడింది. నందకుమార్ తన భార్యను ప్రియుని చెంతకు చేర్చేందుకు నిర్ణయించాడు. ఆపై వేరే ప్రాంతానికి వెళ్లిన ప్రియున్ని రప్పించి దేవితో తురైయూరు పెరుమాల్ ఆలయంలో వివాహం జరిపించాడు. -
బైరెడ్డి రాజశేఖరరెడ్డి లొంగుబాటు
కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కోర్టులో లొంగిపోయారు. నందికొట్కూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సాయి ఈశ్వరుడు హత్య కేసులో నిందితుడిగా ఉన్న బైరెడ్డి సోమవారం కోర్టుకు హాజరై లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఆ క్రమంలోనే తాను లొంగిపోయినట్లు తెలిపాడు. తనకు సాయి ఈశ్వరరెడ్డి హత్య చేయాల్సిన అవసరం లేదని.. రాజకీయంగా దెబ్బతీయడానికే అక్రమ కేసులు బనాయించారని బైరెడ్డి సృష్టం చేశాడు. తన తండ్రి హత్య వెనుక బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి, మరికొందరు ఉన్నారంటూ మృతుని కుమారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ఏప్రిల్ నెలలో తనపై పోలీసులు నమోదు చేసిన తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతరం ఉత్తర్వులు ఇవ్వాలని బైరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే బైరెడ్డి పిటీషన్ ను హైకోర్టు నిరాకరించింది. అప్పట్నుంచీ అజ్ఞాతంలో ఉన్న బైరెడ్డి ఈరోజు కోర్టులో లొంగిపోయాడు. -
49మంది మావో'ఇష్టులు' లొంగుబాటు
రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. 49మంది మావోయిస్టు సానుభూతి పరులు శనివారం రంపచోడవరం ఏసీపీ విజయ రామరావు, ఓఎస్డీ శివశంకర్ ఎదుట లొంగిపోయారు. పోలీసుల కౌన్సెలింగ్ వల్లే వారు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు ప్రజల కోసం ఉన్నారని, సంఘ వ్యతిరేకశక్తులకు గ్రామీణులు ఆశ్రయం కల్పించవద్దని ఈ సందర్భంగా ఏసీపీ, ఓఎస్డీ సూచించారు. -
పెద్ద అవుటపల్లి నిందితుల లొంగుబాటు!
-
పెద్ద అవుటపల్లి నిందితుల లొంగుబాటు!
విజయవాడ: కృష్ణా జిల్లాలో పెద్ద అవుటపల్లి కాల్పుల ఘటనకు సంబంధించిన ఆరుగురు నిందితులు గన్నవరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. లొంగిపోయిన నిందితులను స్థానిక కోర్టులో హాజరు పరిచారు. ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల పెద అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల ఘటనలో గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు పగిడి మారయ్య, మారయ్యల హత్యకు గురైన సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్యే, కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు
-
ఎమ్మెల్యే, కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు
నంద్యాల:నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు పదకొండు మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. నంద్యాల పురపాలక సమావేశంలో ఘర్షణకు ప్రేరేపించి టీడీపీ కౌన్సిలర్లపై దాడికి పాల్పడ్డారని భూమాతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భూమాతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు చేయడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఆ సమావేశం సజావుగా సాగడం లేదని ప్రశ్నించినందుకు భూమాపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుట్టా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు. -
భూమా నాగిరెడ్డికి 15 రోజుల రిమాండ్
-
భూమా నాగిరెడ్డికి 15 రోజుల రిమాండ్
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి 15 రోజుల రిమాండ్ విధించారు. శనివారం సాయంత్రం భూమా నాగిరెడ్డిని నంద్యాలలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచారు. భూమాకు అనారోగ్యంగా ఉందని ఆయన తరపు న్యాయవాది పటిషన్ వేశారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. భూమా నాగిరెడ్డి శనివారం మధ్యాహ్నం పోలీసులకు లొంగిపోయారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణ ఎదుట ఆయన సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించి తాను లొంగిపోయినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎంతగానైనా పోరాడతానన్నారు. నంద్యాల మునిసిపల్ కార్యాలయంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆయనపై హత్యాయత్నం సహా మూడు కేసులు నమోదు అయ్యాయి. -
భూమా నాగిరెడ్డి లొంగుబాటు
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శనివారం లొంగిపోయారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణ ఎదుట ఆయన సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించి తాను లొంగిపోయినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎంతగానైనా పోరాడతానన్నారు. కాగా భూమా నాగిరెడ్డి వెంట వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు ఎస్వీ మోహన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జయరాం, గౌరు చరిత, ఐజయ్య, మణిగాంధీ డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. కర్నూలు మునిసిపల్ కార్యాలయంలో జరిగిన చిన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆయనపై హత్యాయత్నం సహా మూడు కేసులు నమోదు అయ్యాయి. -
కాసేపట్లో పోలీసుల ముందుకు భూమా నాగిరెడ్డి
-
చట్టాన్ని గౌరవించి లొంగిపోతున్నా: భూమా నాగిరెడ్డి
ప్రజల శ్రేయస్సు కోసం ఎన్ని కేసులనైనా తాను భరిస్తానని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. చట్టాన్ని గౌరవించి తాను పోలీసులకు లొంగిపోతున్నట్లు ఆయన తన అనుచరులకు చెప్పారు. కర్నూలు మునిసిపల్ కార్యాలయంలో జరిగిన చిన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. భూమా ఇంటిచుట్టూ భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆయన లొంగిపోనున్నట్లు చెప్పడంతో.. నంద్యాలకు భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ తదితరులు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయ సాయిరెడ్డి కూడా కాసేపట్లో నంద్యాలకు చేరుకుంటారు. -
8 మంది మావోయిస్టులు లొంగుబాటు
రాయ్పూర్: చత్తీస్గఢ్లో ఎనిమిదిమంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఓ డిప్యూటీ కమాండర్ ఉన్నాడు. వీరందరిపైనా నగదు రివార్డులున్నాయి. మావోయిస్టులు నారాయణపూర్ జిల్లాలో లొంగిపోయారని పోలీసులు తెలిపారు. డిప్యూటీ కమాండర్పై మూడు లక్షలు, ఇతర మావోయిస్టులపై తలా లక్ష రూపాయల రివార్డు ఉంది. -
గుండెజబ్బుతో.. లొంగుబాటుకు సిద్ధమైన అసాంజ్
పలు దేశాలకు చెందిన అధికారిక రహస్యాలను బట్టబయలు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ గుండెజబ్బుతో బాధపడుతున్నారు. దాంతో ఆయన లొంగిపోయేందుకు సిద్ధం అవుతున్నారు. చాలా కాలంగా లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న ఆయన.. అనారోగ్యం కారణంగానే బయటకు వచ్చేందుకు సిద్ధపడ్డారు. తన మీద ఎలాంటి ఆరోపణలు లేవని, తాను ఈక్వెడార్ రాయబార కార్యాలయం నుంచి త్వరలోనే బయటకు వస్తానని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. దాంతో అసాంజ్ లొంగిపోతారన్న ఉద్దేశంతో రాయబార కార్యాలయం ఎదుట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గత రెండేళ్లుగా ఆయన అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అసాంజ్ (43)కి గుండెజబ్బుతో పాటు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య కూడా మొదలైంది. అయితే.. బయటకు వస్తే పోలీసులు అరెస్టు చేస్తారన్న కారణంతో ఇంతవరకు ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. ప్రధానంగా విటమిన్ డి లోపం వల్లనే అసాంజ్ ఈ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండేళ్లుగా సూర్యరశ్మి సోకకపోవడం వల్లే డి విటమిన్ లోపం బాగా ఎక్కువైంది. దాంతో ఆయనకు ఆస్థమా, మధుమేహం, ఎముకలు బలహీనం కావడం, చివరకు మతిమరుపు కూడా వచ్చాయని అంటున్నారు. అసాంజ్ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనప్పుడు లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్ ఒక్కటి మాత్రమే ఆయనకు ఆశ్రయం ఇవ్వడానికి 202 ఆగస్టులో ముందుకొచ్చింది. ఓ లైంగిక దాడి కేసులో అసాంజ్ను ప్రశ్నించేందుకు ఆయనపై యూరోపియన్ అరెస్టు వారెంటు ఒకటి జారీ అయింది. దాంతో ఆయనను స్వీడన్కు నేరగాళ్ల అప్పగింత ఒప్పందంపై పంపాలని బ్రిటన్ భావిస్తోంది. స్వీడన్ నుంచి తనను అమెరికాకు పంపుతారని స్వతహాగా ఆస్ట్రేలియాకు చెందినర అసాంజ్ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ అమెరికాకు పంపితే, అక్కడి అధికారిక రహస్యాలను బయటపెట్టినందుకు ఆయనకు 35 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది. -
పోరుబాట వీడిన చంబాల రవీందర్
డీజీపీ ఎదుట లొంగుబాటు 24 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి తెర అనారోగ్యంతోనే బయటికి.. కుటుంబ సభ్యుల్లో వెల్లివిరిసిన ఆనందం జఫర్గఢ్/వరంగల్క్రైం : సుదీర్ఘ కాలంగా విప్లవోద్యమంలో పని చేస్తున్న జిల్లాకు చెంది న ప్రముఖ మావోయిస్టు నేత కుక్కల రవీందర్ అలియూస్ చంబాల రవీందర్ తన భార్యతో సహ పోలీసుల ఎదుట శుక్రవారం లొంగిపోయూరు. కుమారుడి లొంగుబాటు గురించి తెలియగానే ఆయన తల్లి, సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో రవీందర్ లొంగిపోయినట్లు తెలిసింది. మండలంలోని తమ్మడపల్లి(ఐ) గ్రామానికి చెందిన చంబాల సాయిలు, నర్సమ్మ దంపతులకు నలుగురు కుమారులు. అందరిలో చిన్నవాడైన రవీందర్ ఇదే మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక సహకార సొసైటీలో వాచ్మన్గా ఏడాదిపాటు పని చేశాడు. ఈ క్రమంలో అతడికి వివాహమైంది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఆయన పీపుల్స్వార్లో పనిచేస్తున్నట్లు తెలియడంతో వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. రెండు నెలలు జైలులో ఉండి ఇంటికి వచ్చిన ఆయనపై గ్రామస్తులు పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో విసుగు చెంది 1990లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆయన తిరిగి రాకపోవడంతో నాలుగేళ్ల తర్వాత భార్య విడాకులు ఇచ్చి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత తిరిగి ఆయన ఒక్కసారి కూడా ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు. పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన రవీందర్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఆంధ్రా- ఒరిస్సా బార్డర్లో స్పెషల్ జోనల్ కమిటీ ప్రొటెక్షన్ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనపై ప్రభుత్వం రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. ఆలస్యంగా పోలీస్ రికార్డుల్లోకి.. రవీందర్ అజ్ఞాతంలోకి వెళ్లిన కొన్నేళ్ల తర్వాత పోలీసులు ఈ విషయూన్ని గుర్తించారు. అతడు అజ్ఞాతంలో ఉన్నట్లు అక్టోబర్ 29, 1998లో పోలీస్ రికార్డుల్లో నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు తరచూ తమ్మడపల్లి(ఐ) గ్రామానికి వెళ్లి రవీందర్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులను శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్లకు గురిచేశారు. ఈ బాధ భరించలేక అతడి సోదరులు కొన్నేళ్లపాటు ఊరు విడిచి వెళ్లారు. కుటుంబ సభ్యులను పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రవీం దర్ మాత్రం లొంగిపోలేదు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇల్లు శిథిలవస్థకు చేరుకుని, చుట్టూ ముళ్ల కంపలు పెరిగాయి. ప్రస్తుతం రవీందర్ పెద్ద అన్న గ్రామంలోనే మరో ఇల్లు నిర్మించుకొని తల్లితో కలిసి నివసిస్తున్నాడు. తమ్మడపల్లి(ఐ)లో హర్షాతిరేకాలు.. రవీందర్ లొంగిపోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు రడపాక ఎల్లయ్య, మునిగల సామేల్ మాట్లాడుతూ పోలీసులు ఎలాంటి కేసులు పెట్టకుండా ప్రశాంతంగా గ్రామంలో జీవించేలా చూడాలని కోరారు. -
భార్య, బిడ్డను దారుణంగా హతమార్చాడు
అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య, రక్తం పంచుకు చిన్నారిని దారుణంగా హతమార్చాడో భర్త. కుటుంబ కలహాల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు. -
డబ్బు ఇవ్వలేదని ప్రియురాలి కూతురి హత్య
-
డబ్బు ఇవ్వలేదని ప్రియురాలి కూతురి హత్య
హైదరాబాద్ : అడిగినంత డబ్బు ఇవ్వలేదని ప్రియురాలి కూతురిని చంపేశాడో కిరాతకుడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన సయ్యద్ ఆరీఫ్ అలియాస్ బాబు (25) హఫీజ్బాబానగర్లోని అల్తాఫ్ యూనాని క్లినిక్లో పని చేసేవాడు. ఈ క్రమంలో ఇతనికి సైదాబాద్ రెడ్డిబస్తీలో ఉంటూ హోటళ్లలో పని చేస్తున్న కవిత పరిచయమైంది. ఈమె భర్త మద్యానికి బానిస కావడంతో ఐదేళ్ల క్రితం వదిలేసింది. వీరికి కూతురు పుష్ప(10) ఉంది. కాగా కవిత, ఆరీఫ్తో కలిసి రెడ్డిబస్తీలో మూడేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆరీఫ్ కూడా తాగుడుకు బానిసకావడంతో పని మానేసి ఖాళీగా ఉంటున్నాడు. రోజూ పూటుగా తాగి వచ్చి డబ్బుల కోసం కవితను కొట్టడం మొదలు పెట్టాడు. ఈనెల 15న రాత్రి పీకలదాక మద్యం తాగి ఇంటికి వచ్చి కవితను చితకబాదాడు. ఇతని వేధింపులు భరించలేక కవిత మరుసటి రోజు రంగారెడ్డిజిల్లాలోని తన పుట్టింటికి వెళ్లింది. ఎప్పటిలాగే కూతురు పుష్పను ఇక్కడే వదిలి వెళ్లింది. ఆరీఫ్ రోజూ పుట్టింటిలో ఉన్న కవితకు ఫోన్ చేసి డబ్బులు తెమ్మని, లేకపోతే నీ కూతుర్ని చంపుతానని బెదిరించాడు. ఈ క్రమంలో అన్నంత పని చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న పుష్పను మెడకు చున్నీతో ఉరి వేసి చంపేశాడు. కవిత సైదాబాద్కు వచ్చి ఆరీఫ్కు రూ. 700 ఇచ్చి మళ్లీ పుట్టింటికి వెళ్తుండగా.. నీ కూతురిని చంపేశానని, ఇంటికి వెళ్లి చూడమని ఫోన్ చేసి చెప్పాడు. అయినా కవిత అతని మాటలు నమ్మలేదు. దీంతో అతడు నేరుగా సైదాబాద్ పోలీస్స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. పోలీసులు కవితకు ఫోన్ చేసి నీ కూతురు చనిపోయిందని చెప్పగా.. ఆమె ఇంటికి వచ్చి విగతజీవురాలై పడి ఉన్న కూతుర్ని చూసి బోరుమంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను కత్తిపీటతో నరికి చంపిన భార్య
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నాగార్జున కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను... భార్య దారుణంగా కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భర్తను కత్తిపీటతో నరికి చంపిన ఆమె అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. భర్త వేధింపులు తాళలేక ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితురాలు తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇద్దరు మావోయిస్టు నేతల లొంగుబాటు
వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు వెల్లడి వరంగల్, న్యూస్లైన్: మావోయిస్టు పార్టీలో ఏరియా కమిటీ సభ్యులిద్దరు శనివారం లొంగిపోయినట్లు వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు రంగారావు తెలిపారు. వీరిలో వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముప్పానపల్లికి చెందిన పాపారావు అలియాస్ రంజిత్, గూడూరు మండలం సీతానాగారం గ్రామానికి చెందిన ఎదుళ్ల భాస్కర్రెడ్డి అలియూస్ రామకృష్ణ ఉన్నారు. పాపారావు ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా, భాస్కర్రెడ్డి గుండాల-నర్సంపేట ఏరియా దళ సభ్యుడిగా పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. కాగా, పాపారావు కమలాపురంలోని బిల్ట్ జీఎం హత్య కేసుతోపాటు ఇంకా పలు కేసుల్లో నిందితుడని చెప్పారు. చుండూరు నిందితులకు శిక్ష తప్పదు ఓ టీవీ చానల్లో మావోల పేరుతో హెచ్చరిక గుంటూరు, న్యూస్లైన్: చుండూరులో దళితుల ఊచకోతకు పాల్పడిన నిందితులు కోర్టు నుంచి తప్పించుకున్నప్పటికీ.. ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదంటూ మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్ పేరుతో ఓ టీవీ చానల్లో శనివారం వెలువడిన ప్రకటన కలకలం సృష్టించింది. నిందితులను కారంచేడు తరహాలో శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై ఆరా తీస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ర్పచారం చేస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత మీడియా ప్రతినిధికి పోలీసులు ఫోన్ చేసి వివరాలడిగి తెలుసుకున్నట్టు సమాచారం. -
పోలీసుస్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే లొంగుబాటు
‘పచ్చ’నోట్లు పట్టుబడిన కేసులో విజయరమణారావుకు బెయిల్ హైదరాబాద్, ‘పచ్చ’నోట్ల కట్టలు పట్టుబడిన కేసులో నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారావు మంగళవారం బొల్లారం పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. 12 రోజుల నుంచి పరారీలో ఉన్న ఆయన తె ల్లవారుజాము 5.30 గంటలకు పీఎస్లో ప్రత్యక్షమయ్యారు. లొంగిపోయిన గంటలోపే విజయరమణారావు బెయిల్ పొందారు. ఆ తర్వాత ఎవరి కంటపడకుండా పెద్దపల్లికి వె ళ్లిపోయారు. ఇదే కేసులో మరో నిందితుడు నాగరాజు మంగళవారం సికింద్రాబాద్ కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 10న బొల్లారం సమీపంలో ఎన్నికల అధికారులు కరీంనగర్ బస్సులో తనిఖీ చేస్తుండగా కోరుట్లకు చెందిన రాజమౌళి రూ. 89.87 లక్షల నగదు, టీడీపీ స్టిక్కర్లు ఉన్న బ్యాగుతో పట్టుపబడిన సంగతి తెలిసిందే. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఎమ్మెల్యే విజయరమణారావు పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ నగదును విజయరమణారావు ఆదేశంతో బేగంపేట్ వద్ద నాగరాజు నుంచి తీసుకుని కరీంనగర్ టీడీపీ కార్యాలయానికి తీసుకువెళుతున్నట్లు రాజమౌళి పోలీసులకు వివరించారు.ఈ కేసులో పోలీసులు నిందితులపై సెక్షన్లు 171(ఈ), 171(బి), 41, 102లను నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ఎమ్మెల్యే స్టేషన్లో లొంగిపోగా, నాగరాజు కోర్టులో లొంగిపోయారు.అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే: విజయరమణారావు ఎప్పుడు లొంగిపోయేదీ తెలుసుకున్న బొల్లారం పోలీసులు ముందస్తుగానే బెయిల్ పత్రాలు సిద్ధం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అతను తెల్లవారుజామున 5.30 గంటలకు స్టేషన్కు చేరుకునే సరికి ఇన్స్పెక్టర్తో సహా స్టాఫ్ రెడీగా ఉన్నారు. అతను స్టేషన్కు చేరుకున్న గంట లోపే ష్యూరిటీలను సమర్పించి 7 గంటల కల్లా పెద్దపల్లికి బయలుదేరిన విధానం పోలీసుల తీరును ప్రశ్నిస్తోంది. -
పుత్తూరులో పూర్తయిన ఆక్టోపస్ ఆపరేషన్
-
పుత్తూరులో మహిళ, ఇద్దరు చిన్నారుల లొంగుబాటు
చిత్తూరు: పుత్తూరు ఘటనలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు లొంగిపోయారు. పుత్తూరు ఇంట్లో దాక్కున్నవారంతా అల్-ఉమ ఉగ్రవాదులేనని తేలింది. పుత్తూరులో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ఇంట్లో మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చెన్నై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అరెస్ట్ చేసిన అల్-ఉమ సంస్థకు చెందిన ఫకృద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పుత్తూరులో దాడులు నిర్వహించారు. దుండగులు ఇంట్లోనే ఉండి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న పోలీసులపై దాడి చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఒక కానిస్టేబుల్ మరణించినట్లు సమాచారం. సీఐ లక్ష్మణ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా యావత్తు బెంబేలెత్తిపోతోంది. పుత్తూరులో ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తమిళనాడు పోలీసులు, స్థానిక పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. తనిఖీలు చేపట్టిన పోలీసులపై దుండగులు కత్తి, రాళ్లతో దాడి చేశారు. కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. ఇది స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. చిత్తూరు జిల్లా ఎస్పీ కాంతిరాణా, తమిళనాడు ఎస్ఐబీ ఎస్పీ, తిరువళ్లూరు ఎస్పీలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వివరాలు తెలుసుకున్న డీజీపీ బి. ప్రసాదరావు వెంటనే పుత్తూరుకు ఆక్టోపస్ బలగాలను తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అటు... ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులను అల్-ఉమా సంస్థకు చెందిన అబూ బకర్, ఫక్రుద్దీన్ అహ్మద్, బిలాల్గా అనుమానిస్తున్నారు. శుక్రవారం చెన్నై పోలీసులు ఫక్రుద్దీన్ అహ్మద్ను అరెస్టు చేశారు. ఫక్రుద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు గత రాత్రి పుత్తూరు చేరుకున్న తమిళనాడు పోలీసులు, స్థానిక సీఐ సాయంతో ఆపేరషన్ చేపట్టినట్లు సమాచారం. ఈ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు.... ఆర్ఎస్ఎస్, బీజేపీ, భజరంగ్దళ్ నేతలు లక్ష్యంగా పలుసార్లు హత్యప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ నేత రమేష్ను హత్య చేశారు. గత 18 నెలల్లో హిందూ సంస్థలకు చెందిన 16 మందిని అల్-ఉమా ఉగ్రవాదులు హతమార్చినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. తమిళనాడు బీజేపీ నేత రమేష్ హత్యకేసు నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 2011లో బీజేపీ అగ్రనేత అద్వానీని హతమార్చేందుకు కూడా కుట్ర చేశారు. అద్వానీ మధురై పర్యటన సందర్భంగా అల్-ఉమ సభ్యులు బాంబు పేల్చేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. బెంగళూరు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడిలో ఈ సంస్థ పాత్ర ఉంది. అలాగే కోయంబత్తూరు వరుస పేలుళ్లు జరిగింది కూడా అల్-ఉమ పనేనని పోలీసులు చెబుతున్నారు. -
ప్రాజెక్ట్ విభాగం సీఈ సరెండర్
వరంగల్, న్యూస్లైన్ : ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాల యంలో తొలిసారిగా ఓ సీఈ స్థాయి అధికారిపై వేటు పడింది. పని తీరు సరిగా లేదనే కారణంగా ఆయనను సరెండర్ చేస్తూ సీఎండీ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు డీఈ స్థాయి వరకే పరిమితమైన చర్యలు... ఇప్పుడు చీఫ్ ఇంజి నీర్ల వరకూ చేరుకోవడం ఆ సంస్థలో కల కలం రేపుతోంది. విద్యుత్ భవన్లో ప్రాజెక్టు విభాగం సీఈగా సురేందర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో ఫర్చేసింగ్ విభాగంలో సీఈగా పని చేశారు. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎండీ ప్రశ్నలకు సీఈ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. పలు నివేదికలు ఇవ్వడంలో జాప్యం సైతం జాప్యం చేసినట్లు సమాచారం. దీంతో ఆయనపై సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా.. విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని, పనితీరు సరిగా లేదనే కారణంగా సీఎండీ పేషీకి సరెండర్ చేస్తూ సీఎండీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలు ఆరోపణలు, విధుల నిర్లక్ష్యంపై కింది స్థాయి ఉద్యోగులపై వేటు పడుతున్న విషయం విదితమే. కానీ... డిస్కంలో ఎన్నడూ లేని విధంగా సీఈని సరెండర్ చేయడం హాట్ టాపిక్గా మారింది. అరుుతే మరో కొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్న సురేందర్... సరెండర్ కావడంపై మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. మరో ఎనిమిది నెలల సర్వీసు ఉండగా... దీర్ఘకాలిక సెలవులో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా... సీఈ స్థాయి అధికారులపై ఇలా సరెండర్ చర్యలు తీసుకోవడం సరికాదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. -
ఒరిస్సాలో 8 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఒరిస్సాలోని ఎనిమిది మంది మావోయిస్టులు బుధవారం మల్కాన్గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. అయితే ఆ మావోయిస్టులందరిది మల్కాన్గిరి జిల్లాలోని అత్యంత మారుమూలప్రాంతమైన చిత్రకొండ ప్రాంతమని జిల్లా ఎస్పీ వివరించారు. 2009 నుంచి వారు మావోయిస్టు కార్యకలపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. మొత్తం ఎనిమిది మంది మావోయిస్టుల్లో ముగ్గురు ఏరియా దళ కామాండర్లుగా ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... తామంతా జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.