
ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్స్లలో ఒకరైను సుకుమార్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

సుకుమార్ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా, రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో జన్మించారు.

కాకినాడలోని ఆదిత్య కళాశాలలో గణితం అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చినా తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి ఇండిస్ట్రీ వైపు అడుగులు పడేలా చేసింది.

సినీ రంగంపై ఉన్న ఆసక్తితో తన తండ్రితో మాట్లాడి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పని చేశారు.

చిరంజీవి హిట్ సినిమా బావగారు బాగున్నారా సినిమా కోసం రైటింగ్ విభాగంలో ఆయన తొలిసారి పనిచేశారు.

రచయితగా తన కెరీర్ ప్రారంభించినప్పటికీ 2004 సంత్సరంలో ఆర్య సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు.

సుకుమార్ ఇప్పటి వరకు డైరెక్షన్ చేసిన సినిమాలు తొమ్మిది.. ప్రతి సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని ఫ్యాన్స్ అంటుంటారు.

రంగస్థలం , పుష్ప చిత్రాలకు గాను ఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డ్స్ అందుకున్నారు.

ఆర్య సినిమాకు ఉత్తమ స్క్రీన్ప్లే అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది.

సుకుమార్ రైటింగ్స్ పేరుతో కుమారి21F, ఉప్పెన,విరూపాక్ష వంటి చిత్రాలను ఆయన నిర్మించారు.

పుష్ప సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందిన సుకుమార్.. ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు.

రామ్ చరణ్తో సుకుమార్ ఒక సినిమా ఇప్పటికే ప్రకటించారు. అందుకు సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.