
హిందీ బుల్లితెర నటి తన్వీ మల్హారా పెళ్లి పీటలెక్కింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ ప్రతమ్ మెహతాను పెళ్లాడింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇందులో ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ప్రతమ్తో ఫస్ట్ డేట్కు వెళ్లినప్పుడు తనకో పని చెప్పాను.

నన్ను కలిసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటో 500 పదాల్లో వర్ణించాలన్నాను. కానీ ఇంతవరకు అది రాయనేలేదు. ఇన్నాళ్ల తర్వాత ఆ లెటర్ రాయడం పూర్తి చేస్తానని మాటిచ్చాడు అంది.

అక్కడితో వదిలేయలేదు. పెళ్లికూతురిగా ముస్తాబవుతున్నప్పుడు కూడా ప్రతమ్కు ఫోన్ చేసి నాతో కొత్త జీవితం ప్రారంభించడం గురించి లెటర్ రాశావా? లేదా? అని ఆరా తీసింది.

ఇంతలా అడుగుతుంటే చేయక తప్పుతుందా? అనుకున్నాడో ఏమో కానీ పెళ్లిమండపానికి వెళ్లే కొన్ని క్షణాల ముందు తన మనసులోని భావాల్ని అక్షరాలుగా మలిచి ఆ లేఖను కాబోయే భార్యకు అందించాడు.

అది చూసి తెగ సంబరపడిపోయింది తన్వీ. మండపంలోనూ సంతోషం తట్టుకోలేక ఆనందభాష్పాలు కార్చింది.

కాగా తన్వీ మల్హారా ముస్కురానే కీ వాజా తుమ్ హో సీరియల్తో ఫేమసైంది. వేద చిత్రంలోనూ నటించగా దిల్ దోస్తీ డైలమా వెబ్ సిరీస్లోనూ తళుక్కుమని మెరిసింది.





