tv actress
-
సాఫ్ట్వేర్ ఇంజినీర్ను పెళ్లాడిన టాలీవుడ్ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి మాన్షి జోషి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవ్ను పెళ్లాడింది. బెంగళూరులోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాన్షికి అభినందనలు చెబుతున్నారు.కన్నడలో పలు సీరియల్స్లో నటించిన మాన్షి జోషి.. తెలుగులో దేవత అనే సీరియల్లో కనిపించింది. ఈ సీరియల్లో అర్జున్ అంబటి, చంటిగాడు హీరోయిన్ సుహాసిని కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా కన్నడలో పారు సీరియల్తో ఫేమ్ తెచ్చుకుంది. రాధ రమణ, అంబుదాన్ ఖుషీ, గీతాంజలి, రాధ రాఘవ్ లాంటి సీరియల్స్తో మెప్పించింది. -
నటుడు చేసిన పనికి ఏడ్చేసిన అత్త.. గ్రేట్ అంటూ ప్రశంసలు!
బుల్లితెర నటుడు షోయబ్ ఇబ్రహీం (Shoaib Ibrahim) చేసిన పనికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత మంచి భర్త దొరికిన ఆ ఇల్లాలు ఎంతటి అదృష్టవంతురాలంటూ నటి దీపిక కకర్ను (Dipika Kakar) మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరీ షోయబ్? అందరూ మెచ్చేలా ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే! షోయబ్ ఇబ్రహీం బుల్లితెర నటుడు. రెహ్నా హై తేరీ పాల్కన్ కీ ఛావో మే సీరియల్తో తన ప్రయాణం ప్రారంభించాడు. 'సాసురాల్ సిమర్ కా' ధారావాహికలో ప్రధాన పాత్ర పోషించి మెప్పించాడు. ఇందులో యాక్ట్ చేసిన నటి దీపికతో ప్రేమలోనూ పడ్డాడు. ఆమెతో కలిసి నాచ్ బలియే ఎనిమిదో సీజన్లో పార్టిసిపేట్ చేశాడు. షోయబ్ నటించిన ఏకైక మూవీ బెటాలియన్ 609. 2018లో దీపిక- షోయబ్ పెళ్లి జరిగింది. వీరికి 2023లో బాబు రుహాన్ పుట్టాడు. ఇదీ ఆయన పర్సనల్ స్టోరీ.ఇంతకీ షోయబ్ ఏం చేశాడంటే?పెళ్లయ్యాక అమ్మాయిలకు అత్తారిల్లే సర్వస్వం అంటారు. కానీ అదే మాట అబ్బాయి చెప్తే ఎలా ఉంటుంది? సర్వస్వం అని కాకపోయినా తన భార్య పుట్టిల్లు బాధ్యత కూడా భుజాన వేసుకుంటే ఎలా ఉంటుంది? అదే పని చేశాడు షోయబ్. అత్తగారికి ఇల్లు కొనిచ్చాడు. ఎప్పుడూ మాకోసమే ఆలోచించే తన కోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఇంటిని బహుమతిగా ఇచ్చానంటున్నాడు. భర్త చేసిన పనికి దీపిక సంతోషంతో ఉప్పొంగిపోతోంది.తన యూట్యూబ్ ఛానల్లో దీపిక మాట్లాడుతూ.. జీవితంలో అతి పెద్ద వరం ఏంటో తెలుసా? ఇల్లు. నువ్వు నీ తల్లి కోసం ఇదివరకే ఇంటిని బహుమతిగా ఇచ్చావు. ఇప్పుడు నీ అత్తగారికి ఇంటిని వరంగా అందించావు అని ఎమోషనలైంది. కొత్తింటి పత్రాలను షోయబ్ దంపతులు.. దీపిక తల్లికి అందించారు. వాటిని చేతిలోకి తీసుకున్న ఆమె సొంత కుటుంబం తనకు ఏదీ ఇవ్వకపోయినా నా కూతురు దీపిక ఫ్యామిలీ మాత్రం నాకు ఎన్నో చేస్తోంది అంటూ సంతోషంతో ఏడ్చేసింది.చదవండి: Chhaava OTT Release : ఓటీటీలోకి ‘ఛావా’.. ఎప్పుడు, ఎక్కడ? -
తెలుగు బుల్లితెర నటి విష్ణు ప్రియ పెళ్లి రోజు (ఫోటోలు)
-
ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సీతారామ' సీరియల్ ఫేమ్ మేఘనా శంకరప్ప కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. తన ప్రియుడు జయంత్తో ఏడడుగులు వేసింది. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన వధూవరులకు అభినందనలు తెలుపుతున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన మేఘనా శంకరప్ప సీతారామ సీరియల్తో గుర్తింపు తెచ్చుకుంది.కాగా.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన మేఘనా శంకరప్ప నటనవైపు అడుగులు వేసింది. బెంగళూరుకు చెందిన జయంత్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.ఇక నటన విషయానికొస్తే.. మేఘనా శంకరప్ప ప్రస్తుతం 'సీతారామ' సీరియల్లో నటిస్తోంది. గతంలో ఆమె కన్నడలోనే 'నమ్మనే యువరాణి', 'కిన్నెరి' లాంటి సీరియల్స్లో కనిపించింది. అంతేకాకుండా 'కృష్ణ తులసి', 'రత్నగిరి రహస్య', 'దేవయాని', 'సింధూర' లాంటి సీరియల్స్లో నటించారు. అంతేకాకుండా మేఘన ఓ ప్రైవేట్ ఛానల్ డ్యాన్స్ రియాల్టీ షోలో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఆమె డ్యాన్స్ను శివరాజ్కుమార్ లాంటి స్టార్ హీరో సైతం మేఘన నృత్యాన్ని మెచ్చుకున్నారు. కన్నడ టీవీ పరిశ్రమలో మేఘన ఇప్పటివరకు నటించిన సీరియల్స్లో పాజిటివ్, నెగటివ్ పాత్రల్లో నటించింది. View this post on Instagram A post shared by Meghana S Shankarappa ✨ (@meghanasshankarappa_) -
23 ఏళ్లు వయసు.. రూ 250 కోట్ల ఆస్తి.. ఎవరీ బుల్లితెర నటి?
చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిసే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువ. అయితే కొంతమంది హీరోయిన్లకు ఇందులో మినహాయింపు ఉంటుంది. నయనతార, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె లాంటి స్టార్ హీరోయిన్లు హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా నటీమణుల హవా కొనసాగుతుంది. సీరియల్స్ హీరోయిన్లు కూడా ఈ మధ్యకాలంలో తెగ ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్లను మించిన క్రేజ్ తెచ్చుకున్న భామలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో జన్నత్ జుబేర్ రహ్మానీ(Jannat Zubair Rahmani) ఒకరు. ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కానీ ఆస్తుల విలువ మాత్రం దాదాపు 250 కోట్ల వరకు ఉంటుంది. వినడానికి కాస్త షాకింగ్గా ఉన్నా.. ఇది వాస్తవమే.షారుఖ్ని మించిన అభిమానం.. బాలీవుడ్ హీరో షారుక్ఖాన్కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 46 మిలియన్ల ఫాలోవర్స్తో షారుఖ్ అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ జన్నత్ ఇన్స్టా ఫాలోవర్స్లో షారుఖ్ని మించిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాలో 49.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 23 ఏళ్లకే ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకోవడం గొప్ప విషయమే. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా బుల్లితెరపై నటించే అవకాశాలు వస్తున్నాయి.ఎపిసోడ్కి 18 లక్షలుజన్నత్ వయసు ప్రస్తుతం 23 ఏళ్లు. ఆగస్ట్ 29, 2001లో ముంబైలో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్ విల్ పీపుల్ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోలో నటించి మెప్పిస్తుంది. ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొన్న జన్నత్.. ఒక్కో ఎపిసోడ్కి అత్యధికంగా రూ. 18 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక సీరియల్ కోసం ఒక్కో ఎపిసోడ్కి రూ. 2 లక్షల వరకు తీసుకుంటుందట. అలాగే సోషల్ మీడియాలో ఆమె ఒక్కో పోస్టుకు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఇలా ఏడాదికి 25 కోట్ల సంపాదనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది జన్నత్. అంతేకాదు పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టిందట. మీడియా కథనాల ప్రకారం జన్నత్ ఆస్తుల విలువ దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుంది. అందంలోనే కాను ఆస్తుల విషయంలోనూ ఈ బ్యూటీ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకెళ్తోంది. View this post on Instagram A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) -
క్యాన్సర్తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు
సంపద, సంతోషం ఉన్నప్పుడు అందరూ ఉంటారు. కానీ కష్టాలు, బాధలో ఉన్నప్పుడే అయినవాళ్లెవరో, కానివాళ్లెవరో తెలుస్తుంది. బాధలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాళ్లు చాలా తక్కువమంది. కానీ హీనా ఖాన్కు.. ఆమె కష్టాన్ని తన కష్టంగా భావించే ప్రియుడు దొరికాడు. క్యాన్సర్తో పోరాడుతున్న నటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.నాకోసం గుండు కొట్టించుకున్నావ్..ఇంత మంచి భాగస్వామి దొరకడం నా అదృష్టం అంటూ ప్రియుడు రాకీ జైస్వాల్ (Rocky Jaiswal)ను పొగుడుతూ ఓ పోస్ట్ షేర్ చేసింది హీనా ఖాన్ (Hina Khan). నాకు తెలిసిన మంచి వ్యక్తి ఇతడే! ట్రీట్మెంట్లో భాగంగా నేను గుండు చేయించుకున్నప్పుడూ అతడూ గుండు కొట్టించుకున్నాడు. నాకు వెంట్రుకలు పెరిగినప్పుడే తన జుట్టు పెరగనిస్తానన్నాడు. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వంద కారణాలు చెప్పి వెళ్లిపోయే అవకాశం ఉన్నా నాతోనే ఉన్నాడు. నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు. జీవితకాలమంత అనుభవాన్ని మేము ఇప్పటికే పోగు చేసుకున్నాం.కరోనా సమయంలోనూ నాతో..సంతోషకర, బాధాకర సందర్భాల్లో కలిసున్నాం. మా తండ్రుల్ని కోల్పోయినప్పుడు ఇద్దరమూ ఏడ్చాం. ఒకరినొకరం ఓదార్చుకున్నాం. కరోనా సమయంలోనూ కలిసే ఉన్నాం. అప్పుడు నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అతడికి వైరస్ సోకకపోయినా నాతోపాటే కలిసున్నాడు. మూడు మాస్కులు ధరించి నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. క్యాన్సర్ బారిన పడ్డప్పుడు కూడా నా చేయి వదల్లేదు. అన్నీ వదిలేసి నాతోనే ఉంటున్నాడు.(చదవండి: ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్)సరైన దారిలోనే వెళ్తున్నా..ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల్ని అడగాలి.. ఇలా అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అలా అతడు సూచించిన కరెక్ట్ డైరెక్షన్లోనే నేను అడుగులు వేస్తున్నాను. కీమో థెరపీ ప్రారంభించినప్పటి నుంచి నా బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. నాకు డ్రెస్సింగ్ చేయడం, తినిపించడం.. ఇలా అన్నీ తనే చేస్తున్నాడు. నా చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టించాడు. గడిచిన రెండు నెలలు నాకెంతో నేర్పాయి.బాధపెట్టి ఉంటే క్షమించునా జీవితంలో నువ్వు నాకు దొరికిన అద్భుతానివి. నన్ను ధైర్యంగా నిలబడమన్నావ్.. నన్ను నేను ప్రేమించుకోమన్నావ్.. ఆందోళనను వదిలేసి ప్రశాంతంగా శ్వాస తీసుకోమన్నావ్.. నీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒకవేళ ఎప్పుడైనా నేను నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు. మనం కలిసి నవ్వుకునేవాళ్లం, ఏడ్చేవాళ్లం, ఒకరి కన్నీటిని మరొకరు తుడిచేవాళ్లం.. అప్పటికీ, ఇప్పటికీ ఇదే జరిగింది. భవిష్యత్తులో కూడా మన మధ్య ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.గతేడాది క్యాన్సర్ బారిన పడ్డ నటిఇతడు దేవుడు పంపిన ఆశీర్వాదం అని హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇలాంటి మంచి వ్యక్తి ప్రతి అమ్మాయి జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీరు ఎప్పటికీ ఇలాగే కలిసుండాలని కామెంట్లు చేస్తున్నారు. టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కెరీర్లో పుంజుకుంటున్న సమయంలో క్యాన్సర్ హీనా ఖాన్పై దాడి చేసింది. గతేడాది నుంచి మూడో దశ బ్రెస్ట్ క్యాన్సర్తో నటి పోరాడుతోంది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: పెళ్లిరోజు నాడే గుడ్న్యూస్.. తల్లిదండ్రులైన టాలీవుడ్ జంట -
ప్రాణం లేని బిడ్డను నెల రోజులు కడుపులో మోశా.. నటి భావోద్వేగం
బుల్లితెర నటి, యాంకర్ సమీరా (Sameera Sherief) విషాద వార్తను పంచుకుంది. మరోసారి తల్లి కాబోతున్నానన్న ఆనందం తనకు ఎంతోకాలం నిలవలేదంది. కడుపులోనే బిడ్డ కన్నుమూసిందంటూ ఏడ్చేసింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. నేను మొదటిసారి 2020లో తొలిసారి గర్భం దాల్చాను. ఆ సమయంలో నేను మిస్టర్ అండ్ మిసెస్ చిన్నతిరై అనే రియాలిటీ షో చేస్తున్నాను. తొలిసారి గర్భస్రావంషూటింగ్ అయిపోయాక హాస్పిటల్కు వెళ్దామనుకున్నాను. చెన్నైకి చేరుకోగానే తీవ్ర రక్తస్రావమైంది (Miscarriage). ఫస్ట్ ప్రెగ్నెన్సీలో గర్భస్రావమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్స్ చెప్పారు. అలా మొదటి బిడ్డనే కోల్పోయాను. దేవుడి దయ వల్ల ఏడాది తిరగకముందే మరోసారి గర్భం దాల్చాను. 2021 జనవరిలో ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను.. అలా అర్హాన్ పుట్టాడు.అంతా బాగుందని తెలిసి..2023 నవంబర్లో మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంట్లో అందరూ ఎగ్జయిట్ అయ్యారు. అర్హాన్ అయితే నా కడుపులో బిడ్డతో మాట్లాడేవాడు. రెండుసార్లు స్కానింగ్కు వెళ్లినప్పుడు బేబీ బాగుందన్నారు. పన్నెండోవారంలో మరోసారి స్కానింగ్కు వెళ్లాను. ఎనిమిదో వారంలోనే బిడ్డ ఎదుగుదల ఆగిపోయింది. తన గుండె కొట్టుకోవడం లేదని డాక్టర్ చెప్పింది. నాలుగువారాలు ప్రాణం లేని బిడ్డను మోశాఅంటే నాలుగువారాల నుంచి బేబీ నా పొట్టలోనే ఉంది. నన్ను వదిలి వెళ్లాలనుకోవడం లేదు. మా కలలు కుప్పకూలిపోయినట్లనిపించింది. ఎంతగానో ఏడ్చాము. ఈ లోకంలో ఆ బిడ్డతో నేను కలిసిలేకపోయినా చనిపోయిన తర్వాత మాత్రం మళ్లీ తనను కలుస్తాను. డిసెంబర్ 31న టాబ్లెట్స్ ద్వారా గర్భంలోని శిశువును తీసేశాం అని చెప్తూ ఎమోషనలైంది.ఎవరీ సమీరా?నటి సమీరా ఆడపిల్ల అనే సీరియల్తో పాపులారిటీ తెచ్చుకుంది. అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం.. ఇలా ఎన్నో సీరియల్స్లో నటించింది. ఆ తర్వాత ‘అదిరింది’ షోకి కొద్ది రోజులుపాటు యాంకర్గానూ పని చేసింది. అనంతరం సడన్గా బుల్లితెరకు దూరమైపోయింది. సమీరా 2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీరికి 2021లో బాబు పుట్టాడు.చదవండి: గతేడాది ఒకేచోట సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈసారి మాత్రం! -
'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి
లాస్ ఎంజిల్స్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని ప్రముఖ బుల్లితెర నటి రూపల్ త్యాగి తెలిపింది. చదువు కోసం వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంది. ఇటీవల దాదాపు నెల రోజులు పాటు అక్కడే ఉన్నానని వెల్లడించింది. తాను స్వదేశానికి విమానంలో బయలుదేరినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగలు చూశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఇంత స్థాయిలో ఉంటుందని ఊహింలేదన్నారు. తాను చూసిన ప్రదేశాలు బూడిదగా మారడం చూసి హృదయ బద్దలైందని విచారం వ్యక్తం చేసింది.రూపల్ త్యాగి మాట్లాడుతూ.. "పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ అగ్ని ప్రమాదాలు సాధారణమే. కానీ అది అంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. నేను విమానం నుంచి పొగను చూశా. అప్పుడే ఇక్కడ ప్రమాదాలు మామూలే అని అనుకున్నా. కానీ నేను ముంబయిలో దిగే సమయానికి కార్చిచ్చు వల్ల ఎంత ప్రమాదం జరిగిందో అప్పుడే తెలిసింది. నేను చూసిన ప్రదేశాలు ప్రతిదీ కాలిపోయాయని నాకు తెలిసింది. దృశ్యాలను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించింది. తాను ఇంటికి తిరిగి వచ్చే ముందు అదే రోడ్డులో కారులో ప్రయాణించా. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. అదృష్టవశాత్తూ నా స్నేహితులందరూ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. నేను వారి గురించి ఆందోళన చెందుతున్నా. సమయానికి బయలుదేరి ప్రాణాలు దక్కించుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ సంక్షోభ సమయంలో నా స్నేహితులతో లేకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రకృతి కోపాన్ని చూసి చలించిపోయా' అని అన్నారు.ఇలాంటి సంఘటనలు మన జీవితాలు ఊహించని విధంగా మార్చేస్తాయని రూపల్ త్యాగి అన్నారు. ఒక్క రోజులోనే నగరం కాలిపోతుందని ఎవరూ ఊహించరు.. ఇది నమ్మశక్యం కాని ఘటన అని చెప్పింది. మన జీవితంలో ప్రతి రోజు పూర్తిగా అస్వాదించాలనేన ఆలోచన మంచిదే.. ఎందుకంటే మరుసటి రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన ప్రజలు త్వరలోనే కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.కాగా.. అమెరికాలో లాస్ ఏంజిల్స్లో చెలరేగిన కార్చిచ్చు వల్ల దాదాపు వేలమంది నిరాశ్రయులయ్యారు. అడవిలో ఏర్పడిన మంటలు గాలి ధాటికి విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 12 వేలకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వచ్చే వారం ప్రారంభంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా.. రూపల్ త్యాగి బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. బాలీవుడ్లో కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్, రంజు కీ బేటియాన్, హమారీ బేటియాన్ కా వివాహ్ లాంటి హిందీ సీరియల్స్లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్గా కూడా రాణిస్తోంది. -
నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు
హీరోయిన్ హన్సిక (Hansika Motwani) వేధింపులు తాళలేకపోతున్నానంటూ బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రశాంత్ మోత్వానీ, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక మోత్వానీలు తనను మానసికంగా హింసిస్తున్నారని వాపోయింది. ఈ మానసిక ఒత్తిడి వల్ల తన ముఖంలో కొంతభాగం పక్షవాతానికి గురైందని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 18న నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఖరీదైన గిఫ్టులు తెమ్మని..పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముస్కాన్ (Muskaan Nancy James), ప్రశాంత్ 2020లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని నటి అత్త, ఆడపడుచు హన్సిక డిమాండ్ చేశారట! అంతేకాకుండా ఆస్తిలోనూ ఏవో కుట్రలకు పాల్పడ్డారని నటి ఆరోపించింది. తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదేపదే జోక్యం చేసుకుని గొడవలకు కారణమయ్యేదని పేర్కొంది. వీరు పెట్టిన టార్చర్ వల్ల తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై హన్సిక, ప్రశాంత్ ఇంతవరకు స్పందించలేదు. కాగా ముస్కాన్ దంపతులు 2022 నుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: అప్పట్లో ఐరన్ లెగ్ అని పేరొస్తుందని భయపడ్డా: చిరంజీవిపాక్షిక పక్షవాతం2022లో నటి తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. కొంతకాలంగా నేనేమైపోయానని అనుకుంటున్నారా? నా జీవితంలో ఏం జరుగుతుందనేది కొందరికి మాత్రమే తెలుసు. నేను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాను. అధిక ఒత్తిడి వల్ల నాకీ పరిస్థితి వచ్చింది. గతంలో ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు కోలుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి ఆ వ్యాధి నా జీవితంలోకి ప్రవేశించింది.ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది?గత కొద్ది నెలలనుంచి నేను, నా తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. ముఖం ఉబ్బిపోయి ఆ బాధ భరించరాకుండా ఉంది. ఒక నటికి ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది? నాముందున్న సమస్యలతో పోరాడే శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు సపోర్ట్గా నిలబడే పేరెంట్స్ ఉండటం నా అదృష్టం. జీవితం అంత ఈజీ కాదు.. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అన్నీ మారిపోతాయి అని రాసుకొచ్చింది.సీరియల్స్..ముస్కాన్ నాన్సీ.. తొడి ఖుషి తొడె ఘమ్ సీరియల్లో సహాయక నటిగా యాక్ట్ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్ షోలలో కొన్ని ఎపిసోడ్స్లో మెరిసింది. భారత్ కా వీర్ పుత్ర: మహారాణ ప్రతాప్, ఏజెంట్ రాఘవ్- క్రైమ్ బ్రాంచ్ షోలలో నటించింది. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది.చదవండి: అన్నీ ఒకేసారి.. నా వల్ల కావట్లేదంటూ ఏడ్చేసిన మాధవీలత -
'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్
'మా అమ్మాయి నిప్పు.. తనకు బాయ్ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. అబ్బాయిలతో అంత సన్నిహితంగా ఉన్నదే లేదు. భవిష్యత్తులో కూడా తను ఎవరినీ ప్రేమించదు. నేను చూపించిన అబ్బాయిని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోదు. అనవసరంగా తన గురించి లేనిపోనివి మాట్లాడితే బాగోదు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నటి (Chahat Pandey) చాహత్ పాండే తల్లి భావన పాండే. బుల్లితెర నటి చాహత్ ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 18 (Bigg Boss 18)వ సీజన్లో పాల్గొంది. ఉతికారేసిన చాహత్ తల్లిఇటీవల ఫ్యామిలీ వీక్లో భాగంగా చాహత్ తల్లి బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే తన కూతురితో కయ్యం పెట్టుకుంటున్న అవినాష్ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై కామెంట్స్ చేసింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోలేదు. నిజంగానే చాహత్ సింగిలా? అని బిగ్బాస్ టీమ్కు డౌట్ వచ్చింది. తనకు ప్రియుడు ఉండొచ్చన్న అనుమానంతో సోషల్ మీడియా అంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఓ ఫోటో దొరికింది. అందులో ప్రియుడు లేడు కానీ ప్రేమలో ఉన్నట్లు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)మీ అమ్మ సర్టిఫికెట్ ఇచ్చింది!ఇంకేముంది, దాన్ని పట్టేసుకున్నారు. తాజా ప్రోమోలో సల్మాన్ ఖాన్ (Salman Khan).. అమ్మాయిల వెంటపడే అబ్బాయిలంటే నీకస్సలు ఇష్టముండదని మీ అమ్మ చెప్పింది. అంటే నువ్వు ఎలాంటిదానివో చెప్తూ మంచి సర్టిఫికెట్ ఇచ్చి వెళ్లిపోయింది. మా టీమ్ ఇది నిజమేనా? అని నిర్ధారించుకునే క్రమంలో ఒకటి కనుగొన్నారు. అదేంటో మీరూ చూసేయండి అంటూ ఫోటో చూపించాడు. యానివర్సరీ ఫోటో.. మరి ఇదేంటి?ఆ ఫోటోలో 'ఐదేళ్లు పూర్తయ్యాయి. హ్యాపీ యానివర్సరీ మై లవ్' అని కేక్పై రాసి ఉంది. ఆ కేక్ పక్కనే చాహత్ కూర్చుని ఉంది. అది చూసి చాహత్ కంగారుపడగా.. తనతో పాటు సీరియల్స్ చేసిన అవినాష్.. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, సెట్లో అందరికీ ఆ విషయం తెలుసు అని చెప్పాడు. కానీ చాహత్ ఒప్పుకోలేదు.ఇంత దిగజారుతారా?అయితే ఈ వ్యవహారంలో పలువురు నెటిజన్లు బిగ్బాస్ టీమ్నే తప్పుపడుతున్నారు. తన పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకుని మరీ అందరి ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అది తన వ్యక్తిగతమని, దానివల్ల మిగతావారికేంటి సమస్య? అని నిలదీస్తున్నారు. బిగ్బాస్ టీమ్ ఇంత దిగజారుతుందనుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..? -
న్యూ ఇయర్ వేళ తప్పతాగిన ప్రముఖ బుల్లితెర నటి.. నడవలేని స్థితిలో!
చూస్తుండగానే మరో ఏడాది ముగిసిపోయింది. ఎన్నో కొత్త ఆశలతో నూతన ఏడాదికి ప్రపంచమంతా స్వాగతం పలికింది. ఈ కొత్త సంవత్సరాన్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రిటీలు సైతం తమ ఫ్యామిలీస్తో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. బాలీవుడ్ తారలంతా కొత్త ఏడాది గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు.అయితే బాలీవుడ్ బుల్లితెర నటి మౌనీరాయ్ న్యూ ఇయర్ వేళ పార్టీకి హాజరైంది. ఆమె తన భర్తతో కలిసి కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకుంది. వీరిద్దరికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ జంటతో పాటు కల్కి భామ దిశాపటానీ కూడా న్యూ ఇయర్ పార్టీలో సందడి చేశారు.అయితే ఈ వీడియోలో మౌనీ రాయ్ ఫుల్గా ఆల్కహాల్ సేవించినట్లు కనిపించింది. తన భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకుంది. బార్ నుంచి బయటికి వస్తూ నడవలేక కింద పడిపోయింది. దీంతో మౌనీ రాయ్ను ఆమె భర్తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఎవరూ ఫోటోలు తీయవద్దంటూ ఆమె భర్త కెమెరాలకు తన చేతిని అడ్డు పెట్టడం వీడియోలో కనిపించింది. వీరి వెనకాలే కల్కి మూవీ హీరోయిన్ దిశా పటానీ కూడా కనిపించింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేయడంతో నెట్టింట వైరలవుతోంది.కాగా.. మౌనీ రాయ్ నాగిని సీరియల్తో ఫేమస్ అయింది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో ఆమె నటించింది. View this post on Instagram A post shared by Saalim Hussain Rizvi (@saalim_hussain110) #MouniRoy fell while exciting the bar and then husband took her in his arm till the car #DishaPatani pic.twitter.com/N0uau0IInf— $@M (@SAMTHEBESTEST_) January 2, 2025 -
పెళ్లి కొడుక్కి పరీక్ష పెట్టిన నటి.. మండపంలో ఎమోషనల్.. (ఫోటోలు)
-
రెండుసార్లు నటికి గర్భస్రావం.. ఆ భయంతోనే చెప్పట్లేదా?
మెరీనా అబ్రహం (Marina Abraham Sahni).. అమెరికా అమ్మాయి సీరియల్తో అందర్నీ ఇట్టే కట్టిపడేసింది. బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్ (Bigg Boss Reality Show)లో భర్త రోహిత్ సాహ్నితో కలిసి పాల్గొంది. వీరిద్దరూ కలిసి సొంతంగా ఓ ఫోటోస్టూడియో కూడా నెలకొల్పారు. ఇకపోతే కొంతకాలంగా యాక్టింగ్కు దూరంగా ఉంటోంది మెరీనా. ఈ మధ్య కాస్త బొద్దుగా అవడంతో తను ప్రెగ్నెంట్ అన్న రూమర్స్ మొదలయ్యాయి. దీనికి మెరీనా.. యూట్యూబ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. 2021లో ప్రెగ్నెంట్లావయ్యానంటే దానికి చాలా కారణాలుంటాయి. మీకు ముందుగా నా గతం గురించి చెప్తాను. 2021లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ మొదటి స్కానింగ్లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది. అయినా మళ్లీ హార్ట్బీట్ వస్తుందేమోనని ఎదురుచూశాం. మూడునెలలవరకు తీయించుకోలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడంతో దాన్ని తీసేయించుకోవాల్సి వచ్చింది. 2022లో మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు హార్ట్బీట్ వచ్చింది. అందుకే..ఒత్తిడి వల్లో.. నా శరీరం వీక్గా ఉందనో కానీ గర్భస్రావమైంది. అప్పుడు నా బాడీలో చాలా మార్పులు వచ్చాయి. ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు స్టెరాయిడ్లు ఇవ్వాల్సి వచ్చింది. తినకపోయినా లావైపోయాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే నేను ప్రెగ్నెంటా? కాదా? అన్నది ఇప్పుడే చెప్పలేను అంటూ సమాధానం దాటవేసింది. కానీ తన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే మెరీనా ప్రెగ్నెంట్ అని సులువుగా తెలిసిపోయిందంటున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Marina Abraham Sahni (@marina.a1203) చదవండి: కీర్తికి వింత అనుభవం.. దోస అని పిలవడంతో.. -
Sunandha Mala Setti: స్వర్ణగిరిని సందర్శించిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్!
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మాకు బాబు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.. అంటూ ఇన్స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న దేవోలీనా భట్టాచార్జీ తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. డిసెంబర్ 2022లో తన జిమ్ ట్రైనర్ షానవాజ్ షేక్ను వివాహం చేసుకుంది.బాలీవుడ్లో దేవోలీనా భట్టాఛార్జీ పలు సీరియల్స్లో నటించింది. తాను చివరిసారిగా 'కూకి' అనే సీరియల్లో కనిపించింది. అంతకుముందు హిందీ బిగ్బాస్ సీజన్-2006లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. హిందీలో సాత్ నిబానా సాథియా అనే సీరియల్తో ఫేమ్ తెచ్చుకున్నారు దేవోలీనా. ఆ తర్వాత యో హై మోహబ్బతీన్, స్వీట్ లై, చంద్రకాంత, తేరే షహర్ మే, శుభ్ వివాహ్ లాంటి సీరియల్స్లో నటించారు. View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) -
చీరలో చూడముచ్చటగా సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ (ఫోటోలు)
-
కోలీవుడ్ బుల్లితెర నటి మణి మేఘలాయి నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
నా ప్రపంచంలో నాకు నేనే రాణి : అంకిత లోఖండే (ఫోటోలు)
-
గ్లామర్ డాల్లా విష్ణుప్రియ.. భలే క్యూట్ (ఫొటోలు)
-
బుల్లితెర నటి శోభిత పోస్టుమార్టం పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?
కన్నడ బుల్లితెర నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శోభిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. ఆమె స్వస్థలం కర్ణాటక కావడంతో అక్కడికి తరలించనున్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణం ఆత్మహత్యగానే వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని స్వగ్రామంలో నిర్వహించనున్నారు. కాగా.. అంతకుముందు కన్నడ నటి శోభిత తాను నివాసముంటున్న ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యాన్కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. కన్నడలో పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. అయితే గతేడాది హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్రెడ్డికి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ను పెళ్లాడింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్లో ఆమె నివాసముంటున్నారు. అయితే శోభిత పెళ్లి తర్వాతే సినిమాలకు, సిరీయల్స్కు దూరమైంది. సూసైడ్ నోట్ స్వాధీనం..శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం..
-
విషాదం.. అనుమానాస్పదస్థితిలో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. పలు కన్నడ సీరియల్స్లో నటించిన ఆమె సూసైడ్కు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం శోభిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.(ఇది చదవండి: నాలుగు పెళ్లిళ్లు కాదు.. నాది రెండోపెళ్లి మాత్రమే.. నటుడు యూటర్న్)కన్నడ సీరియల్స్లో నటిస్తోన్న శోభిత తన భర్తతో కలిసి గచ్చిబౌలిలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటోంది. అయితే శోభిత మృతిపై కారణాలను ఆమె కుటుంబసభ్యులు వెల్లడించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన పెళ్లి తర్వాత సినిమాలకు, సీరియల్స్కు శోభిత. దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శోభిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బ్రహ్మగంతు సీరియల్తో గుర్తింపు శాండల్వుడ్లో బ్రహ్మగంతు సీరియల్ ద్వారా శోభిత శివన్న పాపులారిటీ తెచ్చుకుంది. గతేడాది మే 22న పెళ్లి చేసుకున్న శోభిత ఆ తర్వాత బుల్లితెరకు దూరమైంది. అయితే తన పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.కర్ణాటకలోని సకలేష్పూర్కి చెందిన శోభిత మొదట్లో రాజ్ మ్యూజిక్ ఛానల్లో వీజేగా పనిచేసింది. ఆ తర్వాత మంచి ఆర్టిస్ట్గా సినిమాలతో పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. కన్నడ సీరియల్ బ్రహ్మగంతులో విలన్ పాత్రలో మెరిసిన శోభిత.. నీనిదలే అనే సీరియల్లో కూడా నటించింది. అంతేకాకుండా ఇతర భాషా సీరియల్స్లో కూడా కనిపించింది. బుల్లితెరతో పాటు అటెంప్ట్ టు మర్డర్, జాక్పాట్ సినిమాల్లోనూ నటించింది. కన్నడలో శతభిషే అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు షాకింగ్కు గురయ్యారు. -
సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా!
బుల్లితెర నటి రూపాలీ గంగూలీ.. తమను రాచిరంపాన పెట్టిందని ఆరోపించింది ఆమె సవతి కూతురు ఈషా. తండ్రిని తమకు కాకుండా చేయడమే కాకుండా తల్లిని, తమను మానసిక క్షోభకు గురి చేసిందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇలా బాహాటంగా తనపై విమర్శలు చేసినందుకుగానూ రూపాలీ రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసింది. అది తనను మరింత బాధించిందంటోంది ఈషా.నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ఈ మేరకు సుదీర్ఘ పోస్టుల్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ నెల ప్రారంభంలో నా వ్యక్తిగత స్టోరీని మీతో పంచుకున్నాను. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కానీ ఇది నా జీవితంలో టర్నింగ్ పాయింట్.. ఎందుకంటే ఏళ్లుగా నాలో గూడుకట్టుకున్న బాధను మీతో పంచుకున్నాకే నా మనసుకు కాస్త ప్రశాంతత దొరికింది. స్వేచ్ఛ లభించినట్లయింది.నటి రూపాలీ గంగూలీ, సవతి కూతురు ఈషానా అనుభవాన్ని చెప్పాఎవరికో ఇబ్బంది తలపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ అనుభవాలు నన్నెలా మార్చాయన్నదే చెప్పాలనుకున్నాను. నిజాయితీగా ఉన్నదున్నట్లు మాట్లాడాను. 2013 ఫిబ్రవరిలో రూపాలీ.. మా నాన్నను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో కొడుకును కన్నది. అప్పుడు మీడియా వీళ్ల గురించి కథలు కథలుగా రాసింది కానీ నేనెక్కడా మాట్లాడలేదే. ఇప్పుడు నేను కేవలం నా అనుభవాన్ని చెప్పాను.నిజం మాట్లాడితే శిక్షిస్తారా?అయినా నిజం మాట్లాడితే శిక్షిస్తారా? వాళ్ల రియాక్షన్ చూసి ఎంతో బాధపడ్డాను. మీ ప్రవర్తనతో మరోసారి మీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. నా ఫ్యామిలీ వివాదం గురించి ఇకపై మాట్లాడాను. ఏ ఇంటర్వ్యూలోనూ పాల్గొనను. ఇక నా జీవితం గురించే నేను ఆలోచిస్తాను అని ఈషా రాసుకొచ్చింది.చదవండి: హీరోయిన్లతో ఎఫైర్స్.. నాకు ముందే తెలుసు: హీరో భార్య -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఉదయ్ కిరణ్తో మొదటి సినిమా!
ప్రముఖ బుల్లితెర నటి అదితి దేవ్ శర్మ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు జన్మించిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. తన రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.కాగా.. 2014లో బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. హిందీలో టీవీ సీరియల్స్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదితి శర్మ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఓం శాంతి, బబ్లూ లాంటి చిత్రాల్లో మెరిసింది. బుల్లితెర నటిగా గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్లో పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. గంగా, కథా అంకహీ లాంటి టీవీ షోలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆదితి శర్మ హిందీ, తెలుగు చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Aditi Sharma (@aditidevsharma) -
యంగ్ హీరోతో రీతూ చౌదరి 'న్యూ బిగినింగ్' (ఫొటోలు)
-
క్యాస్టింగ్ కౌచ్.. 16 ఏళ్ల వయసులోనే చేదు అనుభవం: నటి
నీకు ఛాన్సిస్తే నాకేంటి? అన్న ధోరణి ఎప్పటినుంచో ఉంది. కెమెరా ముందు నటించాలని కలలు గన్న ఎంతోమందికి ఎప్పుడో ఓసారి ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది. కొందరు అలాంటి డిమాండ్లను నిర్మొహమాటంగా తిరస్కరిస్తే మరికొందరు తమ కల కోసం తల వంచేందుకు మొగ్గుచూపుతారు.16 ఏళ్ల వయసులో చేదు అనుభవంఅయితే 16 ఏళ్ల వయసులో తనకూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదురైందంటోంది బిగ్బాస్ బ్యూటీ రష్మీ దేశాయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్.. ఒకానొక సమయంలో నేనూ ఫేస్ చేశాను. అప్పుడు నా వయసు 16 ఏళ్లు. ఆడిషన్ ఉందని పిలిస్తే వెళ్లాను. అక్కడున్న వ్యక్తి నేను స్పృహ కోల్పోయేలా చేయడానికి ప్రయత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్నాఅప్పటికే నాకు అక్కడంతా అసౌకర్యంగా అనిపించడంతో ఎలాగోలా ఆ గది నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాను. కొన్ని గంటల తర్వాత జరిగిందంతా అమ్మకు చెప్పాను. ఆ మర్నాడు అమ్మతో కలిసి అతడి దగ్గరకు వెళ్లాను. అమ్మ అతడి చెంప చెళ్లుమనిపించి గుణపాఠం చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది నిజంగానే ఉంది. ఇండస్ట్రీ అనే కాదు ఎక్కడైనా మంచీచెడు రెండూ ఉంటాయి అని చెప్పుకొచ్చింది.సీరియల్స్తో ఫేమస్కాగా రష్మీ దేశాయ్.. కన్యాదాన్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కబ్ హోయ్ గవ్నా హమర్ చిత్రంతో భోజ్పురి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఉత్తరన్, దిల్సే దిల్ తక్ సీరియల్స్తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఖత్రోన్ కె ఖిలాడీ, నాచ్ బలియే 7, ద ఖత్ర ఖత్ర షో, బిగ్బాస్ 13, బిగ్బాస్ 15వ సీజన్లలోనూ పాల్గొంది. -
బుల్లితెర నటిపై తీవ్ర ఆరోపణలు.. దెబ్బకు వీడియో డిలీట్!
బాలీవుడ్లో బుల్లితెర స్టార్ రూపాలీ గంగూలీ అందరికీ సుపరిచితమే. బుల్లితెర నటుల్లో రిచెస్ట్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమె సవతి కూతురు ఇషా నటిపై సంచలన కామెంట్స్ చేసింది. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్ను విడగొట్టిందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది.అయితే ఈషా కామెంట్స్పై నటి రూపాలీ గంగూలీ పరువునష్టం దావా వేసింది. తన పరువుకు భంగం కలిగించేలా ఇషా మాట్లాడిందంటూ రూ.50 కోట్లకు నోటీసులు పంపించింది. ఈ నోటీసులు అందుకున్న ఇషా వెంటనే అప్రమత్తమైంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను సైతం డిలీట్ చేసింది. అంతేకాకుండా తన ఇన్స్టా అకౌంట్ను ప్రైవేట్గా మార్చేసింది. పరువు నష్టం కేసు నోటీసులు రావడంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు)డిలీట్ చేసిన వీడియో ఇషా మాట్లాడుతూ..'ఇప్పుడు నేను నా రౌడీలకు వ్యతిరేకంగా నిలబడ్డా. నా జీవితంలో వాళ్లిద్దరే రౌడీలు. వారు నేను ప్రేమించే నా తల్లిని ఇబ్బంది పెట్టడమే కాదు.. నన్ను బాధపెట్టాలని చూశారు. వారు నన్ను విమర్శించడానికి నా బలహీనతలను ఎంచుకున్నారు. వారు నాకు బహిరంగంగా, వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నన్ను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని" మాట్లాడింది. పరువు నష్టం నోటీసులు రావడంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. కాగా.. అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి రుహి చతుర్వేది ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. కుండలి భాగ్య సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న రుహి చతుర్వేది నటుడు శివేంద్ర ఓం సాయినియోల్ను పెళ్లాడింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి ఓ వీడియోను షేర్ చేసింది. వీరికి పెళ్లయిన ఐదేళ్ల తర్వాత గర్భం ధరించినట్లు వెల్లడించారు.రుహి చతుర్వేది తన ఇన్స్టాలో రాస్తూ..' మా అందమైన కుటుంబం ఇంకాస్త పెద్దగా అవుతోంది. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. రుహి చతుర్వేది, సైనియోల్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2019లో వివాహం చేసుకున్నారు.కాగా.. ఆమె కుండలి భాగ్య సీరియల్లో షెర్లిన్ ఖురానా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు రుహి మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2010 పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత 2012లో ఆలాప్ అనే సినిమాతో నటనలో ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా ఖత్రోన్ కే కిలాడీ సీజన్-13లోనూ కంటెస్టెంట్గా పాల్గొంది. మరోవైపు ఆమె భర్త శివేంద్ర చోటి సర్దానీ అనే సీరియల్లో నటించారు. View this post on Instagram A post shared by Ruhi Chaturvedi (@ruhiiiiiiiiii) -
ఆధ్యాత్మిక శోభ : భర్తతో కలిసి బిగ్బాస్ నటి సంప్రదాయపూజలు
-
మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు
ప్రముఖ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ తనను ఎంతో వేధించిందంటోంది ఆమె సవతి కూతురు ఈషా. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్ను విడగొట్టిందని ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల కిందట నేను పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరలవుతోంది. దీన్ని రూపాలి, నాన్న (అశ్విన్) ఎలా సమర్థించుకుంటారో అర్థం కావట్లేదు.పేరెంట్స్ బెడ్రూమ్లో తిష్టఅప్పటికీ మా నాన్న ఎక్స్(ట్విటర్)లో ఈ గొడవకు, రూపాలీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. అది అన్నింటికంటే పెద్ద అబద్ధం. ఎందుకంటే అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న మా ఇంటికి రూపాలీ తరచూ వచ్చేది. మా అమ్మ నాన్నతో షేర్ చేసుకున్న బెడ్పైనే తనూ నిద్రించేది. ఆమె నన్ను, మా అమ్మను శారీరకంగా, మానసికంగా వేధించింది. మాటలతో చిత్రవధ చేసింది. ఆమె వల్ల ఎంతో నరకం అనుభవించాం.సీరియల్లో హీరోయిన్.. బయట విలన్నాన్న-రూపాలీ ఎఫైర్ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉంది. రూపాలీ ప్రధాన పాత్రలో నటించే అనుపమ సీరియల్లో.. ఆమె భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకుని తనను మోసం చేస్తాడు. ఆమె తనకోసమే కాకుండా మహిళలందరి పక్షాన నిలబడి పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తుంటుంది. మరి నిజ జీవితంలో ఏం జరిగింది? ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితాల్లో అడుగుపెట్టింది. మా అమ్మను, నాన్నను విడదీసింది. శాశ్వతంగా విడగొట్టాలని ప్రయత్నాలుబలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది. కాగా అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. View this post on Instagram A post shared by Esha Verma (@eshav.official) చదవండి: రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం -
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో భర్త పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి మాళవిక కృష్ణదాస్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతంలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన నటి.. సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. బిడ్డ పుట్టిన విషయాన్ని ఆమె భర్త తేజస్ జ్యోతి ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. బిడ్డ చేతిని పట్టుకున్న ఫోటోను ఆయన పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మాళవిక కృష్ణదాస్, తేజస్ జ్యోతి బుల్లితెర జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్లో కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. ఆ షో ద్వారానే మరింత ఫేమస్ అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత మాళవిక, తేజస్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ బుల్లితెర ప్రేమజంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేశారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మాళవిక ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీపై పోస్టులు పెడుతూనే ఉంటోంది. బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన భర్తతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. కాగా.. మాళివిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Malavika Krishnadas (@malavika_krishnadass) -
పట్టు చీరలో అందమే అసూయపడేలా తేజస్విని గౌడ (ఫొటోలు)
-
లేటు వయసులో పెళ్లి.. 'తండ్రి దొరికినందుకు పిల్లలు హ్యాపీ'
బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ పెళ్లి చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్తో ఏడడుగులు వేశాడు. కేరళలోని గురువాయూర్లో మంగళవారం వీరి వివాహం జరిగింది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్లో కలిసి నటించారు.ఫస్ట్ ప్రపోజ్ ఎవరంటే?ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ.. నాకు మొదట ప్రపోజ్ చేసింది అతడే.. పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడు. నాకేమీ అర్థం కాలేదు. తీరా.. అతడు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అందుకు నన్ను ఒప్పించాడు కూడా! దీని గురించి నా కూతురు, కొడుక్కి చెప్తే వాళ్లు ఎంతగానో సంతోషించారు. తమకు తండ్రి దొరికాడని ఖుషీ అయ్యారు అని తెలిపింది.ఇద్దరూ నటులేకాగా క్రిస్ వేణుగోపాల్ సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుంటాడు. దివ్య శ్రీధర్.. మలయాళ సీరియల్స్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో అలరిస్తూ ఉంటుంది. -
ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి
బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి జ్యోతి- సుమిత్ సూరి పెళ్లికి రెడీ అయ్యారు. రెండు రోజుల క్రితమే పెళ్లిసంబరాలు షురూ అవగా నేడు (అక్టోబర్ 27న) వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కానున్నారు. హల్దీ, మెహందీకి సంబంధించిన ఫోటోలను సురభి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లోని ఓ రిసార్ట్లో వివాభ వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. కృత్రిమ డెకరేషన్ కాదని ప్రకృతి ఒడిలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించడం విశేషం.ఎవరీ సురభి జ్యోతి?పెళ్లికూతురు సురభి విషయానికి వస్తే.. ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్బాజ్, కోయి లౌట్కే ఆయా హై సీరియల్స్లో నటించింది. వరుడు సుమిత్ సూరి.. రిషికేశ్లో జన్మించాడు. సుమారు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. 2013లో వార్నింగ్ చిత్రంతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలతో పాటు ద టెస్ట్ కేస్, హోమ్ వంటి వెబ్ సిరీస్లలో యాక్ట్ చేశాడు.అప్పటి నుంచే లవ్సురభి, సుమిత్.. హాంజి: ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరి మధ్య లవ్ మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో వీరు తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) చదవండి: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ -
ప్రియుడితో నటి నిశ్చితార్థం, పెళ్లెప్పుడంటే?
కన్నడ బుల్లితెర నటి మాన్సీ జోషి శుభవార్త చెప్పింది. త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రియుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆదివారం (అక్టోబర్ 20న) నిశ్చితార్థం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు తెలిపారు.ఇకపోతే ఈ బ్యూటీ దేవత సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్ నుంచి నటి వైష్ణవి తప్పుకోగా.. ఆ స్థానాన్ని మాన్సీ భర్తీ చేసింది. ఈమె ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కన్నడలో పారు, రాధా రమణ వంటి సీరియల్స్లో మెరిసింది. View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) -
గ్రీన్ డ్రెస్లో బుల్లితెర భామ తేజస్విని అందాలు (ఫొటోలు)
-
క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించిన బుల్లితెర నటి
బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది ఆశా నేగి. పదేళ్లుగా టీవీ ఇండస్ట్రీలోనే రాణిస్తున్న ఈ బ్యూటీ కెరీర్ తొలినాళ్లలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో కోఆర్డినేటర్స్ ఉండేవాళ్లు. ఏదైనా అవకాశాలున్నాయంటే వీళ్లే చెప్పేవాళ్లు. అలా ఓ వ్యక్తి నాకు తారసపడ్డాడు. కొన్నింటికి ఓకే చెప్పాలంటూ..తనతో మీటింగ్ కూడా అయింది. అప్పుడు నాకు ఇరవై ఏళ్లు. టెలివిజన్ ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది.. ఇక్కడ కొన్నింటికి ఓకే చెప్పాల్సి వస్తుంది. అప్పుడే నీకు ఎదుగుదల ఉంటుంది. పెద్ద పెద్ద టీవీ స్టార్లు కూడా ఈ పద్ధతిలోనే పాపులారిటీ తెచ్చుకున్నారు అన్నాడు. అతడి ఉద్దేశం ఏంటో అర్థమైంది. ఆసక్తి లేదన్నాతను చెప్పినట్లే చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందీ అంటే అలాంటి కెరీర్ నాకు వద్దే వద్దనుకున్నాను. నాకు ఏమాత్రం ఆసక్తి లేదని అతడి ముఖం మీదే చెప్పాను. ఈ సంఘటనను నా ఫ్రెండ్తో షేర్ చేసుకున్నా.. ఇలాంటివి సర్వసాధారణం అని చాలా సింపుల్గా అనేశాడు అని చెప్పుకొచ్చింది. కాగా ఆశా నేగి పవిత్ర రిష్తా సీరియల్లో పూర్వీ దేశ్ముఖ్గా పేరు తెచ్చుకుంది. బారిష్, హనీమూన్ ఫోటోగ్రాఫర్ వెబ్ సిరీస్లలోనూ నటించింది.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బుల్లితెర నటికి చికెన్ గున్యా
బుల్లితెర నటి మహి వీజ్ అనారోగ్యం పాలైంది. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆమెకు చికెన్ గున్యా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈమేరకు హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.లైఫ్లోనే కఠినమైన రోజులు..కాగా కొద్ది రోజుల క్రితం నటి.. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని పేర్కొంది. ఈమేరకు ఓ వీడియోను తన అభిమానులతో పంచుకుంది. ఈ పది రోజులు నా జీవితంలోనే ఎంతో కఠినతరమైనవి. నాకన్నీ చేసిపెట్టే నాన్న ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వీలైనంతవరకు నేను తనతోనే ఉంటున్నాను. అతడు తిరిగి మామూలుగా నడిచేందుకు ఎంకరేజ్ చేస్తున్నాను. తెలుగులో హీరోయిన్గా..పేరెంట్స్కు పిల్లలను చూస్తేనే సగం జబ్బు నయమైపోతుంది. నా తండ్రి కోసం నెలల తరబడి ఆయన వెన్నంటే ఉంటున్నందుకు గర్వంగా ఉంది. నీ వెంట నేనున్నాను నాన్నా.. లవ్యూ అని రాసుకొచ్చింది. మహి వీజ్.. తెలుగులో తపన అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. బాలికా వధు, లాగి తుజ్సే సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. 2011లో జై భానుషాలిని పెళ్లాడింది. వీరికి తారా అనే కూతురు పుట్టింది. అలాగే రాజ్వీర్ అనే బాబును పెంచుకుంటున్నారు. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: ఆదిత్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? వాళ్ల కంటే ఎక్కువే! -
భర్తతో విడాకులు.. టాటూ మార్చేసిన బుల్లితెర నటి
కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించిన బుల్లితెర నటి దల్జీత్ కౌర్కు భంగపాటు ఎదురైంది. వ్యాపారవేత్త నిఖిల్ పటేల్ను రెండో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిన ఆమెకు కొంతకాలానికే అతడితో విభేదాలు మొదలయ్యాయి. అతడి పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుని జీవితాంతం కలిసుందామన్న ఆశలు అడియాసలయ్యాయి. దంపతుల మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చిందని, అందువల్ల తమ బంధం బీటలు వారిందంటూ కొద్ది నెలల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించింది.టాటూతిరిగి ఇండియాకు వచ్చేసింది. తాజాగా ఆమె తన టాటూను మార్చేసింది. అంతకుముందు నిఖిల్తో తన జర్నీ ప్రారంభానికి సంకేతంగా 'టేక్ 2.. 07/09/22' అని ఉండేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసింది. తల్లీకొడుకుల బంధాన్ని చాటిచెప్పేలా కొత్తగా పచ్చబొట్టును రీడిజైన్ చేసింది. తన కుమారుడు జేడన్ మీద ఉన్న ప్రేమను ఈ టాటూ ద్వారా బయటపెట్టింది. ఈ టాటూ వేయించుకున్నందుకు ఈసారి నొప్పిగా అనిపించలేదని చెప్పింది.రెండు పెళ్లిళ్లు ఫెయిల్కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్ను పెళ్లాడింది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. 2023 మార్చిలో అతడిని పెళ్లి చేసుకోగా ఏడాది తిరగకముందే విడాకులకు దరఖాస్తు చేశారు.చదవండి: ఆ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా : అరవింద్ స్వామి -
నిరాహార దీక్ష చేసి మరీ ఇండస్ట్రీలో అడుగుపెట్టా: బుల్లితెర నటి
రంగులప్రపంచంలో భాగం కావాలని కలలుకనేవాళ్లు ఎంతోమంది. బుల్లితెర నటి ఆశా నేగి కూడా అలానే కలలు కంది. అందరు తల్లిదండ్రులలాగే ఆమె పేరెంట్స్ కూడా అందుకు ఒప్పుకోలేదు. కొద్దిరోజులైతే తనే ఆ కలను మర్చిపోతుందనుకున్నారు. కానీ ఆమె పట్టు వదల్లేదు, నిరాహార దీక్ష చేపట్టింది. రెండుమూడురోజులపాటు తిండి తినకుండా మొండిగా కూర్చుంది. దీంతో ఆమె తల్లి తనను సముదాయించే ప్రయత్నం చేసింది. మొదటి ప్రాధాన్యత సినిమాకు..నాకు మూడు నెలల గడువు ఇవ్వు. అప్పటిలోపు నన్ను నేను నిరూపించుకోకపోతే తిరిగొచ్చి మీకు నచ్చిందే చేస్తాను అని తల్లిని బతిమాలింది. అలా ఆశా నేగి తన కుటుంబాన్ని ఒప్పించి డెహ్రాడూన్ వదిలేసి ముంబైకి వచ్చేసింది. తన టాలెంట్తో పాపులర్ అయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ముంబై వచ్చిన కొత్తలో నాకేం అర్థం కాలేదు. సినిమాలు చేద్దామనుకున్నాను. టీవీ వైపు వెళ్లాలనుకోలేదు.ఆడిషన్స్ ఇస్తూ పోయాఅయినా ఇక్కడ ఏదీ అంత ఈజీగా రాదని తెలుసుకున్నాను. ఆడిషన్స్ ఇస్తూ పోయాను. అలా ఓ సీరియల్లో ఛాన్స్ వచ్చింది. టీవీ ఇండస్ట్రీ నన్ను అక్కున చేర్చుకుంది. నాకెంతో ప్రేమను ఇచ్చింది అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఆశా నేగి చివరగా హనీమూన్ ఫోటోగ్రాఫర్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఇది జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బుల్లెట్ బండితో తేజస్విని గౌడ.. పోజులు మస్త్ (ఫొటోలు)
-
వింటేజ్ కారు, పూలచీరలో విష్ణు ప్రియ అదిరే లుక్స్ (ఫోటోలు)
-
నాన్స్టాప్గా 60 గంటలు షూటింగ్.. సొమ్మసిల్లిపోయినా డోంట్ కేర్!
పని ఒత్తిడి.. అన్ని చోట్లా ఉంది. వెండితెర ప్రపంచం అందుకు మినహాయింపు కానేకాదు. బుల్లితెరలోనూ ఈ ఒత్తిడి అధికంగానే ఉందంటోంది నటి క్రిస్టల్ డిసౌజ. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో నా సంపాదన రోజుకు రూ.2,500. రోజులో కేవలం 12 గంటలు మాత్రమే షూట్ చేయాలి వంటి నిబంధనలు అప్పట్లో లేవు. 60 గంటలపాటు షూటింగ్అలా నేను ఓసారి నాన్స్టాప్గా 60 గంటలపాటు షూటింగ్లో పాల్గొన్నాను. ఆ సమయంలో చాలాసార్లు సెట్లోనే కిందపడిపోయాను. అప్పటికీ వాళ్లు వదల్లేదు. నాకు మెడిసిన్ ఇచ్చి మళ్లీ షూట్లో జాయిన్ అవమని చెప్పేవాళ్లు. కనీసం హాస్పిటల్కు వెళ్లేంత సమయం కూడా ఇచ్చేవారు కాదు. అది నాపై చాలా ప్రభావం చూపింది. నా వల్ల కాకపోయినా అది నా పని కాబట్టి చేయక తప్పలేదు.సీరియల్స్, సినిమాలుఏదేమైనా టీవీ ఇండస్ట్రీ నన్ను స్ట్రాంగ్గా మార్చింది. పారితోషికం కూడా మెరుగ్గానే ఉండేది. ఐదారేళ్లపాటు ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నా కూడా నా ఇంటిని నడపగలను అని చెప్పుకొచ్చింది. కాగా క్రిస్టల్ డిసౌజ.. ఏక్ హజరాన్ మే మేరి బెహ్నా హై సీరియల్తో ఫేమస్ అయింది. 2018లో చివరగా బేలన్ వాలి బాహు సీరియల్లో నటించింది. చెహ్రె మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఈ మధ్యే విస్ఫోట్ సినిమాతో ఆకట్టుకుంది.చదవండి: చెత్త ఫెలోస్.. మణికి నరకం చూపిస్తున్నారు! గొడవల మధ్యలో లవ్ ట్రాక్ ఒకటి.. -
ఈ బతుకే వ్యర్థం అని నిద్రమాత్రలు మింగా: బాలీవుడ్ నటి
ఈ బతుకే వ్యర్థం అని చావుకు సిద్ధపడిన తనను కుటుంబమే రక్షించిందంటోంది బాలీవుడ్ నటి షామా సికిందర్. వాళ్లే గనక లేకపోయుంటే ఈ భూమిపై తనకు ఎప్పుడో నూకలు చెల్లేని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి షామా సికిందర్ తన చీకటి రోజుల గురించి మాట్లాడింది. నానమ్మ నుంచి నాకు..'15 ఏళ్ల క్రితం నేను అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నాను. తీవ్రమైన ఒత్తిడి దానికి తోడు బైపోలార్ డిజార్డర్(ఇది ఒకరకమైన మానసిక అనారోగ్యం.. ఈ వ్యాధి బారినపడినవారు ఎక్కువ ఎగ్జయిట్ అవుతారు, అధికంగా కుంగిపోతారు). మా నానమ్మకు కూడా ఇదే వ్యాధి ఉండేది. జన్యుపరంగా అది నాకు సంక్రమించింది. ఈ బతుకే వద్దనుకున్నాఅయితే మా నానమ్మ చేష్టలు చూసి చాలామంది తనకేదో దెయ్యం పట్టిందనుకునేవారు. కొన్నిసార్లు నేనూ తనలాగే ప్రవర్తించేదాన్ని. ఈ జనరేషన్లో పుట్టినదాన్ని కనుక నాకేదో చేతబడి జరిగిందని అనుకోలేదు. అయితే ఒకసారి మాత్రం చనిపోయేందుకు ప్రయత్నించాను. నాకు ఈ జన్మ వద్దు, నేను పోయాక నాకు మళ్లీ మరో జన్మ ప్రసాదించమని దేవుడిని వేడుకున్నాను. నిద్ర మాత్రలు మింగాబోలెడన్ని నిద్రమాత్రలు మింగాను. నా బ్యాంక్ వివరాలు సోదరుడికి పంపించాను. అప్పుడతడు పెళ్లిలో ఉన్నాడు. నేను సడన్గా బ్యాంక్ వివరాలు పంపడంతో ఆందోళన పడ్డ అతడు అమ్మకు ఫోన్ చేశాడు. దీంతో అమ్మ నా గదిలోకి వచ్చి నన్ను నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. కానీ నేను లేవలేదు. క్షణాల్లో అందరూ నా చుట్టూ గుమిగూడారు. మూడేళ్లు గది దాటి బయటకు రాలేదువెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నా శరీరంలో ఉన్న విషాన్ని తీసేసి బతికించారు. తర్వాత రెండుమూడేళ్లు నాకెంతో కష్టంగా గడిచాయి. గది దాటి బయటకు రాలేదు. నా రూమ్లోనే ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. చాలాకాలానికి నేను తప్పు దారిలో వెళ్తున్నానని అర్థం చేసుకుని దాన్నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేశాను' అని చెప్పుకొచ్చింది.కెరీర్షామా సికిందర్ ‘యే మేరి లేఫ్ హై’, 'బల్వీర్', ‘మన్ మే హై విశ్వాస్’ వంటి సీరియల్స్తో నటిగా మంచి గుర్తింపు పొందింది. ప్రేమ్ అగ్గన్ (1998) మూవీతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఆమె మన్, యే మొహబ్బత్ హహై, అన్ష్: డెడ్లీ పార్ట్, బస్తీ, ధూమ్ ధడక్కా చిత్రాల్లో నటించింది. చివరిగా 2019లో ‘బైపాస్ రోడ్’లో యాక్ట్ చేసింది.గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comచదవండి: యువతిపై 'జానీ మాస్టర్' లైంగిక దాడి నిజమే.. రిమాండ్ రిపోర్టు -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి..!
బుల్లితెర భామ స్మృతి ఖన్నా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2017లో నటుడు తమ్ గుప్తాను పెళ్లాడిన నటికి ఇప్పటికే అనైక కూతురు కూడా ఉన్నారు. తాజాగా మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బుల్లితెర జంటకు రెండో కూతురికి తమ జీవితంలోకి ఆహ్వానం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.స్మృతి ఖన్నా బాలీవుడ్లో మెరీ ఆషికి తుమ్ సే హై అనే సీరియల్తో కెరీర్ ప్రారభించింది. ఆ తర్వాత యే హై ఆషికి, సీఐడీ, బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) లాంటి సీరియల్స్తో మెప్పించింది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో డాక్టర్ వందనా మిట్టల్ పాత్రలో అలరించింది. అంతే కాకుండా పలు రియాలిటీ షోలలో కంటెస్టెంట్గా పాల్గొంది. వీటితో పాటు జట్ ఎయిర్వేస్ అనే పంజాబీ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. చివరిసారిగా 2022లో వచ్చిన దప్పా అనే వెబ్ సిరీస్లో కనిపించింది. అయితే పెళ్లి తర్వాత సీరియల్స్కు గుడ్బై చెప్పేసింది బుల్లితెర భామ స్మృతి ఖన్నా. View this post on Instagram A post shared by Smoo (@smriti_khanna) -
తల్లయ్యాక వదిన పాత్రలే వస్తున్నాయి: బిగ్బాస్ విన్నర్
హీరోలకు పెళ్లయినా, పిల్లలు పుట్టినా, మనవళ్లు, మనవరాళ్లను ఎత్తుకునే వయసు వచ్చినా కూడా తెరపై కథానాయకులుగానే చెలామణి అవుతారు. కానీ హీరోయిన్లు మాత్రం కాస్త వయసుపైబడ్డట్లు కనిపించినా పక్కన పెట్టేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలను తీసుకురావాలని దర్శకనిర్మాతలు ఆరాటపడతారు.సైడ్ క్యారెక్టర్లువెండితెర అయినా, బుల్లితెర అయినా నటీమణులకు పెళ్లయిందంటే చాలు సైడ్ క్యారెక్టర్లు ఆఫర్ చేస్తుంటారు. తనక్కూడా అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది నటి, బిగ్బాస్ విన్నర్ రుబీనా దిలైక్. గతేడాది డిసెంబర్లో రుబీనా- అభినవ్ శుక్లా దంపతులకు కవలలకు జన్మనిచ్చారు. పిల్లలు పుట్టాక తన లైఫ్ మరింత అందంగా మారిందంటోంది రుబీనా. అయితే తల్లయ్యాక తనకన్నీ వదిన రోల్స్ మాత్రమే వస్తున్నాయంది. గణపతి పూజప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గణపతిని ఇంట్లో పెట్టుకుని పూజించినట్లు తెలిపింది. భర్త, పిల్లలు ఊరికి వెళ్తే.. తను మాత్రం ఒక్కతే విఘ్నేశుడిని పూజించింది. ఆ సమయంలో ఫ్యామిలీని చాలా మిస్సయయ్యానంది. అందుకే, రెండురోజులకే గణనాథుడిని నిమజ్జనం చేసి తాను కూడా ఊరెళ్లి పిల్లలతో కలిసి సేద తీరుతోంది. రుబీనా.. అటు వృత్తి పనిని, ఇటు ఫ్యామిలీ లైఫ్ను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది.బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి హెచ్కే వర్ష త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా నటుడు కౌశిక్ నాయుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది ముద్దుగమ్మ. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ.. శాండల్వుడ్లోనూ పలు సీరియల్స్లో కనిపించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.(ఇది చదవండి: బాయ్ఫ్రెండ్తో చిల్ అవుతోన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య!)వర్షకు కాబోయే భర్త కౌశిక్ నాయుడు సైతం కన్నడలో సీరియల్స్లో నటించారు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించింది శాండల్వుడ్ బ్యూటీ వర్ష హెచ్కే. అంతకుముందు కన్నడలో నాగమండలం, కస్తూరి నివాస్, రాజారాణి సీరియల్స్ చేసింది. అంతే కాకుండా కొన్ని లఘు చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో బుల్లితెరపై అభిమానులను అలరిస్తోంది. View this post on Instagram A post shared by 𝙆𝙖𝙪𝙨𝙝𝙞𝙠 𝙉𝙖𝙞𝙙𝙪 (@peoplez_prince) -
అప్పటిదాకా సంస్కారి.. మందు ముట్టాడంటే మాత్రం..!
నటుడు అలోక్ నాథ్ సంస్కారవంతుడు.. అదంతా మందు ముట్టనంతవరకే! ఒక్కసారి మద్యం సేవించాడంటే మృగంలా మారిపోతాడంటోంది నటి హిమాని శివ్పురి. అలోక్ నాథ్తో కలిసి ఎన్నో ప్రాజెక్టుల్లో కలిసి నటించిన హిమాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి బండారాన్ని బయటపెట్టింది.నాతో అసభ్యంగా..ఆమె మాట్లాడుతూ.. అలోక్ నాథ్ చాలా హుందాగా వ్యవహరిస్తాడు. కానీ సాయంత్రమైందంటే చాలు మందు ముట్టకుండా ఉండలేడు. మద్యం సేవించగానే నియంత్రణ కోల్పోతాడు. ఒకసారి నేషన్ స్కూల్ డ్రామా (ఎన్ఎస్డీ) చదివే రోజుల్లో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఎన్నడూ నా దగ్గర ఆ తప్పును రిపీట్ చేయలేదు. కానీ తాగిన మద్యం తర్వాత మాత్రం తేడాగా ప్రవర్తిస్తున్నాడని చాలామంది దగ్గరి నుంచి విన్నాను.ఉన్నపళంగా దింపేశారుఆయన్ను దగ్గరుండి చూశాను, కాబట్టి చెప్తున్నా.. తాగకముందు వరకు సంస్కారి.. ఆ తర్వాతేమో అపరిచితుడిలా మారిపోయేవాడు. ఓసారి మేము అవార్డు షోకు కలిసి వెళ్తున్నాం. అప్పటికే అతడు ఫుల్లుగా తాగి ఉన్నాడు. అతడి భార్య సైలెంట్గా ఉండమని పదేపదే చెప్తూనే ఉంది. కాసేపైనా నిన్ను నువ్వు తమాయించుకో అని నేను కూడా హెచ్చరించాను. తను వినిపించుకోకుండా పిచ్చిగా ప్రవర్తించడంతో అతడిని విమానంలో నుంచి దింపేశారు అని చెప్పుకొచ్చింది.కాగా గతంలో మీటూ ఉద్యం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలోనూ అలోక్ నాథ్ వేధించాడంటూ నటీమణులు నవనీత్ నషాన్, దీపిక, సంధ్య మృదుల్, నిర్మాత వింత నంద ఆరోపించడం గమనార్హం.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
క్యాన్సర్తో నటి పోరాటం.. ఇప్పుడు తినడానికి కూడా కష్టంగా..!
క్యాన్సర్తో పోరాడటం అంత ఈజీ కాదు. అయినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ మహమ్మారిని జయించే దిశగా పోరాడుతోంది హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్. ప్రస్తుతం తనకు రొమ్ము క్యాన్సర్ మూడో స్టేజీలో ఉండటంతో వెంటనే కీమో థెరపీ ప్రారంభించారు.సైడ్ ఎఫెక్ట్స్అయితే వరుస కీమోథెరపీల వల్ల తన శరీరంపై కాలిన మచ్చలు ఏర్పడటంతో పాటు తాజాగా మ్యుకోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. కీమో థెరపీ చేయించుకోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్టే మ్యుకోసైటిస్. వైద్యుల సూచన మేరకు దానికి కూడా చికిత్స తీసుకుంటున్నాను. మీలో ఎవరికైనా దీన్ని ఎలా నివారించాలో తెలిస్తే దయచేసి నాకు సాయం చేయండి. సలహా ఇవ్వండిఎందుకంటే భోజనం కూడా చేయలేకపోవడం చాలా కష్టం కదా! మీరు ఇచ్చే సలహాలు నాకెంతో మేలు చేస్తాయి అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. వైద్యుల చికిత్సనే ఫాలో అయిపో.. పొరపాటున సొంత ప్రయోగం వికటించిందంటే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది అని కొందరు హెచ్చరించారు.మ్యుకోసైటిస్ అంటే..కీమోథెరపీ దుష్ప్రభావాల్లో మ్యుకోసైటిస్ అనేది ఒకటి. దీనివల్ల గొంతు, నోరు, అన్నవాహిక, కడుపు, పేగుల్లో ఉండే శ్లేష్మపొరలు వాచిపోతాయి. నోటిలో అల్సర్లు కూడా కనిపిస్తాయి. దీనివల్ల ఆహారం తినలేరు, జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయదు. కొందరికైతే నోటి నుంచి రక్తం కూడా వస్తుంది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకున్న 'డాన్' దర్శకుడు -
ఆడిషన్ సమయంలో బలవంతం చేశాడు: బుల్లితెర నటి
హేమ కమిటీ నివేదిక బహిర్గతం అయ్యాక ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయటకు చెబుతున్నారు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోన్న క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉందంటూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరో బుల్లితెర నటి తనకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనను తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.తన కెరీర్ తొలినాళ్లలో ఓ హిందీ చిత్ర నిర్మాత వేధింపులకు గురి చేశాడని బుల్లితెర నటి శిల్పా షిండే ఆరోపించింది. ఆడిషన్ సమయంలో తనపై బలవంతం చేశాడని ఆమె పంచుకుంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చేదు సంఘటనను పంచుకుంది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. మహిళలపై లైంగిక వేధింపులు అన్ని రంగాల్లో జరుగుతున్నాయని నటి శిల్పా షిండే అన్నారు.శిల్పా షిండే మాట్లాడుతూ..' నేను 1998-99లో రోజుల్లో ఇండస్ట్రీలో కష్టపడుతున్నా. ఇప్పుడు నేను వారి పేర్లు చెప్పడం ఇష్టం లేదు. ఈ దుస్తులు ధరించండి. మీరు ఒక సీన్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. కానీ నేను అతను ఇచ్చిన దుస్తులు ధరించలేదు. అంతేకాదు.. ఆ సీన్లో అతనే నా బాస్ అని చెప్పాడు. అప్పుడే చాలా అమాయకురాలిని.. అందుకే ఆ సీన్కు ఒప్పుకున్నా. కానీ ఆ వ్యక్తి నా మీదికి వచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో నేను భయంతో అతన్ని పక్కకు తోసి బయటకు పరుగెత్తా. అక్కడే ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ అంతా నన్ను చూశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లమన్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా.. భాబీజీ ఘర్ పర్ హైన్ అనే సిట్కామ్తో శిల్పా షిండే ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఖత్రోన్ కీ కిలాడీ రియాలిటీ షో సీజన్-14లో పాల్గొంటొంది. -
ఒక ఆడదాని జీవితం మరో ఆడదే నాశనం చేస్తుంది: నటి
హిందీ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ కోటి ఆశలతో పెళ్లిపీటలెక్కింది. మొదటి బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మారినా.. రెండో బంధాన్నయినా కలకాలం కాపాడుకోవాలని ఆరాటపడింంది. నిఖిల్ పటేల్ను రెండో పెళ్లి చేసుకుంది. అతడితోనే జీవితమని భావించి తనతోపాటు విదేశాలకు వెళ్లిపోయింది.నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్లు? కానీ ఆశలన్నీ చెదిరిపోయాయి. కట్టుకున్న భర్త తన ప్రియురాలితో ఇంకా సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకుని మనసు ముక్కలైంది. పోట్లాడింది, పోరాడింది. తను మారడని తెలుసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్లో.. 'నా మెదడులో రెండు ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఒకటి.. అతడు ఏదైతే చేస్తున్నాడో.. దానితో సంతోషంగా ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్లు? అంటే గతంలో తనకు పబ్లిసిటీ లభించలేదనా?ఆడదానికి ఆడదే శత్రువురెండోది.. ఒక ఆడదానికి ఆడదే శత్రువు.. మహిళ జీవితాన్ని మరో మహిళే నాశనం చేస్తుందని జనాలు చెప్పే మాటలు సత్యం. ఇప్పుడు నేను ఆవిడను తప్పు పట్టడం లేదు. కానీ భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా తనను వదిలిపెట్టనేమో! భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు, సమస్యలు వచ్చినప్పుడు మూడో వ్యక్తి దూరాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా పెద్ద తప్పు. పైగా తనకు ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అయినా సరే నా భర్త చెంతచేరడమేంటో? దీని వెనక కారణాలేంటో ఎవరికి మాత్రం తెలుసు?' అని రాసుకొచ్చింది.2009లో మొదటి పెళ్లి కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. ఇతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.గొడవలుఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారడంతో 2023 మార్చిలో పెళ్లి చేసుకున్నారు. కుమారుడిని తీసుకుని అతడితో పాటు దల్జీత్ లండన్ వెళ్లిపోయింది. కానీ అక్కడ గొడవలు తలెత్తడంతో వివాహమైన పది నెలలకే విడాకులకు దరఖాస్తు చేయడం గమనార్హం. -
మలయాళమే కాదు.. ఇక్కడ పెద్ద లిస్టే ఉంది: నటి షాకింగ్ కామెంట్స్
మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన హేమ కమిటీ నివేదికపై ప్రముఖ కోలీవుడ్ నటి రేఖ నాయర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉందన్నారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. మీడియా లేని కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. అప్పట్లో చాలామంది సర్దుకుపోయేవారని కామెంట్ చేశారు. కొంతమంది అడ్జస్ట్మెంట్ కాలేక సినిమాల నుంచి తప్పుకున్నారని రేఖా నాయర్ వెల్లడించారు.కోలీవుడ్లోనూ ఇలాంటి వేధింపులు చాలానే జరుగుతున్నాయని రేఖా నాయర్ ఆరోపించారు. మలయాళంలో కేవలం పది నుంచి ఇరవై మంది మాత్రమే ఉంటారని.. తమిళంలో ఆ సంఖ్య భారీగానే ఉంటుందని అన్నారు. ఇక్కడైతే ఏకంగా 500లకు పైగానే ఉంటారని తెలిపారు. ఇవన్నీ బయటికి మాట్లాడితే సినిమా ఛాన్సులు రావని రేఖా నాయర్ వెల్లడించారు. అందుకే హీరోయిన్స్ వాటి గురించి మాట్లాడేందుకు భయపడతారని పేర్కొన్నారు. తమిళంలో సినిమా సంఘాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరన్నారు. కేవలం మలయాళం, తమిళం మాత్రమే అన్ని భాషల్లోనూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.కాగా.. తమిళంలో టీవీ సీరియల్స్లో నటించి గుర్తింపు తెచుకున్న నటి రేఖ నాయర్. ఆమె వంశం, పగల్ నిలవు, ఆండాళ్ అజగర్, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, బాల గణపతి లాంటి టీవీ సీరియల్స్లో నటించింది. అంతే కాకుండా తమిళంలో బిగ్బాస్ సీజన్-7లో కంటెస్టెంట్గా పాల్గొంది. అయితే గతంలో మహిళల పట్ల ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల నడుము మీద అబ్బాయిలు చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి కానీ.. ఏదో అయిపోయిందని హంగామా చేయొద్దని కామెంట్స్ చేశారు. -
Nishka: వెన్నదొంగగా మారిన బుల్లితెర నటి చైత్ర గారాలపట్టి.. (ఫోటోలు)
-
ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి.. ఎన్ని లక్షలంటే?
ఇమ్లీ సీరియల్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అద్రిజా రాయ్. ప్రస్తుతం ఆమె కుండలి భాగ్య సీరియల్లో నటిస్తోంది. దుర్గా ఔర్ చారుతో తన కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ బుల్లితెర అభిమానులను అలరిస్తోంది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించిన ఆద్రిజా తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. నా కష్టం, దృఢ సంకల్పంతో మొదటి కారును కొనుగోలు చేసినట్లు ఆద్రిజా రాయ్ తెలిపింది. ఈ కారు విలువ దాదాపు రూ.65 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. తన తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల ప్రేమనే తనను ముందుకు నడిపిస్తున్నదని నటి పేర్కొంది. కుండలి భాగ్య సీరియల్లో నటించడం మంచి అనుభవమని.. తాను ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉందని అద్రిజ రాయ్ వెల్లడించింది. నా ముందు ఇంకా ఎన్నో మైలురాళ్లు ఉన్నాయని వివరించింది. View this post on Instagram A post shared by Adrija Roy ❤️ (ADDY) (@adrija_roy_official) -
ఆడిషన్కు వెళ్లాకే అసలు విషయం తెలిసింది: క్యాస్టింగ్ కౌచ్పై బుల్లితెర నటి
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. అయితే కొందరు మాత్రమే ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు సాహసం చేస్తుంటారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ బుల్లితెర నటి సనయా ఇరానీ ఓపెన్ అయింది. ఓ బాలీవుడ్ దర్శకుడు తనను సంప్రదించారడని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. దక్షిణాదిలో కూడా కొన్ని చేదు సంఘటనలు ఎదురయ్యాయని తెలిపింది. తనను రిజెక్ట్ చేయడానికి మాత్రమే కలవాలని కొందరు పట్టుబట్టారని తాజా ఇంటర్వ్యూలో సనయ చెప్పింది.సనయా మాట్లాడుతూ.. ' మ్యూజిక్ వీడియో కోసం ఆడిషన్ చేస్తున్నామని మొదట నాతో చెప్పారు. కానీ అక్కడికి వెళ్లాక ఇది ఒక సినిమా కోసమని తెలిసింది. దీంతో నేను అక్కడే ఉన్న సెక్రటరీకి ఆడిషన్ చేయనని చెప్పా. ప్లీజ్ సార్కు కోపం వస్తుంది.. ఒక్కసారి ఆయనతో మాట్లాడండి అని ఆమె నాతో చెప్పింది. ఆ తర్వాత అతను మాట్లాడుతూ.. 'నేను ఈ పెద్ద సినిమా చేస్తున్నాను. ఇందులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇందులో మీరు బికినీ వేసుకోవాలి. మీరు బికినీ ధరించేందుకు సిద్ధమేనా?' అని అడిగాడని చెప్పుకొచ్చింది.ఆ తర్వాత "అతని సెక్రటరీ చెప్పడంతో నేను అతనికి కాల్ చేసాను. నేను మీటింగ్లో ఉన్నా.. అరగంట తర్వాత నాకు కాల్ చేయండి అన్నాడు. మరోసారి 45 నిమిషాల తర్వాత కాల్ చేశా. ఇప్పుడు టైం ఎంత? నిన్ను ఏ సమయానికి చేయమని అడిగాను? అని నాపై కోప్పడ్డాడు. దీంతో అతనికి దర్శకుడిగా పనికిరాని వాడని నాకర్థమైంది' అని వివరించింది. కాగా.. 'మిలే జబ్ హమ్ తుమ్', 'ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్' వంటి టీవీ షోలతో బాలీవుడ్లో సనయా గుర్తింపు తెచ్చుకుంది. సనయ చివరిగా షార్ట్, బటర్ఫ్లైస్ సీజన్ -4లో కనిపించింది. -
రూ.3.5 కోట్ల అప్పు.. రోడ్డునపడ్డా! ఈ బతుకు వద్దనుకున్నా: నటి
రియాలిటీ షో, సినిమాలు, సీరియల్స్.. ఏవైనా సరే తనకు కొట్టిన పిండి. బుల్లితెర అయినా, వెండితెర అయినా.. తన పాత్రలో ఇట్టే ఇమిడిపోతుంది రష్మీ దేశాయ్. ప్రస్తుతం తన చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. కెరీర్లో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడింది. రూ.3.5 కోట్ల అప్పుసీరియల్ నటుడు నందీశ్ సంధును 2011లో పెళ్లాడగా 2014లో విడిపోయారు. 2016లో విడాకులు మంజూరయ్యాయి. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో వెల్లడించింది. రష్మీ దేశాయ్ మాట్లాడుతూ.. సరిగ్గా అప్పుడే నేను ఓ ఇల్లు కొనుక్కున్నాను. నాపై రూ.2.5 కోట్ల అప్పు ఉంది. మిగతా లోన్స్ అన్నీ కలుపుకుంటే నాపై మూడున్నర కోట్లదాకా అప్పు ఉంది. పర్వాలేదు, తీర్చేద్దామని ధైర్యంగా ఉన్నాను. కుటుంబం దూరం పెట్టిందిఅప్పుడే నేను భాగమైన షో ఒకటి క్యాన్సిల్ అయింది. నాలుగైదు రోజులపాటు రోడ్డుపైనే ఉన్నాను. నాకున్న ఆడీ కారులోనే నిద్రపోయాను. నాకు సంబంధించినవన్నీ నా మేనేజర్ ఇంట్లోనే ఉన్నాయి. కుటుంబం నన్ను దూరం పెట్టింది. రూ.20కు దొరికే భోజనం తిన్నాను. విడాకులు తీసుకున్నందుకు ఫ్రెండ్స్ కూడా నేను అందరిలాంటిదాన్ని కాదన్నట్లు ఫీలయ్యారు. నా నిర్ణయాలన్నీ తప్పేనని కుటుంబం బలంగా నమ్మింది. ఒత్తిడికి లోనయ్యా..ఎవరి సాయం లేకపోయినా నెమ్మదిగా అప్పు తీర్చేశాను. కానీ అప్పుడు ఎంతో ఒత్తిడికి గురయ్యాను. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై సరిగా నిద్రపోయేదాన్నే కాదు. కొన్నిసార్లు చచ్చిపోదామనిపించేది. కానీ సెట్లోని వారు నాకు సపోర్ట్గా నిలిచారు. యోగా కూడా ఈ బాధ్యలను మర్చిపోయేందుకు కారణమైంది అని చెప్పుకొచ్చింది.షోస్ అండ్ సినిమాలు..జర నచ్కే దిఖా 2, జలక్ దిఖ్లాజా 5, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ 6, నాచ్ బలియే 7 వంటి పలు రియాలిటీ షోలలోనూ పాల్గొంది. హిందీ బిగ్బాస్ 15వ సీజన్లో పాల్గొని టాప్ 5 కంటెస్టెంట్గా నిలిచింది. ఈ ఏడాది మిషన్ లైలా (హిందీ), హిసబ్ బరాబర్ (హిందీ), మామ్ తానే నై సమ్జే (గుజరాతీ), చంబే ది బూటి (పంజాబీ), ఎవర- బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ (హిందీ) వంటి చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది.చదవండి: ప్లాస్టిక్ సర్జరీలు తప్పేం కావు.. నేను కూడా ట్రై చేస్తా!: హీరోయిన్ -
సీరియల్స్, రియాలిటీ షో వల్ల రాగద్వేషాలు.. ఇక నా వల్ల కాదు: నటి
నటి కవిత కౌశిక్ బుల్లితెర ఇండస్ట్రీకి గుడ్బై చెప్పేసింది. టీవీ కంటెంట్లో కొత్తదనం లోపించిందని, ఇంకా ఇక్కడే ఉండిపోవడం సబబు కాదని అభిప్రాయపడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఒకప్పుడు టీవీ కంటెంట్ ప్రోగ్రెసివ్గా ఉండేది. రకరకాల షోలతో, విభిన్న కంటెంట్తో అందరికీ వినోదాన్ని పంచింది. క్షమించండికానీ ఇప్పుడు.. యంగ్ జనరేషన్ టీవీ చూడటానికి వీల్లేదన్నట్లుగా చెడు కంటెంట్ ఉంటోంది. టీవీ ఇండస్ట్రీ పురోగమనం నుంచి తిరోగమనం వైపు వెళ్తోంది. రియాలిటీ షో, సీరియల్స్ చూసి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. అందులో నేను కూడా భాగమయ్యాను. అందుకు నన్ను క్షమించండి. ఇప్పుడైతే నేనిక్కడ ఉండలేను. బుల్లితెరను వీడుతున్నాను' అని కవిత చెప్పుకొచ్చింది.మార్పు మొదలైందా?టీవీ ఇండస్ట్రీ పరిస్థితుల గురించి తాజాగా నటి సుంబుల్ టకీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఎప్పుడూ పాతచింతకాయ పచ్చడే అంటే ఎవరు మాత్రం టీవీ చూస్తారు? కాస్త కొత్తదనం ఉండాలి. రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ఇప్పుడిప్పుడే మార్పు మొదలవుతోంది. కొత్త కథలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రచయితలు.. యదార్థ ఘటనలను, నిజ జీవిత సమస్యలపై ఫోకస్ చేయాలి. కాలం మారేకొద్దీ జనాలు రీల్ లైఫ్ కన్నా రియల్ లైఫ్పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వారి అభిరుచులకు అనుగుణంగా కంటెంట్లో మార్పుచేర్పులు చేయాలి అని పేర్కొంది.నటి కవితా కౌశిక్అది కూడా సమస్యేనటుడు అర్జున్ బిజ్లానీ మాట్లాడుతూ.. ఇక్కడ బడ్జెట్ కూడా ఒక సమస్యే.. నిర్మాతలు తక్కువ బడ్జెట్తోనే సీరియల్స్, షో అయిపోవాలని చూస్తారు. దీంతో ఆయా షోలను క్రియేటివ్గా ఎలా చేయాలన్నదానికన్నా తక్కువ బడ్జెట్లో ఎలా పూర్తి చేయాలన్నదానిపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఎవరో ఒకరి దగ్గరి నుంచి మార్పు మొదలవుతేనే మంచిరోజులు వస్తాయి అని ఆశిస్తున్నాడు.ఆ సీరియల్తో ఫేమస్కాగా కుటుంబ్ సీరియల్తో బుల్లితెరపై తన ప్రస్థానం ప్రారంభించిన కవిత ప్రియ కా ఘర్, కుంకుమ్- ఏక్ ప్యారా సా బంధన్, రీమిక్స్.. ఇలా అనేక సీరియల్స్లో నటించింది. ఎఫ్ఐఆర్ అనే కామెడీ సీరియల్లో పోషించిన ఎస్ఐ చంద్రముఖి చౌతాలా పాత్రతో బాగా ఫేమస్ అయింది. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లోనూ పాల్గొంది. ఏక్ హసీనా తి సినిమాతో వెండితెరపైనా ఎంట్రీ ఇచ్చింది. మ ఉంబై కటింగ్ (హిందీ మూవీ), వదయియాన్ జీవి వదయియాన్, క్యారీ ఆన్ జట్ట 3 వంటి పంజాబీ సినిమాల్లోనూ మెరిసింది. రామ్చరణ్ తుఫాన్ సినిమాలో షకీలా సెంటు అనే ఐటం సాంగ్లోనూ ఆడిపాడింది.చదవండి: పాక్ నటులపై బ్యాన్.. అంతా రాజకీయమే!: బాలీవుడ్ నటుడు -
డాక్టర్ కారు అని నమ్మాను..కానీ నా చేయి పట్టుకుని: బుల్లితెర నటి
బాలీవుడ్ నటి తిలోతమా షోమ్ ఇటీవల సీఏ టాపర్ వెబ్ సిరీస్లో మెరిసింది. ఈ సిరీస్ను త్రిభువన మిశ్రా డైరెక్షన్లో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ నటి తనకెదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హజరైన తిలోతమా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఇది నా జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటన అని పేర్కొంది. ఢిల్లీలో బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది.తిలోతమా మాట్లాడుతూ..'ఢిల్లీలో బస్సు కోసం ఎదురు చూస్తున్నా. ఒక కారు వచ్చి నా దగ్గర ఆగింది. నేను భయంతో కొంచెం దూరంగా వెళ్లాలనుకున్నా. కానీ నేను పరిగెత్తితే వారు నన్ను పట్టుకోగలరు. అందుకే రహదారి మధ్యలోకి వచ్చి లిఫ్ట్ అడిగా. చాలా కార్లు వెళ్తున్నా ఎవరూ ఆపలేదు. కొద్దిసేపటికే మెడికల్ గుర్తు ఉన్న కారు ఆపారు. అపరిచితుడితో కలిసి ముందు సీటులోకి కూర్చున్నా. కొంచెం దూరం వెళ్లాక అతను నా చేయి పట్టుకున్నాడు. తాను ప్యాంటు విప్పాడు. నా చేతిని బలవంతంగా పట్టుకున్నాడు. దీంతో అతనిపై తిరగబడడంతో కారు ఆపేశాడు. ఆ తర్వాత కారు దిగేశా' అని చెప్పుకొచ్చింది.అదో భయంకరమైన జ్ఞాపకం..ఇది నా జీవితంలో ఎదురైన భయానక అనుభవం తిలోతమా షోమ్ పేర్కొంది. ఈ ఘటనతో తాను చలించిపోయానని చెప్పింది. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ అతను డాక్టర్ కావడం వల్ల సురక్షితంగా ఉంటుందని భావించి కారు ఎక్కానని వెల్లడించింది. అయితే నేను కారు ముందు సీట్లో కూర్చోవడంతో.. డ్రైవర్ తన ప్యాంట్ విప్పి.. నా చేతిని బలవంతంగా లాగడానికి ప్రయత్నించాడని తెలిపింది. దీంతో వెంటనే అతన్ని కొట్టడంతో కారు ఆపేశాడు.. ఆ తర్వాత వెంటనే కారు దిగి బయటకు వచ్చానని తిలోతమా ఆ చేదు సంఘటనను వివరించింది. నాలోని తిరగబడే ధైర్యమే ఆ రోజు కాపాడిందని సీఏ టాపర్ నటి వెల్లడించింది. -
Tejaswini Gowda: తేజు అందాన్ని రెట్టింపు చేసేది ఆ నవ్వే! (ఫోటోలు)
-
బుల్లితెర నటి అంజలి కూతురు చందమామ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
తనే నిజ జీవితంలో ఒక సూపర్ పవర్: బుల్లితెర నటి ఎమోషనల్ పోస్ట్
బుల్లితెర నటి హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఇటీవలే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాడుతోంది. ప్రాణాంతక మహమ్మారి సోకిందని భయంతో వణికిపోకుండా దాన్ని జయిస్తానని ధైర్యంగా నిలబడింది. హీనా ఖాన్కు ప్రస్తుతం క్యాన్సర్ మూడో స్టేజీ ఉండడంతో వెంటనే వైద్యం ప్రారంభించారు. ఇటీవలే ఆమెకు కీమోథెరపీ కూడా చేశారు. ఇలాంటి సమయంలో అమ్మ ప్రేమ తనపై చూపించిన ప్రేమను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.హీనా ఖాన్ తన ఇన్స్టాలో.. 'మనకు ఏదైనా జరిగిన తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో నాకు అర్థమైంది. తన పిల్లలకు ప్రేమ, సాంత్వన అందించడానికి ఎంత బాధనైనా భరిస్తుంది. నా రోగం గురించి తెలుసుకున్న రోజు ఆమె అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేను. కానీ ఆమెనే నన్ను పట్టుకుని తన బాధను మరచిపోయేందుకు యత్నించింది. తల్లులే ఎల్లప్పుడూ మన జీవితంలో ఒక సూపర్ పవర్. ఆమె ముందు ప్రపంచం కూడా చిన్నదే. ఆమె తన చేతుల్లో నన్న ఓదార్చి నాకు బలాన్ని ఇవ్వడానికి ఎంతో తపన పడింది' అంటూ పోస్ట్ చేసింది. తల్లి ఒడిలో కూర్చుని ఉన్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.కాగా.. హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్తో ఫేమస్ అయింది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్బాస్ 11వ సీజన్లోనూ అలరించింది. సినిమాలు, వెబ్ సిరీస్లలోనూ మెప్పించింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) -
సీరియల్ నటి మహేశ్వరి కుమారుడి నామకరణం వేడుక (ఫోటోలు)
-
సీరియల్ యాక్టర్ సునంద మాల శెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
క్యాన్సర్తో పోరాటం.. మీకు ఈ కాలిన మచ్చలే కనిపిస్తున్నాయా?: నటి
బుల్లితెర నటి హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్తో పోరాడుతోంది. ప్రాణాంతక మహమ్మారి సోకిందని భయంతో వణికిపోకుండా దాన్ని జయిస్తానని ధైర్యంగా నిలబడింది. కానీ కూతురికి క్యాన్సర్ రావడాన్ని తట్టుకోలేని ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. హీనా ఖాన్కు ప్రస్తుతం క్యాన్సర్ మూడో స్టేజీలో ఉంది. దీంతో వెంటనే వైద్యం ప్రారంభించారు. కీమోథెరపీ చేశారు. ఇందుకోసం జుట్టు కత్తిరించారు.శరీరంపై గాయాలుఫస్ట్ కీమోథెరపీ అయిపోయిందంటూ నటి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. అందులో హీనా చేతి కింద, మెడపైన కాలిన మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 'ఈ ఫోటోలో మీకు నా శరీరంపై ఉన్న మచ్చలు కనిపిస్తున్నాయా? లేదా నా కళ్లలోని ఆత్మవిశ్వాసం కనిపిస్తోందా? ఈ కాలిన మచ్చలను చూసి నేనేం బాధపడటం లేదు. నువ్వు ఒక ఫైటర్ఎందుకంటే చికిత్స విజయవంతంగా ముందుకు సాగుతుందనడానికి ఇదే నిదర్శనం. నా కళ్ల ద్వారా విజయకాంతిరేఖలను చూడగలుగుతున్నాను' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు.. నువ్వొక ఫైటర్వి.. జాగ్రత్తగా ఉండు హీనా అని కామెంట్లు చేస్తున్నారు.కెరీర్..కాగా హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్తో ఫేమస్ అయింది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్బాస్ 11వ సీజన్లోనూ అలరించింది. సినిమాలు, వెబ్ సిరీస్లలోనూ మెప్పించింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: ఓటీటీలో రియల్స్టోరీతో సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ -
Tejaswini Gowda: సీతామహాలక్ష్మిలా మురిపిస్తోన్న బుల్లితెర నటి (ఫోటోలు)
-
ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన బుల్లితెర నటి
బుల్లితెర నటి దేవలీన భట్టాచార్జి త్వరలో తల్లి కాబోతుందంటూ ఓ వార్త వైరల్గా మారింది. తాజాగా ఈ రూమర్స్పై నటి స్పందించింది. 'నేను ప్రెగ్నెంటా? అని అడుగుతూ చాలాకాలంగా మెసేజ్లు వస్తున్నాయి. అది నాకు చెప్పాలని అనిపించినప్పుడే చెప్తాను. అయినా ఇలాంటిదేదైనా ఉంటే నా అంతట నేనే చెప్తా. అప్పటివరకు నన్ను వదిలిపెట్టండి.నేను ప్రెగ్నెంటో? కాదో? తెలుసుకుని మీరేం చేస్తారు? నాకేదైనా మంచి విషయాలు, సూచనలు చెప్తారా? లేదా ట్రోల్ చేస్తారా? ఇప్పుడవన్నీ పట్టించుకునే స్థితిలో నేను లేను. ఇది నా జీవితం. నాకు నచ్చినట్లు బతకనివ్వండి. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా దేవలీనా.. షానవాజ్ షైఖ్ను 2022 డిసెంబర్లో పెళ్లి చేసుకుంది.చదవండి: కల్కిపై తారల రివ్యూ.. నాగ్, రజనీ, దేవరకొండ ఏమన్నారంటే? -
ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ బ్రేకప్.. అందుకే అలా చేశారా?
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ ప్రకాశ్ బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న నటి హిందీలో పలు సీరియల్స్లో నటిస్తోంది. ఆమె ప్రస్తుతం ఏక్తా కపూర్ సూపర్ నేచురల్ టీవీ షో నాగిన్- 6లో నటిస్తోంది. అంతేకాదు తేజస్వి ప్రకాష్ బిగ్బాస్-15 సీజన్ విజేతగా నిలిచింది. అయితే బిగ్బాస్ షోలో ఉన్న సమయంలోనే నటుడు కరణ్ కుంద్రాను ప్రేమించింది. గత మూడేళ్లుగా ఈ జంట డేటింగ్లో ఉన్నారు.తాజాగా వీరిద్దరు తమ ప్రేమ బంధానికి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. కరణ్, తేజస్వీ దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్ చెప్పుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా వీరి మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తాయని.. దీంతో బ్రేకప్ నిర్ణయానికి వచ్చారని వారి సన్నిహితులు తెలిపారు. అయితే విడిపోయినట్లు వస్తున్న వార్తలపై తేజస్వీ ప్రకాశ్, కరణ్ కుంద్రా ఇప్పటివరకు స్పందించలేదు.అయితే ఇటీవలే కొద్ది రోజుల క్రితమే కరణ్, తేజస్వి ముంబయిలోని జంటగా కనిపించారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్ వెలుపల ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. బ్రేకప్ రూమర్స్ నేపథ్యంలో ఇద్దరు జంటగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము విడిపోతున్నట్లు వార్తలు రావడంతో వాటికి చెక్ పెట్టేందుకే జంటగా కనిపించారా? అన్నది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) -
నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు
కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా కసౌటీ జిందగీ కే సీరియల్లో కోమలిక అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి గుర్తింపు పొందింది ఊర్వశి ఢోలకియా. ఈ సీరియల్ వచ్చి దాదాపు 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆమెను కోమలికగానే ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. తాజాగా ఆమె దీని గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటికీ జనాలు నన్ను కోమలిక అనే పిలుస్తారు. ఆ ఒక్క పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకున్నారంటే నేను వేరే సీరియల్స్ ఏమీ చేయలేనని కాదు! నా విషయంలో దర్శకులు, నిర్మాతల క్రియేటివిటీ ఏమైపోయిందోనని అర్థం! ఇకపై అలాంటివి చేయనుఎన్నో పాత్రలు పోషించాను కానీ వాటికంత గుర్తింపు రాకుండా పోయింది. ఒకే రకమైన పాత్రలు చేసి బోర్ కొడుతోంది. ఇకపై నెగెటివ్ రోల్స్ చేయను. ప్రస్తుతం న్యాయవాదిగా పాజిటివ్ రోల్ చేస్తున్నాను. అందుకు సంతోషంగా ఉంది. ఇక మీదట కూడా ఇలాంటివే చేయాలనుంది. ప్రేక్షకులు ఊహించని పాత్రల్లో కనిపించాలనుంది. ఓటీటీల విషయానికి వస్తే ఇప్పుడు దానికి చాలా క్రేజ్ ఉంది. కానీ గతేడాది ఈ ప్లాట్ఫామ్లో నన్ను తిరస్కరించారు. ఓటీటీలు నన్ను పక్కన పెట్టేశాయినిన్ను టీవీలోనే చాలామంది చూసేశారు.. అని ఛాన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. అసలు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో టీవీ సెలబ్రిటీలే లేరా? అంతటా ఉన్నారు.. మరి ఎందుకని నన్ను అలా చిన్నచూపు చూశారని బాధేసింది. అయినా నాకు ఓటీటీల నుంచి ఎటువంటి మంచి ఛాన్సులు రావడం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ఊర్వశి ప్రస్తుతం పుష్ప ఇంపాజిబుల్ అనే సీరియల్ చేస్తోంది. అందులో లాయర్ దేవి సింగ్ శిఖావత్గా నటిస్తోంది. చదవండి: ఆ డైరెక్టర్ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు.. -
నటి జ్ఞాపకాలు తొలగించిన భర్త.. నిజాలు మాయం చేయలేవంటూ..
బుల్లితెర నటి దల్జీత్ కౌర్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించింది. తన లైఫ్లో దుఃఖానికి చోటు లేదనుకున్న ఆమెకు నిరాశే ఎదురైంది. ఏడాది తిరిగేలోపు పుట్టింటికి వచ్చేసింది. భర్త నిఖిల్ పటేల్ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నందువల్లే తన కాపురం కుప్పకూలిందని ఇటీవలే వెల్లడించింది. అయితే తన గురించి ఇలా అడ్డగోలుగా మాట్లాడితే బాగోదని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు.గుర్తులను చెరిపేస్తూ..తాజాగా ఇతడు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేశాడు. గతంలో దల్జీత్ వేసిన పెయింటింగ్ కనిపించకుండా గోడకు తెలుపు రంగు వేశాడు. ఇది చూసిన నటి సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. గోడ మీద ఉన్న ఆర్ట్ను చెరిపేస్తున్నావ్.. కానీ నిజాన్ని నువ్వు మాయం చేయలేవు అని విరుచుకుపడింది.రెండో పెళ్లి కూడా ఫెయిల్కాగా గతేడాది మార్చిలో దల్జీత్, నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. అప్పటికే పిల్లలు కూడా ఉన్నారు. నిఖిల్తో ఓ కూతురు కలిసి ఉంటుండగా దల్జీత్కు ఓ కుమారుడు ఉన్నాడు. రెండో పెళ్లి కూడా ఫెయిలవడంతో అభిమానులు దల్జీత్ పట్ల సానుభూతి చూపిస్తున్నారు.చదవండి: సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ -
నేను వాడిపడేసిన టిష్యూ ఏరుకుంది: నటి
వెర్రి వేయిరకాలంటారు. ముఖ్యంగా కొందరు వీరాభిమానుల ప్రవర్తన వెర్రితనంలాగే కనిపిస్తుంది. అందుకు హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్ చెప్పిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం హీనా ఖాన్ నటించిన నామాకూల్ అనే వెబ్ సిరీస్ అమెజాన్ మినీటీవీలో ప్రసారమవుతోంది. అందులో అందరూ ఇష్టపడే టీచర్ పాత్రను పోషించింది.కన్నార్పకుండా చూసేదితాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఇబ్బందికర సంఘటనను పంచుకుంది. ఓ ప్రాజెక్ట్ కోసం ఉత్తరాఖండ్ షూటింగ్లో పాల్గొన్నాను. అది జనాలు తిరుగుతూ ఉండే ప్రదేశం. ఒక అమ్మాయి రోజూ అక్కడికి వచ్చి నన్ను కన్నార్పకుండా చూస్తుండేది. తనను గమనించి పిలిచి మాట్లాడాను. తనతో కాసేపు కాలక్షేపం చేశాను. కానీ కొద్దిరోజులకు తను అలాగే చూస్తూ ఉండటం నాకు కొంత అసౌకర్యంగా అనిపించింది. ఇబ్బందిపడ్డా..పూర్తిగా నా మీదే దృష్టి పెట్టకుండా కాస్త చుట్టుపక్కల కూడా చూడమని నా టీమ్తో చెప్పించాను. నేను ఇబ్బందిపడుతున్నానని అర్థమవడంతో వెంటనే వెళ్లిపోయింది. కానీ మర్నాడే సెట్కు వచ్చింది. ఆరోజు నేను బాధాకరమైన సీన్లో నటించాలి. ఏడుస్తూ ఉన్నాను. కాసేపటికి టిష్యూతో కళ్లు తుడుచుకుని దాన్ని చెత్తబుట్టలో పడేశాను. వెంటనే ఆ అమ్మాయి డస్ట్బిన్ అంతా వెతకడం మొదలుపెట్టింది. భయపడిపోయానేను వాడిన టిష్యూను అందులో నుంచి తీసుకుని జాగ్రత్తగా తన వద్ద పెట్టుకుంది. ఆమె అలా చేయడం చూసి నేను షాకయ్యాను.. చెప్పాలంటే భయపడ్డాను కూడా! అభిమానం ఉండొచ్చు, కానీ దానికి కూడా హద్దులుండాలి అని హీనా ఖాన్ చెప్పుకొచ్చింది. కాగా యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్తో గుర్తింపు పొందిన హీనా ఖాన్ కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్బాస్లోనూ అలరించింది.చదవండి: ఐదేళ్ల క్రితమే సీక్రెట్గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ -
ఐదేళ్ల క్రితమే సీక్రెట్గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ
సెలబ్రిటీల కెరీర్ కన్నా పర్సనల్ లైఫ్ మీదే అభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. వారి ప్రేమ వ్యవహారాలు-పెళ్లి-విడాకులపైనే ఎక్కడలేని ఇంట్రస్ట్ చూపిస్తారు. అలా బుల్లితెర నటి సుమిత్ సింగ్ నటుడు షాగుణ్ పాండేతో డేటింగ్లో ఉందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు నటి డేటింగ్ గురించి గుసగుసలు మొదలుపెట్టారు.నటుడితో డేటింగ్?ఆ వార్త తనదాకా చేరడంతో నటి సుమిత్ సింగ్ ఈ రూమర్స్ను కొట్టిపారేసింది. షాగుణ్తో డేటింగ్లో లేనని క్లారిటీ ఇచ్చింది. ఇంతలో సోషల్ మీడియాలో నటి సుమిత్, దర్శకుడు పుష్పేందర్ సింగ్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. వీరిద్దరికీ ఐదేళ్ల క్రితమే పెళ్లయిందని తెలుస్తోంది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడట!మేము విడిపోయాంఐదేళ్ల క్రితం నాటి వెడ్డింగ్ పిక్స్ లీక్ అవడంతో ఎట్టకేలకు తన పెళ్లిపై నోరు విప్పింది సుమిత్. ఆమె మాట్లాడుతూ.. 'మేము 2018లో పెళ్లి చేసుకున్నాం. మాకు బాబు పుట్టాడు. అతడి పేరు రుద్ర. అయితే నా భర్త, నేను విడిపోయి చాలారోజులే అవుతోంది. అతడితో నాకిప్పుడు ఏ సంబంధమూ లేదు. మేము కలిసుండటం లేదు. విడిపోయాం. అయినా ఇప్పుడు నా వ్యక్తిగత విషయాలను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు' అని అసహనం ప్రదర్శించింది.చదవండి: నా కూతురు చూసిన ఒకే ఒక్క సినిమా ఆదిపురుష్: నటుడు -
Keerthi Bhatt: కాబోయే భర్తతో సీరియల్ నటి కీర్తి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
మొన్నే భర్తను తిట్టింది.. ఇప్పుడేమో పెళ్లి వీడియో.. అంతలోనే..
బుల్లితెర నటి దల్జీత్ కౌర్కు పెళ్లి అచ్చి రావడం లేదు. 2009లో నటుడు షాలిన్ బానోత్ను పెళ్లి చేసుకుంది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. విడదీయలేని బంధం అనుకునేలోపే మనస్పర్థల వల్ల 2015లో విడాకులు తీసుకున్నారు. తర్వాత దుబాయ్లో జరిగిన పార్టీలో నిఖిల్ పటేల్ అని వ్యక్తి పరిచయమయ్యాడు. అతడికి ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. కానీ అప్పటికే భార్యతో విడిపోయి కూతురితో కలిసి జీవిస్తున్నాడు. ఏడాది తిరిగేసరికే..అటు దల్జీత్.. ఇటు నిఖిల్.. ఇద్దరూ సింగిల్ పేరెంట్సే అవడంతో పిల్లల గురించి మాట్లాడుకున్నారు. ఈ కబుర్లు కాస్తా ప్రేమకు దారితీశాయి. దీంతో ఇద్దరూ గతేడాది మార్చిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఏడాది తిరిగేసరికే ఇద్దరి మధ్య ప్రేమ కనుమరుగైంది. మౌనం ఆవహించింది. కొడుకును తీసుకుని దల్జీత్ పుట్టింటికి వచ్చేసింది. పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. భర్త చీటింగ్ చేశాడని సోషల్ మీడియాలో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పెళ్లి వీడియో షేర్ చేసిన నటినెట్టింట ఇంత రచ్చ చేసిన ఆమె శనివారం నాడు గతేడాది జ్ఞాపకాలు అంటూ నిఖిల్తో జరిగిన పెళ్లి వీడియో షేర్ చేసింది. అందులో హల్దీ, పెళ్లి, రిసెప్షన్ అన్నీ ఉన్నాయి. నాన్నకు తోడు దొరికిందంటూ నిఖిల్ కూతురు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. పదిహేను నెలల క్రితం అన్న క్యాప్షన్తో ఈ వీడియో షేర్ చేసిన నటి కొద్ది క్షణాల్లోనే దాన్ని డిలీట్ చేసింది. అప్పటికే అది చూసిన నెటిజన్లు.. అక్కడే ఆగిపోకు.. ముందుకు సాగాలికదా.. అతడు నిన్ను మోసం చేశాడు.. కొంచెమైనా ఆత్మాభిమానం ఉందా? అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు.చదవండి: ఉన్నదంతా స్టార్ హీరోలకే.. మిగతా యాక్టర్స్కు ఏం మిగలట్లేదు! -
శుబ్మన్ గిల్తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
హిందీ బుల్లితెర నటి రిద్ధిమా పండిత్, టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్గిల్ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో ఏడడుగులు వేయబోతున్నారంటూ ఓ వార్త నెట్టింట ప్రత్యక్షమైంది. దీంతో అభిమానులు ఇది నిజమేనని భావించి నటికి కంగ్రాట్స్ చెప్తున్నారు. తనకే తెలియకుండా తన పెళ్లి చేస్తుండటంతో నటికి స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నాకే తెలియకుండా పెళ్లా?ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసి రూమర్స్కు చెక్ పెట్టింది. అందులో రిద్ధిమా మాట్లాడుతూ.. 'ఈ రోజు ఉదయాన్నే చాలామంది జర్నలిస్టులు నాకు ఫోన్ చేసి పెళ్లి గురించి అడిగారు. వారి ఫోన్తోనే నిద్ర లేచాను. నాకే తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నానా? నిజంగా అలాంటి గుడ్న్యూస్ ఏదైనా ఉంటే నేనే సంతోషంగా సోషల్ మీడియాలో ప్రకటిస్తాను కదా.. కాబట్టి మీరు అనుకుంటుందేదీ నిజం కాదు. అసలు శుబ్మన్ గిల్తో వ్యక్తిగత పరిచయమే లేదు. అదంతా ఫేక్' అని పేర్కొంది. ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం కూడా లేదంది.చేదు అనుభవంకాగా రిద్ధిమా పండిత్.. బాహు మహారి రజనీకాంత్ సీరియల్లో ముఖ్య పాత్రలో నటించింది. అలాగే ఖాత్ర ఖాత్ర ఖాత్ర అనే షోలోనూ మెరిసింది. హిందీ బిగ్బాస్ ఫస్ట్ ఓటీటీ సీజన్లోనూ పాల్గొంది. కాగా ఇటీవల రిద్దిమా ఓ ఇంటర్వ్యూలో టీవీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఇండస్ట్రీలో ఉండే వేధింపుల గురించి ఎవరూ మాట్లాడరు. నేను పని చేసిన ఓ షోలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత నన్ను మానసికంగా వేధించాడు. మా అమ్మకు ఆరోగ్యం బాలేక ఆస్పత్రిపాలైంది. ఐసీయూలో అడ్మిట్ కావడంతో నేను తట్టుకోలేకపోయాను. అమ్మ ఐసీయూలో ఉంటే..ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంట మధ్య, సాయంత్రం నాలుగింటి నుంచి ఐదున్నర గంటల మధ్య మాత్రమే చూసేందుకు అనుమతిచ్చేవారు. అమ్మకు బాగోలేదు.. నేను తొమ్మిదింటికి షూట్కు వస్తాను అని అడిగాను. పోనీ ఉదయం 7 గంటకు వచ్చినా సాయంత్రం నాలుగుకల్లా వెళ్లిపోతానన్నాను. కావాలంటే తర్వాత ఎక్కువ గంటలు ఉంటానన్నాను. అయినా తను పట్టించుకోలేదు. నా మాట లెక్కచేయలేదు, తను చెప్పిన సమయానికే రావాలనేవాడు. ఎక్కడ ప్రాజెక్ట్లో నుంచి తీసేస్తారోనన్న భయంతో ఎవరూ ఇలాంటివి బయటకు చెప్పరు' అని రిద్ధిమా చెప్పుకొచ్చింది. #shubmangill#ridhimapandit#gill https://t.co/jioVAELCxj pic.twitter.com/IbAiyvzMjh— 🌚 (@NikiChristian11) May 31, 2024 చదవండి: తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే? -
పిచ్చి కూతలు కూసేముందు నీ కాపురమేమైందో చూసుకో: నటి
హిందీ బిగ్బాస్ 17వ సీజన్లో బుల్లితెర జంట ఇషా మాల్వియా- సమర్థ్ జురేల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ బిగ్బాస్ హౌస్లో అభిషేక్ (ఇషా మాల్వియా మాజీ ప్రియుడు)ను చులకనగా చేసి మాట్లాడటం.. అతడు ఆవేశంతో సమర్థ్ చెంప చెళ్లుమనిపించడం.. ఎంతగానో వైరలయ్యాయి. హౌస్లో ఒకరిపై మరొకరు అంత ప్రేమ కురిపించుకున్నారు కానీ, షో నుంచి బయటకు వచ్చాక మాత్రం ఆ ప్రేమను కంటిన్యూ చేయలేకపోయారు. కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు.నాకెప్పుడో తెలుసువీళ్ల బ్రేకప్ను ఎప్పుడో ఊహించానంటూ నటి రింకూ ధావన్ సెటైర్లు వేసింది. 'కేవలం ఆరు నెలల్లో ఇషా నెక్స్ట్ ఎవరిని డేటింగ్ చేస్తుందనే వార్తను చదవాల్సి వస్తుందని సమర్థ్కు బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడే చెప్పాను. ఆమె నిలకడగా ఓ చోట ఉండలేదు' అని వ్యాఖ్యానించింది. తాజాగా ఈ కామెంట్స్పై నటి ఇషా మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చి కూతలు ఆపు'రింకూ సంసారం కూడా సరిగ్గా సాగనేలేదు. నేను ఈ మాట అనకూడదు.. కానీ నా గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. తనకు విడాకులయ్యాయి. ఒక్కతే 20 ఏళ్ల కుమారుడిని చూసుకుంటూ బతికేస్తోంది. నా విషయంలో ఏమైంది? బ్రేకప్ చెప్పుకున్నా, రిలేషన్లో ఉన్నా మేము బాగానే ఉన్నాం. ఆమె తన గురించి తాను చూసుకుంటే బెటర్. పక్కవాళ్ల మీద ఫోకస్ చేసి వారి గురించి పిచ్చి కూతలు కూసి హైలైట్ అవ్వాలని చూస్తే బాగోదు' అని ఇషా వార్నింగ్ ఇచ్చింది.చదవండి: కజ్రారే సాంగ్.. లైవ్లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్.. -
బుల్లితెరపై శ్రీమద్ రామాయణం.. మిస్ట్ కాల్తో బహుమతి గెలవండి!
సమాజానికి ఆదర్శవంతమైన విలువలను చాటి చెప్పిన శ్రీ మహా విష్ణువు అవతార గాథే " శ్రీ మధ్ రామాయణం". తండ్రి మాట జవదాటని కొడుకుగా.. అన్నగా.. ఏకపత్నీవ్రతుడిగా.. స్నేహితుడిగా.. ప్రజల క్షేమం కోసం ధర్మం తప్పని రాజుగా.. అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరామగాథను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదని చెబుతుంటారు. రామాయణ ప్రియుల కోసం టీవీ సీరియల్ వచ్చేస్తోంది. ఈ శ్రీమద్ రామాయణం సీరియల్లో.. శ్రీ రాముని అవతార విశిష్టత , జన్మ వృత్తాంతం, లంకాధిపతి అయిన రావణాసురుడి జన్మ వృత్తాంతం నుంచి రామాయణంలోని అన్ని ఘట్టాలను కనులకు కట్టినట్లుగా చూపించనున్నారు. అద్భుతమైన సాంకేతిక విలువలతో చిత్రీకరించి శ్రీ రామ గాథను బుల్లితెర అభిమాన ప్రేక్షకులందరినీ అలరించేందుకు వచ్చేస్తోంది.శ్రీ మహర్షి వాల్మీకి రచించిన రామాయణాన్ని 'శ్రీమద్ రామాయణంగా' సూపర్ గ్రాఫిక్ టెక్నాలజీతో, అనుభవజ్ఞులైన నటీనటులతో, ఆకట్టుకునే డైలాగ్స్తో రూపొందించారు. ఈనెల 27 నుంచి బుల్లితెర ప్రియులను ఈ సీరియల్ అలరించనుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానుంది.ఈ సీరియల్ ప్రారంభ సందర్భంగా "జెమినిలో కాసుల వర్షం” అనే కాంటెస్ట్ నిర్వహిస్తోంది. మే 27 నుండి జూన్ 1 వరకు ఆరు రోజులపాటు అడిగే ప్రశ్నలకు ప్రేక్షకులు మిస్డ్ కాల్ ద్వారా సమాధానాలను తెలియజేసి బహుమతులను పొందే అవకాశం కల్పించింది. ప్రతి రోజు 500 మంది లక్కీ విజేతలని ఎంపిక చేయనున్నారు. -
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
-
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చందు ప్రస్తుతం త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్లో నటించారు. కాగా.. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఓ యూట్యూబ్ ఛానెల్తో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని వెల్లడించారు. కాగా.. పవిత్రతో సహజీవనం చేసిన చందు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో చందు సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో సీరియల్ నటి పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరగనుంది. -
ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్స్టా పోస్ట్, వీడియో వైరల్
కన్నడ బుల్లితెర నటి పవిత్రా జయరామ్ అకాల మరణం పరిశ్రమ వర్గాలను, తోటి నటీనటులను సహోద్యోగులు,అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రినయని తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన పవిత్ర మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. అయితే చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో జవిత్ర జయరామ్ చందర్ చివరి ఇన్స్టా పోస్ట్ ఒకటి వైరల్ మారింది. నటుడు, భర్త చందూతో కలిసి చేసిన రీల్ నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.త్రినయని సీరియల్లో సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్ని చేస్తూ ఆమె చివరి ఇన్స్టా పోస్ట్ ఇది. "నా ప్రేమ ఎప్పుడూ నీదే పాపా @chandrakanth_artist మిస్ యూ పాపా ఎందుకు అంత ఏడుస్తున్నావు నన్ను నీతోనే వున్నారా పిచ్చోడా లవ్ యు మామా" అని క్యాప్షన్ ఉన్న పోస్ట్ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar) అలాగే ‘‘ఆల్వేస్ మై లవ్ ఫర్ యూ మామా, లవ్ యూ సో మచ్.. చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా.. కానీ, ఆ దేవుడు పిలుస్తున్నాడు.. నాన్నా, నువ్వ టైమ్కి తిను’’ అంటూ మరో పోస్ట్ ఉంది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తరువాత పోస్ట్లు ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందూనే పోస్ట్ చేస్తున్నాడు మరికొంతమంది కమెంట్ చేయడం గమనార్హం. మదర్స్ డే రోజు విషాదం ఆర్ఐపీ పవిత్ర అంటూ చాలామంది నెటిజన్లు స్పందించారు. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు.. ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్ సంతాపం ప్రకటించారు. త్రినయని సీరియల్లో పవిత్ర ఆన్-స్క్రీన్ సోదరుడు పరశురామ్గా చంద్రకాంత్ నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar)పవిత్రా జయరాం మృతిపై నటుడు సమీప్ ఆచార్య సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశారు. “మీరు ఇక లేరనే వార్తతో మేల్కొన్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. నా తొలి ఆన్స్క్రీన్ తల్లి, మీరు ఎప్పుడూ ప్రత్యేకమే.” అంటూ పోస్ట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని మెహబూబా నగర్ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చంద్రకాంత్తో అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ తదితరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. -
తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్
తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (మే 12న) జరిగిన రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జయరామ్ మరణించింది. ఈ విషాద వార్తను ఆమె భర్త, నటుడు చంద్రకాంత్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. పవిత్ర ఇక లేదన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. నాకోసం వచ్చేసేయ్'పాపా.. నీతో దిగిన చివరి ఫోటో ఇదేరా! నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావంటే నమ్మలేకపోతున్నాను. ఒకసారి మామా అని పిలువే ప్లీజ్.. నా కోసం తిరిగి వచ్చేయ్రా..' అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. కాగా పవిత్ర జయరామ్ స్వస్థలం కర్ణాటకలోని మాండ్య. మొదట్లో హౌస్ కీపర్గా, సేల్స్ గర్ల్గా పని చేసిన ఈమె తర్వాత కన్నడ సీరియల్స్లో అడుగుపెట్టింది. అక్కడి నుంచి నిన్నే పెళ్లాడతా సీరియల్తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సీరియల్తో ఫేమస్'త్రినయని' సీరియల్ ద్వారా బాగా క్లిక్కయింది. ఇందులో తిలోత్తమగా విలనిజం పడించింది. అంతకుముందు కన్నడ సీరియల్స్ చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క ధారావాహికతో సంపాదించింది. నటుడు చంద్రకాంత్ కూడా ఇదే సీరియల్లో నటిస్తున్నాడు. నటి మరణవార్త తెలిసిన తారలు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Challa Chandu II (@chandrakanth_artist)