tv actress
-
ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!
బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న జంట ప్రియాంక చాహర్ చౌదరి, అంకిత్ గుప్తా. బిగ్ బాస్ సీజన్- 16లో వీరిద్దరు కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. ఈ సీజన్లో ప్రియాంక సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఆ రియాలిటీ షో తర్వాత వీరిద్దరు పలు సీరియల్స్లోనూ నటించారు. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం కాబోయే తేర్రే హో జాయేన్ హమ్ షో కోసం జతకట్టనున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ బుల్లితెర జంట ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక, అంకిత్ తమ రిలేషన్కు గుడ్ బై చెప్పనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారని టాక్ వినిపించింది. కానీ తాజా పరిణామాలతో ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నట్లు బీటౌన్లో టాక్ నడుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తం చేశారు. అయితే ఒకరినొకరు అన్ఫాలో చేసినప్పటికీ.. ఇన్స్టాగ్రామ్ ఫోటోలు తొలగించలేదు. అయితే ఇదంతా రాబోయే కొత్త షో కోసం ఇలా చేశారా? అని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా.. అంకిత్ గుప్తా, ప్రియాంకతో బాలికా వధు, సద్దా హక్ సిరీయల్స్లో జంటగా నటించారు. ప్రియాంక చాహర్ చౌదరి శ్రీ విష్ణు హీరోగా నటించే తెలుగు చిత్రం హీరో హీరోయిన్లో కనిపించనుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్ కూడా నటించనుంది. -
మూడుసార్లు మిస్క్యారేజ్, కెరీర్కు నటి గుడ్బై.. ఇన్నాళ్లకు గుడ్న్యూస్
బుల్లితెర నటి, తెలుగమ్మాయి గౌరీ నాయుడు (Actress Gowri Naidu) గుడ్న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. 2018లో రాజశేఖరన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. పలుమార్లు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటికీ ఆ గర్భం నిలవకుండానే పోయింది. దీంతో ఎంతో బాధపడ్డ ఆమెకు ఈసారి బిడ్డ పుట్టడంతో సంతోషంలో మునిగి తేలుతోంది.ఉత్తమ విలన్గా అవార్డుఆడదే ఆధారం, మనసు-మమత, ప్రేమ ఎంత మధురం, మల్లి వంటి పలు సీరియల్స్లో నటించింది. ఉత్తమ విలన్గా అవార్డు కూడా అందుకుంది. కానీ కొంతకాలంగా గౌరీ బుల్లితెరకు దూరంగా ఉంటోంది. నిజానికి సీరియల్స్తోనే ఆగిపోకుండా సినిమాలు కూడా చేయాలన్నది ఆమె కోరిక. కానీ సీరియల్స్లో నటించే సమయంలో వరుసగా మూడుసార్లు గర్భస్రావం అయింది. ఆ బాధను తట్టుకోలేకపోయింది.ముగ్గురు పిల్లలు దేవుడి దగ్గరే..దానికి తోడు ఎంతమంది పిల్లలు? అన్న జనాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది. చివరకు విసుగొచ్చి నాకు ముగ్గురు పిల్లలు.. కానీ ఆ ముగ్గురు దేవుడి దగ్గరే ఉన్నారంటూ అప్పట్లో ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. వరుస అబార్షన్ల వల్ల తనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో ఆమె కెరీర్కు బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో గతేడాది గర్భం దాల్చింది. అప్పటినుంచి బేబీ బంప్తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తూ వస్తోంది. సీమంతం ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇప్పుడు బేబీ జన్మించింది. మరి పాపను ఎప్పుడు చూపిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by actress gowrinaidu🇮🇳 (@actressgowrinaidu) View this post on Instagram A post shared by actress gowrinaidu🇮🇳 (@actressgowrinaidu) చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'మహాతల్లి' -
భర్తతో బుల్లితెర నటి వాసంతి హోలి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
సీక్రెట్ పెళ్లి.. నాలుగు నెలలకే విడాకులు.. స్పందించిన బుల్లితెర నటి
ఇటు ప్రేమ కావాలి, అటు కెరీర్ కావాలి అనుకుంది హిందీ బుల్లితెర నటి అదితి శర్మ (Aditi Sharma). అందుకే నాలుగేళ్లుగా డేటింగ్లో ఉన్న ప్రియుడు అభిజిత్ కౌశిక్(Abhineet Kaushik)ను సీక్రెట్గా పెళ్లాడింది. దంపతులుగా కొత్త జీవితం ప్రారంభించి నాలుగు నెలలైందో లేదో అప్పుడే విడాకులు కావాలన్నాడు అభిజిత్. అదితి.. నటుడు సమర్థ్య గుప్తా అత్యంత సన్నిహితంగా ఉండటం చూశానని, తనతో ఉండలేనని మీడియా ముందు వాపోయాడు.సీక్రెట్ పెళ్లి- విడాకులు.. స్పందించిన నటితాజాగా ఈ విడాకుల వ్యవహారంపై అదితి తొలిసారిగా స్పందించింది. పెళ్లయిన నెలకే గొడవలు మొదలయ్యాయి. నాతో దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇంకా చాలా జరిగాయి. కానీ విడాకుల వ్యవహారం కోర్టులో ఉన్నందున ఇప్పుడవేవీ చెప్పలేను. అతడితో ఉండలేనని అర్థమైంది. అందుకే శాంతియుతంగా విడిపోవాలనుకున్నాం. ఇరు కుటుంబాలు అందుకు ఒప్పుకున్నాయి. అతడు చాలాసార్లు నా ఫ్రెండ్స్ ముందు.. నన్ను, నా కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడాడు. కానీ నేను ఎన్నడూ అతడి కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. తనలా నేను హింసించలేదు. మనస్ఫూర్తిగా ప్రేమించాను.అందుకే చెప్పలేదుమరో విషయం.. మేము రహస్యంగా పెళ్లి చేసుకోలేదు. మా కుటుంబాలు, క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులందరికీ మా వివాహం గురించి తెలుసు. అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మా పెళ్లి జరిగింది. నా కెరీర్ గ్రాఫ్ బాగుంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకున్నానని తెలిస్తే బాగోదనిపించింది. ఎందుకంటే అపోలెనా సీరియల్లో నేను 18 ఏళ్ల అమ్మాయి పాత్ర పోషిస్తున్నాను. అందుకే పబ్లిక్కు ఈ విషయం గురించి ఇప్పుడే చెప్పకూడదనుకున్నాను అని అదితి శర్మ చెప్పుకొచ్చింది. అపోలెనా సీరియల్ నటుడు సమర్థ్య గుప్తాతో అదితిఆన్స్క్రీన్ కపుల్ మాత్రమే..ఇకపోతే అపోలెనా సీరియల్లో సమర్థ్య గుప్తా- అదితి జంటగా నటిస్తున్నారు. వీరు సన్నిహితంగా ఉంటూ దొరికిపోయారన్న అభిజిత్ మాటలపై సమర్థ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము ఆన్స్క్రీన్పై మాత్రమే జంటగా కనిపిస్తామన్నాడు. అభిజిత్ చెప్పినట్లుగా తాము అడ్డంగా దొరికిపోయామన్నదాంట్లో ఎటువంటి నిజం లేదని వెల్లడించాడు. ఇలాంటి పిచ్చికామెంట్ల వల్ల తన పేరెంట్స్ ఇబ్బందిపడుతున్నారన్నాడు.చదవండి: ‘దిల్ రూబా’ మూవీ రివ్యూ -
సీక్రెట్గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు తీసుకున్న నటి!
బాలీవుడ్లో నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎంత సహజమో..విడిపోవడం అంతే సహజం. ఇలా పెళ్లి చేసుకోని అలా విడాకులు తీసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో జంట విడిపోయింది. బాలీవుడ్ బుల్లితెర నటి,అపోలీనా(ఫేమస్ సైన్స్ డ్రామా సిరిస్) ఫేం అదితి శర్మ తన భర్త అభిజిత్ కౌశిక్తో విడిపోయినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్లో సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగు నెలల కూడా కలిసి కాపురం చేయలేకపోయింది.నాలుగేళ్లుగా సహజీవనం.. సీక్రెట్గా పెళ్లిబాలీవుడ్ బుల్లితెరపై అదితి శర్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియళ్లతో పాటు పలు షోలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత నాలుగేళ్లుగా ఆమె అభిజిత్ కౌశిక్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఈ విషయం బాలీవుడ్ మొత్తానికి తెలుసు. సోషల్ మీడియాలోనూ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసేవారు. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత గతేడాది నవంబర్లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం అత్యంత రహస్యంగా జరిగింది. తన కెరీర్కి ఇబ్బంది కలుగొద్దని ఇలా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు ఆమె ప్రవర్తన నచ్చక విడిపోయామని ఆమె భర్త అభిజిత్ కౌశిక్ చెప్పారు. అదితి ఒత్తిడితోనే పెళ్లి!తాజాగా ఆయన తన న్యాయ సలహాదారు రాకెశ్ శెట్టితో కలిసి ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘అదితి నేను నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నాం. గతేడాది నవంబర్ 12న మేం సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాం. ఏడాదిన్నరగా అదితి నాపై ఒత్తిడి తెవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి ఓకే చెప్పాను. పెళ్లి విషయం బయటకు తెలిస్తే తన కెరీర్కి ఇబ్బంది అవుతుందని అదితి చెప్పడంతో మా ఇద్దరి ఫ్యామిలీల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకున్నాం. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి’ అని అభిషేక్ చెప్పారురూ.25లక్షలు డిమాండ్అదితి శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న అభిషేకే ఇప్పుడు విడాకులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె అపోలీనా కో స్టార్ సమర్థ గుప్తాతో సన్నిహితంగా ఉంటుందని, వారిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు తాను చూశానని ఆరోపించాడు. ఈ కారణంగానే తాను విడాకులు కోరానని అభిషేక్ చెప్పారు. అయితే విడిపోవడానికి అదితి శర్మ కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తూనే రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని అభిషేక్ న్యాయ సలహాదారు రాకేశ్ తెలిపారు. -
తన పేరెత్తితేనే కన్నీళ్లు.. ఈ క్యాన్సర్ పోరాటంలో..: బుల్లితెర నటి ఎమోషనల్
సంతోషాన్ని అందరూ పంచుకుంటారు, కానీ కష్టాన్ని కూడా పంచుకున్నవారే అసలైన ఆప్తులు. ఈ విషయంలో తాను చాలా లక్కీ అంటోంది బుల్లితెర నటి హీనా ఖాన్ (Hina Khan). క్యాన్సర్తో పోరాడుతున్న తనను ప్రియుడు రాకీ జైస్వాల్ (Rocky Jaiswal) చంటిపాపలా చూసుకుంటున్నాడని చెప్తోంది. తినిపించడం, టాబ్లెట్స్ వేయడం, నడిపించడం.. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాడంది. ఇలాంటి ప్రేమికుడు దొరికినందుకు పొంగిపోతోంది.మాటలు సరిపోవురొమ్ము క్యాన్సర్ (స్టేజ్ 3)తో పోరాడుతున్న హీనా ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. అతడి పేరెత్తినప్పుడు తన గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. నాకోసం ఎంతో చేశాడు. ఎల్లప్పుడూ చేయి పట్టుకునే నడిపించాడు. తనెప్పుడూ అంతే.. నాకోసమే ఆలోచిస్తాడు. ఎంత మంచి మనిషో కదా! తనను తలుచుకుంటేనే సంతోషంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ప్రతి అమ్మాయికి ఇలాంటి అబ్బాయి దొరకాలి.అతడు ప్రేమించినంతగా నేను ప్రేమించలేనురాకీ నాకు 12 ఏళ్లుగా తెలుసు. నా ఫస్ట్ షోలో తొలిసారి అతడిని కలిశాను. ఏడునెలలపాటు ఫ్రెండ్స్గా ఉన్నాం. తర్వాత మాది స్నేహం కాదని ప్రేమని తెలుసుకున్నాం. మేము ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు. కానీ ఓ రోజు ఆత్మీయంగా హగ్ ఇచ్చుకున్నప్పుడు మా మధ్య ఉన్న బంధం బలపడిందని అర్థం చేసుకున్నాం. మేము జంటగా ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాళ్లం. నా క్యాన్సర్ అతడిని ఎంతో బాధించింది. నేనెప్పుడూ అతడికి ఒకటే చెప్తుంటాను.. నువ్వు ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేను అని! దానికి అతడు గర్వంగా ఫీలవడు, కనీసం అవునని కూడా ఒప్పుకోడు. నేను ఎక్కువగా ఏం చేశానని? అని అమాయకంగా అడుగుతుంటాడు అని హీనా ఖాన్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)చదవండి: ఆటోఇమ్యూన్ వ్యాధి.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా: టాలీవుడ్ నటి -
రెండో భర్తతో బుల్లితెర నటి విడాకులు.. స్పందించిన భామ!
సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్ అయిపోయింది. పలువురు సినీతారలు తమ వివాహ బంధానికి మధ్యలోనే ముగించేస్తున్నారు. గతేడాది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సైతం తన భార్య సైరా భానుతో విడిపోయారు. దాదాపు 27 వారి వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశారు. తాజాగా మరో బాలీవుడ్ జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెళ్లైన ఏడేళ్లకు వీరిద్దరు విడిపోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ప్రముఖ బుల్లితెర నటి దీపికా కకర్ ఆమె రెండో భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు గత కొద్ది రోజులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విడాకుల రూమర్స్పై బుల్లితెర జంట స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ ఫేక్ అన్ని కొట్టిపారేశారు. అవీ చూస్తుంటే తమకు నవ్వాలనిపిస్తోందని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దీపికా ఆమె భర్త షోయబ్ విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 2018లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు.దీపిక కక్కర్, షోయబ్ ప్రముఖ బాలీవుడ్ సీరియల్ ససురల్ సిమర్ కా సెట్స్లో కలుసుకున్నారు. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతకుముందు దీపిక కక్కర్ పైలట్ రౌనక్ శాంసన్ను 2011లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత షోయబ్ను పెళ్లాడగా..2023లో కుమారుడు రుహాన్ను స్వాగతించారు. -
ఎవరికీ చెప్పకుండా చేయించుకున్నా: సెక్రేడ్ గేమ్స్ నటి
సేక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కుబ్రా సైత్. ఇటీవలే షాహిద్కపూర్ హీరోగా నటించిన దేవా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అంతకుముందు హిందీలో పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ల్లో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కుబ్రా సైత్ కెరీర్తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. గతంలో తనకు అబార్షన్ జరిగినప్పుడు ఎదురైన ఇబ్బందులను వివరించింది. ఆ సమయంలో తాను ధైర్యం కోల్పోయినట్లు వెల్లడించింది. అది తన జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేదని తెలిపింది.ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ మాట్లాడుతూ.. 'నేను అబార్షన్కు వెళ్లినప్పుడు బలంగా ఉన్నట్లు అనిపించలేదు. ఆ సమయంలో చాలా బలహీనంగా ఉన్నా. అలా చేయకుంటే బతుకుతానని చెప్పే ధైర్యం, శక్తి నాకు లేవు. ఆ సమయంలో నేను చాలా బలహీనంగా భావించా. నాకు ఏదో వెలితిగా అనిపించింది. అస్సలు విలువ ఉండదేమో అనుకున్నా. కానీ దాని నుంచి బయటపడేందుకు చాలా కాలం పట్టింది. నా కోసం ఒక నిర్ణయం తీసుకున్నా. అది కూడా నా సొంత ఆలోచనలకు కట్టుబడి నిర్ణయించుకున్నా. ఇక్కడ నేను సామాజిక నిబంధనలను ఉల్లంఘించాను అనడానికి ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేనే స్వయంగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నా. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు' అని వెల్లడించింది. ఓసారి తన స్నేహితురాలతో కలిసి ట్రిప్కు వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్తో ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నామని తెలిపింది. ఆ సమయంలో తన కళ్లలో నీళ్లు వచ్చాయని వెల్లడించింది. -
సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్ ఆన్సర్కు ఆశ్చర్యపోయిన నటి
సెలబ్రిటీలు సోషల్ మీడియానే కాదు యూట్యూబ్నూ నమ్ముకుంటున్నారు. పర్సనల్ విషయాలను, ఫన్నీ సంఘటనలను, బాధాకర విషయాలను, కొత్త ప్రాజెక్టులను.. ఇలా ప్రతీది యూట్యూబ్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అలా బుల్లితెర నటి అర్చన పూరన్ సింగ్ (Archana Puran Singh)కు సైతం యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ మధ్య ఆమె ఓ వీడియో వదిలింది. అందులో తన కుటుంబంతో కలిసి ముంబైలో తమకిష్టమైన దోస హోటల్స్ వద్దకు వెళ్దామంది.ఫ్యామిలీతో ఫుడ్ వ్లాగ్అర్చన భర్త పర్మీత్.. చిన్నతనంలో జుహు బీచ్లో దొరికే దోస తన ఫేవరెట్ అన్నాడు. అర్చన శివనగర్లోని ఓ హోటల్ పేరు చెప్పగా.. కుమారులు ఆర్యమన్, ఆయుష్మాన్ ఇద్దరూ మిథిబాయి కాలేజ్ దగ్గర దొరికే దోస అలాగే అమర్ జ్యూస్ సెంటర్లో దిరకే జ్యూస్ అద్భుతంగా ఉంటాయన్నారు. అలా మొదటగా మిథిబాయి కాలేజీ సమీపంలోని దోసల్ని కుటుంబమంతా ట్రై చేసింది. అక్కడ పనిచేసే చెఫ్ నేపాలీవాసి. దీంతో అర్చన.. మసాలా దోసలో ఎక్కువ కారం దట్టించకు.. నేను చెప్పింది చేయకపోతే నిన్ను నేపాల్ పంపించేస్తా అని సరదాగా వ్యాఖ్యానించింది. చివరగా భర్తకు ఇష్టమైన చోట..తర్వాత కుటుంబమంతా శివ్ నగర్కు వెళ్లి అక్కడ దోసను తిన్నారు. అనంతరం అమర్ జ్యూస్ సెంటర్లో ఫేమస్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగారు. చివరగా భర్తకు ఇష్టమైన దోస కోసం జుహు బీచ్కు వెళ్లారు. అక్కడ తనకు ఇష్టమైన హోటల్ను వెతకడానికి కాస్తంత సమయం పట్టింది. చివరకు అది ఎట్టకేలకు కనిపించడంతో పర్మీత్ ఎగిరి గంతేశాడు. వాళ్లు దోసను ఆస్వాదిస్తుంటే అక్కడున్న జనాలు అర్చనతో ఫోటో దిగేందుకు ఎగబడ్డారు. దీంతో ఆమెకు ఓ ఐడియా తట్టింది. నా సెల్ఫీ రూ.100 కూడా విలువ చేయదా?మాకు దోస వేసిచ్చినందుకు బదులుగా నీకు సెల్ఫీ ఇస్తాను అంది. ఆమె ఐడియా అతడికి ఏమాత్రం నచ్చలేదు. తనకు డబ్బులే కావాలన్నాడు. అందుకు షాకైన అర్చన.. నా సెల్ఫీ రూ.100 కూడా విలువ చేయదా? అని అడిగింది. ఆ హోటల్ వ్యక్తి.. సెల్ఫీ కావాలి, అలాగే డబ్బు కూడా కావాలన్నాడు. సరే, భయపడకులే.. నేను డబ్బివ్వకుండా ఎక్కడికీ పారిపోను అని చెప్పింది. ఇక అందరికీ ఈ చివరి స్టాల్లోని దోసెనే నచ్చింది.చదవండి: కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్? -
తొమ్మిదేళ్ల బంధం.. విడాకులు కావాలన్న నటి!
బాలీవుడ్ నటుడు అమన్ వర్మ (Aman Verma)- వందన లల్వానీ (Vandana Lalwani) విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. తొమ్మిదేళ్ల బంధానికి ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించుకోలేక విడిపోవడానికే నిర్ణయించుకున్నట్లు భోగట్టా! 'నిజానికి వీరు పిల్లల్ని కని కుటుంబాన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ కొన్ని విషయాల్లో బేధాభిప్రాయలు రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో వందన విడాకుల కోసం దరఖాస్తు చేసింది' అని బీటౌన్లో ఓ వార్త వైరల్గా మారింది. 2016లో వివాహందీని గురించి నటుడు అమన్ను ప్రశ్నించగా సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు తన లాయర్ చెప్తాడన్నారు. దీంతో దంపతుల విడాకుల వ్యవహారం నిజమేనని తేలిపోయింది. అమన్- వందన 2014లో హమ్ నే లి హై: శపథ్ అనే టీవీ సిరీస్లో తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలోనే పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2015లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2016లో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఒంటరిగా..పెళ్లి గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో అమన్ మాట్లాడుతూ.. పెళ్లి నన్ను ఎంతగానో మార్చేసింది. ఒకప్పుడు చిన్నవిషయాలకే కోపం వచ్చేది. కానీ ఇప్పుడు చాలామటుకు సైలెంట్ అయిపోయాను. అలాగే ఎన్నో ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాను. మంచి భాగస్వామి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అలా వందన కనిపించాక తనను పెళ్లాడాను. మేము చాలా సంతోషంగా ఉన్నాను. ఒకరిపై ఒకరికి ఎలాంటి ఫిర్యాదులు లేవు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడేమో 53 ఏళ్ల వయసులో విడాకులకు సిద్ధమయ్యాడు.బుల్లితెర.. వెండితెరఅమన్ వర్మ.. పచ్పన్ ఖంబే లాల్ దీవారేన్, మహాభారత్ కథ (కర్ణుడి కుమారుడు), క్యూంకీ సాస్ భీ కభీ బహూ తీ, కెహతా హై దిల్, కుంకుమ్.. ఇలా అనేక సీరియల్స్ చేశాడు. సంఘర్ష్, జానీ దుష్మన్, అండాజ్, దోస్తీ: ఫ్రెండ్స్ ఫరెవర్, కచ్చీ సడక్, జనని, జాన్-ఇ-మన్, ఈఎమ్ఐ, తీస్ మార్ ఖాన్. చికెన్ కర్రీ లా, ద యూపీ ఫైల్స్ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించాడు. వందన లల్వానీ సైతం సీరియల్స్తో పాటు సినిమాలు చేసింది.చదవండి: కలర్ ఫోటో చేతులారా వదిలేసుకున్నా..: హీరోయిన్ -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ను పెళ్లాడిన టాలీవుడ్ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి మాన్షి జోషి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవ్ను పెళ్లాడింది. బెంగళూరులోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాన్షికి అభినందనలు చెబుతున్నారు.కన్నడలో పలు సీరియల్స్లో నటించిన మాన్షి జోషి.. తెలుగులో దేవత అనే సీరియల్లో కనిపించింది. ఈ సీరియల్లో అర్జున్ అంబటి, చంటిగాడు హీరోయిన్ సుహాసిని కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా కన్నడలో పారు సీరియల్తో ఫేమ్ తెచ్చుకుంది. రాధ రమణ, అంబుదాన్ ఖుషీ, గీతాంజలి, రాధ రాఘవ్ లాంటి సీరియల్స్తో మెప్పించింది. -
నటుడు చేసిన పనికి ఏడ్చేసిన అత్త.. గ్రేట్ అంటూ ప్రశంసలు!
బుల్లితెర నటుడు షోయబ్ ఇబ్రహీం (Shoaib Ibrahim) చేసిన పనికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత మంచి భర్త దొరికిన ఆ ఇల్లాలు ఎంతటి అదృష్టవంతురాలంటూ నటి దీపిక కకర్ను (Dipika Kakar) మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరీ షోయబ్? అందరూ మెచ్చేలా ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే! షోయబ్ ఇబ్రహీం బుల్లితెర నటుడు. రెహ్నా హై తేరీ పాల్కన్ కీ ఛావో మే సీరియల్తో తన ప్రయాణం ప్రారంభించాడు. 'సాసురాల్ సిమర్ కా' ధారావాహికలో ప్రధాన పాత్ర పోషించి మెప్పించాడు. ఇందులో యాక్ట్ చేసిన నటి దీపికతో ప్రేమలోనూ పడ్డాడు. ఆమెతో కలిసి నాచ్ బలియే ఎనిమిదో సీజన్లో పార్టిసిపేట్ చేశాడు. షోయబ్ నటించిన ఏకైక మూవీ బెటాలియన్ 609. 2018లో దీపిక- షోయబ్ పెళ్లి జరిగింది. వీరికి 2023లో బాబు రుహాన్ పుట్టాడు. ఇదీ ఆయన పర్సనల్ స్టోరీ.ఇంతకీ షోయబ్ ఏం చేశాడంటే?పెళ్లయ్యాక అమ్మాయిలకు అత్తారిల్లే సర్వస్వం అంటారు. కానీ అదే మాట అబ్బాయి చెప్తే ఎలా ఉంటుంది? సర్వస్వం అని కాకపోయినా తన భార్య పుట్టిల్లు బాధ్యత కూడా భుజాన వేసుకుంటే ఎలా ఉంటుంది? అదే పని చేశాడు షోయబ్. అత్తగారికి ఇల్లు కొనిచ్చాడు. ఎప్పుడూ మాకోసమే ఆలోచించే తన కోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఇంటిని బహుమతిగా ఇచ్చానంటున్నాడు. భర్త చేసిన పనికి దీపిక సంతోషంతో ఉప్పొంగిపోతోంది.తన యూట్యూబ్ ఛానల్లో దీపిక మాట్లాడుతూ.. జీవితంలో అతి పెద్ద వరం ఏంటో తెలుసా? ఇల్లు. నువ్వు నీ తల్లి కోసం ఇదివరకే ఇంటిని బహుమతిగా ఇచ్చావు. ఇప్పుడు నీ అత్తగారికి ఇంటిని వరంగా అందించావు అని ఎమోషనలైంది. కొత్తింటి పత్రాలను షోయబ్ దంపతులు.. దీపిక తల్లికి అందించారు. వాటిని చేతిలోకి తీసుకున్న ఆమె సొంత కుటుంబం తనకు ఏదీ ఇవ్వకపోయినా నా కూతురు దీపిక ఫ్యామిలీ మాత్రం నాకు ఎన్నో చేస్తోంది అంటూ సంతోషంతో ఏడ్చేసింది.చదవండి: Chhaava OTT Release : ఓటీటీలోకి ‘ఛావా’.. ఎప్పుడు, ఎక్కడ? -
తెలుగు బుల్లితెర నటి విష్ణు ప్రియ పెళ్లి రోజు (ఫోటోలు)
-
ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సీతారామ' సీరియల్ ఫేమ్ మేఘనా శంకరప్ప కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. తన ప్రియుడు జయంత్తో ఏడడుగులు వేసింది. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన వధూవరులకు అభినందనలు తెలుపుతున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన మేఘనా శంకరప్ప సీతారామ సీరియల్తో గుర్తింపు తెచ్చుకుంది.కాగా.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన మేఘనా శంకరప్ప నటనవైపు అడుగులు వేసింది. బెంగళూరుకు చెందిన జయంత్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.ఇక నటన విషయానికొస్తే.. మేఘనా శంకరప్ప ప్రస్తుతం 'సీతారామ' సీరియల్లో నటిస్తోంది. గతంలో ఆమె కన్నడలోనే 'నమ్మనే యువరాణి', 'కిన్నెరి' లాంటి సీరియల్స్లో కనిపించింది. అంతేకాకుండా 'కృష్ణ తులసి', 'రత్నగిరి రహస్య', 'దేవయాని', 'సింధూర' లాంటి సీరియల్స్లో నటించారు. అంతేకాకుండా మేఘన ఓ ప్రైవేట్ ఛానల్ డ్యాన్స్ రియాల్టీ షోలో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఆమె డ్యాన్స్ను శివరాజ్కుమార్ లాంటి స్టార్ హీరో సైతం మేఘన నృత్యాన్ని మెచ్చుకున్నారు. కన్నడ టీవీ పరిశ్రమలో మేఘన ఇప్పటివరకు నటించిన సీరియల్స్లో పాజిటివ్, నెగటివ్ పాత్రల్లో నటించింది. View this post on Instagram A post shared by Meghana S Shankarappa ✨ (@meghanasshankarappa_) -
23 ఏళ్లు వయసు.. రూ 250 కోట్ల ఆస్తి.. ఎవరీ బుల్లితెర నటి?
చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిసే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువ. అయితే కొంతమంది హీరోయిన్లకు ఇందులో మినహాయింపు ఉంటుంది. నయనతార, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె లాంటి స్టార్ హీరోయిన్లు హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా నటీమణుల హవా కొనసాగుతుంది. సీరియల్స్ హీరోయిన్లు కూడా ఈ మధ్యకాలంలో తెగ ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్లను మించిన క్రేజ్ తెచ్చుకున్న భామలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో జన్నత్ జుబేర్ రహ్మానీ(Jannat Zubair Rahmani) ఒకరు. ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కానీ ఆస్తుల విలువ మాత్రం దాదాపు 250 కోట్ల వరకు ఉంటుంది. వినడానికి కాస్త షాకింగ్గా ఉన్నా.. ఇది వాస్తవమే.షారుఖ్ని మించిన అభిమానం.. బాలీవుడ్ హీరో షారుక్ఖాన్కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 46 మిలియన్ల ఫాలోవర్స్తో షారుఖ్ అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ జన్నత్ ఇన్స్టా ఫాలోవర్స్లో షారుఖ్ని మించిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాలో 49.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 23 ఏళ్లకే ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకోవడం గొప్ప విషయమే. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా బుల్లితెరపై నటించే అవకాశాలు వస్తున్నాయి.ఎపిసోడ్కి 18 లక్షలుజన్నత్ వయసు ప్రస్తుతం 23 ఏళ్లు. ఆగస్ట్ 29, 2001లో ముంబైలో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్ విల్ పీపుల్ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోలో నటించి మెప్పిస్తుంది. ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొన్న జన్నత్.. ఒక్కో ఎపిసోడ్కి అత్యధికంగా రూ. 18 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక సీరియల్ కోసం ఒక్కో ఎపిసోడ్కి రూ. 2 లక్షల వరకు తీసుకుంటుందట. అలాగే సోషల్ మీడియాలో ఆమె ఒక్కో పోస్టుకు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఇలా ఏడాదికి 25 కోట్ల సంపాదనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది జన్నత్. అంతేకాదు పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టిందట. మీడియా కథనాల ప్రకారం జన్నత్ ఆస్తుల విలువ దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుంది. అందంలోనే కాను ఆస్తుల విషయంలోనూ ఈ బ్యూటీ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకెళ్తోంది. View this post on Instagram A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) -
క్యాన్సర్తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు
సంపద, సంతోషం ఉన్నప్పుడు అందరూ ఉంటారు. కానీ కష్టాలు, బాధలో ఉన్నప్పుడే అయినవాళ్లెవరో, కానివాళ్లెవరో తెలుస్తుంది. బాధలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాళ్లు చాలా తక్కువమంది. కానీ హీనా ఖాన్కు.. ఆమె కష్టాన్ని తన కష్టంగా భావించే ప్రియుడు దొరికాడు. క్యాన్సర్తో పోరాడుతున్న నటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.నాకోసం గుండు కొట్టించుకున్నావ్..ఇంత మంచి భాగస్వామి దొరకడం నా అదృష్టం అంటూ ప్రియుడు రాకీ జైస్వాల్ (Rocky Jaiswal)ను పొగుడుతూ ఓ పోస్ట్ షేర్ చేసింది హీనా ఖాన్ (Hina Khan). నాకు తెలిసిన మంచి వ్యక్తి ఇతడే! ట్రీట్మెంట్లో భాగంగా నేను గుండు చేయించుకున్నప్పుడూ అతడూ గుండు కొట్టించుకున్నాడు. నాకు వెంట్రుకలు పెరిగినప్పుడే తన జుట్టు పెరగనిస్తానన్నాడు. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వంద కారణాలు చెప్పి వెళ్లిపోయే అవకాశం ఉన్నా నాతోనే ఉన్నాడు. నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు. జీవితకాలమంత అనుభవాన్ని మేము ఇప్పటికే పోగు చేసుకున్నాం.కరోనా సమయంలోనూ నాతో..సంతోషకర, బాధాకర సందర్భాల్లో కలిసున్నాం. మా తండ్రుల్ని కోల్పోయినప్పుడు ఇద్దరమూ ఏడ్చాం. ఒకరినొకరం ఓదార్చుకున్నాం. కరోనా సమయంలోనూ కలిసే ఉన్నాం. అప్పుడు నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అతడికి వైరస్ సోకకపోయినా నాతోపాటే కలిసున్నాడు. మూడు మాస్కులు ధరించి నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. క్యాన్సర్ బారిన పడ్డప్పుడు కూడా నా చేయి వదల్లేదు. అన్నీ వదిలేసి నాతోనే ఉంటున్నాడు.(చదవండి: ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్)సరైన దారిలోనే వెళ్తున్నా..ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల్ని అడగాలి.. ఇలా అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అలా అతడు సూచించిన కరెక్ట్ డైరెక్షన్లోనే నేను అడుగులు వేస్తున్నాను. కీమో థెరపీ ప్రారంభించినప్పటి నుంచి నా బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. నాకు డ్రెస్సింగ్ చేయడం, తినిపించడం.. ఇలా అన్నీ తనే చేస్తున్నాడు. నా చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టించాడు. గడిచిన రెండు నెలలు నాకెంతో నేర్పాయి.బాధపెట్టి ఉంటే క్షమించునా జీవితంలో నువ్వు నాకు దొరికిన అద్భుతానివి. నన్ను ధైర్యంగా నిలబడమన్నావ్.. నన్ను నేను ప్రేమించుకోమన్నావ్.. ఆందోళనను వదిలేసి ప్రశాంతంగా శ్వాస తీసుకోమన్నావ్.. నీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒకవేళ ఎప్పుడైనా నేను నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు. మనం కలిసి నవ్వుకునేవాళ్లం, ఏడ్చేవాళ్లం, ఒకరి కన్నీటిని మరొకరు తుడిచేవాళ్లం.. అప్పటికీ, ఇప్పటికీ ఇదే జరిగింది. భవిష్యత్తులో కూడా మన మధ్య ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.గతేడాది క్యాన్సర్ బారిన పడ్డ నటిఇతడు దేవుడు పంపిన ఆశీర్వాదం అని హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇలాంటి మంచి వ్యక్తి ప్రతి అమ్మాయి జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీరు ఎప్పటికీ ఇలాగే కలిసుండాలని కామెంట్లు చేస్తున్నారు. టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కెరీర్లో పుంజుకుంటున్న సమయంలో క్యాన్సర్ హీనా ఖాన్పై దాడి చేసింది. గతేడాది నుంచి మూడో దశ బ్రెస్ట్ క్యాన్సర్తో నటి పోరాడుతోంది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: పెళ్లిరోజు నాడే గుడ్న్యూస్.. తల్లిదండ్రులైన టాలీవుడ్ జంట -
ప్రాణం లేని బిడ్డను నెల రోజులు కడుపులో మోశా.. నటి భావోద్వేగం
బుల్లితెర నటి, యాంకర్ సమీరా (Sameera Sherief) విషాద వార్తను పంచుకుంది. మరోసారి తల్లి కాబోతున్నానన్న ఆనందం తనకు ఎంతోకాలం నిలవలేదంది. కడుపులోనే బిడ్డ కన్నుమూసిందంటూ ఏడ్చేసింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. నేను మొదటిసారి 2020లో తొలిసారి గర్భం దాల్చాను. ఆ సమయంలో నేను మిస్టర్ అండ్ మిసెస్ చిన్నతిరై అనే రియాలిటీ షో చేస్తున్నాను. తొలిసారి గర్భస్రావంషూటింగ్ అయిపోయాక హాస్పిటల్కు వెళ్దామనుకున్నాను. చెన్నైకి చేరుకోగానే తీవ్ర రక్తస్రావమైంది (Miscarriage). ఫస్ట్ ప్రెగ్నెన్సీలో గర్భస్రావమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్స్ చెప్పారు. అలా మొదటి బిడ్డనే కోల్పోయాను. దేవుడి దయ వల్ల ఏడాది తిరగకముందే మరోసారి గర్భం దాల్చాను. 2021 జనవరిలో ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను.. అలా అర్హాన్ పుట్టాడు.అంతా బాగుందని తెలిసి..2023 నవంబర్లో మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంట్లో అందరూ ఎగ్జయిట్ అయ్యారు. అర్హాన్ అయితే నా కడుపులో బిడ్డతో మాట్లాడేవాడు. రెండుసార్లు స్కానింగ్కు వెళ్లినప్పుడు బేబీ బాగుందన్నారు. పన్నెండోవారంలో మరోసారి స్కానింగ్కు వెళ్లాను. ఎనిమిదో వారంలోనే బిడ్డ ఎదుగుదల ఆగిపోయింది. తన గుండె కొట్టుకోవడం లేదని డాక్టర్ చెప్పింది. నాలుగువారాలు ప్రాణం లేని బిడ్డను మోశాఅంటే నాలుగువారాల నుంచి బేబీ నా పొట్టలోనే ఉంది. నన్ను వదిలి వెళ్లాలనుకోవడం లేదు. మా కలలు కుప్పకూలిపోయినట్లనిపించింది. ఎంతగానో ఏడ్చాము. ఈ లోకంలో ఆ బిడ్డతో నేను కలిసిలేకపోయినా చనిపోయిన తర్వాత మాత్రం మళ్లీ తనను కలుస్తాను. డిసెంబర్ 31న టాబ్లెట్స్ ద్వారా గర్భంలోని శిశువును తీసేశాం అని చెప్తూ ఎమోషనలైంది.ఎవరీ సమీరా?నటి సమీరా ఆడపిల్ల అనే సీరియల్తో పాపులారిటీ తెచ్చుకుంది. అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం.. ఇలా ఎన్నో సీరియల్స్లో నటించింది. ఆ తర్వాత ‘అదిరింది’ షోకి కొద్ది రోజులుపాటు యాంకర్గానూ పని చేసింది. అనంతరం సడన్గా బుల్లితెరకు దూరమైపోయింది. సమీరా 2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీరికి 2021లో బాబు పుట్టాడు.చదవండి: గతేడాది ఒకేచోట సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈసారి మాత్రం! -
'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి
లాస్ ఎంజిల్స్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని ప్రముఖ బుల్లితెర నటి రూపల్ త్యాగి తెలిపింది. చదువు కోసం వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంది. ఇటీవల దాదాపు నెల రోజులు పాటు అక్కడే ఉన్నానని వెల్లడించింది. తాను స్వదేశానికి విమానంలో బయలుదేరినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగలు చూశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఇంత స్థాయిలో ఉంటుందని ఊహింలేదన్నారు. తాను చూసిన ప్రదేశాలు బూడిదగా మారడం చూసి హృదయ బద్దలైందని విచారం వ్యక్తం చేసింది.రూపల్ త్యాగి మాట్లాడుతూ.. "పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ అగ్ని ప్రమాదాలు సాధారణమే. కానీ అది అంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. నేను విమానం నుంచి పొగను చూశా. అప్పుడే ఇక్కడ ప్రమాదాలు మామూలే అని అనుకున్నా. కానీ నేను ముంబయిలో దిగే సమయానికి కార్చిచ్చు వల్ల ఎంత ప్రమాదం జరిగిందో అప్పుడే తెలిసింది. నేను చూసిన ప్రదేశాలు ప్రతిదీ కాలిపోయాయని నాకు తెలిసింది. దృశ్యాలను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించింది. తాను ఇంటికి తిరిగి వచ్చే ముందు అదే రోడ్డులో కారులో ప్రయాణించా. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. అదృష్టవశాత్తూ నా స్నేహితులందరూ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. నేను వారి గురించి ఆందోళన చెందుతున్నా. సమయానికి బయలుదేరి ప్రాణాలు దక్కించుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ సంక్షోభ సమయంలో నా స్నేహితులతో లేకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రకృతి కోపాన్ని చూసి చలించిపోయా' అని అన్నారు.ఇలాంటి సంఘటనలు మన జీవితాలు ఊహించని విధంగా మార్చేస్తాయని రూపల్ త్యాగి అన్నారు. ఒక్క రోజులోనే నగరం కాలిపోతుందని ఎవరూ ఊహించరు.. ఇది నమ్మశక్యం కాని ఘటన అని చెప్పింది. మన జీవితంలో ప్రతి రోజు పూర్తిగా అస్వాదించాలనేన ఆలోచన మంచిదే.. ఎందుకంటే మరుసటి రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన ప్రజలు త్వరలోనే కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.కాగా.. అమెరికాలో లాస్ ఏంజిల్స్లో చెలరేగిన కార్చిచ్చు వల్ల దాదాపు వేలమంది నిరాశ్రయులయ్యారు. అడవిలో ఏర్పడిన మంటలు గాలి ధాటికి విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 12 వేలకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వచ్చే వారం ప్రారంభంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా.. రూపల్ త్యాగి బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. బాలీవుడ్లో కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్, రంజు కీ బేటియాన్, హమారీ బేటియాన్ కా వివాహ్ లాంటి హిందీ సీరియల్స్లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్గా కూడా రాణిస్తోంది. -
నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు
హీరోయిన్ హన్సిక (Hansika Motwani) వేధింపులు తాళలేకపోతున్నానంటూ బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రశాంత్ మోత్వానీ, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక మోత్వానీలు తనను మానసికంగా హింసిస్తున్నారని వాపోయింది. ఈ మానసిక ఒత్తిడి వల్ల తన ముఖంలో కొంతభాగం పక్షవాతానికి గురైందని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 18న నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఖరీదైన గిఫ్టులు తెమ్మని..పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముస్కాన్ (Muskaan Nancy James), ప్రశాంత్ 2020లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని నటి అత్త, ఆడపడుచు హన్సిక డిమాండ్ చేశారట! అంతేకాకుండా ఆస్తిలోనూ ఏవో కుట్రలకు పాల్పడ్డారని నటి ఆరోపించింది. తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదేపదే జోక్యం చేసుకుని గొడవలకు కారణమయ్యేదని పేర్కొంది. వీరు పెట్టిన టార్చర్ వల్ల తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై హన్సిక, ప్రశాంత్ ఇంతవరకు స్పందించలేదు. కాగా ముస్కాన్ దంపతులు 2022 నుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: అప్పట్లో ఐరన్ లెగ్ అని పేరొస్తుందని భయపడ్డా: చిరంజీవిపాక్షిక పక్షవాతం2022లో నటి తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. కొంతకాలంగా నేనేమైపోయానని అనుకుంటున్నారా? నా జీవితంలో ఏం జరుగుతుందనేది కొందరికి మాత్రమే తెలుసు. నేను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాను. అధిక ఒత్తిడి వల్ల నాకీ పరిస్థితి వచ్చింది. గతంలో ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు కోలుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి ఆ వ్యాధి నా జీవితంలోకి ప్రవేశించింది.ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది?గత కొద్ది నెలలనుంచి నేను, నా తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. ముఖం ఉబ్బిపోయి ఆ బాధ భరించరాకుండా ఉంది. ఒక నటికి ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది? నాముందున్న సమస్యలతో పోరాడే శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు సపోర్ట్గా నిలబడే పేరెంట్స్ ఉండటం నా అదృష్టం. జీవితం అంత ఈజీ కాదు.. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అన్నీ మారిపోతాయి అని రాసుకొచ్చింది.సీరియల్స్..ముస్కాన్ నాన్సీ.. తొడి ఖుషి తొడె ఘమ్ సీరియల్లో సహాయక నటిగా యాక్ట్ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్ షోలలో కొన్ని ఎపిసోడ్స్లో మెరిసింది. భారత్ కా వీర్ పుత్ర: మహారాణ ప్రతాప్, ఏజెంట్ రాఘవ్- క్రైమ్ బ్రాంచ్ షోలలో నటించింది. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది.చదవండి: అన్నీ ఒకేసారి.. నా వల్ల కావట్లేదంటూ ఏడ్చేసిన మాధవీలత -
'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్
'మా అమ్మాయి నిప్పు.. తనకు బాయ్ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. అబ్బాయిలతో అంత సన్నిహితంగా ఉన్నదే లేదు. భవిష్యత్తులో కూడా తను ఎవరినీ ప్రేమించదు. నేను చూపించిన అబ్బాయిని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోదు. అనవసరంగా తన గురించి లేనిపోనివి మాట్లాడితే బాగోదు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నటి (Chahat Pandey) చాహత్ పాండే తల్లి భావన పాండే. బుల్లితెర నటి చాహత్ ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 18 (Bigg Boss 18)వ సీజన్లో పాల్గొంది. ఉతికారేసిన చాహత్ తల్లిఇటీవల ఫ్యామిలీ వీక్లో భాగంగా చాహత్ తల్లి బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే తన కూతురితో కయ్యం పెట్టుకుంటున్న అవినాష్ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై కామెంట్స్ చేసింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోలేదు. నిజంగానే చాహత్ సింగిలా? అని బిగ్బాస్ టీమ్కు డౌట్ వచ్చింది. తనకు ప్రియుడు ఉండొచ్చన్న అనుమానంతో సోషల్ మీడియా అంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఓ ఫోటో దొరికింది. అందులో ప్రియుడు లేడు కానీ ప్రేమలో ఉన్నట్లు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)మీ అమ్మ సర్టిఫికెట్ ఇచ్చింది!ఇంకేముంది, దాన్ని పట్టేసుకున్నారు. తాజా ప్రోమోలో సల్మాన్ ఖాన్ (Salman Khan).. అమ్మాయిల వెంటపడే అబ్బాయిలంటే నీకస్సలు ఇష్టముండదని మీ అమ్మ చెప్పింది. అంటే నువ్వు ఎలాంటిదానివో చెప్తూ మంచి సర్టిఫికెట్ ఇచ్చి వెళ్లిపోయింది. మా టీమ్ ఇది నిజమేనా? అని నిర్ధారించుకునే క్రమంలో ఒకటి కనుగొన్నారు. అదేంటో మీరూ చూసేయండి అంటూ ఫోటో చూపించాడు. యానివర్సరీ ఫోటో.. మరి ఇదేంటి?ఆ ఫోటోలో 'ఐదేళ్లు పూర్తయ్యాయి. హ్యాపీ యానివర్సరీ మై లవ్' అని కేక్పై రాసి ఉంది. ఆ కేక్ పక్కనే చాహత్ కూర్చుని ఉంది. అది చూసి చాహత్ కంగారుపడగా.. తనతో పాటు సీరియల్స్ చేసిన అవినాష్.. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, సెట్లో అందరికీ ఆ విషయం తెలుసు అని చెప్పాడు. కానీ చాహత్ ఒప్పుకోలేదు.ఇంత దిగజారుతారా?అయితే ఈ వ్యవహారంలో పలువురు నెటిజన్లు బిగ్బాస్ టీమ్నే తప్పుపడుతున్నారు. తన పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకుని మరీ అందరి ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అది తన వ్యక్తిగతమని, దానివల్ల మిగతావారికేంటి సమస్య? అని నిలదీస్తున్నారు. బిగ్బాస్ టీమ్ ఇంత దిగజారుతుందనుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..? -
న్యూ ఇయర్ వేళ తప్పతాగిన ప్రముఖ బుల్లితెర నటి.. నడవలేని స్థితిలో!
చూస్తుండగానే మరో ఏడాది ముగిసిపోయింది. ఎన్నో కొత్త ఆశలతో నూతన ఏడాదికి ప్రపంచమంతా స్వాగతం పలికింది. ఈ కొత్త సంవత్సరాన్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రిటీలు సైతం తమ ఫ్యామిలీస్తో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. బాలీవుడ్ తారలంతా కొత్త ఏడాది గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు.అయితే బాలీవుడ్ బుల్లితెర నటి మౌనీరాయ్ న్యూ ఇయర్ వేళ పార్టీకి హాజరైంది. ఆమె తన భర్తతో కలిసి కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకుంది. వీరిద్దరికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ జంటతో పాటు కల్కి భామ దిశాపటానీ కూడా న్యూ ఇయర్ పార్టీలో సందడి చేశారు.అయితే ఈ వీడియోలో మౌనీ రాయ్ ఫుల్గా ఆల్కహాల్ సేవించినట్లు కనిపించింది. తన భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకుంది. బార్ నుంచి బయటికి వస్తూ నడవలేక కింద పడిపోయింది. దీంతో మౌనీ రాయ్ను ఆమె భర్తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఎవరూ ఫోటోలు తీయవద్దంటూ ఆమె భర్త కెమెరాలకు తన చేతిని అడ్డు పెట్టడం వీడియోలో కనిపించింది. వీరి వెనకాలే కల్కి మూవీ హీరోయిన్ దిశా పటానీ కూడా కనిపించింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేయడంతో నెట్టింట వైరలవుతోంది.కాగా.. మౌనీ రాయ్ నాగిని సీరియల్తో ఫేమస్ అయింది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో ఆమె నటించింది. View this post on Instagram A post shared by Saalim Hussain Rizvi (@saalim_hussain110) #MouniRoy fell while exciting the bar and then husband took her in his arm till the car #DishaPatani pic.twitter.com/N0uau0IInf— $@M (@SAMTHEBESTEST_) January 2, 2025 -
పెళ్లి కొడుక్కి పరీక్ష పెట్టిన నటి.. మండపంలో ఎమోషనల్.. (ఫోటోలు)
-
రెండుసార్లు నటికి గర్భస్రావం.. ఆ భయంతోనే చెప్పట్లేదా?
మెరీనా అబ్రహం (Marina Abraham Sahni).. అమెరికా అమ్మాయి సీరియల్తో అందర్నీ ఇట్టే కట్టిపడేసింది. బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్ (Bigg Boss Reality Show)లో భర్త రోహిత్ సాహ్నితో కలిసి పాల్గొంది. వీరిద్దరూ కలిసి సొంతంగా ఓ ఫోటోస్టూడియో కూడా నెలకొల్పారు. ఇకపోతే కొంతకాలంగా యాక్టింగ్కు దూరంగా ఉంటోంది మెరీనా. ఈ మధ్య కాస్త బొద్దుగా అవడంతో తను ప్రెగ్నెంట్ అన్న రూమర్స్ మొదలయ్యాయి. దీనికి మెరీనా.. యూట్యూబ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. 2021లో ప్రెగ్నెంట్లావయ్యానంటే దానికి చాలా కారణాలుంటాయి. మీకు ముందుగా నా గతం గురించి చెప్తాను. 2021లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ మొదటి స్కానింగ్లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది. అయినా మళ్లీ హార్ట్బీట్ వస్తుందేమోనని ఎదురుచూశాం. మూడునెలలవరకు తీయించుకోలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడంతో దాన్ని తీసేయించుకోవాల్సి వచ్చింది. 2022లో మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు హార్ట్బీట్ వచ్చింది. అందుకే..ఒత్తిడి వల్లో.. నా శరీరం వీక్గా ఉందనో కానీ గర్భస్రావమైంది. అప్పుడు నా బాడీలో చాలా మార్పులు వచ్చాయి. ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు స్టెరాయిడ్లు ఇవ్వాల్సి వచ్చింది. తినకపోయినా లావైపోయాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే నేను ప్రెగ్నెంటా? కాదా? అన్నది ఇప్పుడే చెప్పలేను అంటూ సమాధానం దాటవేసింది. కానీ తన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే మెరీనా ప్రెగ్నెంట్ అని సులువుగా తెలిసిపోయిందంటున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Marina Abraham Sahni (@marina.a1203) చదవండి: కీర్తికి వింత అనుభవం.. దోస అని పిలవడంతో.. -
Sunandha Mala Setti: స్వర్ణగిరిని సందర్శించిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్!
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మాకు బాబు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.. అంటూ ఇన్స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న దేవోలీనా భట్టాచార్జీ తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. డిసెంబర్ 2022లో తన జిమ్ ట్రైనర్ షానవాజ్ షేక్ను వివాహం చేసుకుంది.బాలీవుడ్లో దేవోలీనా భట్టాఛార్జీ పలు సీరియల్స్లో నటించింది. తాను చివరిసారిగా 'కూకి' అనే సీరియల్లో కనిపించింది. అంతకుముందు హిందీ బిగ్బాస్ సీజన్-2006లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. హిందీలో సాత్ నిబానా సాథియా అనే సీరియల్తో ఫేమ్ తెచ్చుకున్నారు దేవోలీనా. ఆ తర్వాత యో హై మోహబ్బతీన్, స్వీట్ లై, చంద్రకాంత, తేరే షహర్ మే, శుభ్ వివాహ్ లాంటి సీరియల్స్లో నటించారు. View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) -
చీరలో చూడముచ్చటగా సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ (ఫోటోలు)
-
కోలీవుడ్ బుల్లితెర నటి మణి మేఘలాయి నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
నా ప్రపంచంలో నాకు నేనే రాణి : అంకిత లోఖండే (ఫోటోలు)
-
గ్లామర్ డాల్లా విష్ణుప్రియ.. భలే క్యూట్ (ఫొటోలు)
-
బుల్లితెర నటి శోభిత పోస్టుమార్టం పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే?
కన్నడ బుల్లితెర నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శోభిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. ఆమె స్వస్థలం కర్ణాటక కావడంతో అక్కడికి తరలించనున్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణం ఆత్మహత్యగానే వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని స్వగ్రామంలో నిర్వహించనున్నారు. కాగా.. అంతకుముందు కన్నడ నటి శోభిత తాను నివాసముంటున్న ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యాన్కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. కన్నడలో పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. అయితే గతేడాది హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్రెడ్డికి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ను పెళ్లాడింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్లో ఆమె నివాసముంటున్నారు. అయితే శోభిత పెళ్లి తర్వాతే సినిమాలకు, సిరీయల్స్కు దూరమైంది. సూసైడ్ నోట్ స్వాధీనం..శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం..
-
విషాదం.. అనుమానాస్పదస్థితిలో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. పలు కన్నడ సీరియల్స్లో నటించిన ఆమె సూసైడ్కు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం శోభిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.(ఇది చదవండి: నాలుగు పెళ్లిళ్లు కాదు.. నాది రెండోపెళ్లి మాత్రమే.. నటుడు యూటర్న్)కన్నడ సీరియల్స్లో నటిస్తోన్న శోభిత తన భర్తతో కలిసి గచ్చిబౌలిలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటోంది. అయితే శోభిత మృతిపై కారణాలను ఆమె కుటుంబసభ్యులు వెల్లడించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన పెళ్లి తర్వాత సినిమాలకు, సీరియల్స్కు శోభిత. దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శోభిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బ్రహ్మగంతు సీరియల్తో గుర్తింపు శాండల్వుడ్లో బ్రహ్మగంతు సీరియల్ ద్వారా శోభిత శివన్న పాపులారిటీ తెచ్చుకుంది. గతేడాది మే 22న పెళ్లి చేసుకున్న శోభిత ఆ తర్వాత బుల్లితెరకు దూరమైంది. అయితే తన పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.కర్ణాటకలోని సకలేష్పూర్కి చెందిన శోభిత మొదట్లో రాజ్ మ్యూజిక్ ఛానల్లో వీజేగా పనిచేసింది. ఆ తర్వాత మంచి ఆర్టిస్ట్గా సినిమాలతో పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. కన్నడ సీరియల్ బ్రహ్మగంతులో విలన్ పాత్రలో మెరిసిన శోభిత.. నీనిదలే అనే సీరియల్లో కూడా నటించింది. అంతేకాకుండా ఇతర భాషా సీరియల్స్లో కూడా కనిపించింది. బుల్లితెరతో పాటు అటెంప్ట్ టు మర్డర్, జాక్పాట్ సినిమాల్లోనూ నటించింది. కన్నడలో శతభిషే అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు షాకింగ్కు గురయ్యారు. -
సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా!
బుల్లితెర నటి రూపాలీ గంగూలీ.. తమను రాచిరంపాన పెట్టిందని ఆరోపించింది ఆమె సవతి కూతురు ఈషా. తండ్రిని తమకు కాకుండా చేయడమే కాకుండా తల్లిని, తమను మానసిక క్షోభకు గురి చేసిందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇలా బాహాటంగా తనపై విమర్శలు చేసినందుకుగానూ రూపాలీ రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసింది. అది తనను మరింత బాధించిందంటోంది ఈషా.నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ఈ మేరకు సుదీర్ఘ పోస్టుల్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ నెల ప్రారంభంలో నా వ్యక్తిగత స్టోరీని మీతో పంచుకున్నాను. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కానీ ఇది నా జీవితంలో టర్నింగ్ పాయింట్.. ఎందుకంటే ఏళ్లుగా నాలో గూడుకట్టుకున్న బాధను మీతో పంచుకున్నాకే నా మనసుకు కాస్త ప్రశాంతత దొరికింది. స్వేచ్ఛ లభించినట్లయింది.నటి రూపాలీ గంగూలీ, సవతి కూతురు ఈషానా అనుభవాన్ని చెప్పాఎవరికో ఇబ్బంది తలపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ అనుభవాలు నన్నెలా మార్చాయన్నదే చెప్పాలనుకున్నాను. నిజాయితీగా ఉన్నదున్నట్లు మాట్లాడాను. 2013 ఫిబ్రవరిలో రూపాలీ.. మా నాన్నను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో కొడుకును కన్నది. అప్పుడు మీడియా వీళ్ల గురించి కథలు కథలుగా రాసింది కానీ నేనెక్కడా మాట్లాడలేదే. ఇప్పుడు నేను కేవలం నా అనుభవాన్ని చెప్పాను.నిజం మాట్లాడితే శిక్షిస్తారా?అయినా నిజం మాట్లాడితే శిక్షిస్తారా? వాళ్ల రియాక్షన్ చూసి ఎంతో బాధపడ్డాను. మీ ప్రవర్తనతో మరోసారి మీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. నా ఫ్యామిలీ వివాదం గురించి ఇకపై మాట్లాడాను. ఏ ఇంటర్వ్యూలోనూ పాల్గొనను. ఇక నా జీవితం గురించే నేను ఆలోచిస్తాను అని ఈషా రాసుకొచ్చింది.చదవండి: హీరోయిన్లతో ఎఫైర్స్.. నాకు ముందే తెలుసు: హీరో భార్య -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఉదయ్ కిరణ్తో మొదటి సినిమా!
ప్రముఖ బుల్లితెర నటి అదితి దేవ్ శర్మ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు జన్మించిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. తన రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.కాగా.. 2014లో బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. హిందీలో టీవీ సీరియల్స్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదితి శర్మ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఓం శాంతి, బబ్లూ లాంటి చిత్రాల్లో మెరిసింది. బుల్లితెర నటిగా గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్లో పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. గంగా, కథా అంకహీ లాంటి టీవీ షోలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆదితి శర్మ హిందీ, తెలుగు చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Aditi Sharma (@aditidevsharma) -
యంగ్ హీరోతో రీతూ చౌదరి 'న్యూ బిగినింగ్' (ఫొటోలు)
-
క్యాస్టింగ్ కౌచ్.. 16 ఏళ్ల వయసులోనే చేదు అనుభవం: నటి
నీకు ఛాన్సిస్తే నాకేంటి? అన్న ధోరణి ఎప్పటినుంచో ఉంది. కెమెరా ముందు నటించాలని కలలు గన్న ఎంతోమందికి ఎప్పుడో ఓసారి ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది. కొందరు అలాంటి డిమాండ్లను నిర్మొహమాటంగా తిరస్కరిస్తే మరికొందరు తమ కల కోసం తల వంచేందుకు మొగ్గుచూపుతారు.16 ఏళ్ల వయసులో చేదు అనుభవంఅయితే 16 ఏళ్ల వయసులో తనకూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదురైందంటోంది బిగ్బాస్ బ్యూటీ రష్మీ దేశాయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్.. ఒకానొక సమయంలో నేనూ ఫేస్ చేశాను. అప్పుడు నా వయసు 16 ఏళ్లు. ఆడిషన్ ఉందని పిలిస్తే వెళ్లాను. అక్కడున్న వ్యక్తి నేను స్పృహ కోల్పోయేలా చేయడానికి ప్రయత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్నాఅప్పటికే నాకు అక్కడంతా అసౌకర్యంగా అనిపించడంతో ఎలాగోలా ఆ గది నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాను. కొన్ని గంటల తర్వాత జరిగిందంతా అమ్మకు చెప్పాను. ఆ మర్నాడు అమ్మతో కలిసి అతడి దగ్గరకు వెళ్లాను. అమ్మ అతడి చెంప చెళ్లుమనిపించి గుణపాఠం చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది నిజంగానే ఉంది. ఇండస్ట్రీ అనే కాదు ఎక్కడైనా మంచీచెడు రెండూ ఉంటాయి అని చెప్పుకొచ్చింది.సీరియల్స్తో ఫేమస్కాగా రష్మీ దేశాయ్.. కన్యాదాన్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కబ్ హోయ్ గవ్నా హమర్ చిత్రంతో భోజ్పురి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఉత్తరన్, దిల్సే దిల్ తక్ సీరియల్స్తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఖత్రోన్ కె ఖిలాడీ, నాచ్ బలియే 7, ద ఖత్ర ఖత్ర షో, బిగ్బాస్ 13, బిగ్బాస్ 15వ సీజన్లలోనూ పాల్గొంది. -
బుల్లితెర నటిపై తీవ్ర ఆరోపణలు.. దెబ్బకు వీడియో డిలీట్!
బాలీవుడ్లో బుల్లితెర స్టార్ రూపాలీ గంగూలీ అందరికీ సుపరిచితమే. బుల్లితెర నటుల్లో రిచెస్ట్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమె సవతి కూతురు ఇషా నటిపై సంచలన కామెంట్స్ చేసింది. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్ను విడగొట్టిందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది.అయితే ఈషా కామెంట్స్పై నటి రూపాలీ గంగూలీ పరువునష్టం దావా వేసింది. తన పరువుకు భంగం కలిగించేలా ఇషా మాట్లాడిందంటూ రూ.50 కోట్లకు నోటీసులు పంపించింది. ఈ నోటీసులు అందుకున్న ఇషా వెంటనే అప్రమత్తమైంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను సైతం డిలీట్ చేసింది. అంతేకాకుండా తన ఇన్స్టా అకౌంట్ను ప్రైవేట్గా మార్చేసింది. పరువు నష్టం కేసు నోటీసులు రావడంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు)డిలీట్ చేసిన వీడియో ఇషా మాట్లాడుతూ..'ఇప్పుడు నేను నా రౌడీలకు వ్యతిరేకంగా నిలబడ్డా. నా జీవితంలో వాళ్లిద్దరే రౌడీలు. వారు నేను ప్రేమించే నా తల్లిని ఇబ్బంది పెట్టడమే కాదు.. నన్ను బాధపెట్టాలని చూశారు. వారు నన్ను విమర్శించడానికి నా బలహీనతలను ఎంచుకున్నారు. వారు నాకు బహిరంగంగా, వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నన్ను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని" మాట్లాడింది. పరువు నష్టం నోటీసులు రావడంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. కాగా.. అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి రుహి చతుర్వేది ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. కుండలి భాగ్య సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న రుహి చతుర్వేది నటుడు శివేంద్ర ఓం సాయినియోల్ను పెళ్లాడింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి ఓ వీడియోను షేర్ చేసింది. వీరికి పెళ్లయిన ఐదేళ్ల తర్వాత గర్భం ధరించినట్లు వెల్లడించారు.రుహి చతుర్వేది తన ఇన్స్టాలో రాస్తూ..' మా అందమైన కుటుంబం ఇంకాస్త పెద్దగా అవుతోంది. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. రుహి చతుర్వేది, సైనియోల్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2019లో వివాహం చేసుకున్నారు.కాగా.. ఆమె కుండలి భాగ్య సీరియల్లో షెర్లిన్ ఖురానా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు రుహి మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2010 పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత 2012లో ఆలాప్ అనే సినిమాతో నటనలో ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా ఖత్రోన్ కే కిలాడీ సీజన్-13లోనూ కంటెస్టెంట్గా పాల్గొంది. మరోవైపు ఆమె భర్త శివేంద్ర చోటి సర్దానీ అనే సీరియల్లో నటించారు. View this post on Instagram A post shared by Ruhi Chaturvedi (@ruhiiiiiiiiii) -
ఆధ్యాత్మిక శోభ : భర్తతో కలిసి బిగ్బాస్ నటి సంప్రదాయపూజలు
-
మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు
ప్రముఖ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ తనను ఎంతో వేధించిందంటోంది ఆమె సవతి కూతురు ఈషా. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్ను విడగొట్టిందని ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల కిందట నేను పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరలవుతోంది. దీన్ని రూపాలి, నాన్న (అశ్విన్) ఎలా సమర్థించుకుంటారో అర్థం కావట్లేదు.పేరెంట్స్ బెడ్రూమ్లో తిష్టఅప్పటికీ మా నాన్న ఎక్స్(ట్విటర్)లో ఈ గొడవకు, రూపాలీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. అది అన్నింటికంటే పెద్ద అబద్ధం. ఎందుకంటే అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న మా ఇంటికి రూపాలీ తరచూ వచ్చేది. మా అమ్మ నాన్నతో షేర్ చేసుకున్న బెడ్పైనే తనూ నిద్రించేది. ఆమె నన్ను, మా అమ్మను శారీరకంగా, మానసికంగా వేధించింది. మాటలతో చిత్రవధ చేసింది. ఆమె వల్ల ఎంతో నరకం అనుభవించాం.సీరియల్లో హీరోయిన్.. బయట విలన్నాన్న-రూపాలీ ఎఫైర్ వ్యవహారంలో ఇద్దరి తప్పు ఉంది. రూపాలీ ప్రధాన పాత్రలో నటించే అనుపమ సీరియల్లో.. ఆమె భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకుని తనను మోసం చేస్తాడు. ఆమె తనకోసమే కాకుండా మహిళలందరి పక్షాన నిలబడి పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తుంటుంది. మరి నిజ జీవితంలో ఏం జరిగింది? ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితాల్లో అడుగుపెట్టింది. మా అమ్మను, నాన్నను విడదీసింది. శాశ్వతంగా విడగొట్టాలని ప్రయత్నాలుబలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది. కాగా అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. View this post on Instagram A post shared by Esha Verma (@eshav.official) చదవండి: రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం -
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో భర్త పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి మాళవిక కృష్ణదాస్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతంలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన నటి.. సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. బిడ్డ పుట్టిన విషయాన్ని ఆమె భర్త తేజస్ జ్యోతి ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. బిడ్డ చేతిని పట్టుకున్న ఫోటోను ఆయన పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మాళవిక కృష్ణదాస్, తేజస్ జ్యోతి బుల్లితెర జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్లో కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. ఆ షో ద్వారానే మరింత ఫేమస్ అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత మాళవిక, తేజస్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ బుల్లితెర ప్రేమజంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేశారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మాళవిక ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీపై పోస్టులు పెడుతూనే ఉంటోంది. బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన భర్తతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. కాగా.. మాళివిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Malavika Krishnadas (@malavika_krishnadass) -
పట్టు చీరలో అందమే అసూయపడేలా తేజస్విని గౌడ (ఫొటోలు)
-
లేటు వయసులో పెళ్లి.. 'తండ్రి దొరికినందుకు పిల్లలు హ్యాపీ'
బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ పెళ్లి చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్తో ఏడడుగులు వేశాడు. కేరళలోని గురువాయూర్లో మంగళవారం వీరి వివాహం జరిగింది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్లో కలిసి నటించారు.ఫస్ట్ ప్రపోజ్ ఎవరంటే?ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ.. నాకు మొదట ప్రపోజ్ చేసింది అతడే.. పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడు. నాకేమీ అర్థం కాలేదు. తీరా.. అతడు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అందుకు నన్ను ఒప్పించాడు కూడా! దీని గురించి నా కూతురు, కొడుక్కి చెప్తే వాళ్లు ఎంతగానో సంతోషించారు. తమకు తండ్రి దొరికాడని ఖుషీ అయ్యారు అని తెలిపింది.ఇద్దరూ నటులేకాగా క్రిస్ వేణుగోపాల్ సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుంటాడు. దివ్య శ్రీధర్.. మలయాళ సీరియల్స్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో అలరిస్తూ ఉంటుంది. -
ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి
బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి జ్యోతి- సుమిత్ సూరి పెళ్లికి రెడీ అయ్యారు. రెండు రోజుల క్రితమే పెళ్లిసంబరాలు షురూ అవగా నేడు (అక్టోబర్ 27న) వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కానున్నారు. హల్దీ, మెహందీకి సంబంధించిన ఫోటోలను సురభి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లోని ఓ రిసార్ట్లో వివాభ వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. కృత్రిమ డెకరేషన్ కాదని ప్రకృతి ఒడిలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించడం విశేషం.ఎవరీ సురభి జ్యోతి?పెళ్లికూతురు సురభి విషయానికి వస్తే.. ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్బాజ్, కోయి లౌట్కే ఆయా హై సీరియల్స్లో నటించింది. వరుడు సుమిత్ సూరి.. రిషికేశ్లో జన్మించాడు. సుమారు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. 2013లో వార్నింగ్ చిత్రంతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలతో పాటు ద టెస్ట్ కేస్, హోమ్ వంటి వెబ్ సిరీస్లలో యాక్ట్ చేశాడు.అప్పటి నుంచే లవ్సురభి, సుమిత్.. హాంజి: ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరి మధ్య లవ్ మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో వీరు తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) చదవండి: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ -
ప్రియుడితో నటి నిశ్చితార్థం, పెళ్లెప్పుడంటే?
కన్నడ బుల్లితెర నటి మాన్సీ జోషి శుభవార్త చెప్పింది. త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రియుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆదివారం (అక్టోబర్ 20న) నిశ్చితార్థం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు తెలిపారు.ఇకపోతే ఈ బ్యూటీ దేవత సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్ నుంచి నటి వైష్ణవి తప్పుకోగా.. ఆ స్థానాన్ని మాన్సీ భర్తీ చేసింది. ఈమె ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కన్నడలో పారు, రాధా రమణ వంటి సీరియల్స్లో మెరిసింది. View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) -
గ్రీన్ డ్రెస్లో బుల్లితెర భామ తేజస్విని అందాలు (ఫొటోలు)
-
క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించిన బుల్లితెర నటి
బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది ఆశా నేగి. పదేళ్లుగా టీవీ ఇండస్ట్రీలోనే రాణిస్తున్న ఈ బ్యూటీ కెరీర్ తొలినాళ్లలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో కోఆర్డినేటర్స్ ఉండేవాళ్లు. ఏదైనా అవకాశాలున్నాయంటే వీళ్లే చెప్పేవాళ్లు. అలా ఓ వ్యక్తి నాకు తారసపడ్డాడు. కొన్నింటికి ఓకే చెప్పాలంటూ..తనతో మీటింగ్ కూడా అయింది. అప్పుడు నాకు ఇరవై ఏళ్లు. టెలివిజన్ ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది.. ఇక్కడ కొన్నింటికి ఓకే చెప్పాల్సి వస్తుంది. అప్పుడే నీకు ఎదుగుదల ఉంటుంది. పెద్ద పెద్ద టీవీ స్టార్లు కూడా ఈ పద్ధతిలోనే పాపులారిటీ తెచ్చుకున్నారు అన్నాడు. అతడి ఉద్దేశం ఏంటో అర్థమైంది. ఆసక్తి లేదన్నాతను చెప్పినట్లే చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందీ అంటే అలాంటి కెరీర్ నాకు వద్దే వద్దనుకున్నాను. నాకు ఏమాత్రం ఆసక్తి లేదని అతడి ముఖం మీదే చెప్పాను. ఈ సంఘటనను నా ఫ్రెండ్తో షేర్ చేసుకున్నా.. ఇలాంటివి సర్వసాధారణం అని చాలా సింపుల్గా అనేశాడు అని చెప్పుకొచ్చింది. కాగా ఆశా నేగి పవిత్ర రిష్తా సీరియల్లో పూర్వీ దేశ్ముఖ్గా పేరు తెచ్చుకుంది. బారిష్, హనీమూన్ ఫోటోగ్రాఫర్ వెబ్ సిరీస్లలోనూ నటించింది.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బుల్లితెర నటికి చికెన్ గున్యా
బుల్లితెర నటి మహి వీజ్ అనారోగ్యం పాలైంది. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆమెకు చికెన్ గున్యా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈమేరకు హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.లైఫ్లోనే కఠినమైన రోజులు..కాగా కొద్ది రోజుల క్రితం నటి.. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని పేర్కొంది. ఈమేరకు ఓ వీడియోను తన అభిమానులతో పంచుకుంది. ఈ పది రోజులు నా జీవితంలోనే ఎంతో కఠినతరమైనవి. నాకన్నీ చేసిపెట్టే నాన్న ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వీలైనంతవరకు నేను తనతోనే ఉంటున్నాను. అతడు తిరిగి మామూలుగా నడిచేందుకు ఎంకరేజ్ చేస్తున్నాను. తెలుగులో హీరోయిన్గా..పేరెంట్స్కు పిల్లలను చూస్తేనే సగం జబ్బు నయమైపోతుంది. నా తండ్రి కోసం నెలల తరబడి ఆయన వెన్నంటే ఉంటున్నందుకు గర్వంగా ఉంది. నీ వెంట నేనున్నాను నాన్నా.. లవ్యూ అని రాసుకొచ్చింది. మహి వీజ్.. తెలుగులో తపన అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. బాలికా వధు, లాగి తుజ్సే సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. 2011లో జై భానుషాలిని పెళ్లాడింది. వీరికి తారా అనే కూతురు పుట్టింది. అలాగే రాజ్వీర్ అనే బాబును పెంచుకుంటున్నారు. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: ఆదిత్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? వాళ్ల కంటే ఎక్కువే! -
భర్తతో విడాకులు.. టాటూ మార్చేసిన బుల్లితెర నటి
కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించిన బుల్లితెర నటి దల్జీత్ కౌర్కు భంగపాటు ఎదురైంది. వ్యాపారవేత్త నిఖిల్ పటేల్ను రెండో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిన ఆమెకు కొంతకాలానికే అతడితో విభేదాలు మొదలయ్యాయి. అతడి పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుని జీవితాంతం కలిసుందామన్న ఆశలు అడియాసలయ్యాయి. దంపతుల మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చిందని, అందువల్ల తమ బంధం బీటలు వారిందంటూ కొద్ది నెలల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించింది.టాటూతిరిగి ఇండియాకు వచ్చేసింది. తాజాగా ఆమె తన టాటూను మార్చేసింది. అంతకుముందు నిఖిల్తో తన జర్నీ ప్రారంభానికి సంకేతంగా 'టేక్ 2.. 07/09/22' అని ఉండేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసింది. తల్లీకొడుకుల బంధాన్ని చాటిచెప్పేలా కొత్తగా పచ్చబొట్టును రీడిజైన్ చేసింది. తన కుమారుడు జేడన్ మీద ఉన్న ప్రేమను ఈ టాటూ ద్వారా బయటపెట్టింది. ఈ టాటూ వేయించుకున్నందుకు ఈసారి నొప్పిగా అనిపించలేదని చెప్పింది.రెండు పెళ్లిళ్లు ఫెయిల్కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్ను పెళ్లాడింది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. 2023 మార్చిలో అతడిని పెళ్లి చేసుకోగా ఏడాది తిరగకముందే విడాకులకు దరఖాస్తు చేశారు.చదవండి: ఆ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా : అరవింద్ స్వామి -
నిరాహార దీక్ష చేసి మరీ ఇండస్ట్రీలో అడుగుపెట్టా: బుల్లితెర నటి
రంగులప్రపంచంలో భాగం కావాలని కలలుకనేవాళ్లు ఎంతోమంది. బుల్లితెర నటి ఆశా నేగి కూడా అలానే కలలు కంది. అందరు తల్లిదండ్రులలాగే ఆమె పేరెంట్స్ కూడా అందుకు ఒప్పుకోలేదు. కొద్దిరోజులైతే తనే ఆ కలను మర్చిపోతుందనుకున్నారు. కానీ ఆమె పట్టు వదల్లేదు, నిరాహార దీక్ష చేపట్టింది. రెండుమూడురోజులపాటు తిండి తినకుండా మొండిగా కూర్చుంది. దీంతో ఆమె తల్లి తనను సముదాయించే ప్రయత్నం చేసింది. మొదటి ప్రాధాన్యత సినిమాకు..నాకు మూడు నెలల గడువు ఇవ్వు. అప్పటిలోపు నన్ను నేను నిరూపించుకోకపోతే తిరిగొచ్చి మీకు నచ్చిందే చేస్తాను అని తల్లిని బతిమాలింది. అలా ఆశా నేగి తన కుటుంబాన్ని ఒప్పించి డెహ్రాడూన్ వదిలేసి ముంబైకి వచ్చేసింది. తన టాలెంట్తో పాపులర్ అయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ముంబై వచ్చిన కొత్తలో నాకేం అర్థం కాలేదు. సినిమాలు చేద్దామనుకున్నాను. టీవీ వైపు వెళ్లాలనుకోలేదు.ఆడిషన్స్ ఇస్తూ పోయాఅయినా ఇక్కడ ఏదీ అంత ఈజీగా రాదని తెలుసుకున్నాను. ఆడిషన్స్ ఇస్తూ పోయాను. అలా ఓ సీరియల్లో ఛాన్స్ వచ్చింది. టీవీ ఇండస్ట్రీ నన్ను అక్కున చేర్చుకుంది. నాకెంతో ప్రేమను ఇచ్చింది అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఆశా నేగి చివరగా హనీమూన్ ఫోటోగ్రాఫర్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఇది జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బుల్లెట్ బండితో తేజస్విని గౌడ.. పోజులు మస్త్ (ఫొటోలు)
-
వింటేజ్ కారు, పూలచీరలో విష్ణు ప్రియ అదిరే లుక్స్ (ఫోటోలు)
-
నాన్స్టాప్గా 60 గంటలు షూటింగ్.. సొమ్మసిల్లిపోయినా డోంట్ కేర్!
పని ఒత్తిడి.. అన్ని చోట్లా ఉంది. వెండితెర ప్రపంచం అందుకు మినహాయింపు కానేకాదు. బుల్లితెరలోనూ ఈ ఒత్తిడి అధికంగానే ఉందంటోంది నటి క్రిస్టల్ డిసౌజ. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో నా సంపాదన రోజుకు రూ.2,500. రోజులో కేవలం 12 గంటలు మాత్రమే షూట్ చేయాలి వంటి నిబంధనలు అప్పట్లో లేవు. 60 గంటలపాటు షూటింగ్అలా నేను ఓసారి నాన్స్టాప్గా 60 గంటలపాటు షూటింగ్లో పాల్గొన్నాను. ఆ సమయంలో చాలాసార్లు సెట్లోనే కిందపడిపోయాను. అప్పటికీ వాళ్లు వదల్లేదు. నాకు మెడిసిన్ ఇచ్చి మళ్లీ షూట్లో జాయిన్ అవమని చెప్పేవాళ్లు. కనీసం హాస్పిటల్కు వెళ్లేంత సమయం కూడా ఇచ్చేవారు కాదు. అది నాపై చాలా ప్రభావం చూపింది. నా వల్ల కాకపోయినా అది నా పని కాబట్టి చేయక తప్పలేదు.సీరియల్స్, సినిమాలుఏదేమైనా టీవీ ఇండస్ట్రీ నన్ను స్ట్రాంగ్గా మార్చింది. పారితోషికం కూడా మెరుగ్గానే ఉండేది. ఐదారేళ్లపాటు ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నా కూడా నా ఇంటిని నడపగలను అని చెప్పుకొచ్చింది. కాగా క్రిస్టల్ డిసౌజ.. ఏక్ హజరాన్ మే మేరి బెహ్నా హై సీరియల్తో ఫేమస్ అయింది. 2018లో చివరగా బేలన్ వాలి బాహు సీరియల్లో నటించింది. చెహ్రె మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఈ మధ్యే విస్ఫోట్ సినిమాతో ఆకట్టుకుంది.చదవండి: చెత్త ఫెలోస్.. మణికి నరకం చూపిస్తున్నారు! గొడవల మధ్యలో లవ్ ట్రాక్ ఒకటి.. -
ఈ బతుకే వ్యర్థం అని నిద్రమాత్రలు మింగా: బాలీవుడ్ నటి
ఈ బతుకే వ్యర్థం అని చావుకు సిద్ధపడిన తనను కుటుంబమే రక్షించిందంటోంది బాలీవుడ్ నటి షామా సికిందర్. వాళ్లే గనక లేకపోయుంటే ఈ భూమిపై తనకు ఎప్పుడో నూకలు చెల్లేని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి షామా సికిందర్ తన చీకటి రోజుల గురించి మాట్లాడింది. నానమ్మ నుంచి నాకు..'15 ఏళ్ల క్రితం నేను అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నాను. తీవ్రమైన ఒత్తిడి దానికి తోడు బైపోలార్ డిజార్డర్(ఇది ఒకరకమైన మానసిక అనారోగ్యం.. ఈ వ్యాధి బారినపడినవారు ఎక్కువ ఎగ్జయిట్ అవుతారు, అధికంగా కుంగిపోతారు). మా నానమ్మకు కూడా ఇదే వ్యాధి ఉండేది. జన్యుపరంగా అది నాకు సంక్రమించింది. ఈ బతుకే వద్దనుకున్నాఅయితే మా నానమ్మ చేష్టలు చూసి చాలామంది తనకేదో దెయ్యం పట్టిందనుకునేవారు. కొన్నిసార్లు నేనూ తనలాగే ప్రవర్తించేదాన్ని. ఈ జనరేషన్లో పుట్టినదాన్ని కనుక నాకేదో చేతబడి జరిగిందని అనుకోలేదు. అయితే ఒకసారి మాత్రం చనిపోయేందుకు ప్రయత్నించాను. నాకు ఈ జన్మ వద్దు, నేను పోయాక నాకు మళ్లీ మరో జన్మ ప్రసాదించమని దేవుడిని వేడుకున్నాను. నిద్ర మాత్రలు మింగాబోలెడన్ని నిద్రమాత్రలు మింగాను. నా బ్యాంక్ వివరాలు సోదరుడికి పంపించాను. అప్పుడతడు పెళ్లిలో ఉన్నాడు. నేను సడన్గా బ్యాంక్ వివరాలు పంపడంతో ఆందోళన పడ్డ అతడు అమ్మకు ఫోన్ చేశాడు. దీంతో అమ్మ నా గదిలోకి వచ్చి నన్ను నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. కానీ నేను లేవలేదు. క్షణాల్లో అందరూ నా చుట్టూ గుమిగూడారు. మూడేళ్లు గది దాటి బయటకు రాలేదువెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నా శరీరంలో ఉన్న విషాన్ని తీసేసి బతికించారు. తర్వాత రెండుమూడేళ్లు నాకెంతో కష్టంగా గడిచాయి. గది దాటి బయటకు రాలేదు. నా రూమ్లోనే ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. చాలాకాలానికి నేను తప్పు దారిలో వెళ్తున్నానని అర్థం చేసుకుని దాన్నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేశాను' అని చెప్పుకొచ్చింది.కెరీర్షామా సికిందర్ ‘యే మేరి లేఫ్ హై’, 'బల్వీర్', ‘మన్ మే హై విశ్వాస్’ వంటి సీరియల్స్తో నటిగా మంచి గుర్తింపు పొందింది. ప్రేమ్ అగ్గన్ (1998) మూవీతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఆమె మన్, యే మొహబ్బత్ హహై, అన్ష్: డెడ్లీ పార్ట్, బస్తీ, ధూమ్ ధడక్కా చిత్రాల్లో నటించింది. చివరిగా 2019లో ‘బైపాస్ రోడ్’లో యాక్ట్ చేసింది.గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comచదవండి: యువతిపై 'జానీ మాస్టర్' లైంగిక దాడి నిజమే.. రిమాండ్ రిపోర్టు -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి..!
బుల్లితెర భామ స్మృతి ఖన్నా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2017లో నటుడు తమ్ గుప్తాను పెళ్లాడిన నటికి ఇప్పటికే అనైక కూతురు కూడా ఉన్నారు. తాజాగా మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బుల్లితెర జంటకు రెండో కూతురికి తమ జీవితంలోకి ఆహ్వానం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.స్మృతి ఖన్నా బాలీవుడ్లో మెరీ ఆషికి తుమ్ సే హై అనే సీరియల్తో కెరీర్ ప్రారభించింది. ఆ తర్వాత యే హై ఆషికి, సీఐడీ, బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) లాంటి సీరియల్స్తో మెప్పించింది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో డాక్టర్ వందనా మిట్టల్ పాత్రలో అలరించింది. అంతే కాకుండా పలు రియాలిటీ షోలలో కంటెస్టెంట్గా పాల్గొంది. వీటితో పాటు జట్ ఎయిర్వేస్ అనే పంజాబీ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. చివరిసారిగా 2022లో వచ్చిన దప్పా అనే వెబ్ సిరీస్లో కనిపించింది. అయితే పెళ్లి తర్వాత సీరియల్స్కు గుడ్బై చెప్పేసింది బుల్లితెర భామ స్మృతి ఖన్నా. View this post on Instagram A post shared by Smoo (@smriti_khanna) -
తల్లయ్యాక వదిన పాత్రలే వస్తున్నాయి: బిగ్బాస్ విన్నర్
హీరోలకు పెళ్లయినా, పిల్లలు పుట్టినా, మనవళ్లు, మనవరాళ్లను ఎత్తుకునే వయసు వచ్చినా కూడా తెరపై కథానాయకులుగానే చెలామణి అవుతారు. కానీ హీరోయిన్లు మాత్రం కాస్త వయసుపైబడ్డట్లు కనిపించినా పక్కన పెట్టేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలను తీసుకురావాలని దర్శకనిర్మాతలు ఆరాటపడతారు.సైడ్ క్యారెక్టర్లువెండితెర అయినా, బుల్లితెర అయినా నటీమణులకు పెళ్లయిందంటే చాలు సైడ్ క్యారెక్టర్లు ఆఫర్ చేస్తుంటారు. తనక్కూడా అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది నటి, బిగ్బాస్ విన్నర్ రుబీనా దిలైక్. గతేడాది డిసెంబర్లో రుబీనా- అభినవ్ శుక్లా దంపతులకు కవలలకు జన్మనిచ్చారు. పిల్లలు పుట్టాక తన లైఫ్ మరింత అందంగా మారిందంటోంది రుబీనా. అయితే తల్లయ్యాక తనకన్నీ వదిన రోల్స్ మాత్రమే వస్తున్నాయంది. గణపతి పూజప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గణపతిని ఇంట్లో పెట్టుకుని పూజించినట్లు తెలిపింది. భర్త, పిల్లలు ఊరికి వెళ్తే.. తను మాత్రం ఒక్కతే విఘ్నేశుడిని పూజించింది. ఆ సమయంలో ఫ్యామిలీని చాలా మిస్సయయ్యానంది. అందుకే, రెండురోజులకే గణనాథుడిని నిమజ్జనం చేసి తాను కూడా ఊరెళ్లి పిల్లలతో కలిసి సేద తీరుతోంది. రుబీనా.. అటు వృత్తి పనిని, ఇటు ఫ్యామిలీ లైఫ్ను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది.బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి హెచ్కే వర్ష త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా నటుడు కౌశిక్ నాయుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది ముద్దుగమ్మ. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ.. శాండల్వుడ్లోనూ పలు సీరియల్స్లో కనిపించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.(ఇది చదవండి: బాయ్ఫ్రెండ్తో చిల్ అవుతోన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య!)వర్షకు కాబోయే భర్త కౌశిక్ నాయుడు సైతం కన్నడలో సీరియల్స్లో నటించారు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించింది శాండల్వుడ్ బ్యూటీ వర్ష హెచ్కే. అంతకుముందు కన్నడలో నాగమండలం, కస్తూరి నివాస్, రాజారాణి సీరియల్స్ చేసింది. అంతే కాకుండా కొన్ని లఘు చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో బుల్లితెరపై అభిమానులను అలరిస్తోంది. View this post on Instagram A post shared by 𝙆𝙖𝙪𝙨𝙝𝙞𝙠 𝙉𝙖𝙞𝙙𝙪 (@peoplez_prince) -
అప్పటిదాకా సంస్కారి.. మందు ముట్టాడంటే మాత్రం..!
నటుడు అలోక్ నాథ్ సంస్కారవంతుడు.. అదంతా మందు ముట్టనంతవరకే! ఒక్కసారి మద్యం సేవించాడంటే మృగంలా మారిపోతాడంటోంది నటి హిమాని శివ్పురి. అలోక్ నాథ్తో కలిసి ఎన్నో ప్రాజెక్టుల్లో కలిసి నటించిన హిమాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి బండారాన్ని బయటపెట్టింది.నాతో అసభ్యంగా..ఆమె మాట్లాడుతూ.. అలోక్ నాథ్ చాలా హుందాగా వ్యవహరిస్తాడు. కానీ సాయంత్రమైందంటే చాలు మందు ముట్టకుండా ఉండలేడు. మద్యం సేవించగానే నియంత్రణ కోల్పోతాడు. ఒకసారి నేషన్ స్కూల్ డ్రామా (ఎన్ఎస్డీ) చదివే రోజుల్లో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఎన్నడూ నా దగ్గర ఆ తప్పును రిపీట్ చేయలేదు. కానీ తాగిన మద్యం తర్వాత మాత్రం తేడాగా ప్రవర్తిస్తున్నాడని చాలామంది దగ్గరి నుంచి విన్నాను.ఉన్నపళంగా దింపేశారుఆయన్ను దగ్గరుండి చూశాను, కాబట్టి చెప్తున్నా.. తాగకముందు వరకు సంస్కారి.. ఆ తర్వాతేమో అపరిచితుడిలా మారిపోయేవాడు. ఓసారి మేము అవార్డు షోకు కలిసి వెళ్తున్నాం. అప్పటికే అతడు ఫుల్లుగా తాగి ఉన్నాడు. అతడి భార్య సైలెంట్గా ఉండమని పదేపదే చెప్తూనే ఉంది. కాసేపైనా నిన్ను నువ్వు తమాయించుకో అని నేను కూడా హెచ్చరించాను. తను వినిపించుకోకుండా పిచ్చిగా ప్రవర్తించడంతో అతడిని విమానంలో నుంచి దింపేశారు అని చెప్పుకొచ్చింది.కాగా గతంలో మీటూ ఉద్యం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలోనూ అలోక్ నాథ్ వేధించాడంటూ నటీమణులు నవనీత్ నషాన్, దీపిక, సంధ్య మృదుల్, నిర్మాత వింత నంద ఆరోపించడం గమనార్హం.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
క్యాన్సర్తో నటి పోరాటం.. ఇప్పుడు తినడానికి కూడా కష్టంగా..!
క్యాన్సర్తో పోరాడటం అంత ఈజీ కాదు. అయినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ మహమ్మారిని జయించే దిశగా పోరాడుతోంది హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్. ప్రస్తుతం తనకు రొమ్ము క్యాన్సర్ మూడో స్టేజీలో ఉండటంతో వెంటనే కీమో థెరపీ ప్రారంభించారు.సైడ్ ఎఫెక్ట్స్అయితే వరుస కీమోథెరపీల వల్ల తన శరీరంపై కాలిన మచ్చలు ఏర్పడటంతో పాటు తాజాగా మ్యుకోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. కీమో థెరపీ చేయించుకోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్టే మ్యుకోసైటిస్. వైద్యుల సూచన మేరకు దానికి కూడా చికిత్స తీసుకుంటున్నాను. మీలో ఎవరికైనా దీన్ని ఎలా నివారించాలో తెలిస్తే దయచేసి నాకు సాయం చేయండి. సలహా ఇవ్వండిఎందుకంటే భోజనం కూడా చేయలేకపోవడం చాలా కష్టం కదా! మీరు ఇచ్చే సలహాలు నాకెంతో మేలు చేస్తాయి అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. వైద్యుల చికిత్సనే ఫాలో అయిపో.. పొరపాటున సొంత ప్రయోగం వికటించిందంటే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది అని కొందరు హెచ్చరించారు.మ్యుకోసైటిస్ అంటే..కీమోథెరపీ దుష్ప్రభావాల్లో మ్యుకోసైటిస్ అనేది ఒకటి. దీనివల్ల గొంతు, నోరు, అన్నవాహిక, కడుపు, పేగుల్లో ఉండే శ్లేష్మపొరలు వాచిపోతాయి. నోటిలో అల్సర్లు కూడా కనిపిస్తాయి. దీనివల్ల ఆహారం తినలేరు, జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయదు. కొందరికైతే నోటి నుంచి రక్తం కూడా వస్తుంది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకున్న 'డాన్' దర్శకుడు -
ఆడిషన్ సమయంలో బలవంతం చేశాడు: బుల్లితెర నటి
హేమ కమిటీ నివేదిక బహిర్గతం అయ్యాక ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయటకు చెబుతున్నారు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోన్న క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉందంటూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరో బుల్లితెర నటి తనకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనను తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.తన కెరీర్ తొలినాళ్లలో ఓ హిందీ చిత్ర నిర్మాత వేధింపులకు గురి చేశాడని బుల్లితెర నటి శిల్పా షిండే ఆరోపించింది. ఆడిషన్ సమయంలో తనపై బలవంతం చేశాడని ఆమె పంచుకుంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చేదు సంఘటనను పంచుకుంది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. మహిళలపై లైంగిక వేధింపులు అన్ని రంగాల్లో జరుగుతున్నాయని నటి శిల్పా షిండే అన్నారు.శిల్పా షిండే మాట్లాడుతూ..' నేను 1998-99లో రోజుల్లో ఇండస్ట్రీలో కష్టపడుతున్నా. ఇప్పుడు నేను వారి పేర్లు చెప్పడం ఇష్టం లేదు. ఈ దుస్తులు ధరించండి. మీరు ఒక సీన్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. కానీ నేను అతను ఇచ్చిన దుస్తులు ధరించలేదు. అంతేకాదు.. ఆ సీన్లో అతనే నా బాస్ అని చెప్పాడు. అప్పుడే చాలా అమాయకురాలిని.. అందుకే ఆ సీన్కు ఒప్పుకున్నా. కానీ ఆ వ్యక్తి నా మీదికి వచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో నేను భయంతో అతన్ని పక్కకు తోసి బయటకు పరుగెత్తా. అక్కడే ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ అంతా నన్ను చూశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లమన్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా.. భాబీజీ ఘర్ పర్ హైన్ అనే సిట్కామ్తో శిల్పా షిండే ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఖత్రోన్ కీ కిలాడీ రియాలిటీ షో సీజన్-14లో పాల్గొంటొంది. -
ఒక ఆడదాని జీవితం మరో ఆడదే నాశనం చేస్తుంది: నటి
హిందీ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ కోటి ఆశలతో పెళ్లిపీటలెక్కింది. మొదటి బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మారినా.. రెండో బంధాన్నయినా కలకాలం కాపాడుకోవాలని ఆరాటపడింంది. నిఖిల్ పటేల్ను రెండో పెళ్లి చేసుకుంది. అతడితోనే జీవితమని భావించి తనతోపాటు విదేశాలకు వెళ్లిపోయింది.నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్లు? కానీ ఆశలన్నీ చెదిరిపోయాయి. కట్టుకున్న భర్త తన ప్రియురాలితో ఇంకా సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకుని మనసు ముక్కలైంది. పోట్లాడింది, పోరాడింది. తను మారడని తెలుసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్లో.. 'నా మెదడులో రెండు ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఒకటి.. అతడు ఏదైతే చేస్తున్నాడో.. దానితో సంతోషంగా ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్లు? అంటే గతంలో తనకు పబ్లిసిటీ లభించలేదనా?ఆడదానికి ఆడదే శత్రువురెండోది.. ఒక ఆడదానికి ఆడదే శత్రువు.. మహిళ జీవితాన్ని మరో మహిళే నాశనం చేస్తుందని జనాలు చెప్పే మాటలు సత్యం. ఇప్పుడు నేను ఆవిడను తప్పు పట్టడం లేదు. కానీ భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా తనను వదిలిపెట్టనేమో! భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు, సమస్యలు వచ్చినప్పుడు మూడో వ్యక్తి దూరాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా పెద్ద తప్పు. పైగా తనకు ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అయినా సరే నా భర్త చెంతచేరడమేంటో? దీని వెనక కారణాలేంటో ఎవరికి మాత్రం తెలుసు?' అని రాసుకొచ్చింది.2009లో మొదటి పెళ్లి కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. ఇతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు.గొడవలుఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారడంతో 2023 మార్చిలో పెళ్లి చేసుకున్నారు. కుమారుడిని తీసుకుని అతడితో పాటు దల్జీత్ లండన్ వెళ్లిపోయింది. కానీ అక్కడ గొడవలు తలెత్తడంతో వివాహమైన పది నెలలకే విడాకులకు దరఖాస్తు చేయడం గమనార్హం. -
మలయాళమే కాదు.. ఇక్కడ పెద్ద లిస్టే ఉంది: నటి షాకింగ్ కామెంట్స్
మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన హేమ కమిటీ నివేదికపై ప్రముఖ కోలీవుడ్ నటి రేఖ నాయర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉందన్నారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. మీడియా లేని కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. అప్పట్లో చాలామంది సర్దుకుపోయేవారని కామెంట్ చేశారు. కొంతమంది అడ్జస్ట్మెంట్ కాలేక సినిమాల నుంచి తప్పుకున్నారని రేఖా నాయర్ వెల్లడించారు.కోలీవుడ్లోనూ ఇలాంటి వేధింపులు చాలానే జరుగుతున్నాయని రేఖా నాయర్ ఆరోపించారు. మలయాళంలో కేవలం పది నుంచి ఇరవై మంది మాత్రమే ఉంటారని.. తమిళంలో ఆ సంఖ్య భారీగానే ఉంటుందని అన్నారు. ఇక్కడైతే ఏకంగా 500లకు పైగానే ఉంటారని తెలిపారు. ఇవన్నీ బయటికి మాట్లాడితే సినిమా ఛాన్సులు రావని రేఖా నాయర్ వెల్లడించారు. అందుకే హీరోయిన్స్ వాటి గురించి మాట్లాడేందుకు భయపడతారని పేర్కొన్నారు. తమిళంలో సినిమా సంఘాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరన్నారు. కేవలం మలయాళం, తమిళం మాత్రమే అన్ని భాషల్లోనూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.కాగా.. తమిళంలో టీవీ సీరియల్స్లో నటించి గుర్తింపు తెచుకున్న నటి రేఖ నాయర్. ఆమె వంశం, పగల్ నిలవు, ఆండాళ్ అజగర్, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, బాల గణపతి లాంటి టీవీ సీరియల్స్లో నటించింది. అంతే కాకుండా తమిళంలో బిగ్బాస్ సీజన్-7లో కంటెస్టెంట్గా పాల్గొంది. అయితే గతంలో మహిళల పట్ల ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల నడుము మీద అబ్బాయిలు చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి కానీ.. ఏదో అయిపోయిందని హంగామా చేయొద్దని కామెంట్స్ చేశారు. -
Nishka: వెన్నదొంగగా మారిన బుల్లితెర నటి చైత్ర గారాలపట్టి.. (ఫోటోలు)
-
ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి.. ఎన్ని లక్షలంటే?
ఇమ్లీ సీరియల్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అద్రిజా రాయ్. ప్రస్తుతం ఆమె కుండలి భాగ్య సీరియల్లో నటిస్తోంది. దుర్గా ఔర్ చారుతో తన కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ బుల్లితెర అభిమానులను అలరిస్తోంది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించిన ఆద్రిజా తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. నా కష్టం, దృఢ సంకల్పంతో మొదటి కారును కొనుగోలు చేసినట్లు ఆద్రిజా రాయ్ తెలిపింది. ఈ కారు విలువ దాదాపు రూ.65 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. తన తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల ప్రేమనే తనను ముందుకు నడిపిస్తున్నదని నటి పేర్కొంది. కుండలి భాగ్య సీరియల్లో నటించడం మంచి అనుభవమని.. తాను ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉందని అద్రిజ రాయ్ వెల్లడించింది. నా ముందు ఇంకా ఎన్నో మైలురాళ్లు ఉన్నాయని వివరించింది. View this post on Instagram A post shared by Adrija Roy ❤️ (ADDY) (@adrija_roy_official) -
ఆడిషన్కు వెళ్లాకే అసలు విషయం తెలిసింది: క్యాస్టింగ్ కౌచ్పై బుల్లితెర నటి
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. అయితే కొందరు మాత్రమే ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు సాహసం చేస్తుంటారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ బుల్లితెర నటి సనయా ఇరానీ ఓపెన్ అయింది. ఓ బాలీవుడ్ దర్శకుడు తనను సంప్రదించారడని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. దక్షిణాదిలో కూడా కొన్ని చేదు సంఘటనలు ఎదురయ్యాయని తెలిపింది. తనను రిజెక్ట్ చేయడానికి మాత్రమే కలవాలని కొందరు పట్టుబట్టారని తాజా ఇంటర్వ్యూలో సనయ చెప్పింది.సనయా మాట్లాడుతూ.. ' మ్యూజిక్ వీడియో కోసం ఆడిషన్ చేస్తున్నామని మొదట నాతో చెప్పారు. కానీ అక్కడికి వెళ్లాక ఇది ఒక సినిమా కోసమని తెలిసింది. దీంతో నేను అక్కడే ఉన్న సెక్రటరీకి ఆడిషన్ చేయనని చెప్పా. ప్లీజ్ సార్కు కోపం వస్తుంది.. ఒక్కసారి ఆయనతో మాట్లాడండి అని ఆమె నాతో చెప్పింది. ఆ తర్వాత అతను మాట్లాడుతూ.. 'నేను ఈ పెద్ద సినిమా చేస్తున్నాను. ఇందులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇందులో మీరు బికినీ వేసుకోవాలి. మీరు బికినీ ధరించేందుకు సిద్ధమేనా?' అని అడిగాడని చెప్పుకొచ్చింది.ఆ తర్వాత "అతని సెక్రటరీ చెప్పడంతో నేను అతనికి కాల్ చేసాను. నేను మీటింగ్లో ఉన్నా.. అరగంట తర్వాత నాకు కాల్ చేయండి అన్నాడు. మరోసారి 45 నిమిషాల తర్వాత కాల్ చేశా. ఇప్పుడు టైం ఎంత? నిన్ను ఏ సమయానికి చేయమని అడిగాను? అని నాపై కోప్పడ్డాడు. దీంతో అతనికి దర్శకుడిగా పనికిరాని వాడని నాకర్థమైంది' అని వివరించింది. కాగా.. 'మిలే జబ్ హమ్ తుమ్', 'ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్' వంటి టీవీ షోలతో బాలీవుడ్లో సనయా గుర్తింపు తెచ్చుకుంది. సనయ చివరిగా షార్ట్, బటర్ఫ్లైస్ సీజన్ -4లో కనిపించింది. -
రూ.3.5 కోట్ల అప్పు.. రోడ్డునపడ్డా! ఈ బతుకు వద్దనుకున్నా: నటి
రియాలిటీ షో, సినిమాలు, సీరియల్స్.. ఏవైనా సరే తనకు కొట్టిన పిండి. బుల్లితెర అయినా, వెండితెర అయినా.. తన పాత్రలో ఇట్టే ఇమిడిపోతుంది రష్మీ దేశాయ్. ప్రస్తుతం తన చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. కెరీర్లో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడింది. రూ.3.5 కోట్ల అప్పుసీరియల్ నటుడు నందీశ్ సంధును 2011లో పెళ్లాడగా 2014లో విడిపోయారు. 2016లో విడాకులు మంజూరయ్యాయి. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో వెల్లడించింది. రష్మీ దేశాయ్ మాట్లాడుతూ.. సరిగ్గా అప్పుడే నేను ఓ ఇల్లు కొనుక్కున్నాను. నాపై రూ.2.5 కోట్ల అప్పు ఉంది. మిగతా లోన్స్ అన్నీ కలుపుకుంటే నాపై మూడున్నర కోట్లదాకా అప్పు ఉంది. పర్వాలేదు, తీర్చేద్దామని ధైర్యంగా ఉన్నాను. కుటుంబం దూరం పెట్టిందిఅప్పుడే నేను భాగమైన షో ఒకటి క్యాన్సిల్ అయింది. నాలుగైదు రోజులపాటు రోడ్డుపైనే ఉన్నాను. నాకున్న ఆడీ కారులోనే నిద్రపోయాను. నాకు సంబంధించినవన్నీ నా మేనేజర్ ఇంట్లోనే ఉన్నాయి. కుటుంబం నన్ను దూరం పెట్టింది. రూ.20కు దొరికే భోజనం తిన్నాను. విడాకులు తీసుకున్నందుకు ఫ్రెండ్స్ కూడా నేను అందరిలాంటిదాన్ని కాదన్నట్లు ఫీలయ్యారు. నా నిర్ణయాలన్నీ తప్పేనని కుటుంబం బలంగా నమ్మింది. ఒత్తిడికి లోనయ్యా..ఎవరి సాయం లేకపోయినా నెమ్మదిగా అప్పు తీర్చేశాను. కానీ అప్పుడు ఎంతో ఒత్తిడికి గురయ్యాను. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై సరిగా నిద్రపోయేదాన్నే కాదు. కొన్నిసార్లు చచ్చిపోదామనిపించేది. కానీ సెట్లోని వారు నాకు సపోర్ట్గా నిలిచారు. యోగా కూడా ఈ బాధ్యలను మర్చిపోయేందుకు కారణమైంది అని చెప్పుకొచ్చింది.షోస్ అండ్ సినిమాలు..జర నచ్కే దిఖా 2, జలక్ దిఖ్లాజా 5, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ 6, నాచ్ బలియే 7 వంటి పలు రియాలిటీ షోలలోనూ పాల్గొంది. హిందీ బిగ్బాస్ 15వ సీజన్లో పాల్గొని టాప్ 5 కంటెస్టెంట్గా నిలిచింది. ఈ ఏడాది మిషన్ లైలా (హిందీ), హిసబ్ బరాబర్ (హిందీ), మామ్ తానే నై సమ్జే (గుజరాతీ), చంబే ది బూటి (పంజాబీ), ఎవర- బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ (హిందీ) వంటి చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది.చదవండి: ప్లాస్టిక్ సర్జరీలు తప్పేం కావు.. నేను కూడా ట్రై చేస్తా!: హీరోయిన్ -
సీరియల్స్, రియాలిటీ షో వల్ల రాగద్వేషాలు.. ఇక నా వల్ల కాదు: నటి
నటి కవిత కౌశిక్ బుల్లితెర ఇండస్ట్రీకి గుడ్బై చెప్పేసింది. టీవీ కంటెంట్లో కొత్తదనం లోపించిందని, ఇంకా ఇక్కడే ఉండిపోవడం సబబు కాదని అభిప్రాయపడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఒకప్పుడు టీవీ కంటెంట్ ప్రోగ్రెసివ్గా ఉండేది. రకరకాల షోలతో, విభిన్న కంటెంట్తో అందరికీ వినోదాన్ని పంచింది. క్షమించండికానీ ఇప్పుడు.. యంగ్ జనరేషన్ టీవీ చూడటానికి వీల్లేదన్నట్లుగా చెడు కంటెంట్ ఉంటోంది. టీవీ ఇండస్ట్రీ పురోగమనం నుంచి తిరోగమనం వైపు వెళ్తోంది. రియాలిటీ షో, సీరియల్స్ చూసి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. అందులో నేను కూడా భాగమయ్యాను. అందుకు నన్ను క్షమించండి. ఇప్పుడైతే నేనిక్కడ ఉండలేను. బుల్లితెరను వీడుతున్నాను' అని కవిత చెప్పుకొచ్చింది.మార్పు మొదలైందా?టీవీ ఇండస్ట్రీ పరిస్థితుల గురించి తాజాగా నటి సుంబుల్ టకీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఎప్పుడూ పాతచింతకాయ పచ్చడే అంటే ఎవరు మాత్రం టీవీ చూస్తారు? కాస్త కొత్తదనం ఉండాలి. రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ఇప్పుడిప్పుడే మార్పు మొదలవుతోంది. కొత్త కథలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రచయితలు.. యదార్థ ఘటనలను, నిజ జీవిత సమస్యలపై ఫోకస్ చేయాలి. కాలం మారేకొద్దీ జనాలు రీల్ లైఫ్ కన్నా రియల్ లైఫ్పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వారి అభిరుచులకు అనుగుణంగా కంటెంట్లో మార్పుచేర్పులు చేయాలి అని పేర్కొంది.నటి కవితా కౌశిక్అది కూడా సమస్యేనటుడు అర్జున్ బిజ్లానీ మాట్లాడుతూ.. ఇక్కడ బడ్జెట్ కూడా ఒక సమస్యే.. నిర్మాతలు తక్కువ బడ్జెట్తోనే సీరియల్స్, షో అయిపోవాలని చూస్తారు. దీంతో ఆయా షోలను క్రియేటివ్గా ఎలా చేయాలన్నదానికన్నా తక్కువ బడ్జెట్లో ఎలా పూర్తి చేయాలన్నదానిపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఎవరో ఒకరి దగ్గరి నుంచి మార్పు మొదలవుతేనే మంచిరోజులు వస్తాయి అని ఆశిస్తున్నాడు.ఆ సీరియల్తో ఫేమస్కాగా కుటుంబ్ సీరియల్తో బుల్లితెరపై తన ప్రస్థానం ప్రారంభించిన కవిత ప్రియ కా ఘర్, కుంకుమ్- ఏక్ ప్యారా సా బంధన్, రీమిక్స్.. ఇలా అనేక సీరియల్స్లో నటించింది. ఎఫ్ఐఆర్ అనే కామెడీ సీరియల్లో పోషించిన ఎస్ఐ చంద్రముఖి చౌతాలా పాత్రతో బాగా ఫేమస్ అయింది. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లోనూ పాల్గొంది. ఏక్ హసీనా తి సినిమాతో వెండితెరపైనా ఎంట్రీ ఇచ్చింది. మ ఉంబై కటింగ్ (హిందీ మూవీ), వదయియాన్ జీవి వదయియాన్, క్యారీ ఆన్ జట్ట 3 వంటి పంజాబీ సినిమాల్లోనూ మెరిసింది. రామ్చరణ్ తుఫాన్ సినిమాలో షకీలా సెంటు అనే ఐటం సాంగ్లోనూ ఆడిపాడింది.చదవండి: పాక్ నటులపై బ్యాన్.. అంతా రాజకీయమే!: బాలీవుడ్ నటుడు -
డాక్టర్ కారు అని నమ్మాను..కానీ నా చేయి పట్టుకుని: బుల్లితెర నటి
బాలీవుడ్ నటి తిలోతమా షోమ్ ఇటీవల సీఏ టాపర్ వెబ్ సిరీస్లో మెరిసింది. ఈ సిరీస్ను త్రిభువన మిశ్రా డైరెక్షన్లో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ నటి తనకెదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హజరైన తిలోతమా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఇది నా జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటన అని పేర్కొంది. ఢిల్లీలో బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది.తిలోతమా మాట్లాడుతూ..'ఢిల్లీలో బస్సు కోసం ఎదురు చూస్తున్నా. ఒక కారు వచ్చి నా దగ్గర ఆగింది. నేను భయంతో కొంచెం దూరంగా వెళ్లాలనుకున్నా. కానీ నేను పరిగెత్తితే వారు నన్ను పట్టుకోగలరు. అందుకే రహదారి మధ్యలోకి వచ్చి లిఫ్ట్ అడిగా. చాలా కార్లు వెళ్తున్నా ఎవరూ ఆపలేదు. కొద్దిసేపటికే మెడికల్ గుర్తు ఉన్న కారు ఆపారు. అపరిచితుడితో కలిసి ముందు సీటులోకి కూర్చున్నా. కొంచెం దూరం వెళ్లాక అతను నా చేయి పట్టుకున్నాడు. తాను ప్యాంటు విప్పాడు. నా చేతిని బలవంతంగా పట్టుకున్నాడు. దీంతో అతనిపై తిరగబడడంతో కారు ఆపేశాడు. ఆ తర్వాత కారు దిగేశా' అని చెప్పుకొచ్చింది.అదో భయంకరమైన జ్ఞాపకం..ఇది నా జీవితంలో ఎదురైన భయానక అనుభవం తిలోతమా షోమ్ పేర్కొంది. ఈ ఘటనతో తాను చలించిపోయానని చెప్పింది. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ అతను డాక్టర్ కావడం వల్ల సురక్షితంగా ఉంటుందని భావించి కారు ఎక్కానని వెల్లడించింది. అయితే నేను కారు ముందు సీట్లో కూర్చోవడంతో.. డ్రైవర్ తన ప్యాంట్ విప్పి.. నా చేతిని బలవంతంగా లాగడానికి ప్రయత్నించాడని తెలిపింది. దీంతో వెంటనే అతన్ని కొట్టడంతో కారు ఆపేశాడు.. ఆ తర్వాత వెంటనే కారు దిగి బయటకు వచ్చానని తిలోతమా ఆ చేదు సంఘటనను వివరించింది. నాలోని తిరగబడే ధైర్యమే ఆ రోజు కాపాడిందని సీఏ టాపర్ నటి వెల్లడించింది. -
Tejaswini Gowda: తేజు అందాన్ని రెట్టింపు చేసేది ఆ నవ్వే! (ఫోటోలు)
-
బుల్లితెర నటి అంజలి కూతురు చందమామ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
తనే నిజ జీవితంలో ఒక సూపర్ పవర్: బుల్లితెర నటి ఎమోషనల్ పోస్ట్
బుల్లితెర నటి హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఇటీవలే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె బ్రెస్ట్ క్యాన్సర్తో పోరాడుతోంది. ప్రాణాంతక మహమ్మారి సోకిందని భయంతో వణికిపోకుండా దాన్ని జయిస్తానని ధైర్యంగా నిలబడింది. హీనా ఖాన్కు ప్రస్తుతం క్యాన్సర్ మూడో స్టేజీ ఉండడంతో వెంటనే వైద్యం ప్రారంభించారు. ఇటీవలే ఆమెకు కీమోథెరపీ కూడా చేశారు. ఇలాంటి సమయంలో అమ్మ ప్రేమ తనపై చూపించిన ప్రేమను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.హీనా ఖాన్ తన ఇన్స్టాలో.. 'మనకు ఏదైనా జరిగిన తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో నాకు అర్థమైంది. తన పిల్లలకు ప్రేమ, సాంత్వన అందించడానికి ఎంత బాధనైనా భరిస్తుంది. నా రోగం గురించి తెలుసుకున్న రోజు ఆమె అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేను. కానీ ఆమెనే నన్ను పట్టుకుని తన బాధను మరచిపోయేందుకు యత్నించింది. తల్లులే ఎల్లప్పుడూ మన జీవితంలో ఒక సూపర్ పవర్. ఆమె ముందు ప్రపంచం కూడా చిన్నదే. ఆమె తన చేతుల్లో నన్న ఓదార్చి నాకు బలాన్ని ఇవ్వడానికి ఎంతో తపన పడింది' అంటూ పోస్ట్ చేసింది. తల్లి ఒడిలో కూర్చుని ఉన్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.కాగా.. హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్తో ఫేమస్ అయింది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్బాస్ 11వ సీజన్లోనూ అలరించింది. సినిమాలు, వెబ్ సిరీస్లలోనూ మెప్పించింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) -
సీరియల్ నటి మహేశ్వరి కుమారుడి నామకరణం వేడుక (ఫోటోలు)
-
సీరియల్ యాక్టర్ సునంద మాల శెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
క్యాన్సర్తో పోరాటం.. మీకు ఈ కాలిన మచ్చలే కనిపిస్తున్నాయా?: నటి
బుల్లితెర నటి హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్తో పోరాడుతోంది. ప్రాణాంతక మహమ్మారి సోకిందని భయంతో వణికిపోకుండా దాన్ని జయిస్తానని ధైర్యంగా నిలబడింది. కానీ కూతురికి క్యాన్సర్ రావడాన్ని తట్టుకోలేని ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. హీనా ఖాన్కు ప్రస్తుతం క్యాన్సర్ మూడో స్టేజీలో ఉంది. దీంతో వెంటనే వైద్యం ప్రారంభించారు. కీమోథెరపీ చేశారు. ఇందుకోసం జుట్టు కత్తిరించారు.శరీరంపై గాయాలుఫస్ట్ కీమోథెరపీ అయిపోయిందంటూ నటి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. అందులో హీనా చేతి కింద, మెడపైన కాలిన మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 'ఈ ఫోటోలో మీకు నా శరీరంపై ఉన్న మచ్చలు కనిపిస్తున్నాయా? లేదా నా కళ్లలోని ఆత్మవిశ్వాసం కనిపిస్తోందా? ఈ కాలిన మచ్చలను చూసి నేనేం బాధపడటం లేదు. నువ్వు ఒక ఫైటర్ఎందుకంటే చికిత్స విజయవంతంగా ముందుకు సాగుతుందనడానికి ఇదే నిదర్శనం. నా కళ్ల ద్వారా విజయకాంతిరేఖలను చూడగలుగుతున్నాను' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు.. నువ్వొక ఫైటర్వి.. జాగ్రత్తగా ఉండు హీనా అని కామెంట్లు చేస్తున్నారు.కెరీర్..కాగా హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్తో ఫేమస్ అయింది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్బాస్ 11వ సీజన్లోనూ అలరించింది. సినిమాలు, వెబ్ సిరీస్లలోనూ మెప్పించింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: ఓటీటీలో రియల్స్టోరీతో సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ -
Tejaswini Gowda: సీతామహాలక్ష్మిలా మురిపిస్తోన్న బుల్లితెర నటి (ఫోటోలు)
-
ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన బుల్లితెర నటి
బుల్లితెర నటి దేవలీన భట్టాచార్జి త్వరలో తల్లి కాబోతుందంటూ ఓ వార్త వైరల్గా మారింది. తాజాగా ఈ రూమర్స్పై నటి స్పందించింది. 'నేను ప్రెగ్నెంటా? అని అడుగుతూ చాలాకాలంగా మెసేజ్లు వస్తున్నాయి. అది నాకు చెప్పాలని అనిపించినప్పుడే చెప్తాను. అయినా ఇలాంటిదేదైనా ఉంటే నా అంతట నేనే చెప్తా. అప్పటివరకు నన్ను వదిలిపెట్టండి.నేను ప్రెగ్నెంటో? కాదో? తెలుసుకుని మీరేం చేస్తారు? నాకేదైనా మంచి విషయాలు, సూచనలు చెప్తారా? లేదా ట్రోల్ చేస్తారా? ఇప్పుడవన్నీ పట్టించుకునే స్థితిలో నేను లేను. ఇది నా జీవితం. నాకు నచ్చినట్లు బతకనివ్వండి. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా దేవలీనా.. షానవాజ్ షైఖ్ను 2022 డిసెంబర్లో పెళ్లి చేసుకుంది.చదవండి: కల్కిపై తారల రివ్యూ.. నాగ్, రజనీ, దేవరకొండ ఏమన్నారంటే? -
ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ బ్రేకప్.. అందుకే అలా చేశారా?
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ ప్రకాశ్ బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న నటి హిందీలో పలు సీరియల్స్లో నటిస్తోంది. ఆమె ప్రస్తుతం ఏక్తా కపూర్ సూపర్ నేచురల్ టీవీ షో నాగిన్- 6లో నటిస్తోంది. అంతేకాదు తేజస్వి ప్రకాష్ బిగ్బాస్-15 సీజన్ విజేతగా నిలిచింది. అయితే బిగ్బాస్ షోలో ఉన్న సమయంలోనే నటుడు కరణ్ కుంద్రాను ప్రేమించింది. గత మూడేళ్లుగా ఈ జంట డేటింగ్లో ఉన్నారు.తాజాగా వీరిద్దరు తమ ప్రేమ బంధానికి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. కరణ్, తేజస్వీ దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్ చెప్పుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా వీరి మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తాయని.. దీంతో బ్రేకప్ నిర్ణయానికి వచ్చారని వారి సన్నిహితులు తెలిపారు. అయితే విడిపోయినట్లు వస్తున్న వార్తలపై తేజస్వీ ప్రకాశ్, కరణ్ కుంద్రా ఇప్పటివరకు స్పందించలేదు.అయితే ఇటీవలే కొద్ది రోజుల క్రితమే కరణ్, తేజస్వి ముంబయిలోని జంటగా కనిపించారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్ వెలుపల ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. బ్రేకప్ రూమర్స్ నేపథ్యంలో ఇద్దరు జంటగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము విడిపోతున్నట్లు వార్తలు రావడంతో వాటికి చెక్ పెట్టేందుకే జంటగా కనిపించారా? అన్నది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) -
నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు
కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా కసౌటీ జిందగీ కే సీరియల్లో కోమలిక అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి గుర్తింపు పొందింది ఊర్వశి ఢోలకియా. ఈ సీరియల్ వచ్చి దాదాపు 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆమెను కోమలికగానే ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. తాజాగా ఆమె దీని గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటికీ జనాలు నన్ను కోమలిక అనే పిలుస్తారు. ఆ ఒక్క పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకున్నారంటే నేను వేరే సీరియల్స్ ఏమీ చేయలేనని కాదు! నా విషయంలో దర్శకులు, నిర్మాతల క్రియేటివిటీ ఏమైపోయిందోనని అర్థం! ఇకపై అలాంటివి చేయనుఎన్నో పాత్రలు పోషించాను కానీ వాటికంత గుర్తింపు రాకుండా పోయింది. ఒకే రకమైన పాత్రలు చేసి బోర్ కొడుతోంది. ఇకపై నెగెటివ్ రోల్స్ చేయను. ప్రస్తుతం న్యాయవాదిగా పాజిటివ్ రోల్ చేస్తున్నాను. అందుకు సంతోషంగా ఉంది. ఇక మీదట కూడా ఇలాంటివే చేయాలనుంది. ప్రేక్షకులు ఊహించని పాత్రల్లో కనిపించాలనుంది. ఓటీటీల విషయానికి వస్తే ఇప్పుడు దానికి చాలా క్రేజ్ ఉంది. కానీ గతేడాది ఈ ప్లాట్ఫామ్లో నన్ను తిరస్కరించారు. ఓటీటీలు నన్ను పక్కన పెట్టేశాయినిన్ను టీవీలోనే చాలామంది చూసేశారు.. అని ఛాన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. అసలు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో టీవీ సెలబ్రిటీలే లేరా? అంతటా ఉన్నారు.. మరి ఎందుకని నన్ను అలా చిన్నచూపు చూశారని బాధేసింది. అయినా నాకు ఓటీటీల నుంచి ఎటువంటి మంచి ఛాన్సులు రావడం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ఊర్వశి ప్రస్తుతం పుష్ప ఇంపాజిబుల్ అనే సీరియల్ చేస్తోంది. అందులో లాయర్ దేవి సింగ్ శిఖావత్గా నటిస్తోంది. చదవండి: ఆ డైరెక్టర్ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు.. -
నటి జ్ఞాపకాలు తొలగించిన భర్త.. నిజాలు మాయం చేయలేవంటూ..
బుల్లితెర నటి దల్జీత్ కౌర్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించింది. తన లైఫ్లో దుఃఖానికి చోటు లేదనుకున్న ఆమెకు నిరాశే ఎదురైంది. ఏడాది తిరిగేలోపు పుట్టింటికి వచ్చేసింది. భర్త నిఖిల్ పటేల్ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నందువల్లే తన కాపురం కుప్పకూలిందని ఇటీవలే వెల్లడించింది. అయితే తన గురించి ఇలా అడ్డగోలుగా మాట్లాడితే బాగోదని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు.గుర్తులను చెరిపేస్తూ..తాజాగా ఇతడు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేశాడు. గతంలో దల్జీత్ వేసిన పెయింటింగ్ కనిపించకుండా గోడకు తెలుపు రంగు వేశాడు. ఇది చూసిన నటి సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. గోడ మీద ఉన్న ఆర్ట్ను చెరిపేస్తున్నావ్.. కానీ నిజాన్ని నువ్వు మాయం చేయలేవు అని విరుచుకుపడింది.రెండో పెళ్లి కూడా ఫెయిల్కాగా గతేడాది మార్చిలో దల్జీత్, నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. అప్పటికే పిల్లలు కూడా ఉన్నారు. నిఖిల్తో ఓ కూతురు కలిసి ఉంటుండగా దల్జీత్కు ఓ కుమారుడు ఉన్నాడు. రెండో పెళ్లి కూడా ఫెయిలవడంతో అభిమానులు దల్జీత్ పట్ల సానుభూతి చూపిస్తున్నారు.చదవండి: సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ -
నేను వాడిపడేసిన టిష్యూ ఏరుకుంది: నటి
వెర్రి వేయిరకాలంటారు. ముఖ్యంగా కొందరు వీరాభిమానుల ప్రవర్తన వెర్రితనంలాగే కనిపిస్తుంది. అందుకు హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్ చెప్పిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం హీనా ఖాన్ నటించిన నామాకూల్ అనే వెబ్ సిరీస్ అమెజాన్ మినీటీవీలో ప్రసారమవుతోంది. అందులో అందరూ ఇష్టపడే టీచర్ పాత్రను పోషించింది.కన్నార్పకుండా చూసేదితాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఇబ్బందికర సంఘటనను పంచుకుంది. ఓ ప్రాజెక్ట్ కోసం ఉత్తరాఖండ్ షూటింగ్లో పాల్గొన్నాను. అది జనాలు తిరుగుతూ ఉండే ప్రదేశం. ఒక అమ్మాయి రోజూ అక్కడికి వచ్చి నన్ను కన్నార్పకుండా చూస్తుండేది. తనను గమనించి పిలిచి మాట్లాడాను. తనతో కాసేపు కాలక్షేపం చేశాను. కానీ కొద్దిరోజులకు తను అలాగే చూస్తూ ఉండటం నాకు కొంత అసౌకర్యంగా అనిపించింది. ఇబ్బందిపడ్డా..పూర్తిగా నా మీదే దృష్టి పెట్టకుండా కాస్త చుట్టుపక్కల కూడా చూడమని నా టీమ్తో చెప్పించాను. నేను ఇబ్బందిపడుతున్నానని అర్థమవడంతో వెంటనే వెళ్లిపోయింది. కానీ మర్నాడే సెట్కు వచ్చింది. ఆరోజు నేను బాధాకరమైన సీన్లో నటించాలి. ఏడుస్తూ ఉన్నాను. కాసేపటికి టిష్యూతో కళ్లు తుడుచుకుని దాన్ని చెత్తబుట్టలో పడేశాను. వెంటనే ఆ అమ్మాయి డస్ట్బిన్ అంతా వెతకడం మొదలుపెట్టింది. భయపడిపోయానేను వాడిన టిష్యూను అందులో నుంచి తీసుకుని జాగ్రత్తగా తన వద్ద పెట్టుకుంది. ఆమె అలా చేయడం చూసి నేను షాకయ్యాను.. చెప్పాలంటే భయపడ్డాను కూడా! అభిమానం ఉండొచ్చు, కానీ దానికి కూడా హద్దులుండాలి అని హీనా ఖాన్ చెప్పుకొచ్చింది. కాగా యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్తో గుర్తింపు పొందిన హీనా ఖాన్ కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్బాస్లోనూ అలరించింది.చదవండి: ఐదేళ్ల క్రితమే సీక్రెట్గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ -
ఐదేళ్ల క్రితమే సీక్రెట్గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ
సెలబ్రిటీల కెరీర్ కన్నా పర్సనల్ లైఫ్ మీదే అభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. వారి ప్రేమ వ్యవహారాలు-పెళ్లి-విడాకులపైనే ఎక్కడలేని ఇంట్రస్ట్ చూపిస్తారు. అలా బుల్లితెర నటి సుమిత్ సింగ్ నటుడు షాగుణ్ పాండేతో డేటింగ్లో ఉందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు నటి డేటింగ్ గురించి గుసగుసలు మొదలుపెట్టారు.నటుడితో డేటింగ్?ఆ వార్త తనదాకా చేరడంతో నటి సుమిత్ సింగ్ ఈ రూమర్స్ను కొట్టిపారేసింది. షాగుణ్తో డేటింగ్లో లేనని క్లారిటీ ఇచ్చింది. ఇంతలో సోషల్ మీడియాలో నటి సుమిత్, దర్శకుడు పుష్పేందర్ సింగ్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. వీరిద్దరికీ ఐదేళ్ల క్రితమే పెళ్లయిందని తెలుస్తోంది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడట!మేము విడిపోయాంఐదేళ్ల క్రితం నాటి వెడ్డింగ్ పిక్స్ లీక్ అవడంతో ఎట్టకేలకు తన పెళ్లిపై నోరు విప్పింది సుమిత్. ఆమె మాట్లాడుతూ.. 'మేము 2018లో పెళ్లి చేసుకున్నాం. మాకు బాబు పుట్టాడు. అతడి పేరు రుద్ర. అయితే నా భర్త, నేను విడిపోయి చాలారోజులే అవుతోంది. అతడితో నాకిప్పుడు ఏ సంబంధమూ లేదు. మేము కలిసుండటం లేదు. విడిపోయాం. అయినా ఇప్పుడు నా వ్యక్తిగత విషయాలను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు' అని అసహనం ప్రదర్శించింది.చదవండి: నా కూతురు చూసిన ఒకే ఒక్క సినిమా ఆదిపురుష్: నటుడు -
Keerthi Bhatt: కాబోయే భర్తతో సీరియల్ నటి కీర్తి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
మొన్నే భర్తను తిట్టింది.. ఇప్పుడేమో పెళ్లి వీడియో.. అంతలోనే..
బుల్లితెర నటి దల్జీత్ కౌర్కు పెళ్లి అచ్చి రావడం లేదు. 2009లో నటుడు షాలిన్ బానోత్ను పెళ్లి చేసుకుంది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. విడదీయలేని బంధం అనుకునేలోపే మనస్పర్థల వల్ల 2015లో విడాకులు తీసుకున్నారు. తర్వాత దుబాయ్లో జరిగిన పార్టీలో నిఖిల్ పటేల్ అని వ్యక్తి పరిచయమయ్యాడు. అతడికి ఆల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. కానీ అప్పటికే భార్యతో విడిపోయి కూతురితో కలిసి జీవిస్తున్నాడు. ఏడాది తిరిగేసరికే..అటు దల్జీత్.. ఇటు నిఖిల్.. ఇద్దరూ సింగిల్ పేరెంట్సే అవడంతో పిల్లల గురించి మాట్లాడుకున్నారు. ఈ కబుర్లు కాస్తా ప్రేమకు దారితీశాయి. దీంతో ఇద్దరూ గతేడాది మార్చిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఏడాది తిరిగేసరికే ఇద్దరి మధ్య ప్రేమ కనుమరుగైంది. మౌనం ఆవహించింది. కొడుకును తీసుకుని దల్జీత్ పుట్టింటికి వచ్చేసింది. పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. భర్త చీటింగ్ చేశాడని సోషల్ మీడియాలో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పెళ్లి వీడియో షేర్ చేసిన నటినెట్టింట ఇంత రచ్చ చేసిన ఆమె శనివారం నాడు గతేడాది జ్ఞాపకాలు అంటూ నిఖిల్తో జరిగిన పెళ్లి వీడియో షేర్ చేసింది. అందులో హల్దీ, పెళ్లి, రిసెప్షన్ అన్నీ ఉన్నాయి. నాన్నకు తోడు దొరికిందంటూ నిఖిల్ కూతురు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. పదిహేను నెలల క్రితం అన్న క్యాప్షన్తో ఈ వీడియో షేర్ చేసిన నటి కొద్ది క్షణాల్లోనే దాన్ని డిలీట్ చేసింది. అప్పటికే అది చూసిన నెటిజన్లు.. అక్కడే ఆగిపోకు.. ముందుకు సాగాలికదా.. అతడు నిన్ను మోసం చేశాడు.. కొంచెమైనా ఆత్మాభిమానం ఉందా? అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు.చదవండి: ఉన్నదంతా స్టార్ హీరోలకే.. మిగతా యాక్టర్స్కు ఏం మిగలట్లేదు! -
శుబ్మన్ గిల్తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
హిందీ బుల్లితెర నటి రిద్ధిమా పండిత్, టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్గిల్ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో ఏడడుగులు వేయబోతున్నారంటూ ఓ వార్త నెట్టింట ప్రత్యక్షమైంది. దీంతో అభిమానులు ఇది నిజమేనని భావించి నటికి కంగ్రాట్స్ చెప్తున్నారు. తనకే తెలియకుండా తన పెళ్లి చేస్తుండటంతో నటికి స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నాకే తెలియకుండా పెళ్లా?ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసి రూమర్స్కు చెక్ పెట్టింది. అందులో రిద్ధిమా మాట్లాడుతూ.. 'ఈ రోజు ఉదయాన్నే చాలామంది జర్నలిస్టులు నాకు ఫోన్ చేసి పెళ్లి గురించి అడిగారు. వారి ఫోన్తోనే నిద్ర లేచాను. నాకే తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నానా? నిజంగా అలాంటి గుడ్న్యూస్ ఏదైనా ఉంటే నేనే సంతోషంగా సోషల్ మీడియాలో ప్రకటిస్తాను కదా.. కాబట్టి మీరు అనుకుంటుందేదీ నిజం కాదు. అసలు శుబ్మన్ గిల్తో వ్యక్తిగత పరిచయమే లేదు. అదంతా ఫేక్' అని పేర్కొంది. ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం కూడా లేదంది.చేదు అనుభవంకాగా రిద్ధిమా పండిత్.. బాహు మహారి రజనీకాంత్ సీరియల్లో ముఖ్య పాత్రలో నటించింది. అలాగే ఖాత్ర ఖాత్ర ఖాత్ర అనే షోలోనూ మెరిసింది. హిందీ బిగ్బాస్ ఫస్ట్ ఓటీటీ సీజన్లోనూ పాల్గొంది. కాగా ఇటీవల రిద్దిమా ఓ ఇంటర్వ్యూలో టీవీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఇండస్ట్రీలో ఉండే వేధింపుల గురించి ఎవరూ మాట్లాడరు. నేను పని చేసిన ఓ షోలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత నన్ను మానసికంగా వేధించాడు. మా అమ్మకు ఆరోగ్యం బాలేక ఆస్పత్రిపాలైంది. ఐసీయూలో అడ్మిట్ కావడంతో నేను తట్టుకోలేకపోయాను. అమ్మ ఐసీయూలో ఉంటే..ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంట మధ్య, సాయంత్రం నాలుగింటి నుంచి ఐదున్నర గంటల మధ్య మాత్రమే చూసేందుకు అనుమతిచ్చేవారు. అమ్మకు బాగోలేదు.. నేను తొమ్మిదింటికి షూట్కు వస్తాను అని అడిగాను. పోనీ ఉదయం 7 గంటకు వచ్చినా సాయంత్రం నాలుగుకల్లా వెళ్లిపోతానన్నాను. కావాలంటే తర్వాత ఎక్కువ గంటలు ఉంటానన్నాను. అయినా తను పట్టించుకోలేదు. నా మాట లెక్కచేయలేదు, తను చెప్పిన సమయానికే రావాలనేవాడు. ఎక్కడ ప్రాజెక్ట్లో నుంచి తీసేస్తారోనన్న భయంతో ఎవరూ ఇలాంటివి బయటకు చెప్పరు' అని రిద్ధిమా చెప్పుకొచ్చింది. #shubmangill#ridhimapandit#gill https://t.co/jioVAELCxj pic.twitter.com/IbAiyvzMjh— 🌚 (@NikiChristian11) May 31, 2024 చదవండి: తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే? -
పిచ్చి కూతలు కూసేముందు నీ కాపురమేమైందో చూసుకో: నటి
హిందీ బిగ్బాస్ 17వ సీజన్లో బుల్లితెర జంట ఇషా మాల్వియా- సమర్థ్ జురేల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ బిగ్బాస్ హౌస్లో అభిషేక్ (ఇషా మాల్వియా మాజీ ప్రియుడు)ను చులకనగా చేసి మాట్లాడటం.. అతడు ఆవేశంతో సమర్థ్ చెంప చెళ్లుమనిపించడం.. ఎంతగానో వైరలయ్యాయి. హౌస్లో ఒకరిపై మరొకరు అంత ప్రేమ కురిపించుకున్నారు కానీ, షో నుంచి బయటకు వచ్చాక మాత్రం ఆ ప్రేమను కంటిన్యూ చేయలేకపోయారు. కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు.నాకెప్పుడో తెలుసువీళ్ల బ్రేకప్ను ఎప్పుడో ఊహించానంటూ నటి రింకూ ధావన్ సెటైర్లు వేసింది. 'కేవలం ఆరు నెలల్లో ఇషా నెక్స్ట్ ఎవరిని డేటింగ్ చేస్తుందనే వార్తను చదవాల్సి వస్తుందని సమర్థ్కు బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడే చెప్పాను. ఆమె నిలకడగా ఓ చోట ఉండలేదు' అని వ్యాఖ్యానించింది. తాజాగా ఈ కామెంట్స్పై నటి ఇషా మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చి కూతలు ఆపు'రింకూ సంసారం కూడా సరిగ్గా సాగనేలేదు. నేను ఈ మాట అనకూడదు.. కానీ నా గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. తనకు విడాకులయ్యాయి. ఒక్కతే 20 ఏళ్ల కుమారుడిని చూసుకుంటూ బతికేస్తోంది. నా విషయంలో ఏమైంది? బ్రేకప్ చెప్పుకున్నా, రిలేషన్లో ఉన్నా మేము బాగానే ఉన్నాం. ఆమె తన గురించి తాను చూసుకుంటే బెటర్. పక్కవాళ్ల మీద ఫోకస్ చేసి వారి గురించి పిచ్చి కూతలు కూసి హైలైట్ అవ్వాలని చూస్తే బాగోదు' అని ఇషా వార్నింగ్ ఇచ్చింది.చదవండి: కజ్రారే సాంగ్.. లైవ్లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్.. -
బుల్లితెరపై శ్రీమద్ రామాయణం.. మిస్ట్ కాల్తో బహుమతి గెలవండి!
సమాజానికి ఆదర్శవంతమైన విలువలను చాటి చెప్పిన శ్రీ మహా విష్ణువు అవతార గాథే " శ్రీ మధ్ రామాయణం". తండ్రి మాట జవదాటని కొడుకుగా.. అన్నగా.. ఏకపత్నీవ్రతుడిగా.. స్నేహితుడిగా.. ప్రజల క్షేమం కోసం ధర్మం తప్పని రాజుగా.. అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరామగాథను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదని చెబుతుంటారు. రామాయణ ప్రియుల కోసం టీవీ సీరియల్ వచ్చేస్తోంది. ఈ శ్రీమద్ రామాయణం సీరియల్లో.. శ్రీ రాముని అవతార విశిష్టత , జన్మ వృత్తాంతం, లంకాధిపతి అయిన రావణాసురుడి జన్మ వృత్తాంతం నుంచి రామాయణంలోని అన్ని ఘట్టాలను కనులకు కట్టినట్లుగా చూపించనున్నారు. అద్భుతమైన సాంకేతిక విలువలతో చిత్రీకరించి శ్రీ రామ గాథను బుల్లితెర అభిమాన ప్రేక్షకులందరినీ అలరించేందుకు వచ్చేస్తోంది.శ్రీ మహర్షి వాల్మీకి రచించిన రామాయణాన్ని 'శ్రీమద్ రామాయణంగా' సూపర్ గ్రాఫిక్ టెక్నాలజీతో, అనుభవజ్ఞులైన నటీనటులతో, ఆకట్టుకునే డైలాగ్స్తో రూపొందించారు. ఈనెల 27 నుంచి బుల్లితెర ప్రియులను ఈ సీరియల్ అలరించనుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానుంది.ఈ సీరియల్ ప్రారంభ సందర్భంగా "జెమినిలో కాసుల వర్షం” అనే కాంటెస్ట్ నిర్వహిస్తోంది. మే 27 నుండి జూన్ 1 వరకు ఆరు రోజులపాటు అడిగే ప్రశ్నలకు ప్రేక్షకులు మిస్డ్ కాల్ ద్వారా సమాధానాలను తెలియజేసి బహుమతులను పొందే అవకాశం కల్పించింది. ప్రతి రోజు 500 మంది లక్కీ విజేతలని ఎంపిక చేయనున్నారు. -
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
-
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చందు ప్రస్తుతం త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్లో నటించారు. కాగా.. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఓ యూట్యూబ్ ఛానెల్తో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని వెల్లడించారు. కాగా.. పవిత్రతో సహజీవనం చేసిన చందు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో చందు సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో సీరియల్ నటి పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరగనుంది. -
ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్స్టా పోస్ట్, వీడియో వైరల్
కన్నడ బుల్లితెర నటి పవిత్రా జయరామ్ అకాల మరణం పరిశ్రమ వర్గాలను, తోటి నటీనటులను సహోద్యోగులు,అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రినయని తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన పవిత్ర మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. అయితే చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో జవిత్ర జయరామ్ చందర్ చివరి ఇన్స్టా పోస్ట్ ఒకటి వైరల్ మారింది. నటుడు, భర్త చందూతో కలిసి చేసిన రీల్ నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.త్రినయని సీరియల్లో సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్ని చేస్తూ ఆమె చివరి ఇన్స్టా పోస్ట్ ఇది. "నా ప్రేమ ఎప్పుడూ నీదే పాపా @chandrakanth_artist మిస్ యూ పాపా ఎందుకు అంత ఏడుస్తున్నావు నన్ను నీతోనే వున్నారా పిచ్చోడా లవ్ యు మామా" అని క్యాప్షన్ ఉన్న పోస్ట్ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar) అలాగే ‘‘ఆల్వేస్ మై లవ్ ఫర్ యూ మామా, లవ్ యూ సో మచ్.. చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా.. కానీ, ఆ దేవుడు పిలుస్తున్నాడు.. నాన్నా, నువ్వ టైమ్కి తిను’’ అంటూ మరో పోస్ట్ ఉంది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తరువాత పోస్ట్లు ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందూనే పోస్ట్ చేస్తున్నాడు మరికొంతమంది కమెంట్ చేయడం గమనార్హం. మదర్స్ డే రోజు విషాదం ఆర్ఐపీ పవిత్ర అంటూ చాలామంది నెటిజన్లు స్పందించారు. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు.. ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్ సంతాపం ప్రకటించారు. త్రినయని సీరియల్లో పవిత్ర ఆన్-స్క్రీన్ సోదరుడు పరశురామ్గా చంద్రకాంత్ నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar)పవిత్రా జయరాం మృతిపై నటుడు సమీప్ ఆచార్య సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశారు. “మీరు ఇక లేరనే వార్తతో మేల్కొన్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. నా తొలి ఆన్స్క్రీన్ తల్లి, మీరు ఎప్పుడూ ప్రత్యేకమే.” అంటూ పోస్ట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని మెహబూబా నగర్ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చంద్రకాంత్తో అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ తదితరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. -
తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్
తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (మే 12న) జరిగిన రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జయరామ్ మరణించింది. ఈ విషాద వార్తను ఆమె భర్త, నటుడు చంద్రకాంత్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. పవిత్ర ఇక లేదన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. నాకోసం వచ్చేసేయ్'పాపా.. నీతో దిగిన చివరి ఫోటో ఇదేరా! నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావంటే నమ్మలేకపోతున్నాను. ఒకసారి మామా అని పిలువే ప్లీజ్.. నా కోసం తిరిగి వచ్చేయ్రా..' అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. కాగా పవిత్ర జయరామ్ స్వస్థలం కర్ణాటకలోని మాండ్య. మొదట్లో హౌస్ కీపర్గా, సేల్స్ గర్ల్గా పని చేసిన ఈమె తర్వాత కన్నడ సీరియల్స్లో అడుగుపెట్టింది. అక్కడి నుంచి నిన్నే పెళ్లాడతా సీరియల్తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సీరియల్తో ఫేమస్'త్రినయని' సీరియల్ ద్వారా బాగా క్లిక్కయింది. ఇందులో తిలోత్తమగా విలనిజం పడించింది. అంతకుముందు కన్నడ సీరియల్స్ చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క ధారావాహికతో సంపాదించింది. నటుడు చంద్రకాంత్ కూడా ఇదే సీరియల్లో నటిస్తున్నాడు. నటి మరణవార్త తెలిసిన తారలు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Challa Chandu II (@chandrakanth_artist) -
బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్
అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళా ఆరాటపడుతుంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. బుల్లితెర నటి మహేశ్వరి గతంలోనే పండంటి కూతురికి జన్మనిచ్చి తల్లయింది. గతేడాది ఆమె మరోసారి గర్భం దాల్చగా ఇటీవలే బాబు పుట్టాడు. దీంతో ఆ నటి ఇంట సంతోషం అంతా ఇంతా కాదు.యూట్యూబ్లో వరుస వీడియోలుఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ యూట్యూబ్లో వరుస వీడియోలు చేస్తోంది. డెలివరీకి ముందు రోజు, డెలివరీ రోజు, ఆ తర్వాత బాబును చూడటానికి వచ్చిన తారల సందడి.. ఇలా అన్నీ వీడియోల రూపంలో షేర్ చేస్తోంది. తాజాగా మహేశ్వరి ఇంట బాబు బారసాల ఫంక్షన్ జరిగినట్లు తెలుస్తోంది.బారసాలతొలిసారి బాబును ఊయలలో వేశారు. ఈ ఫంక్షన్లో మహేశ్వరి దంపతులిద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిశారు. బాబు ఊయల ఫంక్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాబుకు ఏం పేరు పెట్టాడన్నది మాత్రం తెలియరాలేదు. మహేశ్వరి విషయానికి వస్తే.. వదినమ్మ, శశిరేఖ పరిణయం సహా ఎన్నో సీరియల్స్లో నటించింది. సీరియల్స్తోకేవలం సీరియల్స్కే పరిమితం కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు రియాలిటీ షోలలోనూ కనిపించింది. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 వంటి షోలలో భర్త శివనాగ్తో కలిసి పాల్గొంది. శివనాగ్ టాలీవుడ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు.చదవండి: ఆ స్టార్ హీరో నాకోసం వెయిట్ చేశాడు.. అదే నా మెట్టినిల్లు! -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి మోనా సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. త్రీ ఇడియట్స్, లాల్ సింగ్ చద్దా సినిమాలతో పాటు పలు సీరియల్స్, వెబ్ సిరీస్ల్లో మోనా సింగ్ నటించింది. సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే మెర్సిడెజ్ బెంజ్ కారును సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.కాగా.. ఇటీవలే మేడ్ ఇన్ హెవెన్ సీజన్- 2లో మోనా సింగ్ కనిపించింది. బాలీవుడ్లో సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న భామ సినిమాల్లోనూ ఛాన్సులు కొట్టేసింది. ఆమె కొనుగోలు చేసి కారు విలువ దాదాపు కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. -
Tanya Sharma: వియత్నాంలో హిందీ బుల్లితెర నటి సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
-
సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
సినిమా ఆర్టిస్టులకే కాదు.. సీరియల్ ఆర్టిస్టులకూ అంతే క్రేజ్ ఉంటుంది. ఒక్క సీరియల్ అయిందంటే అందులో ఉన్నవారందరినీ జనాలు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అలా ఎంతోమంది నటీనటులు తర్వాతి కాలంలో సీరియల్స్ చేసినా, చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్లో ఉంటున్నారు. బుల్లితెర నటి సీమంతంఇటీవల నటి మహేశ్వరి సీమంతం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తనకు పండంటి బాబు పుట్టగా.. ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్గా మారింది. తాజాగా మరో బుల్లితెర నటి సీమంతం ఘనంగా జరిగింది. ముత్యాల ముగ్గు సీరియల్లో కొండమ్మ పాత్రలో నవ్వులు పూయించిన స్వప్న ప్రస్తుతం గర్భిణి.వేడుకల ఫోటోలు2022లో ఆమెకు పెళ్లయింది. త్వరలో ఆమె తల్లి కాబోతోంది. తాజాగా తనకు సీమంతం జరగ్గా ఆ వేడుకల ఫోటోలను అభిమానులతో పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్గా మారాయి. మనసిచ్చి చూడు, ముత్యమంత ముగ్గు వంటి ధారావాహికల్లోనూ నటించింది. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడె సీరియల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Swapnakondamma Varakavi (@bujjivarakavi) చదవండి: ఆయన్ను ఫాలో అయి మరీ కొడితే ప్రైజ్మనీ ఇస్తానంటూ జక్కన్న బంపర్ ఆఫర్ -
రూ.39 లక్షలు బాకీ.. ఇంకా ఇవ్వలేదు: నటి ఆవేదన
సెట్స్లో తనకు చుక్కలు చూపించారని బుల్లితెర నటి కృష్ణ ముఖర్జీ ఇటీవల శుభ్ షాగుణ్ సీరియల్ టీమ్పై సంచలన ఆరోపణలు చేసింది. తనను గదిలో పెట్టి బంధించారని వాపోయింది. తన పారితోషికం కూడా సరిగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసలేం జరిగిందో వివరంగా చెప్పుకొచ్చింది.గూండాల్లా ప్రవర్తించారుకృష్ణ ముఖర్జీ మాట్లాడుతూ.. నిర్మాత కుందన్ సింగ్ నన్ను గదిలో బంధించాడని చెప్పలేదు. ఆ బ్యానర్లో పని చేసిన వాళ్లు నన్ను గదిలో లాక్ చేశారు. అయితే అతడు చెప్పడం వల్లే వాళ్లు ఈ పని చేశారు. రెండుసార్లు గదిలో బంధించి వేధించారు. గూండాల్లా ప్రవర్తించారు. ఇప్పుడతడు దీన్ని ఎలా కవర్ చేయాలా? అని ఆలోచిస్తున్నాడు. నేను ముంబైలోని మధ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందన్నాను. కానీ అది గోరెగావ్లోని ఫేమస్ స్టూడియోలో జరిగింది. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది.వాళ్లు కనిపించనేలేదుకుందన్ చాలా తెలివైనవాడు. బేటా బేటా అంటూ అందరినీ కాకాపట్టేవాడు. అక్టోబర్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆపేశాడు. అయితే సీరియల్ యూనిట్కు చెందిన స్వాతి తనవాల నాకు అలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురుకావని హామీ ఇచ్చింది. నన్ను గదిలో బంధించిన ప్రభాత్, సమీర్లపై చర్యలు తీసుకుంది. వాళ్లు ఎప్పుడూ నాకు సెట్స్లో మళ్లీ కనిపించనేలేదు. 12 గంటల పని..కానీ డబ్బుల కోసం మాత్రం ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉండేవాళ్లం. షెహజాదాది కూడా ఇదే పరిస్థితి.. తనకూ పైసలివ్వకుండా వేధించారు. ఓసారి తనే నన్ను కాపాడాడు. ఇప్పటికీ డిప్రెషన్ నుంచి బయటపడలేదు. డాక్టర్లను, థెరపిస్టులను కలుస్తూనే ఉన్నాను. రోజుకు 12 గంటలపాటు పని చేయించుకున్నారు.. రెమ్యునరేషన్ మాత్రం ఆపేశారు. నాకు రూ.39 లక్షలు బాకీ ఉన్నారు. నాకే కాదు ఇంకా చాలామందికి వారు డబ్బులివ్వలేదు' అని కృష్ణ ముఖర్జీ చెప్పుకొచ్చింది. -
39 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సీరియల్ నటి
బుల్లితెర నటి ఆర్తి సింగ్ పెళ్లి చేసుకుంది. 39 ఏళ్ల వయసులో బిజినెస్మెన్ దీపక్ చౌహాన్తో ఏడడుగులు వేసింది. ముంబై జుహులోని ఇస్కాన్ ఆలయప్రాంగణంలో బుధవారం ఈ వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికొడుకు దీపక్ గుర్రపు స్వారీ చేసుకుంటూ కల్యాణ మండపానికి వచ్చాడు. తెల్లని షేర్వాణీ ధరించిన అతడు తలపై పింక్ టర్బన్ పెట్టుకున్నాడు. ఆర్తి రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోయింది.సిగ్గుతో ముడుచుకుపోయిన నటిపెళ్లికొడుకు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒకింత సంతోషం, ఒకింత సిగ్గుతో ముడుచుకుపోయింది నటి. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీరి పెళ్లికి విక్కీ జైన్- అంకిత లోఖండే, దేవలీనా భట్టాచార్జి, రష్మీ దేశాయ్, యువిక చౌదరి, కరణ్ సింగ్ గ్రోవర్-బిపాషా బసు.. తదితర సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఆ షోలతో ఫేమస్కాగా ఈ వారం ప్రారంభంలోనే ఆర్తి ఇంట సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ సైతం ఘనంగా జరిగాయి. ఆర్తి కెరీర్ విషయానికి వస్తే.. మాయ్క అనే సీరియల్తో 2007లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. తోడ హై బాస్ తోడే కీ జరూరత్ హై, పరిచయ్, వారీస్ అనే షోలతో పాపులారిటీ తెచ్చుకుంది. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లో పాల్గొని నాలుగో రన్నరప్గా నిలిచింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) చదవండి: జూనియర్ ఎన్టీఆర్కు ఎందుకంత కోపం వచ్చింది? -
రైల్వేలో ఇంటర్న్షిప్ చేశా.. జాబ్ కాదనుకుని యాక్టింగ్ ఫీల్డ్లోకి!
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను.. ఇంజనీర్ అవబోయి ఇలా సినిమాల్లో వచ్చి పడ్డాను.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. కొందరైతే సినిమాల మీద ప్రేమతో ఉన్న ఉద్యోగాలు వదిలేసి మరీ సినీ ఇండస్ట్రీలో వాలిపోయారు. అలా బుల్లితెర నటి మైరా ధాత్రి మెహ్రా కూడా నటి కాకముందు ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ చేసిందట.జాబ్ ఆఫర్ వదిలేశాఆమె మాట్లాడుతూ.. 'నాకు చదువంటే ఇష్టం. ఇంజనీరింగ్ పూర్తి చేశాక రైల్వేలో ఇంటర్న్షిప్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశం ఎలా వచ్చిందో తెలీదు కానీ ఎలాగోలా ఇంటర్న్షిప్ పూర్తి చేశాను. ఆ సమయంలోనే.. రోజూ ఎనిమిది గంటల డ్యూటీ చేయడం నా వల్ల కాదని తెలుసుకున్నాను. అందుకే జాబ్ ఆఫర్ వచ్చినా వదిలేసుకున్నాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఇందుకోసం అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్టూడియోలో నెలపాటు శిక్షణ తీసుకున్నాను.కాలేజీకి వెళ్తూనే..పార్ట్ టైం కోర్సు కూడా పూర్తి చేశాను. ఓపక్క ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కోచింగ్ తీసుకుంటూ ఆ తర్వాత కాలేజీకి వెళ్లేదాన్ని. ఇందుకోసం ఎక్కువ జర్నీ చేయాల్సి వచ్చేది. మా అమ్మకు కూడా ఈ విషయం చెప్పలేదు. అనుపమ్ సర్ అప్పట్లో కాస్టింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆ సమయంలో కుంకుమ భాగ్య సీరియల్కు నా పేరు సూచించాడు. అలా ఫస్ట్ టైమ్ ఆ సీరియల్లో నటించాను.అప్పుడలా.. తర్వాతిలా..నిజానికి రైల్వే ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు సాయంత్రం ఐదు ఎప్పుడవుతుందా? అని ఎదురుచూసేదాన్ని. యాక్టింగ్ ఇండస్ట్రీలో వరుసగా 12 నుంచి 13 గంటల దాకా పని చేస్తాం. కానీ ఎన్నడూ బోర్గా ఫీలవలేదు, టైం ఎప్పుడు అయిపోతుందా? అని గడియారం వంక చూసుకోలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా 'కుంకుమ భాగ్య'తో పాటు 'సాసురాల్ జెండా ఫూల్ 2', 'యే రిష్తా క్యా కెహ్లాతా హై' వంటి సీరియల్స్లో మెరిసిన మైరా ధాత్రి చివరగా 'దాల్చిని' సీరియల్లో నటించింది. -
ధనశ్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశావ్! 'ఆమెతో ఉన్నదెవరు?'
ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది.. అలా ప్రేమ పక్షులకు పెద్దలనొప్పించి పెళ్లి చేసుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి చందన- కరణ్ శర్మ 13 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దల సమ్మతితో జైపూర్లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మార్చిలో పెళ్లిపీటలెక్కిన ఈ జంట వెకేషన్ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా సురభి.. స్విమ్మింగ్ పూల్లో భర్తతో జలకాలాటలు ఆడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.రోజుకో వ్యక్తితో..ఇది చూసిన కొందరు ఆమెను తిట్టిపోస్తున్నారు. సురభిని.. క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీగా పొరపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఇన్ఫ్లూయెన్సర్ను పెళ్లి చేసుకుంటే నీ జీవితమే వేస్ట్ అవుతుంది. డిప్రెషన్లోకి వెళ్లిపోతావు. తను రోజుకో వ్యక్తితో ఎంజాయ్ చేస్తుంది' అని ఓ యూజర్ ఆగ్రహం వెళ్లగక్కాడు. మరో నెటిజన్.. 'ఈమె ధనశ్రీయా? నమ్మలేకపోతున్నాను.. సారీ చాహల్.. నువ్వు ఆమెను భాగస్వామిగా ఎంచుకుని తప్పు చేశావు' అని రాసుకొచ్చాడు.చాహల్ను ట్యాగ్ చేస్తూ..మరో వ్యక్తి ఏకంగా చాహల్ను ట్యాగ్ చేస్తూ.. 'నిన్ను ట్యాగ్ చేస్తున్నందుకు వెరీ సారీ.. కానీ చూశావ్గా.. ఇన్ఫ్లూయెన్సర్ను పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇలా ఉంటుంది. అసలు ఇలా ఎవరైనా చేయగలరా?' అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధనశ్రీతో ఉన్న వ్యక్తి ఎవరని అడుగుతున్నారు. ఇది చూసిన నటి అభిమానులు.. ఆమె ధనశ్రీ కాదు.. నటి సురభి చందన అని కామెంట్స్తో క్లారిటీ ఇస్తున్నారు.సీరియల్ కెరీర్సురభి చందన విషయానికి వస్తే.. 'ఇష్క్బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్', 'ఖుబూల్ హై', 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' ధారావాహికల్లో నటించింది. బాబీ జాసూస్ చిత్రంతో వెండితెరపైనా మెరిసింది. కరణ్ శర్మ.. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్తో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 'ఉదారియన్' అనే ధారావాహికలో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Surbhi Chandna (@officialsurbhic) చదవండి: OTT: ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు.. వీకెండ్లో ఓ లుక్కేయండి! -
ప్రముఖ బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..!
బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది. యే హై మొహబ్బతీన్ సీరియల్ గుర్తింపు తెచ్చుకుంది. గురువారం ప్రమాదానికి గురైన దివ్యాంకను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమెకు చేతి ఎముకలు విరగడంతో శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త వివేక్ దహియా వెల్లడించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటినా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ తారలు దివ్యాంక త్రిపాఠి కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఆమె భర్త వివేక్ నటికి సంబంధించిన ఎక్స్ రేను సైతం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ప్రమాదంలో ఆమెకు రెండు ఎముకలు విరిగినట్లు సమాచారం. ఇవాళ శస్త్ర చికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే గాయం నుంచి కోలుకుంది. దివ్యాంక త్రిపాఠి తన కెరీర్లో పలు సీరియల్స్తో పాటు రియాలిటీ షోలలో పాల్గొంది. -
Maheshwari: వైభవంగా బుల్లితెర నటి సీమంతం (ఫోటోలు)
-
బుల్లితెర నటిపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. కానీ!
బాలీవుడ్ బుల్లితెర భామ దీపికా కక్కర్ బీటౌన్లో సుపరిచితమే. ససురాల్ సిమర్ కాలో సిమార్, కహాన్ హమ్ కహాన్ తుమ్ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్- 12లో కంటెస్టెంట్గా పాల్గొని విజేతగా నిలిచింది. అయితే 2018లో రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ గతేడాది జూన్లో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఇదిలా ఉండగా దీపికా మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఆమె ఇటీవలే తన బిడ్డ రుహాన్ను తన చేతుల్లో పట్టుకుని వీడియోలో కనిపించింది. అందులో దీపికా వదులుగా ఉన్న తెల్లటి సూట్ ధరించి కనిపించింది. ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ 'బేబీ బంప్' దుపట్టాతో దాచి ఉంచారంటూ కామెంట్స్ చేశారు. అయితే దీపికా కక్కర్ తనపై వస్తున్న రూమర్స్పై స్పందించలేదు. కాగా.. దీపికకు ఇప్పటికే రౌనక్ సామ్సన్ అనే వ్యక్తితో మొదటి పెళ్లి కాగా.. అతనితో 2015లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2018లో షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడింది. -
బిగ్ బాస్ హౌస్లో డేటింగ్.. అప్పుడే బ్రేకప్ చెప్పేసుకున్నారా?
బిగ్ బాస్ సీజన్- 17తో ఫేమస్ అయిన జంట సమర్థ్ జురెల్- ఇషా మాల్వియా. గతేడాది జరిగిన షోలో వీరిద్దరు మరింత రెచ్చిపోయారు. ఏకంగా ఓకే బెడ్పై నిద్రించిన వీడియో అప్పట్లో తెగ వైరలైంది. హౌస్లో సమర్థ్ జురెల్, ఇషా తీరు దారుణంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఇలా చేయడమేంటి? అంటూ ఇషాను ట్రోల్ చేశారు. అంతే కాకుండా ఇది బిగ్బాస్ షోనా.. అడల్ట్ షోగా మార్చేశారా అంటూ మండిపడ్డారు. అదే హౌస్లో ఇషా మాజీ భాయ్ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఈ జంటపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఉదరియన్ అనే సీరియల్లో నటించే సమయంలో వీరి మధ్య రిలేషన్ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బిగ్బాస్ షో ద్వారా తమ రిలేషన్ నిజమేనని ధృవీకరించారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలకనున్నట్లు టాక్ వినిపించింది. ఈ జంట త్వరలోనే బ్రేకప్ కానుందని నెట్టింట తెగ వైరలైంది. కానీ ఈ రూమర్స్పై ఇషా కానీ, సమర్థ్ కానీ స్పందించలేదు. (ఇది చదవండి: 'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!) తాజాగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ అభిమాను జంట బ్రేకప్ కావడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. అయితే ఈ జంట బ్రేకప్కు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంపై మాత్రం బుల్లితెర జంట నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఇషా మాల్వియా ఇటీవల పలు మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. -
పెళ్లై రెండేళ్లు.. పిల్లలు పుట్టాలంటే ముందు ఆ కండీషన్!
పెళ్లైన ప్రతి జంటకు ఎదురయ్యే ప్రశ్న.. ఏమైనా విశేషం ఉందా? అని! ఒకప్పుడు డజను కొద్దీ పిల్లల్నీ కనేవారు.. కానీ ఇప్పుడు సంతానం కోసం ఎన్నో పాట్లు పడుతున్నారు. మొన్నటివరకు ఇద్దరు ముద్దు అనుకునేవారు కూడా ఒక్కరు చాలని భావిస్తున్నారు. మరికొందరైతే లైఫ్లో సెటిలయ్యాకే పిల్లల గురించి ఆలోచిస్తామంటున్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం ఓ కండీషన్ పెట్టుకుని మరీ ఇప్పట్లో పిల్లలు వద్దనుకుంటున్నారట! కండీషన్ కన్నడ బుల్లితెర జంట లావణ్య- శశి హెగ్డే కన్నడ సీరియల్స్ ద్వారానే ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారి తీయగా ఇద్దరూ రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అయితే అందరి జంటలకూ మాదిరే ఈ జంటకు కూడా పిల్లల్ని ఎప్పుడు కంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి లావణ్య బదులిస్తూ.. 'నేను, నా భర్త ఇప్పటివరకు హనీమూన్కు వెళ్లనేలేదు. రెండుసార్లు ప్లాన్ చేసుకుని వెళ్లడమే ఆలస్యం అనుకున్న సమయంలో బంధువులు చనిపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది. బ్రో అని పిలిచి.. హనీమూన్కు వెళ్లాకే పిల్లల గురించి ఆలోచిద్దామని నా భర్త కండీషన్ పెట్టాడు. అలాగే నేనూ ఓ కండీషన్ పెట్టాను. నన్ను హనీమూన్కు మనాలీయో లేదంటే విదేశాలకో తీసుకెళ్లిన తర్వాతే పిల్లల్ని ప్లాన్ చేద్దామన్నాను. జూన్లో హనీమూన్కు వెళ్లబోతున్నాం' అని నటి చెప్పుకొచ్చింది. కాగా రాజారాణి సీరియల్ సెట్స్లో వీరి పరిచయం బలపడింది. ఈ సీరియల్లో లావణ్య.. శశిని బ్రో అని పిలిచేది. తర్వాత అతడే భర్త అవడం విశేషం! చదవండి: చెల్లితో హీరోయిన్ రీల్.. నెట్టింట ట్రోలింగ్ -
అసలు ఆమెను ఎలా తీసుకున్నారు?.. బుల్లితెర నటిపై విమర్శలు
గతేడాది మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నేరు. మలయాళంలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ప్రియమణి లాయర్గా కనిపించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్తో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి హరిత జి నాయర్. మోహన్ లాల్ వద్ద జూనియర్ లాయర్ పాత్రలో మెప్పించింది. మొదట ఫాహద్ ఫాజిల్ నటించిన కార్బన్ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత రియాల్టీ షోలు, సీరియల్స్తో బిజీగా మారిపోయింది. హరిత నాయర్ ప్రస్తుతం శ్యామంబరం సీరియల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె శ్యామాంబరం సీరియల్లో నల్లగా ఉండే అమ్మాయి పాత్రలో నటించింది. అయితే ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ పాత్రలో అసలు హరితను ఎలా తీసుకున్నారంటూ నెటిజన్స్ విమర్శించారు. అయితే ఇలాంటి కామెంట్స్పై హరిత సైతం తనదైన శైలిలో స్పందించింది. క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ తెల్లగా ఉన్నారా? లేదా నల్లగా ఉన్నారా? అనేది ముఖ్యం కాదని హితవు పలికింది. కేవలం క్యారెక్టర్ యాక్టింగ్ ఎబిలిటీ మాత్రమే చూడాలని.. రంగును కాదని సూచించింది. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే బదులిచ్చింది బుల్లితెర భామ. కాగా.. మొదటి నర్సుగా కెరీర్ ప్రారంభించిన హరిత.. తక్కువ కాలంలోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Zee Keralam (@zeekeralam) View this post on Instagram A post shared by Haritha.G Nair (@haritha.girigeeth) -
కొడుకు డ్రీమ్ : బిడ్డను ‘కన్న’తల్లి టీవీ నటి, క్యూట్ బేబీ (ఫోటోలు)
-
కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్ స్టోరీ
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. సహజంగా పిల్లలకు కనే అవకాశం లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్ దేశానికి చెందిన టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. అయితే మరణానికి ముందు అలెస్కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్ను భ్రద (ఫ్రీజ్) పర్చుకున్నాడు. ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది. ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసింది. “అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్... నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్ చేసింది. ఇది నెటిజనుల చేత కంటతడిపెట్టిస్తోంది. View this post on Instagram A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial) -
రూ.50 లక్షలు నష్టపోయా.. ఆస్తులమ్మేశా: బుల్లితెర నటి
ఒకప్పుడు సీరియల్స్లో రఫ్ఫాడించింది నటి, నిర్మాత యాట నవీన. ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఇద్దరు కుమారులతో కలిసి రీల్స్, వీడియోలు చేస్తూ హడావుడి చేస్తోంది. ఆమె భర్త యాట సత్యనారాయణ దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవలే రజాకార్ సినిమాకు దర్శకత్వం వహించాడు. అమ్మ ఎంతో కష్టపడింది తాజాగా నవీన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నా చిన్నప్పటినుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడింది. చీరలమ్ముతూ, మిషన్ కుడుతూ పోషించింది. నేను షూటింగ్స్కు వెళ్తే నా పిల్లల్ని మా అమ్మే చూసుకుంది. నిజానికి నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి ఇష్టంగా రాలేదు. పరిస్థితుల వల్ల డబ్బు కోసం సినిమాల్లోకి వచ్చాను. అప్పట్లో సినిమా ఛాన్సులు రావాలంటే ఫోటోషూట్ చేయించుకుని అవి పట్టుకునే తిరిగేవాళ్లం. దానికోసం మా అమ్మ తనదగ్గరున్న ఒకే ఒక బంగారు నగను అమ్మేసి నన్ను ఫోటోలు తీయించింది. అరిస్తే ఏడ్చేశా వీరివీరి గుమ్మడిపండు, కాదంటే ఔననిలే.. సినిమాల్లో హీరోయిన్గా చేశాను. ఇంకో రెండు సినిమాల్లో కథానాయికగా చేశాను కానీ రిలీజ్ కాలేదు. త్రిశూలం సీరియల్ చేస్తున్నప్పుడు.. నాకు యాక్టింగ్ సరిగా రావడం లేదని డైరెక్టర్ సత్యనారాయణ సెట్స్లో అరిచేశాడు. ఏడ్చి వెళ్లిపోయాను. అలా మా మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కిలో బంగారం.. నాకు బంగారం అంటే చాలా ఇష్టం. కిలో బంగారం ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఇప్పటికే కిలోదాకా గోల్డ్ జమ చేశాను. ఒకసారి మేము పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయాము. ఓ సీరియల్ తీసేందుకు రూ.70 లక్షల దాకా ఖర్చు చేశాం. అగ్రిమెంట్స్ దగ్గర తేడా రావడంతో వంద ఎపిసోడ్లకే ఆ సీరియల్ ఆపేశారు. రూ.20 లక్షలు కూడా వెనక్కు రాలేదు. రూ.50 లక్షలు నష్టం రావడంతో మా దగ్గరున్న భూమి అమ్మేసి అప్పులు తీర్చేశాం. మళ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాం' అని పేర్కొంది. చదవండి: ఆ షో వల్లే అంతా తలకిందులు.. విడాకులు.. మానసికంగా దెబ్బతిన్నా! -
బతికేందుకు చెత్త సేకరించి అమ్మాను: బుల్లితెర నటి
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి దహియా. యే హై మొహబ్బతేన్ సీరియల్తో ఫేమస్ అయింది. ప్రస్తుతం అదృశ్యం అనే సీరియల్లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్యాంక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది. బతకడం కోసం చిన్న చిన్న పనులు చేశానని వెల్లడించింది. దివ్యాంక మాట్లాడుతూ.. ' ప్రతి ఒక్కరూ మీపై మీరే ఆశలు పెంచుకోవాలి. మన లక్ష్యం కోసం ఎప్పటికీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ మన మనుగడ కోసం ఏదో ఒకటి చేయాలి. గతంలో నేను టూత్పేస్ట్ పెట్టెలను సేకరించి అమ్మేదాన్ని. వాటికి ఒక్కో బాక్స్కు రూపాయి ఇచ్చేవారు. అలా సేకరించిన వాటిని భద్రంగా దాచి చెత్త సేకరించే వారికి అమ్మాను. అలా డబ్బు సంపాదించి నా పెట్ డాగ్ కోసం ఆహారం, బిల్లులు చెల్లించేదాన్ని. అప్పట్లో నా సర్వైవల్ కోసం రూ. 2 వేలు వచ్చినా ఫర్వాలేదు. అలా నా రోజువారీ జీవితం ప్రారంభయ్యేది. ఎవరైనా సరే డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలి' అంటూ సలహాలు ఇస్తోంది బుల్లితెర భామ .కాగా.. దివ్యాంక ప్రస్తుతం బాలీవుడ్ బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటిమణుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం దివ్యాంక ఈజాజ్ ఖాన్ సరసన అదృష్టమ్ అనే చిత్రంలో నటిస్తోంది. -
నలుగురు డాక్టర్లను కలిశా.. ప్రయోజనం లేదు: నటి
సింగర్, నటి దెబత్తమ సాహ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎంతమంది వైద్యుల చుట్టూ తిరిగినా ఇప్పటికీ కోలుకోలేకపోతున్నానంటోంది. గొంతు సమస్య వల్ల పాటలు పాడలేకపోతున్నానని వాపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఈ గొంతు సమస్యతో ఇంకా ఎంతకాలం ఇబ్బందిపడాలో తెలియడం లేదు. ఇప్పటికే నెలన్నర కావస్తోంది. కోపం వస్తోంది నా గొంతుతో సరిగా పాడలేకపోతున్నాను. ఇప్పటివరకు నలుగురు డాక్టర్లను కలిశాను కానీ ప్రయోజం లేకుండా పోయింది. చిన్నగా కూనిరాగాలు తీయొస్తుంది.. కానీ హైపిచ్లో పాడేందుకు గొంతు సహకరించడం లేదు. నా గొంతు తిరిగొస్తే బాగుండని ప్రతిరోజూ దేవుడిని వేడుకుంటున్నాను. ఒక్కోసారి విపరీతమైన కోపం వస్తోంది. మరోసారి సరిగా పాడలేకపోతున్నానని నా మీద నేనే జోకులు వేసుకుంటున్నాను. సంతోషమేసినా, బాధనిపించినా.. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మరింత ఎక్కువవుతున్నాయి. సంతోషమేసినా, బాధగా అనిపించినా పాటల్నే ఎంచుకునేదాన్ని. ఇప్పుడు పాడటమే కష్టమవుతోంది. ఈ బాధను ఎలా వర్ణించాలో కూడా తెలియడం లేదు. డాక్టర్.. నేను ఎక్కువగా మాట్లాడకూడదని సూచించారు. ఇప్పటికే నా గొంతును ఎక్కువగా ఉపయోగించడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తాయి' అని నటి చెప్పుకొచ్చింది. చదవండి: ఇక కలవడం కష్టమే.. ధనుశ్- ఐశ్వర్య విడాకులు ఖాయం! -
సీరియల్ నటి సీమంతం.. ఇది రెండోసారి!
బుల్లితెర నటి మహేశ్వరి త్వరలో రెండోసారి తల్లి కాబోతోంది. ఇప్పటికే మెటర్నటీ ఫోటోషూట్లతో తెగ సందడి చేసింది. భర్త, కూతురితో కలిసి బేబీబంప్తో ఫోటోలకు ఫోజిచ్చింది. ఆ హంగామా అంతా ఎలా జరిగిందో కూడా వివరిస్తూ యూట్యూబ్లో వీడియోలు చేసింది. భార్య అంటే పంచప్రాణాలైన శివ తనకు జీవితాంతం గుర్తుండిపోయేట్లు గత నెలలో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. మరోసారి సీమంతం మహేశ్వరికి మాటైనా చెప్పకుండా అన్నీ అరేంజ్ చేసి సీమంతం చేశాడు. ఇప్పుడు మరోసారి ఆమె సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్కు సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. నీలిరంగు చీరలో నిండా నగలు వేసుకుని ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోంది మహేశ్వరి. ఫ్యాన్స్ విషెస్ ఈ ఫోటోలు చూసిన అభిమానులు మహేశ్వరి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మహేశ్వరి.. వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్లో నటించింది. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 అనే రియాలిటీ షోలలో తన భర్త శివనాగ్తో కలిసి పార్టిసిపేట్ చేసింది. వీరికి హరిణి అనే కూతురు ఉంది. చదవండి: మా వాడిని చూసి భయపడుతున్నారా.. ? విజయ్ మేనమామ కామెంట్లు వైరల్ -
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన బుల్లితెర నటి..!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సినీ తారలు సైతం ఈ ఏడాదిలో ఎక్కువగా వివాహాబంధంలోకి అడుగు పెడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర నటి, బిగ్బాస్ బ్యూటీ ఆర్తీ సింగ్ పెళ్లికి రెడీ అయిపోయింది. దాదాపు 39 ఏళ్ల భామ ఈనెల 25న ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ చౌహాన్ను పెళ్లాడనుంది. ఈ విషయాన్ని నటి వెల్లడించారు. ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో ఆర్తి సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 25న ముంబైలోని తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నట్టు ఆర్తి తెలిపారు. హల్దీ, మెహందీతో పాటు ఫెరాస్ వంటి వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే మాది అరెంజ్డ్ మ్యారేజ్ అని వెల్లడించారు. ఢిల్లీలోని గురూజీ ఆలయంలో దీపక్ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది. ఈ వివాహానికి నటులు గోవిందా, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా.. ఆర్తి ప్రధానంగా మాయకా, గృహస్తి, ఉత్తరన్, ఉడాన్, పరిచయ్, ససురల్ సిమర్ కా, దేవాన్ కే దేవ్...మహదేవ్, వారిస్ లాంటి టీవీ సీరియల్స్లో నటించింది. 2019లో బిగ్ బాస్ -13 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొని నాలుగో రన్నరప్గా నిలిచింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ఈ రియాలిటీ షోలో రెండేళ్లుగా పని లేకపోవడం వల్ల డిప్రెషన్కు గురయ్యానని వెల్లడించింది. ఆర్తి ప్రస్తుతం ఉమ్మీద్ కి రోష్ని శ్రావణి అనే సీరియల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Arti singh sharma (@artisingh5) -
ఫ్యాన్స్కు షాకిచ్చిన బిగ్బాస్ ప్రియాంక.. సడన్గా ప్రియుడితో పెళ్లి!
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్బాస్తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్బాస్ హౌస్లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్ను అభిమానులకు పరిచయం చేసింది. హౌస్ నుంచి బయటకు రాగానే గుడ్న్యూస్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చింది. దీంతో శివకుమార్ను త్వరలోనే పెళ్లి చేసుకోనుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్డేట్స్ ఇస్తూ ఉండే ప్రియాంక సడన్గా తన అభిమానులకు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా తన ప్రియుడిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. మా పెళ్లి అయిపోయింది అంటూ ప్రకటించారు. రియల్లీ సారీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం అంటూ ప్రకటించాడు శివకుమార్. త్వరలోనే తమ పెళ్లి వీడియో కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తీరా చూస్తే ఇదంతా షూటింగ్ కోసమే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా మా ఇంటి పండుగ అనే షూటింగ్ జరిగింది. ఇందులో ప్రియాంక, శివ కుమార్కు పెళ్లి జరిగింది. దానికి సంబంధించిన ప్రోమో వీడియో కూడా రిలీజైంది. -
టీవీ నటికి ముద్దుల పాపాయి : కుటుంబం ఘన స్వాగతం, వైరల్ వీడియో
టెలివిజన్ నటి, మోహెనా కుమారి సింగ్, సుయేష్ రావత్ దంపతుల ఇంట ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. అయితే బుల్లి యవరాణికి మోహెనా కుటుంబం వేడుకగా స్వాగతం పలికిన తీరు విశేషంగా నిలిచింది. ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో తల్లీ-కూతురు ఇద్దరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో పాపాయికి ఘన స్వాగతం పలికారుకుటుంబ సభ్యులు, సన్నిహితులు. మోహెనా కుమారి సింగ్ అభిమాని పేజీ ప్రకారం, మోహెనా భర్త, సుయేష్ కుమారుడు అయాన్ష్ని చేతుల్లో పట్టుకుని కనిపించాడు. పాపాయిని పరిచయం చేసినపుడు బంధువులు, స్నేహితులు ఆనందంతో స్టెప్పులు వేశారు. అటు అయాన్ష్ కూడా తన బుజ్జి చెల్లాయ్ని చూసి మురిసి పోయాడు. ఇల్లంతా పింక్ కలర్ (పాపాయికి పింక్ కలర్ సింబల్) బెలూన్స్, బటర్ ఫ్లైస్తో అంలంకరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. View this post on Instagram A post shared by princess of reva (@mohena.ksingh) కాగా ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’ అనే సీరియల్లో 'కీర్తి గోయెంకా సింఘానియా'గా నటించి దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న నటి మోహెనా. నయా అక్బర్ బీర్బల్, కుబూల్ హై, సిల్సిలా ప్యార్ కా , ప్యార్ తునే క్యా కియాతో లాంటి టీవీ సీరియల్స్తో పాపులర్ అయింది. తొలిబిడ్డగా కుమారుడు అయాన్ష్ పుట్టినపుడు చేతుల్లోకి మొదటిసారి పట్టుకున్నప్పుడు ఎంత భావోద్వేగానికి లోనైందీ తెలిపింది. అలాగే తన రెండో ప్రెగ్నెన్సీని కూడా భారతీయ శాస్త్రీయ నృత్యం చేస్తూ ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Mohena Kumari Singh (@mohenakumari) -
పెళ్లి చేసుకున్న బుల్లితెర జంట.. ఇద్దరికీ రెండోదే!
బుల్లితెర నటుడు కరణ్ శర్మ, పూజా సింగ్ పెళ్లి పీటలెక్కారు. మార్చి 30న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. బుల్లితెర తారలు సైతం పెళ్లిలో తెగ హడావుడి చేశారు. తమ పెళ్లి విషయాన్ని కొత్త జంట ఏప్రిల్ 1న సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మిస్టర్ అండ్ మిసెస్ శర్మ అంటూ భర్తను ముద్దాడుతున్న ఫోటోలు షేర్ చేసింది పూజా సింగ్. ఏళ్ల తరబడి ఒకే సంస్థలో.. ఈ సెలబ్రిటీ జంట పెళ్లి వేడుకలు మార్చి 29 నుంచే మొదలయ్యాయి. హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ గ్రాండ్గా నిర్వహించారు. ఇద్దరూ ఒకే నిర్మాణ సంస్థలో ఏళ్ల తరబడి పని చేస్తున్నా ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకుందే లేదు. కానీ ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా గతేడాది డిసెంబర్లో కలుసుకున్నారు. ఆ పరిచయమే ఏడడుగుల బంధానికి దారి తీసింది. పెళ్లి తర్వాత పూజ మాట్లాడుతూ.. కరణ్ భర్తగా దొరకడం తన అదృష్టమని ఉప్పొంగిపోయింది. అద్భుతంగా సాగాలి కరణ్ మాట్లాడుతూ.. బ్యాచిలర్ లైఫ్ నుంచి వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఈ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నానన్నాడు. కాగా ఇతడు సాసురాల్ సిమర్ కా 2, ఉదారియాన్, మోహి, ఏక్ నహీ పెంచాన్ వంటి సీరియల్స్తో పాపులర్ అయ్యాడు. పూజ.. దియా ఔర్ బాతీ హమ్, తేరే ఇష్క్ మే ఘాయల్, శక్తి: అస్తిత్వ కే ఎసాస్ వంటి సీరియల్స్తో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె గతంలో కపిల్ చట్టానీని పెళ్లి చేసుకుంది. 2017లో ఆమె పెళ్లి జరగ్గా 2021లో విడిపోయారు. కరణ్ కూడా గతంలో టియారా ఖర్ను పెళ్లాడాడు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2016లో పెళ్లవగా నాలుగేళ్లకే విడిపోయారు. View this post on Instagram A post shared by Pooja Singh (@poojaa_singh_) View this post on Instagram A post shared by Jigyasa Singh (@jigyasa_07) చదవండి: బాడీ షేమింగ్.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్ -
గ్రాండ్గా బుల్లితెర నటి సీమంతం.. ఫోటోలు వైరల్!
యే రిష్తా క్యా కెహ్లతా హై అనే సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి మోహెనా కుమారి సింగ్. ఆ తర్వాత నయా అక్బర్ బీర్బల్, సిల్సిలా ప్యార్ కా, ప్యార్ తునే క్యా కియా, కుబూల్ హై లాంటి సిరీస్ల్లో కనిపించింది. ఆ తర్వాత సుయేష్ రావత్ను 2019లో వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇప్పటికే అయాన్ష్ అనే బాబు కూడా ఉన్నారు . తాజాగా బుల్లితెర భామ మోహెనా సింగ్ రెండోసారి గర్భం ధరించింది. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన భర్తతో కలిసి ఉన్న బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. తాజాగా మోహెనా కుమారి సింగ్కు సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఆమె కేవలం నటిగా మాత్రమే కాదు.. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్గా రాణిస్తున్నారు. View this post on Instagram A post shared by Mohena Kumari Singh (@mohenakumari) -
చిల్లర లేదన్న నటి.. యాచకుడి మాటలకు షాక్!
అమ్మా.. ధర్మం చేయండమ్మా.. బాబూ, దానం చేయండయ్యా.. అంటూ ప్లేటు పట్టుకుని తిరిగే యాచకులు ఎందరో! చిల్లర లేదని చెప్పినా సరే కొందరు వినిపించుకోకుండా డబ్బులివ్వమని పట్టుపడతారు. ఇచ్చేవరకు వదిలిపెట్టరు. అయితే బిగ్బాస్ బ్యూటీ, నటి హీనా ఖాన్కు దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైందట. డబ్బులివ్వమన్నాడు 'నేను కారులో వెళ్తున్నప్పుడు ఓ జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ వ్యక్తి నా కారు విండో తట్టాడు. డబ్బులివ్వమని అడిగాడు. అయ్యో, నా దగ్గర క్యాష్ లేదని బదులిచ్చాను. అతడు వెంటనే.. ఈరోజు ఉదయం నుంచి బోణీ కాలేదు.. ఇంట్లో తమ్ముడు, చెల్లె ఉన్నారు అంటూ అభ్యర్థించాడు. నిజంగానే నా దగ్గర డబ్బుల్లేవు.. అంటూ సారీ కూడా చెప్పాను. అతడు వెంటనే గూగుల్ పే చేయండంటూ తన నెంబర్ ఇచ్చాడు. నేను ఒక్కసారిగా షాకయ్యాను. వారానికి సరిపడా ఒక వారం రేషన్కు సరిపడా డబ్బులు పంపమని చెప్పాడు. వెంటనే అతడికి అవసరమయ్యేంత డబ్బు యూపీఐ ద్వారా పంపించాను. కానీ నిజంగానే సర్ప్రైజ్ కదా.. డిజిటల్ ఇండియా అంటే ఇదేనేమో!' అని చెప్పుకొచ్చింది. హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్తో గుర్తింపు పొందింది. ఖత్రాన్ కె ఖిలాడీ 8వ సీజన్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. హిందీ బిగ్బాస్ 11వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్లో ముఖ్య పాత్ర పోషించింది. చదవండి: పిచ్చి కుక్కలా జైల్లో వేద్దామనుకున్నారంటూ నటి ఆవేదన.. గీతూ రాయల్పై పరువునష్టం దావా! -
నా కోడలు మాయలాడిది.. ఇప్పుడేమో ఏక్దమ్ చించిపారేసిందట!
ఈ అత్తలున్నారే.. ఎప్పుడెలా ఉంటారో ఎవరికీ అర్థం కాదు అని కోడళ్లు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు చెప్పే విషయం వింటే వారేంటి.. మీరు కూడా అదే మాట అంటారు. ఇంతకీ ఏం జరిగిందంటే... బుల్లితెర నటి అంకిత లోఖండే ఇటీవలే హిందీ బిగ్బాస్ 17వ సీజన్లో పార్టిసిపేట్ చేసింది. తను ఒక్కతే వెళ్లలేదు. వెంట భర్తను కూడా తీసుకెళ్లింది. ఆలూమగలన్నాక గొడవలు సర్వసాధారణమే! కానీ చుట్టూ కెమెరాలున్న సంగతే మర్చిపోయి ఈ దంపతులు వేరే లెవల్లో తిట్టుకున్నారు.. కొట్టుకున్నంత పని చేశారు. అప్పుడేమో తిట్టేసి.. ఇది చూసిన అంకిత అత్త రంజనా జైన్కు మండిపోయింది. నా కొడుక్కి కనీస గౌరవం ఇవ్వట్లేదు.. నేనెప్పుడో చెప్పా.. ఈమె అలాంటిది, ఇలాంటిది అంటూ విమర్శల పారాయణం చేసింది. అంకిత.. తన మాజీ ప్రియుడు, దివంగత నటుడు సుశాంత్ సింగ్ను గుర్తు చేసుకుంటే కూడా.. అంతా ఫేమస్ అవడం కోసమే, ఓట్ల కోసమే.. పెద్ద మాయలాడి అని నానామాటలు అంది. ఇప్పుడేమో మెచ్చుకుని కట్ చేస్తే అంకిత కీలక పాత్రలో నటించిన స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమా మార్చి 22న విడుదలైంది. థియేటర్లో మూవీ చూసిన అంకిత అత్తయ్య.. నా కోడలు ఎంత బాగా కనిపిస్తుందో! మా అంకిత ఏ1. ఏక్దమ్ యాక్ట్ చేసింది అని మెచ్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు.. కమల్ హాసన్ను మించిపోయిందిగా అని కామెంట్లు చేస్తున్నారు. నటి పారితోషికం? ఇకపోతే స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమా కోసం డైరెక్టర్ కమ్ హీరో రణ్దీప్ హుడా 32 కిలోలు తగ్గాడు. కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే రూ.6 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ తొలి రోజు ఈ చిత్రం కేవలం కోటి రూపాయల పైచిలుకు మాత్రమే సాధించడం గమనార్హం. ఈ మూవీకి అంకిత ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఆ సినిమాలు చేశానని వేశ్య అని ట్రోల్ చేస్తున్నారు -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫోటోలు
-
డేటింగ్ యాప్లో పరిచయం.. పెళ్లి చేసుకున్న నటి
బుల్లితెర నటి ట్వింకిల్ వశిష్ట్ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు హర్ష్ తులిని మంగళవారం పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ట్వింకిల్- హర్ష డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమను పెళ్లితో పదిలపర్చుకోవాలనుకున్నారు. గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మార్చి 12న ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మా జర్నీ అంత ఈజీగా సాగలేదు ఎన్నో హార్ట్ ఎటాక్లు, బ్రేకప్లు, ఎత్తుపల్లాలు, ఇతరుల ఎత్తిపొడుపు మాటల నుంచి ఇక్కడివరకు వచ్చాం. మా ప్రేమ నిజమైనది నిరూపించాం. మాకు ఎదురైన ప్రతీ పరీక్షలో ఒకరికొకరం అండగా నిలబడ్డాం. మాది విడదీయరాని బంధమని నిరూపించాం. మా ప్రయాణం అంత సులువుగా జరగలేదు. కానీ ఈ జర్నీలో ఓపిక, నమ్మకం, కమిట్మెంట్ అన్న పదాలకు అసలైన అర్థాలు తెలుసుకున్నాం. ఎన్నో ఛాలెంజ్లను దాటి ఈరోజు ఒక్కటిగా నిలబడ్డాం.. ప్రేమకు సరిహద్దు లేదని నిరూపించాం. ధృడ సంకల్పం, విధి ఆటలను అన్నింటినీ తట్టుకుని మా ప్రేమను నిర్మించుకున్నాం. ఐ లవ్యూ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ వైరల్గా మారగా అభిమానులు, సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎన్నో బ్రేకప్లు తమ పెళ్లి గురించి నటి మాట్లాడుతూ.. ఆరేళ్లలో ఎన్నోసార్లు బ్రేకప్ చెప్పుకున్నాం. కానీ మళ్లీ కలిసిపోయేవాళ్లం. మా ఫ్రెండ్స్ కూడా మా బంధాన్ని నమ్మలేదు. విడిపోతామనే చూశారు. కానీ మేము ఒకరికొకరం దూరం కాలేకపోయాం. ఎంత పెద్ద గొడవ జరిగినా మళ్లీ కలిసిపోయేవాళ్లం. నేను అరిచినా హర్ష్ మాత్రం ఎంతో మెచ్యూర్గా ఆలోచిస్తాడు. ఇలాంటి పార్ట్నర్ దొరికినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం కుండలీ భాగ్య అనే సీరియల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by ⭐️Twinkle R Vasisht⭐️ (@twinkle_vasisht) చదవండి: హీరోయిన్ను అమ్మేయాలని చూసిన భర్త.. హనీమూన్లో అతడి ఫ్రెండ్స్.. -
టీవీ నటి సురభి చందన-కరణ్ శర్మ, హల్దీ ఫంక్షన్ అదిరిందిగా( ఫోటోలు)
-
పెళ్లి పేరుతో సీరియల్ నటి మోసం
సీతంపేట : అత్తారింటికి దారేది, పలుకే బంగారమాయే సీరియల్ ఫేం అడ్డాల ఐశ్వర్య పెళ్లి పేరుతో తనను మోసం చేసిందని ఆమె భర్త శ్యామ్కుమార్ ఆరోపించాడు. పెళ్లికి ముందే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుందన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో సోమవారం శ్యామ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ మ్యాట్రిమోనియల్ ద్వారా పెద్దలు సంబంధం కుదర్చడంతో 2023 సెప్టెంబర్ 6న విశాఖలో ఐశ్వర్యతో తనకు పెళ్లి జరిగిందని తెలిపారు. అక్టోబర్ 7న హైదరాబాద్లో ఐశ్వర్య ఇంటికి వెళ్లామని, అయితే ఆ ఇంట్లో ఆమె స్నేహితుడు డ్రింక్ చేస్తూ కనిపించాడన్నారు. దీంతో తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. మరుసటి రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారి కరణం రమేతో ఐశ్వర్య ఉండటం చూశానని, నిజం ఎక్కడ బయట పడిపోతుందోనని ఐశ్వర్య తల్లిదండ్రులు తనను బలవంతంగా విశాఖ పంపేశారని వెల్లడించాడు. ఆ తర్వాత కరణం రమేష్ తనకు ఫోన్ చేసి ఐశ్వర్యకు విడాకులు ఇవ్వాలని, లేదంటే గొడవలు జరుగుతాయని హెచ్చరించాడన్నారు. విషయాన్ని ఐశ్వర్య తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళితే.. కట్నం కోసం తన కుటుంబం వేధిస్తున్నట్టు పెందుర్తి పోలీసుస్టేషన్లో తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తిరిగి తన కుటుంబంపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని శ్యామ్కుమార్ కోరాడు. తనను పెళ్లి చేసుకుని మోసం చేసి, తన కుటుంబాన్ని రోడ్డుపైకి లాగారని ఆరోపించాడు. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి ఖర్చులకు తామే డబ్బులు ఇచ్చామని తెలిపాడు. మీడియా సమావేశంలో శ్యామ్కుమార్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
టాలీవుడ్ నటి వివాహేతర సంబంధం.. భర్త ఆవేదన..
ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి పేరుతో మోసం చేసిందంటున్నాడు ఆమె భర్త శ్యామ్ కుమార్. పెళ్లి చేసుకుని డబ్బులన్నీ కాజేసి ఇప్పుడు విడాకులు అడుగుతూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందంటూ మీడియాను ఆశ్రయించాడు. తన వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ సోమవారం నాడు సాక్షి టీవీతో తన గోడు వెల్లబోసుకున్నాడు. కాగా గతేడాది సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్- అడ్డాల ఐశ్వర్య వివాహం జరిగింది. పెళ్లయిన నెలకే.. ఓ మ్యాట్రిమోనీ ద్వారా వీరు పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా తర్వాతే అసలు గొడవలు మొదలయ్యాయి. పెళ్లయిన నెల రోజులకే భార్య.. హైదరాబాద్కు చెందిన రియల్టర్ కరణం రమేశ్బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తున్నాడు భర్త. ఇదేంటని బెదిరిస్తే తనపైనే అన్యాయంగా కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని వాపోయాడు. పెళ్లయ్యాక తన దగ్గరి నుంచి రూ.25 లక్షలు కాజేసిందని, ఇప్పుడేమో విడాకులు కావాలంటూ తన కుటుంబాన్ని మానసికంగా టార్చర్ పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సీరియల్స్, సినిమాలు.. అడ్డాల ఐశ్వర్య తెలుగు బుల్లితెర పరిశ్రమలో ఎన్నో సీరియల్స్లో నటించింది. ప్రస్తుతం అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం సీరియల్స్లో యాక్ట్ చేస్తోంది. గతంలో.. ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, నీ రూటే సెపరేటు, త్రిముఖి వంటి సినిమాల్లో హీరోయిన్గానూ చేసింది. చదవండి: మరోసారి మార్మోగుతున్న ఆర్ఆర్ఆర్.. ఈసారి పాటే కాదు ఏకంగా.. -
క్యాన్సర్తో బుల్లితెర నటి మృతి.. కన్నీళ్లు తెప్పిస్తోన్న చివరి పోస్ట్!
బాలీవుడ్ బుల్లితెర నటి డాలీ సోహి (48) క్యాన్సర్తో ఇవాళ కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందతూ మార్చి 8న ఉదయం తుదిశ్వాస విడిచింది. డాలీ సోహి కుటుంబంలో రెండు రోజుల్లోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే నటి కన్నుమూయడానికి ముందు రోజే.. ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది. అయితే డాలీ సోహి తన మరణానికి ముందు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. గతనెల 20న ఆస్పత్రిలో చేరినప్పుడు చివరిసారిగా పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్స్టాలో రాస్తూ ఈ ప్రపంచంలో అతిపెద్ద వైర్లెస్ కనెక్షన్ ప్రార్థన. అది మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ ప్రార్థనలు అవసరం అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెట్టారు. ఇవాళ ఆమె కన్నుమూయడంతో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. కాగా.. ఇటీవలే గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కోసం పూనమ్ పాండే మరణించిదంటూ ఫ్రాంక్ చేసిన సంగతి తెలిసిందే. జాండిస్తో ఆమె సోదరి మృతి.. పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్కు దగ్గరైంది. View this post on Instagram A post shared by Dolly Sohi (@dolly_sohi) -
నిర్మాతను పెళ్లాడిన ప్రముఖ నటి.. ఫోటోలు షేర్ చేసిన ముద్దుగుమ్మ!
సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల జోరు మామూలుగా లేదు. ఈ ఏడాదిని వివాహాల సంవత్సరంగా పేరు మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కొత్త ఏడాదిలో సినీ ప్రముఖులు చాలామంది పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడగా.. త్వరలోనే కృతి కర్బందా, మీరా చోప్రా కూడా వెడ్డింగ్కు సిద్ధమయ్యారు. తాజాగా మరో బాలీవుడ్ భామ పెళ్లి చేసుకుంది. నిర్మాతను పెళ్లాడిన ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం. ప్రముఖ నటి సుఖ్మణి సదానా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన సన్నీ గిల్ను మార్చి 3, 2024 పెళ్లాడారు. అమృత్సర్లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు మూడూ రోజుల పాటు అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లయిన విషయాన్ని కాస్తా ఆలస్యంగా అభిమానులతో పంచుకుంది ముద్దుగుమ్మ. తన పెళ్లి ఫోటోలను ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. మా జీవితంలో అత్యంత అందమైన రోజు ఇది.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ నటి పోస్ట్ చేసింది. కాగా.. సుఖ్మణి సదానా సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్లో నటించింది. అంతే కాకుండా జోగి, రాకెట్రీ వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. వీటితో పాటు తాండవ్, ఉడాన్ పటోలాస్, తనవ్, మన్మర్జియాన్ లాంటి షోలలో కూడా కనిపించారు. View this post on Instagram A post shared by Sukhmani Sadana (@sukhmanisadana) -
ఒక్కరోజు వ్యవధిలో కన్నుమూసిన అక్కాచెల్లెళ్లు
గర్భాశయ క్యాన్సర్ వల్ల నటి పూనమ్ పాండే మరణించిందంటూ ఆమె టీం ఇటీవల ఓ ప్రాంక్ చేసింది. దానివల్ల ఎంతటి వివాదం చెలరేగిందో అందరికీ తెలిసిందే! గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకే బతికుండగానే చనిపోయినట్లు నాటకం ఆడింది పూనమ్. తన ఉద్దేశం బాగానే ఉన్నా, అవగాహన కల్పించాల్సిన తీరు బాగోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో గర్భాశయ క్యాన్సర్ అంత ప్రమాదమా? దాని వల్ల మరణిస్తారా? అన్న చర్చ కూడా మొదలైంది. క్యాన్సర్తో ఒకరు.. ఈ క్రమంలో తాజాగా బుల్లితెర నటి డాలీ సోహి (48) ఇదే క్యాన్సర్ బారినపడి కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో శుక్రవారం(మార్చి 8న) ఉదయం తుదిశ్వాస విడిచింది. మరింత విషాదం ఏంటంటే.. నటి కన్నుమూయడానికి ముందు రోజు ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది. జాండిస్తో సోదరి మృతి పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్కు దగ్గరైంది. చదవండి:'గామి' మూవీ రివ్యూ -
ప్రియుడిని పెళ్లాడిన నటి సురభి చందన (ఫొటోలు)
-
13 ఏళ్ల ప్రేమ.. మూడుముళ్ల బంధంగా మారిన వేళ..
బుల్లితెర నటి సురభి చందన పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు కరణ్ శర్మతో ఏడడుగులు వేసింది. 13 ఏళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లితో పదిలపర్చుకుంది. జైపూర్లో ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వేడుకకు కొత్త జంట సిల్వర్ కలర్ డ్రెస్సులను ఎంచుకున్నారు. డ్యాన్స్ చేస్తూ స్టేజీపైకి.. పెళ్లిలో ఓ రొమాంటిక్ పాట ప్లే అవుతుండగా తను కూడా ఆ పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ వరుడివైపు తన్మయత్వంతో అడుగులు వేసింది సురభి. పెళ్లికి ముందు తన స్నేహితులకు బ్యాచిలరేట్ పార్టీ కూడా ఇచ్చిందీ బ్యూటీ. కాగా సురభి 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో అతిథి పాత్రలో మెరిసింది. 'ఖుబూల్ హై' సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది. సీరియల్స్ ద్వారా గుర్తింపు 'ఇష్క్బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్' ఇలా పలు ధారావాహికల్లో నటించింది. బాబీ జాసూస్ చిత్రంతో వెండితెరపై తళుక్కుమని మెరిసింది. కరణ్ శర్మ విషయానికి వస్తే 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్తో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 'ఉదారియన్' అనే సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by SURBHI CHANDNA & KARAN SHARMA❤️😍🧿 (@sukarlove_) View this post on Instagram A post shared by SURBHI CHANDNA & KARAN SHARMA❤️😍🧿 (@sukarlove_) -
Mahishivan: జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్.. ఏడ్చేసిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
సర్ప్రైజ్ సీమంతం.. ఏడ్చేసిన బుల్లితెర నటి
సీరియల్స్లో యాక్ట్ చేసినవారిని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. ఒకవేళ వారు యాక్టింగ్కు దూరంగా ఉన్నా సరే ఫలానా సీరియల్లో ఈ పాత్ర చేశారు, ఆ పాత్రలో భలే కనిపించారు అంటూ ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అందుకనే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. యూట్యూబ్లోనూ సొంతంగా ఛానల్ ఓపెన్ చేసుకుని ఎప్పటికప్పుడు తమ విషయాలను వీడియోల ద్వారా జనాలతో షేర్ చేసుకుంటున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి కూడా అదే చేసింది. రెండోసారి ప్రెగ్నెంట్ వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్లో యాక్ట్ చేసింది మహీశ్వరి. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 అనే రియాలిటీ షోలలో తన భర్తతో కలిసి పాల్గొంది. ఆమె భర్త శివనాగ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఈ జంటకు హరిణి అనే కూతురు ఉంది. త్వరలో ఆమెతో ఆడుకోవడానికి ఓ బుజ్జి పాపాయి రానుంది. మహేశ్వరి ప్రస్తుతం ప్రెగ్నెంట్. దీంతో ఆమెకు ఏదైనా మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు శివ. సర్ప్రైజ్ సీమంతం.. ఇంకేముంది, సీమంతం వేడుక ప్లాన్ చేశాడు. భార్యకు తెలియకుండానే సీమంతం వేడుకకు కావాల్సినవన్నీ సమకూర్చాడు. భార్య, కూతురికి అవసరమయ్యే షాపింగ్ కూడా చేశాడు. బోటింగ్కు వెళ్తున్నాం.. అని చెప్పి వారిని నేరుగా ఓ ఈవెంట్ హాల్కు తీసుకెళ్లాడు. అక్కడ తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కనిపించడంతో షాకైంది నటి. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తనను రెడీ చేసి సీమంతం చేశారు. ఎమోషనలైన నటి ఈ సర్ప్రైజ్ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది మహేశ్వరి. ఆమె ఏడుస్తుంటే మేఘన కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అనంతరం మహేశ్వరి- శివ కేక్ కట్ చేశారు. ఆ కేక్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేయించారు. భార్య పొట్టకు ముద్దుపెడుతున్న భర్త, ఆ పక్కన వారి మొదటి కూతురు నిలుచున్నట్లు ప్రత్యేకంగా తయారు చేయించారు. కేక్ కట్ చేయడంతో పాటు పనిలో పనిగా ఫోటోషూట్ కూడా చేశారు. ఈ సెలబ్రేషన్స్కు సిద్దార్థ్వర్మ - విష్ణుప్రియ, ఇంద్ర- మేఘన దంపతులు, యాంకర్ రవి హాజరయ్యారు. చదవండి: తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్ -
ఒక అమ్మాయిని బూతులు తిట్టే హక్కు ఉందా?: ఏడ్చేసిన నటి
ఇటీవల హైదరాబాద్లో నటి సౌమ్య జాను ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాంగ్ రూట్లో వెళ్తుండగా ట్రాఫిక్ హోంగార్డ్తో జరిగిన గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ నెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు.. జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన సౌమ్యను అడ్డగించారు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై తాజగా నటి సౌమ్య జాను ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ సమయంలో తాను రాంగ్ రూట్లో వెళ్లినట్లు తెలిపింది. కానీ ట్రాఫిక్ పోలీస్ వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని వివరించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు జరిగిన సంఘటన గురించి అసలు నిజాలు చెప్పుకొచ్చింది. సౌమ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' అసలు నా గురించి వీడియో సోషల్ మీడియాలో వస్తున్న సంగతే తెలీదు. ఇక్కడ పెద్ద బ్లండర్ ఎంటంటే.. నాకు మందు అలావాటే లేదు. నేను రాంగ్లో రూట్లోనే వెళ్లా. దీనికి సారీ చెబుతున్నా. నేను మెడిసిన్స్ కోసం వెళ్తున్నా. ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా మదర్కు మందులు అర్జెంట్గా కావాలి. ఆ విషయం అతనికి కూడా చెప్పాను. కానీ వినకుండా కారు వెనక్కి తీయమన్నారు. తను చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. నాతో చాలా అసభ్యంగా మాట్లాడాడు. కానీ ఆ ఒక్క బూతు మాట నేను తీసుకోలేకపోయాను. రెండు రోజుల నుంచి మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నా. ఆ మాటలకే నాకు కోపం వచ్చింది. అసలు ఆ మాట అనడానికి అతనికి నోరెలా వచ్చిందో నాకు తెలియట్లేదు. ప్రతి మగాడు.. ఒక ఆడదాన్ని అలా ఎందుకంటాడు.' అంటూ ఏడ్చేసింది. సౌమ్య మాట్లాడుతూ..'ఒక అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు. కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. అయిన వాళ్లను అనే హక్కు ఎవరికీ లేదు. మన సమాజంలో గేలు కూడా ఉంటారు. వాళ్లను ఉద్దేశించి ఎవరికీ అనే హక్కు లేదు. ఎందుకంటే ఆ దేవుడు వారికి అలాంటి లైఫ్ ఇచ్చాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆ మాటలు నన్ను ఎలా అంటారు. అక్కడ నేనేం నానా హంగామా చేయలేదు. కావాలంటే సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది. నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీ. కానీ అతను అన్న మాటలకు నా కుటుంబం నరకం అనుభవిస్తున్నాం. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎంటి ఇలా అయింది? అని అడుగుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది. ఆ రోజు నాకు మా అమ్మ ఆరోగ్యమే ముఖ్యం. అందుకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. నేను ఎక్కడికీ పోలేదు. హైదరాబాద్లోనే ఉన్నా. అతను చేసింది మాత్రం చాలా తప్పు. దీనిపై ఎంతవరకైనా పోరాడతా' అని అన్నారు. -
19 ఏళ్లకే హీరోయిన్ ఆఫర్.. ఎగిరి గంతేశా! కానీ..: నటి
హిందీ బిగ్బాస్ 17వ సీజన్లో బుల్లితెర జంట అంకిత లోఖండే- విక్కీజైన్ సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచారు. వీరి గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, ఆప్యాయతలు, ఈర్ష్య, అసూయలు.. ఇవన్నీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. అయితే ఈ షో వల్ల ఎక్కువ నెగెటివిటీని మూటగట్టుకుంది అంకితనే! తాజాగా ఈ బ్యూటీ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఓ షోకి హాజరైన ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఫేస్ చేశావా? అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆమె అవునని తలూపుతూ ఆనాటి ఇబ్బందికర పరిస్థితులను గుర్తు చేసుకుంది. ఎగిరి గంతేశా.. 'దక్షిణాది చిత్రపరిశ్రమలో నేను ఓ ఆడిషన్కు వెళ్లాను. తర్వాత వాళ్లు కాల్ చేసి మీరు సెలక్ట్ అయ్యారు, వచ్చి సంతకం చేయండన్నారు. నేను సంతోషంతో ఎగిరిగంతేశాను. ఈ విషయం అమ్మకు చెప్పి సంబరపడ్డాను. అయితే ఇంత తేలికగా ఎలా సెలక్ట్ చేశారబ్బా అన్న అనుమానం కూడా వచ్చింది. నేను సంతకం చేయడానికి వెళ్లినప్పుడు నాతో వచ్చిన వ్యక్తిని బయటే ఉండమన్నారు. లోపలికి వెళ్లాక నన్ను కాంప్రమైజ్ కావాలని అడిగారు. షాకయ్యాను. నేనలాంటిదాన్ని కాదని.. నాకప్పుడు 19 ఏళ్లే. నన్ను హీరోయిన్ చేస్తారేమోనని కాంప్రమైజ్ అంటే ఏంటని అడిగాను. అందుకు వాళ్లు.. నిర్మాతతో ఒక రాత్రి ఉండాలని చెప్పారు. అప్పుడు నేను.. మీ నిర్మాతకు టాలెంట్ అవసరం లేదనుకుంటా.. కేవలం ఒక అమ్మాయి తన పక్కన ఉంటే చాలనుకుంటున్నాడు. నేను అలాంటిదాన్ని కాదని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను' అని చెప్పుకొచ్చింది. అయితే సౌత్లో ఏ భాషా ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవం ఫేస్ చేసిందో వివరంగా చెప్పలేదు. చదవండి: ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మూవీ రివ్యూ -
మూడేళ్ల ముచ్చట.. విడిపోయిన బుల్లితెర జంట
ఈ మధ్య పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. బుల్లితెర జంట అభిషేక్ మాలిక్- సుహాని చౌదరి కూడా ఆ కోవలోకే వస్తారు. వీరిద్దరూ 2021లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మీ జంట చూడముచ్చటగా ఉందని, కలకాలం కలిసుండాలని కోరుతూ అతిథులు అక్షింతలు వేసి దీవించారు. కానీ మూడేళ్లకే వీరి వైవాహిక బంధం బీటలు వారింది. తాము విడిపోయామంటూ నటుడు అభిషేక్ వెల్లడించాడు. తమ మధ్య సరైన సఖ్యత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కనెక్షన్ మిస్ అవుతోంది అభిషేక్ మాలిక్ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మనస్వత్వాలు వేరు. మా మధ్య సరైన అండర్స్టాండింగ్ కూడా లేదు. మా మధ్య ఏదో కనెక్షన్ మిస్ అవుతున్నాం. దీని గురించి ఇద్దరం చర్చించుకున్నాం. విడాకులు తీసుకుంటేనే ఇద్దరం సంతోషంగా ఉండలగమని నిర్ణయించుకున్నాం. కలిసి బంధాన్ని కొనసాగించేందుకు మాకు సహేతుక కారణాలేవీ కనిపించట్లేదు. బలవంతంగా కలిసుండి ఒకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం? అందుకే విడిపోయాం. తనకేమో కలలు.. నేనేమో బిజీ నేను నా వర్క్తో చాలా బిజీగా ఉంటున్నాను. తనేమో ఏవేవో కలలు కంటోంది. పైగా తను ముంబైకి కొత్త. ఇక్కడ తనకు పెద్దగా స్నేహితులు కూడా లేరు. నా ఫ్రెండ్సే తనకు మిత్రులుగా మారారు. ఇండస్ట్రీకి చెందిన నా స్నేహితులు తనను ఎంతో ప్రేమిస్తారు. నాకంటే తనే ఎక్కువగా వారితో కలిసి బయటకు వెళ్తూ ఉండేది. అయితే ఆ ఫ్రెండ్స్ కూడా నేను నా భార్యకు ఎక్కువ సమయం కేటాయించడం లేదని అనేవారు. ఆ మాట నాకు బలంగా గుచ్చుకుంది. అది కాస్తా ఇంతవరకు వచ్చింది. విడాకుల కోసం దరఖాస్తు కూడా చేశాం' అని చెప్పుకొచ్చాడు. ప్రేమ పెళ్లి- మూడేళ్లకే విడాకులు కాగా అభిషేక్- సుహాని తొమ్మిదినెలల పాటు డేటింగ్ చేసి 2021లో పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లకే విడాకులు తీసుకోబోతుండటంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ మాలిక్.. ఛల్-షే ఔర్ మాత్ అనే సీరియల్తో 2012లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఏక్ వివాహ్ ఐసా బీ, భాగ్యలక్ష్మి, యే హై మొహబ్బతే, కుంకుమ్ భాగ్య వంటి సీరియల్స్తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. సుహాని చౌదరి మోడల్గా రాణిస్తోంది. చదవండి: శాలువా ఎందుకు విసిరేశారు? వివాదంపై క్లారిటీ ఇచ్చిన హీరో తండ్రి -
కాసేపట్లో డెలివరీ.. డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లిన నటి
ప్రెగ్నెన్సీ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొందరైతే కాలు తీసి అడుగు ముందుకువేయడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. మరికొందరేమో వ్యాయామాలు, రన్నింగ్లు చేస్తూ సర్ప్రజ్ చేస్తుంటారు. తాజాగా మలయాళ బుల్లితెర నటి లక్ష్మి ప్రమోద్ కూడా ఇలాంటి పనే చేసింది. స్వతహాగా డ్యాన్సర్ కావడంతో లేబర్ రూమ్కు వెళ్లేముందు చిందులేసింది. నిండు గర్భిణి అన్న విషయాన్ని మర్చిపోయి హాయిగా డ్యాన్స్ చేసింది. దీన్ని ఆమె భర్త అజర్ మహ్మద్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను నటి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. లేబర్ రూమ్కు వెళ్లేముందు ఒక రీల్ చేస్తే బాగుంటుందనిపించింది. అయినా డ్యాన్స్ చేసుకుంటూ లేబర్ రూమ్కు వెళ్తావా? అని అడిగారుగా.. వారికోసమే ఈ వీడియో అని రాసుకొచ్చింది. ఇది చూసిన కొందరు డెలివరీ తర్వాత కూడా ఇలాగే డ్యాన్స్ చేయ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తర్వాత నటికి పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Lekshmi Pramod (@laxmi_azar) చదవండి: ఆ సినిమా 14 సార్లు చూశా.. డైలాగ్ చెప్తూ తడబడ్డ నందమూరి హీరో! -
ప్రియుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. ఆ విషయంలో నెటిజన్ల ట్రోల్స్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇటీవల కొద్ది రోజులుగా పలువురు వివాహాబంధంలోకి అడుగు పెడుతున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. తాజాగా మరో నటి దివ్య అగర్వాల్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్తో నటి ఏడడుగులు నడిచింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ముంబయిలోని చెంబూర్లో జరిగిన వివాహా వేడుకకు సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. 2022లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరి వివాహానికి ముందు వేడుకలు కాక్టెయిల్ పార్టీతో ప్రారంభమయ్యాయి. తర్వాత దివ్య అగర్వాల్ మెహందీ, హల్దీ వేడుక చేసుకున్నారు. వీరి పెళ్లికి బాలీవుడ్ తారలు జియా శంకర్, నైరా బెనర్జీ, ఇజాజ్ ఖాన్, నిక్కీ తంబోలి, అలీ మర్చంట్, రోహిత్ వర్మ, శార్దూల్ పండిత్, విశాల్ ఆదిత్య సింగ్ హాజరయ్యారు. కాగా.. హారర్ వెబ్ సిరీస్ రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్-2 తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు రియాలీటీ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఏంటీవీ సీజన్- 10 రన్నరప్, ఏస్ ఆఫ్ స్పేస్ సీజన్- 1, బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 విజేతగా నిలిచింది. ఆమె గతంలో వరుణ్ సూద్, ప్రియాంక్ శర్మతో రిలేషన్షిప్లో ఉంది. హల్దీ వేడుకపై ట్రోల్స్ దివ్య తన హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వేడుకలో ఆమె లుక్ కంటే బ్యాక్గ్రౌండ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే వెనుక భాగంలో లేస్ చిప్స్ పాకెట్స్ దర్శనమిచ్చాయి. ఇది చూసిన కొందరు తక్కువ బడ్జెట్ డెకరేషన్ కోసం ఇలా చేశారంటూ కామెంట్స్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ రాస్తూ.. 'హల్దీ వేడుక కోసం చిప్స్తో అలంకరణ.. బడ్జెట్ అంత తక్కువగా ఉందా?' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official) -
ఎట్టకేలకు బిజినెస్ మేన్తో టీవీ నటి పెళ్లి, వైరల్ వీడియో
టెలివిజన్ నటి సోనారికా భదోరియా వ్యాపారవేత్త వికాస్ పరాశర్ను పెళ్లాడింది. నిన్న ( ఫిబ్రవరి 18న) రాజస్థాన్ రణతంబోర్లోని సవాయ్ మాధోపూర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఎట్టకేలకు తమ అభిమాన నటి వివాహ బంధంలోకి అడుగు పెట్టడంతో ఫ్యాన్స్ ఈ లవ్బర్డ్స్కు విషెస్ అందిస్తున్నారు. గోవాలో రోకా వేడుక అనంతరం వివాహం ఘనంగా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో హల్దీ, మెహిందీ, తదితర ప్రీ వెడ్డింగ్ వేడుకలు, సోనారికా భావోద్వేగానికి గురైన దృశ్యాలతో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోనారికా భదోరియా 'దేవో కే దేవ్ మహదేవ్’ సీరియల్లో పార్వతీ దేవి పాత్రతో టీవీ పార్వతిగా పాపులర్ అయింది. ప్రియుడు వికాస్తో ఎనిమిదేళ్లుగా డేటింగ్లో ఉన్న సోనారిక 2022 మే నెలలో మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Yami♥️Craziest Sonarikan♥️ (@sonakifan) -
ప్రియుడితో ప్రేమ పెళ్లి.. విడాకులతో షాకిచ్చిన బుల్లితెర నటి!
కోలీవుడ్లో బుల్లితెరపై మెప్పించిన నటి ప్రియాంక నల్కారి. తమిళంలో సీతారామన్ అనే సీరియల్తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత రోజా సీరియల్తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సమ్థింగ్ సమ్థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లోనూ మెరిసింది. అంతేకాకుండా టాలీవుడ్లో అందరి బంధువయా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎస్ఎంఎస్, హైపర్, నేనేరాజు నేనేమంత్రి, వైఫ్ఆఫ్ రామ్, కిక్-2 చిత్రాల్లో నటించింది. అయితే గతేడాది ఆడియన్స్కు ఊహించని షాకిచ్చింది ప్రియాంక. తన ప్రియుడిని సీక్రెట్గా పెళ్లాడింది. బుల్లితెర నటుడు రాహుల్ వర్మను మలేషియాలో పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఆ వార్త విన్న ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. కోలీవుడ్లో బుల్లితెరతో పాటు వెండితెరపై మెరిసిన ప్రియాంక నల్కారి ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో నలదమయంతి అనే సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నారు ప్రియాంక నల్కారి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటోంది.' ఏడాదిలోపే విడాకులు..! గతేడాది మార్చిలో పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ జంట విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆడియన్స్తో నిర్వహించిన ఇంటరాక్షన్లో సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు భర్తతో విడిపోయారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అవునని సమాధానమిచ్చింది ప్రియాంక. అలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తన ఇన్స్టా స్టోరీస్ ద్వారా సమాధానాలిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు. పెళ్లైన ఏడాదిలోపే ప్రియాంక విడాకులు తీసుకోవడంతో కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే ప్రియాంక సీతారామన్ సీరియల్ నుంచి తప్పుకుంది. అప్పట్లోనే దీనికి కారణం తన భర్తే అని కూడా చెప్పుకొచ్చింది. ప్రియాంక ఓ సీరియల్లో నటించేందుకు చెన్నైకి రావడం.. ఆమె భర్త మలేషియాలో ఉండడంతో వారి మధ్య దూరం పెరగడం వల్లే ప్రియాంక నటనకు స్వస్తి చెప్పిందని కూడా కొందరు రాసుకొచ్చారు. కానీ.. ఆ తర్వాత ప్రియాంక నలదమయంతి అనే సీరియల్తో మళ్లీ నటించడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ పేజీలో భర్త ఫోటోలన్నింటినీ తొలగించింది. ప్రియాంక భర్త రాహుల్ కూడా ఆమెతో ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేశాడు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం ప్రియాంక నల్కారి వెల్లడించలేదు. ఈ టాపిక్ ప్రస్తుతం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రియాంక భర్త రాహుల్ వర్మ విషయానికొస్తే.. నటుడు, బిజినెస్ మేన్ రాణిస్తున్నారు. అతడు తెలుగులో పలు సీరియల్స్లో నటించాడు. అదే క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018లో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత గతేడాది మలేషియాలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka Nalkari Official (@nalkarpriyanka) -
రెండో భర్తకు విడాకులు.. ఆ ఫోటోలు డిలీట్, భర్త ఇంటి నుంచి..
'ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు' అన్నారు పెద్దలు. జీవితంలో ఈ రెండూ అన్నింటికన్నా ఎంతో ప్రాముఖ్యమైనవని, అలాగే వాటిని బాధ్యతగా పూర్తి చేయడం అంతకన్నా కష్టతరమైనవని చెప్పకనే చెప్పారు. కానీ పెళ్లి చేయడం ఒక ఎత్తయితే దాన్ని కలకాలం నిలబెట్టడం కత్తి మీద సాముగా మారింది. కొందరు వివాహమైన కొంతకాలానికే విడాకులు తీసుకుంటున్నారు. సెకండ్ ఛాన్స్ అంటూ రెండో పెళ్లికి సిగ్నల్ ఇచ్చేస్తున్నారు, కానీ అది నిలబెట్టుకోవడం కూడా కష్టంగానే ఉంది. బుల్లితెర నటి దల్జీత్ కౌర్ కూడా ఈ కోవలోకే వస్తుంది.మనస్పర్థలతో భర్తకు దూరంచూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్ను పెళ్లాడింది. వీరికి జైడన్ అనే కుమారుడు జన్మించాడు. మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్లపాటు తన కుమారుడితో కలిసి ఒంటరిగా ఉన్న దల్జీత్.. దుబాయ్లో జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో నిఖిల్ పటేల్ అనే వ్యక్తిని కలిసింది. అతడికి అప్పటికే పెళ్లయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి విడిగా జీవిస్తున్నాడు (ఒకరు తల్లితో ఉంటే మరో అమ్మాయి ఇతడితోనే ఉంది).రెండో పెళ్లి.. ఫోటోలు డిలీట్ చేసిన నటిపార్టీలో ఇతడు తన పిల్లల గురించి, దల్జీత్ తన కొడుకు గురించి మాట్లాడింది. అలా పిల్లల మీద వారికున్న ప్రేమ ఇద్దరినీ కలిపింది. ఏడాది పాటు ప్రేమలో చెట్టాపట్టాలేసుకుని తిరిగాక గతేడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు. కొడుకును తీసుకుని అతడితోపాటు లండన్లో సెటిలైందీ బ్యూటీ. సడన్గా ఈ మధ్యే లండన్ నుంచి ఇండియాకు వచ్చేసింది. అంతేకాదు, ఇన్స్టాగ్రామ్లో పెళ్లి ఫోటోలను డిలీట్ చేసింది. తన బయోలో కూడా పటేల్ అనే పదాన్ని తొలగించింది. దీంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.నటి తల్లిదండ్రులకు సర్జరీదీనిపై నటి టీమ్ స్పందించింది. 'దల్జీత్, ఆమె కుమారుడు జైడన్ ఇండియాలోనే ఉన్నారు. దల్జీత్ తల్లిదండ్రులకు సర్జరీ చేయాల్సింది ఉంది. ఇప్పుడు ఆమె వారితో ఉండటం చాలా అవసరం. ఇలాంటి సమయంలో ఆమె ఏ అంశం గురించీ మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే మొత్తం వ్యవహారంలో పిల్లలు కూడా ఉన్నారు. వారి గోప్యతకు భంగం కలిగొంచవద్దు' అని ప్రకటన విడుదల చేసింది. దీంతో విడాకుల వార్తలు నిజమేనని ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు నెటిజన్లు. పెళ్లయి ఏడాది కూడా అవకముందే ఇలా విడిపోయారేంటని షాకవుతున్నారు.చదవండి: ఓటీటీలోకి 'నా సామిరంగ'.. అప్పటినుంచే స్ట్రీమింగ్.. -
విడాకులై మూడేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డా: బుల్లితెర నటి
బుల్లితెర నటి నివేదిత పంకజ్ మరోసారి ప్రేమలో పడిందట! సీరియల్ నటుడు సురేందర్ను గాఢంగా ప్రేమిస్తుందట! త్వరలోనే అతడి కలిసి ఏడడుగులు వేయనుందట! త్వరలోనే కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నానోచ్ అంటూ సంతోషంలో మునిగి తేలుతోందీ బ్యూటీ. అయితే గతంలో నివేదిత సీరియల్ నటుడు ఎస్ఎస్ ఆర్యన్ను పెళ్లాడింది. వీరిని అభిమానులు క్యూట్ కపుల్గా అభివర్ణించారు. కానీ, అంతలోనే విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తీసుకున్న మూడేళ్లకు తనకు మరో తోడు దొరికిందని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది నివేదిత. పనికిరాని ప్రశ్నలు అడగొద్దు 'చిన్నచిన్న విషయాలు కూడా మీతో పంచుకోవడమే నాకిష్టం. నేను విడాకులు తీసుకుని మూడేళ్లవుతోంది. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డాను. ఓ స్పెషల్ వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని ఆరాటపడుతున్నాను. ఈ విషయంపై మీరు ఎంత ఆసక్తి చూపిస్తారో నాకు తెలుసు. ఏయే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో కూడా తెలుసు. ప్లీజ్.. పనికిరాని ప్రశ్నలు వేసి విసిగించొద్దు. పాజిటివ్గా ఉందాం. ఒకరికొకరం మద్దతుగా నిలబడుదాం. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్' అని ఓ లేఖ షేర్ చేసింది. మాజీ భర్త రెండో పెళ్లి 'మీ అనుమానాలు, ప్రశ్నలన్నింటికి ఈ ఒక్క పోస్ట్తో సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాను' అంటూ సదరు పోస్ట్కు క్యాప్షన్ జోడించింది. దీనికంటే ముందే సురేందర్తో క్లోజ్గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతూ ఇతడే తన ప్రియుడు అని హార్ట్ సింబల్తో క్లారిటీ ఇచ్చేసింది. ఇకపోతే ఆమె మాజీ భర్త ఆర్యన్ సైతం గతేడాది మరో పెళ్లి చేసుకున్నాడు. బుల్లితెర నటి శ్రీతిక సనీష్ను పెళ్లాడాడు. View this post on Instagram A post shared by Nivedhitha (@_n.i.v.e.d.h.i.t.h.a_) View this post on Instagram A post shared by LK Photography (@lkphotography.in) View this post on Instagram A post shared by LK Photography (@lkphotography.in) చదవండి: OTT: ఓటీటీలో బేబి హీరో కొత్త సినిమా.. సైలెంట్గా స్ట్రీమింగ్.. -
ఫ్రీగా పెళ్లి దుస్తులు కావాలన్న నటి.. ఏకిపారేసిన డిజైనర్
నాగిన్ సీరియల్ ఫేమ్, బుల్లితెర నటి సురభి చందన పెళ్లికి రెడీ అవుతోంది. 13 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న నటుడు కరణ్ శర్మతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. మార్చి 1 లేదా 2న జైపూర్ వేదికగా వీరి వివాహం జరగనుందట! తాజాగా ఈ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఈమె తన పెళ్లి కోసం గ్రాండ్గా కనిపించే దుస్తులను ఫ్రీగా ఇవ్వమని అడిగిందట. ఇంకేముంది, డిజైనర్కు మండిపోయింది. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకోవడానికి డబ్బులుంటాయి కానీ బట్టలు కొనుక్కోవడానికి ఉండవా? అని ఆగ్రహించాడు. నేనెందుకు ఫ్రీగా ఇస్తా? అంతేకాదు, ఆమె టీమ్తో చాట్ చేసిన స్క్రీన్షాట్లను ఆయుష్ కేజ్రీవాల్ అనే డిజైనర్ రెడ్డిట్ ప్లాట్ఫామ్లో షేర్ చేశాడు. నాకు సంబంధమే లేని వ్యక్తి పెళ్లికి నేనెందుకు ఉచితంగా దుస్తులివ్వాలి? ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. పెద్ద రాజభవనం లాంటి ప్యాలెస్లో పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లకు కనీసం దుస్తులు కొనడానికి కూడా డబ్బులుండవా? అని విమర్శించాడు. ఈ ఘటనపై నెటిజన్లు సురభిని తిట్టిపోస్తున్నారు. డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బుల్లేవా? 'ఈమె పెద్ద సెలబ్రిటీ అనుకుంటుంది. తన కోసం పెద్ద పెద్ద బ్రాండ్లు ముందుకు వచ్చి అన్నీ స్పాన్సర్ చేస్తారనుకుంటుంది..', 'ఎంతో ఘనంగా వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు డిజైనర్కు కూడా ఎంతో కొంత ముట్టజెప్తే బాగుంటుంది' అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం సురభిని వెనకేసుకొస్తున్నారు. ఆమెకు ఫ్రీగా డ్రెస్సులు ఇస్తే ఆ డిజైనర్కు గుర్తింపు వస్తుందిగా! చాలామంది డిజైనర్లు.. గుర్తింపు కోసం, బిజినెస్ కోసం సెలబ్రిటీలకు ఫ్రీగా దుస్తులు పంపిస్తారు. దానివల్ల వారి బిజినెస్కు ప్రమోషన్ చేసినట్లేగా అంటున్నారు. దీనిపై నటి టీమ్ ఏమని స్పందిస్తుందో చూడాలి! ఇద్దరిదీ సీరియల్ బ్యాక్గ్రౌండే.. కాగా సురభి హిందీ సూపర్ హిట్ సీరియల్ 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో అతిథి పాత్రలో మెరిసింది. 'ఖుబూల్ హై' సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది. 'ఇష్క్బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్' వంటి పలు సీరియల్స్ చేసింది. బాబీ జాసూస్ చిత్రంతో వెండితెరపైనా తళుక్కుమంది. కరణ్ శర్మ 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్తో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 'ఉదారియన్' అనే సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Surbhi Chandna (@officialsurbhic) చదవండి: విశాల్ వల్లే వెనక్కు వెళ్లిపోయారు.. సినిమాను సినిమా వాళ్లే చంపేస్తున్నారు -
బిగ్బాస్ తర్వాత దారుణ పరిస్థితులు, డిప్రెషన్కు వెళ్లిపోయా: నటి
బిగ్బాస్ షోతో కావాల్సినంత గుర్తింపు వస్తుంది. బోలెడంత డబ్బు వస్తుంది. కానీ తర్వాత? అవకాశాలు లేక నానాపాట్లు పడ్డవారే ఎక్కువున్నారు! చాలామంది బుల్లితెర, వెండితెరపై నామరూపాల్లేకుండా పోయారు. కొద్దిమంది మాత్రమే నిలదొక్కుకున్నారు. అయితే బిగ్బాస్ షో తర్వాత తను చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానంటోంది పవిత్ర పూనియా. ఈ బుల్లితెర నటి 2009లో ఎమ్టీవీ స్ప్లిట్స్విల్లా మూడో సీజన్లో, 2020లో బిగ్బాస్ 14వ సీజన్లో పాల్గొంది. తాజాగా ఆమె తను ఫేస్ చేసిన కష్టాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఉన్నదంతా అయిపోయింది నేను బిగ్బాస్ షోకి వెళ్లినప్పుడు కోవిడ్తో అంతా అల్లకల్లోలంగా ఉంది. రియాలిటీ షో నుంచి బయటకు వచ్చాక పని దొరకడమే కష్టమైంది. నా సేవింగ్స్ అన్నీ వాడేశాను. బిగ్బాస్ ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చైపోయాయి. నా దగ్గర లెక్కపెట్టలేనంత డబ్బు ఉండాలని నేను కోరుకోలేదు. కానీ నాకు సడన్గా ఏదైనా అయి ఆస్పత్రిలో ఉంటే అమ్మను రూపాయి అడక్కుండా నా బిల్ నేనే కట్టుకోగలిగేంత మనీ ఉంటే చాలు. డిప్రెషన్కు లోనయ్యా నేను షో నుంచి వచ్చిన నెల రోజులకు నాన్నకు యాక్సిడెంట్ అయింది. దీని వల్ల ఏడాదిన్నరపాటు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పలేదు. దీనివల్ల డిప్రెషన్కు లోనయ్యాను. నా జీవితాన్ని చాలించాలనుకున్నాను. ఆ సమయంలో కుటుంబం నాకు అండగా నిలిచింది. ఆ చీకటి రోజుల నుంచి బయటపడేలా చేసింది' అని చెప్పుకొచ్చింది. కాగా పవిత్ర ప్రస్తుతం 'ఇష్క్ కీ దస్తాన్-నాగమణి' అనే సీరియల్లో నటిస్తోంది. నోట్: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ప్రేక్షకులను భయంతో ఉలిక్కిపడేలా చేసిన చిత్రం.. సైలెంట్గా ఓటీటీలోకి.. -
భర్త చేతిలో మోసపోయిన బిగ్బాస్ కంటెస్టెంట్.. చివరికీ!
మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో ఆర్య ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అంతే కాకుండా మలయాళ బిగ్బాస్ సీజన్-2లో కంటెస్టెంట్గా పాల్గొంది. వీటితో పాటు బడాయి బంగ్లా, స్టార్ మ్యూజిక్ లాంటి రియాలిటీ షోలలో కనిపించింది. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ముఖ్యంగా తన భర్త రాహుల్ సుశీలన్తో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి తన విడాకులపై స్పందించింది. బిగ్బాస్ కంటెస్టెంట్ ఆర్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నా. వదిలించుకోవడానికే అతను నన్ను బిగ్ బాస్కి పంపాడా అనే అనుమానం ఉంది. ముఖ్యంగా షోలో వెళ్లడానికి నాకు మద్దతు ఇచ్చిన వ్యక్తి. నాకు ఓ కుమార్తె ఉంది. మా నాన్న చనిపోయి చాలా కాలం కూడా కాలేదు. బిగ్బాస్ వెళ్లమని ఆయనే నాకు సపోర్టు చేసి మరీ ఎయిర్పోర్టులో దింపారు. నాకు అక్కడ బిగ్బాస్లో ఉన్నన్ని రోజులు ఎవరితోనూ పరిచయం లేదు. నేను హౌస్ నుంచి వచ్చేలోగా నాకు దూరం కావాలనేది అతని ప్లాన్ అని తెలీదు. కానీ ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నా' అని తెలిపింది. కొవిడ్ వల్ల నేను బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చి నా భర్తకు చాలాసార్లు కాల్ చేశా. కానీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన ఏకైక నంబర్ అతనిదే. అతను ఫోన్ తీయకపోవడంతో.. నేను అతని సోదరికి ఫోన్ చేశా. ఆమె జరిగిన విషయమంతా నాకు చెప్పింది. అతని మరో మహిళ వివాహేతర సంబంధంలో ఉన్నాడని నాకు అప్పుడే తెలిసింది. దీంతో అతన్ని కాల్చి చంపాలన్నా కోపం వచ్చింది. కానీ ఇప్పుడైతే అలాంటి కోపం లేదు. కానీ అతనికి ఏదైనా చెడు జరిగిందని తెలిస్తే మాత్రం సంతోషిస్తా.' అంటూ తన కోపాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో అతను దుబాయ్లో ఉన్నందున.. కొవిడ్ వల్ల అతన్ని కలిసేందుకు వీలు కాలేదని ఆర్య తెలిపింది. కాగా.. ఆర్య చివరిగా మలయాళ కామెడీ చిత్రం క్వీన్ ఎలిజబెత్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం పద్మకుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్వేతా మీనన్, నరేన్, జానీ ఆంటోనీ, మీరా జాస్మిన్, నీనా కురుప్ ప్రముఖ పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) -
'చివరి శ్వాస వరకు చేయి వదలను'.. రెండేళ్లకే నటి బ్రేకప్!
బుల్లితెర నటి అంజుమ్ ఫఖీ బ్రేకప్ బాధలో మునిగిపోయింది. రెండేళ్లుగా మార్కెటింగ్ ప్రొఫెషనల్ రోహిత్ జాదవ్తో ప్రేమలో ఉన్న ఆమె అతడితో తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఈ నెలలో కూడా కలిసి ట్రిప్కు వెళ్లిందట, ఏమైందే ఏమో కానీ అక్కడే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం. ఒకరినొకరు అన్ఫాలో ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. అంతేకాదు తన సోషల్ మీడియా ఖాతాలోనూ రోహిత్తో కలిసి దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది నటి. దీంతో ఈ జంట బ్రేకప్ వార్త నిజమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చివరి శ్వాస వరకు చేయి వదలను.. కాగా అంజుమ్.. రోహిత్ను ఎంతగానో ప్రేమించింది. అతడిపై తన ప్రేమను వెల్లడిస్తూ గతంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'జీవితాంతం నీ భాగస్వామిగా ఉంటానని మాటిస్తున్నాను. చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. నీ పేరును నా గుండెపై పచ్చబొట్టు వేయించుకున్నాను' అని రాసుకొచ్చింది. మరి రోహిత్ను అంతగా ప్రేమించిన నటి మనసు ఎందుకు ముక్కలైంది? వీరి బ్రేకప్కు గల కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది. సీరియల్స్ ద్వారా గుర్తింపు కాగా ఈ నటి మహి వే సీరియల్తో తన కెరీర్ ఆరంభించింది. ఏక్ త రాజా ఏక్తీ రాణి, కుండలీ భాగ్య, బడే అచ్చే లగ్తే హై 2 సీరియల్స్లో నటించింది. ఫియర్ ఫ్యాక్టర్:ఖత్రోన్ కె ఖిలాడీ 13వ సీజన్లోనూ పాల్గొంది. ప్రస్తుతం దబాంగి-ముల్గి ఆయూరే ఆయి సీరియల్లో నటిస్తోంది. చదవండి: పిచ్చిపట్టిందా? ఎందుకిలా చేస్తున్నావ్? అని ఆ స్టార్ హీరోను నిలదీశా.. -
పండక్కి గుడ్న్యూస్ చెప్పిన బుల్లితెర బ్యూటీ
బుల్లితెర నటి సురభి చందన గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రకటించింది. 13 ఏళ్లుగా ప్రియుడు, నటుడు కరణ్ శర్మతో డేటింగ్లో ఉన్న ఆమె అతడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. పెళ్లెప్పుడు? ఎక్కడ? అనే వివరాలను పూర్తిగా ప్రకటించలేదు. పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు అయితే ఆమెకు పెళ్లవబోతున్న విషయాన్ని సురభి పెంపుడు కుక్క చెప్తున్నట్లుగా మై హ్యూమన్స్ ఆర్ గెటింగ్ మారీడ్ (నా మనుషులు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు) అని రాసి ఉన్న బోర్డు ముందు దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. 13 ఏళ్ల ప్రేమను పెళ్లి బంధంతో పదిలం చేసుకోబోతున్న ఈ ప్రేమజంటకు అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా సురభి హిందీ సూపర్ హిట్ సీరియల్ 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో అతిథి పాత్రలో మెరిసింది. 'ఖుబూల్ హై' సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది. ఇద్దరికీ సీరియల్స్ ద్వారానే క్రేజ్ 'ఇష్క్బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్', 'షెర్డిల్ షెర్గిల్' సీరియల్స్లో నటించింది. 'బాబీ జాసూస్' అనే హిందీ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. ఇది ఆమె వెండితెరపై నటించిన ఏకైక సినిమా! కరణ్ శర్మ విషయానికి వస్తే ఇతడు కూడా చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్తో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 'ఉదారియన్' అనే సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Surbhi Chandna (@officialsurbhic) చదవండి: సంక్రాంతి రేసులో ఏడుసార్లు.. ఎన్ని హిట్సో తెలుసా? -
దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్.. ఆ బుల్లితెర నటి ఎవరంటే?
సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ఎందుకంటే స్టార్ హీరోల విషయాకొనిస్తే ఆ పదం కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు కూడా ఉన్నారు. అలాగే సినిమాలతో పాటు బుల్లితెరపై కనిపించే నటీనటులు సైతం కోట్లలో కాకపోయినా.. లక్షల్లో తీసుకునేవారు ఉన్నారు. బుల్లితెరపై నటీనటుల విషయంలో రెమ్యునరేషన్ తక్కువే అయినా.. అందులోనూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్న క్రేజీ నటి గురించి తెలుసుకుందాం. ఇంతకీ ఆమె ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి. ఏడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన నటి ప్రస్తుతం బుల్లితెరపై నటించేవారిలో అత్యధిక పారితోషికం అందుకుంటోంది. ప్రముఖ సీరియల్స్లో నటిస్తూ ఒక్కో ఎపిసోడ్కు హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమె దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బుల్లితెర భామ రూపాలీ గంగూలీ. దర్శకుడు, స్క్రీన్ రైటర్ అనిల్ గంగూలీ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె సోదరుడు విజయ్ గంగూలీ కూడా కొరియోగ్రాఫర్గా పనిచేశారు. రూపాలి గంగూలీ 1985లో ఏడేళ్ల వయసులో తన తండ్రి చిత్రం సాహెబ్లో నటించింది. ఆ తర్వాత ఆమె 2000లో సుకన్య అనే సీరియల్తో బుల్లితెర రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సారాభాయ్ వర్సెస్ సారాభాయ్లో మోనిషా పాత్రకు ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2006లో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్- 1లో పాల్గొంది. ఆ తర్వాత కూడా పలు రియాలిటీ షోస్లో కూడా పాల్గొంది. ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో సన్నిహితమైన సంబంధాలు కూడా ఉన్నాయి. అక్షయ్ కుమార్ను కుటుంబ సభ్యుడిలా భావిస్తామని గతంలో రూపాలీ చాలాసార్లు చెప్పుకొచ్చారు. సీరియల్స్లో నటిస్తూ ఉండగానే రూపాలి గంగూలీ ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కె. వర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనుపమ-నమస్తే అమెరికా, బతేన్ కుచ్ అంకాసీ అనే సీరియల్స్లో నటిస్తోంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లితెర నటిగా పేరు సంపాదించుకున్న రూపాలీ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బుల్లితెర నటిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఒక్కో ఎపిసోడ్కి రూ. 3 లక్షలు తీసుకుంటోంది. కేవలం సీరియల్స్ ద్వారానే దాదాపు రూ. 20 కోట్ల వరకు ఆస్తులు సంపాదించారు. బుల్లితెర పరంగా చూస్తే ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ రూపాలీ గంగూలీ అందుకుంటున్నారు. ఓవరాల్గా ఇండియాలో ఈ స్థానం మాత్రం కమెడియన్ కపిల్ శర్మదే. అతడు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.50 లక్షలు వసూలు చేస్తుండటం విశేషం. బాలీవుడ్ లోనూ అతడు పలు సినిమాల్లో కనిపించాడు. ది కపిల్ శర్మ షో మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. సంపద పరంగా చూస్తే రూపాలీ గంగూలీ కంటే హీనా ఖాన్ నెట్ వర్త్ చాలా ఎక్కువ. ఆమె రూ.52 కోట్లతో దేశంలో అత్యధిక సంపద కలిగిన బుల్లితెర నటిగా నిలిచింది. View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) -
Actress Lahari Son Cradle Ceremon: బుల్లితెర నటి లహరి తనయుడి బారసాల ఫంక్షన్ (ఫోటోలు)
-
డెలివరీ అయిన 2 నెలలకే నటి ఆత్మహత్యాయత్నం.. భర్తకు విడాకులు
జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానంటోంది తమిళ బుల్లితెర నటి కృతిక అన్నమలై. ఒకానొక సమయంలో భర్త పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్యకు యత్నించానంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా వైవాహిక జీవితంలో చాలా సమస్యలున్నాయి. అసలు నా పెళ్లి జీవితమే పెద్ద సమస్య. నా మెడలో తాళి పడ్డ పది నెలలకు కొడుకు పుట్టాడు. ఆ సమయంలో నా చేతిలో మూడు సీరియల్స్ ఉన్నాయి. వాడిని చూసుకోవడం కోసం సీరియల్స్ మానేసి ఇంటిపట్టునే ఉన్నాను. ఇంటి దగ్గరే ఖాళీగా.. అప్పటినుంచే నాకు, నా భర్తకు మధ్య గొడవలు మొదలయ్యాయి. తర్వాత అతడు వ్యాపారంలో నష్టపోవడంతో నేను తిరిగి సీరియల్స్ చేయడం ప్రారంభించాను. తను మాత్రం బాధ్యత లేకుండా ఇంటి దగ్గరే ఖాళీగా కూర్చున్నాడు. దీనివల్ల మా మధ్య గొడవలు మరింత ముదిరాయి. ఒకరోజు ఈ టార్చర్ భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించాను. పిల్లాడు పుట్టిన రెండు నెలలకే ఇది జరిగింది. చావు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చిన నేను మళ్లీ అతడితోనే సర్దుకుపోవాలనుకున్నాను. భరించలేక విడాకులు.. నాలుగేళ్లు అతడితోనే కలిసున్నాను. ఆ తర్వాత మాత్రం తనను భరించే ఓపిక నశించి విడాకులు తీసుకున్నాను. చాలామందికి నేను విడాకులు తీసుకున్న విషయం కూడా తెలియదు. ఇప్పుడు విడిపోయానని చెప్పినందుకు చాలామంది చులకనగా కామెంట్లు చేస్తారు. కానీ మేము కూడా మనుషులమే.. మాకూ జీవితాలుంటాయి. నా భర్తతో ఎంతో పోరాడాను. అలిసిపోయాను. నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఏమాత్రం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా 'మెట్టి ఒలి' సీరియల్తో పాపులర్ అయింది కృతిక. విలనిజం పండించడంలో ఆమె దిట్ట. సీరియల్స్లో కనిపించే ఈ నటి 'మనద మయిలద' అనే డ్యాన్స్ ప్రోగ్రామ్లోనూ పాల్గొంది. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: అమ్మ జీవితంలో చాలా మిస్సయింది.. రెండో పెళ్లి.. మేము ఏమంటామోనని.. -
కవలలకు జన్మనిచ్చిన బిగ్బాస్ విజేత!
బుల్లితెర నటి, బిగ్బాస్ విజేత రుబీనా దిలక్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని నెల రోజుల తర్వాత రివీల్ చేసింది. నవంబర్ 27న గురునానక్ జయంతి సందర్భంగా జన్మించినట్లు ఆమె వెల్లడించింది. కానీ అంతకుముందే రుబీనా-అభినవ్ జంటకు ట్విన్స్ జన్మించినట్లు రుబీనా ఫిట్నెస్ ట్రైనర్ పోస్ట్ చేశారు. ఈ బుల్లితెర జంట తమ కుమార్తెల పేర్లను కూడా వెల్లడించారు. కవలలకు జీవా, ఈధా అనే పేర్లు పెట్టినట్లు తెలిపారు. పిల్లలు జన్మించి నెల రోజులు పూర్తి కావడంతో ఇంట్లో పూజలు నిర్వహించారు. తమ కూతుళ్లను చేతుల్లో పట్టుకుని కెమెరాల ముందు కనిపించారు. కాగా.. రుబీనా బుల్లితెర నటుడు అభినవ్ శుక్లాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమ ఇన్స్టాలో రాస్తూ.. 'మా కుమార్తెలు జీవా, ఎధాలకు నెల రోజులు నిండాయని పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నా. గురుపురాబ్ లాంటి పవిత్రమైన రోజున ఆ దేవుడు ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా దేవతలకు మా శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. ఈ జంట 2018లో సిమ్లాలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరు సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్- 14 లో పాల్గొన్నారు. ఈ సీజన్ విజేతగా రుబీనా నిలిచింది. అభినవ్ ఇంట్లో పెద్దమనిషిగా ప్రశంసలు అందుకున్నారు. View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) -
పెళ్లి చేసుకోవడమే ఆలస్యం.. ఇంతలోనే షాకిచ్చిన బిగ్బాస్ బ్యూటీ!
బుల్లితెర జంట పవిత్ర పూనియా- ఇజాజ్ ఖాన్ విడిపోయారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలాకాలంగా ఈ రూమర్స్పై నోరు విప్పని పవిత్ర తొలిసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా అభిమానులతో నేనెప్పుడూ టచ్లోనే ఉంటాను. అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నా.. దయచేసి దీని(బ్రేకప్ రూమర్స్) గురించి ఎవరూ మాట్లాడొద్దు. మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు. నన్ను, అలాగే ఇజాజ్ను కూడా సపోర్ట్ చేయండి. మా మధ్య ఏదైతే జరిగిందో బహుశా ఏదో ఒక కారణం వల్లే అది జరిగుండొచ్చు. పెళ్లికి నో.. ఆ వార్తలు నిజమే! ఇప్పుడు నేను నా కెరీర్ పైనే ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యే నా తండ్రిని కోల్పోయాను. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. కానీ అతడు నన్ను తల్లిగా చూస్తాడు. నేను తనను చిన్నపిల్లాడిగా చూసుకుంటాను. ఇప్పుడు నా కుటుంబానికి నా అవసరం ఎంతో ఉంది. నా కోసం, నా కుటుంబం కోసం కొన్ని పనులు చేయాల్సి వస్తోంది. అది మీరు ప్రేమతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంతకంటే ఏం చెప్పలేను. నా ఫ్యామిలీ బాధ్యతలు నేను భుజాన ఎత్తుకున్నాను. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. మా రిలేషన్ గురించి ఏదైతే ప్రచారం జరుగుతుందో అది నిజమే!' అంటూ బ్రేకప్ వార్తలు వాస్తవమేనని ధ్రువీకరించింది నటి. బిగ్బాస్ హౌస్లో మొదలైన లవ్ కాగా పవిత్ర పూనియా.. లవ్ యూ జిందగీ, యే హై మొహబ్బతే, నాగిన్ వంటి సీరియల్స్లో నటించింది. అలాగే హిందీ బిగ్బాస్ 14వ సీజన్లోనూ పాల్గొంది. ఇజాజ్ ఖాన్ విషయానికి వస్తే.. ఈ నటుడు గతంలో అనిత హస్సనందానీతో డేటింగ్ చేశాడు. కొంతకాలానికే ఆమెకు బ్రేకప్ చెప్పి కెనడియన్ సింగర్ నటలై డి లుసియోతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునే సమయానికి వీరి బంధం ముక్కలైంది. బిగ్బాస్ 14వ సీజన్లో పాల్గొన్నప్పుడు నటి పవిత్ర పూనియాతో పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారింది. వీరు గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటారనుకులోపే బ్రేకప్ చెప్పుకుని అభిమానులకు షాకిచ్చారు. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి.. జీవితాంతం ఈ చేయి విడవనంటూ.. -
డేటింగ్కు ఫుల్స్టాప్, పెళ్లితో ఒక్కటైన లవ్ బర్డ్స్
బుల్లితెర జంట శ్రెను పరిఖ్, అక్షయ్ మాత్రే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ 2021లో ప్రసారమైన 'ఘర్ ఏక్ మందిర్ కృపా అగ్రసేన్ మహారాజా కీ' అనే సీరియల్లో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరిమధ్య సమ్థింగ్ సమ్థింగ్ స్టార్ట్ అయింది. ఈ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి, పెళ్లికి పచ్చజెండా ఊపాయి. దీంతో శ్రెను సొంతూరైన గుజరాత్లోని వడోదరలో గురువారం(డిసెంబర్ 21న) వీరి వివాహం ఘనంగా జరిగింది. అతడితోనే జీవితం.. తమ పెళ్లి ఫోటోలను ఈ నవదంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో శ్రెను రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ లెహంగాలో ధగధగ మెరిసిపోయింది. అటు అక్షయ్ రెడ్ కలర్ షేర్వాణీ ధరించాడు. ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కొత్త పెళ్లికూతురు ఈ జీవితానికి అతడినే బుక్ చేసుకున్నానని రాసుకొచ్చింది. సీరియల్స్తో గుర్తింపు పెళ్లికి ముందు హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు సైతం జరిగాయి. సంగీత్లో ఈ లవ్ బర్డ్స్ బాలీవుడ్ హిట్ సాంగ్స్కు స్టెప్పులేశారు. కాగా శ్రెను పరిఖ్.. ఏక్ భ్రమ్ సర్వగుణ్ సంపన్, ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూన్- ఏక్ బార్ ఫిర్, ఇష్క్బాజ్, ఘర్ ఏక్ మందిర్, జింగదగీ కా హర్ ర్యాంగ్, గులాల్.. వంటి పలు సీరియల్స్తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. అక్షయ్ మాత్రే.. ఇండియావాలీ మా సీరియల్లో నరేన్ వ్యాస్గా నటించి బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. View this post on Instagram A post shared by Shrenu Parikh (@shrenuparikhofficial) చదవండి: సీనియర్ను ప్రేమించా.. అతడు కూడా ఇంట్రస్ట్ చూపించాడు.. అంతలోనే! -
హీరోయిన్గా ఒకే ఒక్క సినిమా.. అదీ తెలుగులో!
సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. లేదంటే ఎంత టాలెంట్ ఉన్నా ఇక్కడ ఎక్కువకాలం రాణించలేం. పై ఫోటోలో ఉన్న బెంగాలీ బ్యూటీ సీరియల్ నటిగా తన ప్రయాణం మొదలుపెట్టింది. తన ప్రతిభతో సినిమా ఛాన్స్ కూడా అందుకుంది. కానీ కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క సినిమా చేసింది. అది కూడా తెలుగులో, అందులోనూ హీరోయిన్గా! ఒక్క సినిమాతో ఆగిపోయిన వెండితెర ప్రయాణం టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన హిట్ సినిమాల్లో యజ్ఙం ఒకటి. ఈ సినిమా గోపీచంద్కు కలిసొచ్చింది కానీ ఇందులో కథానాయికగా నటించిన సమీరా బెనర్జీకి మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ మూవీ తర్వాత బ్యూటీకి ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. కొంతకాలం పాటు అవకాశాల కోసం ఎదురుచూసింది. కానీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత నిర్మాత నీరజ్ శర్మాను పెళ్లాడింది బెనర్జీ. వీరికి సుమారు 11 ఏళ్ల బాబు ఉన్నాడు. ఏం చేస్తుందంటే? సమీరా బెనర్జీ అసలు పేరు మూన్ బెనర్జీ. ఈమెకు సినిమా ఛాన్సులు రాకపోవడంతో తిరిగి సీరియల్స్ వైపు వెళ్లిపోయింది. కసౌటీ జింగదీ కే, క్యోన్కీ సాస్ భీ కబీ బహూతీ, రిష్తాన్ కీ డర్, సాసురల్ జెండా పూల్, ఏక్ తా రాజా ఏక్ తా రాణీ, ముస్కురాన్ తదితర సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం గమ్ హై కిసీకే ప్యార్ మే, సాసురాల్ సిమర్ కా 2 ధారావాహికలతో అభిమానులను అలరిస్తోంది. అయితే 40 ఏళ్లు దాటడంతో తల్లి పాత్రలే ఎక్కువగా వస్తున్నాయంటోంది బెనర్జీ. చదవండి: విడాకులు, బ్రేకప్.. ముచ్చటగా మూడోసారి లవ్లో పడ్డ సల్మాన్ సోదరుడు!