Allu Arjun Arrest
-
శ్రీతేజ్కు అల్లు అర్జున్ పరామర్శ
-
హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు
-
A1 పెద్దరామిరెడ్డి, A2 చిన్న రామిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు
-
నాంపల్లి కోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
బాబు.. పవన్.. ఊసరవెల్లి.. సిగ్గు సిగ్గు!
అందితే జుట్టకు.. అందకుంటే కాళ్లు అని సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విద్య వెన్నతో పెట్టిందేనని చాలాకాలంగా అందరికీ తెలుసు. అయితే ఈమధ్యకాలంలో ఆయనకు పవన్కళ్యాణ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమే కాదు.. రాజకీయాలకు సినిమాలను వాడుకోవడమెలాగో కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు మరి! అల్లూ అర్జున్ అరెస్ట్ విషయంలో పవన్ వ్యాఖ్యలు, వ్యవహారం మొత్తం ఈ ద్వంద్వ వైఖరినే సూచిస్తోంది. గతంలో సినిమా టిక్కెట్ల నియంత్రణకు జగన్ సీఎం హోదాలో నడుం బిగిస్తే అంతెత్తున ఎగిరిన వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్! జగన్ సినిమా వాళ్లను అగౌరవ పరిచారని, టిక్కెట్ ధరలకూ.. ప్రభుత్వానికి సంబంధం ఏమిటని గగ్గోలుపెట్టారు. అసత్య ప్రచారం కొనసాగించారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల గురించి మాట్లాడితే మాత్రం పవన్ ఆయన చాలా గొప్ప అని పొగిడేస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వారిని పవన్ పంచెలూడదీసి కొడతానని బహిరంగంగా ప్రకటించడం!!! పవన్ ద్వంద్వ వైఖరి మొత్తం తన సినిమా వ్యాపారాన్ని కాపాడుకునేందుకే అన్నది బహిరంగ రహస్యమే. కాకపోతే ఈ విషయం అక్కడితోనే ఆగిపోలేదు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆయన అల్లూ అర్జున్ అరెస్ట్ను కూడా తప్పు పట్టలేకపోయారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సుద్దులు కూడా వల్లెవేశారు. చట్టంపై అంత గౌరవమున్న మనిషే అయితే.. గతంలో చంద్రబాబుపై అవినీతి కేసులు వచ్చినప్పుడు అస్సలు మాట్లాడలేదేం? పైగా ఎందుకు రోడ్లపై పడి దొర్లారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచారం యావకు 29 మంది నిండు ప్రాణాలు బలైతే.. నోరెత్తని పవన్ అల్లూ అర్జున్ విషయంలో మాత్రం ముందు వరుసలోకి వచ్చారే? ఇక్కడ మరణించిన వ్యక్తుల సంఖ్య కాదు ముఖ్యం. మానవత్వం. ఒకసారి ఒకలా.. ఇంకోసారి ఇంకోలా వ్యవహరించడాన్నే ప్రశ్నించాలి. చంద్రబాబు సభలు జరిగినప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటల వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల లేదా పుట్టిన రోజుకో ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్కు అభిమానులు మరణించిన ఘటనలున్నాయి. మానవత్వం ఉన్న వారైతే అలా ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రకటన చేసుండేవారు. బిజెపి మిత్రపక్షంగా, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పవన్ పొగడడం తెలంగాణ బీజేపీ నేతలకు కాస్త చికాకు కలిగించినట్లుగానే ఉంది. బీజేపీ నేతలు ఒకపక్క అల్లు అర్జున్ను సమర్థిస్తూంటే పవన్ దీనికి భిన్నమైన వైఖరి తీసుకోవడం వారికి అసంతృప్తి కలిగించింది. అందుకే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంశం గురించి ప్రస్తావించి రేవంత్ ఎందులో గొప్పవాడిగా కనిపించారని అడిగారు. రేవంత్ సినిమా వారి పట్ల కర్కశంగా వ్యవహరించినా, వారికి బెనిఫిట్ షో లు ఇచ్చే ప్రసక్తి లేదని, రేట్లు పెంచబోమని ప్రకటించినా పవన్ నోరు విప్పి స్పందించలేకపోతున్నారు. ఏపీలో గతంలో వేసిన రంకెలు తెలంగాణలో ఏమయ్యాయని పవన్ ప్రత్యర్థులు ఎద్దేవ చేస్తున్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును ఉద్దేశించి గతంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు.. ‘‘నువ్వూ రెడ్డివే..జగన్ రెడ్డే.. మీరు, మీరు మాట్లాడండి’’ అని పెద్ద గొంతుకతో చెప్పారు. కాని ఇప్పుడు అదే దిల్ రాజు ఈయనతో మాట్లాడగానే రేవంత్ ను పొగిడేసి తెల్ల జెండా ఎత్తేశారన్నమాట. అంటే తన అన్న కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమాతో పాటు తన సినిమాలు, బాలకృష్ణ వంటివారు నటించిన సినిమాలు విడుదలకు సిద్దం అవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం పవన్ చేయలేకపోయారు. ఎలాగొలా రేవంత్ ను ప్రసన్నం చేసుకుని మళ్లీ బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల విషయాలలో సానుకూల నిర్ణయం కోసం ఈ పాట్లు పడుతున్నట్లు అనిపిస్తుంది. సినిమా నటుడుగా ఉన్న ఆయన జనసేన పార్టీ పెట్టుకుని రాజకీయాలలోకి వచ్చి బాగానే లబ్ది పొందారని చెప్పాలి. కేంద్రస్థాయిలో బీజేపీతో జత కట్టడం, ఆ తర్వాత విడిపోయి పాచిపోయిన లడ్లు ఇచ్చిందని చెప్పినా, తదుపరి మళ్లీ వారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్లను అవినీతిపరులుగా ఆరోపించి, ఆ తర్వాత మళ్లీ వారితోనే స్నేహం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి పాదాభివందనం చేసి, వామపక్షాలతో కలిసి పోటీచేసి పరాజయం తర్వాత వారిని గాలికి వదలివేశారు. ఇలా అవకాశవాద రాజకీయాలు చేయడంలో పవన్ ఘనాపాటినే అనిపించుకున్నారు. చెగువేరా అభిమానిని ప్రచారం చేసుకుని, అనంతర దశలో మోడీ అంటే చాలా అభిమానం అని చెప్పుకున్నారు. వామపక్ష భావజాలం నుంచి సనాతన హిందూవాదినని పోజు పెట్టగలిగారు. ఒకసారి ఓటమి పాలైనా, సినిమాల పాత్రల ద్వారా తన అభిమానులను ఆకట్టుకుని, ఒక సామాజికవర్గాన్ని ఆకర్షించి తద్వారా రాజకీయ అవసరాలను తీర్చుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తన రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని సినిమా వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కాంగ్రెస్ నేత అని తెలిసినా రేవంత్ ను అంతగా పొగిడారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. సినీ ప్రముఖుల మాదిరే ఆయనకు కూడా హైదరాబాద్ లోనే ఆస్తిపాస్తులు ఉండడం వల్లే భయపడ్డారన్న వాదన ఉంది. గతంలో కెసిఆర్ ను రాజకీయంగా ఒక సందర్భంలో విమర్శించినా, ఆయన ముఖ్యమంత్రి కాగానే పవన్ కళ్యాణ్ కలిసి ప్రశంసించి వచ్చారు. ఆ తర్వాత ఆయన సినిమాకు ఇబ్బంది లేకుండా చేసుకున్నారని చెబుతారు. ఇలా రాజకీయాలను ,సినిమాలను కలిపి వాడుకోగలగడంలో పవన్ సఫలం అయ్యారని చెప్పాలి. ఇది రాజకీయ అవకాశవాదం కావచ్చు. విలువలు లేని రాజకీయం కావచ్చు..ఏమైతేనేం .. అంతిమంగా అటు రాజకీయంలో పదవులు పొందాలి. ఇటు సినిమాలలో వ్యాపారం పండాలి..ఈ వైఖరి తోనే పవన్ నడక సాగిస్తున్నట్లు కనిపిస్తుంది.ఇక తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించడాన్ని సమర్దించుకున్న తీరు విడ్డూరమే .గతంలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అని,తన ఇంటిలోని వారికెవరికి పదవులు తీసుకోవడం లేదని చెప్పిన ఆయన ఇప్పుడు స్వరం మార్చారు. నాగబాబు జనసేన కోసం కష్టపడ్డారని చెబుతున్నారు.నాగబాబు మాదిరికాని, మంత్రి నాదెండ్ల మనోహర్ లాగా కాని బిసి,ఎస్సి,ఎస్టి నేతలెవరైనా కష్టపడి ఉంటే వారికి పదవులు ఇచ్చేవారట.అంటే వారికి అవకాశాలు ఇవ్వకుండా, వారు శ్రమపడలేదని చెప్పడం పవన్ కే చెల్లింది. అన్నిటికి మించి తన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ , ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏ కులమో తెలియదని చెప్పడం ఈయన అబద్దాలు ఏ లెవెల్లో ఆడగలరో చెప్పకనే చెబుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబు నాయుడే అవకాశవాద రాజకీయాలలో దిట్ట అని, అబద్దాలు ఆడడంలో బహు నేర్పరి అని అంతా అంటుంటారు. ఇప్పుడు పవన్ ఆయనను దాటి పోతున్నట్లుగా ఉంది.ఏది ఏమైనా వ్యక్తిగత జీవితంలోకాని, రాజకీయాలలో కాని, సినిమాలలో కాని విలువల గురించి ఆలోచించకూడదన్న తత్వాన్ని ఈ ఉదంతాలు తెలియచేస్తున్నాయి.ఎవరితో అంటకాగితే ప్రయోజనమో తెలుసుకోవాలి. ఎప్పుడు ఎవరిని పొగిడితే వ్యాపార పరంగా లాభమో ఆలోచించాలి. ఈ విషయాలలో పవన్ కళ్యాణ్ మాస్టర్ డిగ్రీ చేసినట్లే అనుకోవచ్చేమో! కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్ ఓపెన్ అయితే ఇలా ఉంటుంది పుష్పా!
ఇంతకీ అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో?.. అని ఇంతకాలం అటు రాజకీయ వర్గాలు, ఇటు సినీ వర్గాలు ఒక కుతూహలంతో ఎదురు చూశాయి. తీరా ఆయన ఓపెన్ అయ్యేసరికి.. ఆయన తన అభిప్రాయం చెప్పకపోయి ఉంటేనే బాగుండు అనుకుంటున్నాయి. ఈ ఇష్యూపై మీడియా చిట్చాట్లో పవన్ మాట్లాడి.. ఇంకా గంటలు కూడా గడవలేదు. కానీ, ఈ కామెంట్లు ఎంత ఫాస్ట్గా ప్రభావం చూపాయంటే.. మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్లీ తన్నుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసేంతలా.. !సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ జైలుకెళ్లి వచ్చాక దాదాపు సినీ పరిశ్రమ మొత్తం ఆయన్ని పరామర్శించింది. పవన్ మాత్రం ఇక్కడికైతే రాలేదు. ‘‘వచ్చేస్తున్నారహో..’’ అంటూ థంబ్నెయిల్స్తో సోషల్ మీడియాలో ఊదరగొట్టేశారు. అల్లుడి కోసం కదిలి వస్తున్నాడంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు. అయితే అల్లు వారిని కనీసం ఫోన్ ద్వారా అయినా ఆయన పరామర్శించినట్లు ఎక్కడా సమాచారం లేదు. ఇది అల్లు అర్జున్ అభిమానులతో పాటు పవన్ అభిమానులను ఒకింత ఇబ్బందికి గురి చేసింది. వరుసకు మామ బంధుత్వంతోనైనా బన్నీని కలిసి ఉంటేనే.. పెద్దరికం నిలబెట్టుకున్నట్లు ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు.. ఈ ఇష్యూ మొదట్లో రాజకీయంగా తాము ఇబ్బందికి గురవుతున్నామన్న అభద్రతాభావం సినీ పెద్దల్లో కనిపించింది. అలాంటి టైంలో దాదాపు ముప్పై ఏళ్లపాటు సినీ రంగంలో ఉన్న పవన్ కల్యాణ్ తమకు మద్దతుగా ఒక్క మాట అయినా అంటారేమోనని యావత్ సినీ పరిశ్రమ భావించింది. కానీ, ఇవేవీ జరగక.. తనదైన శైలిలో కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. పవన్ ఏమన్నారో యధాతథంగా ఓసారి గమనిస్తే..‘‘ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు. మేము సినిమా థియేటర్కు వెళ్లడం ఎప్పుడో మానేశాం. విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు. చిరంజీవి(Chiranjeevi) ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారు. నేనూ అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో స్టాఫ్ అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్లి కూర్చున్నాక... ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం!. అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదు. కానీ..ఇటువంటి ఘటనల్లో పోలీసులను నేను తప్పు పట్టను. ఎందుకంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు... అర్జున్కు చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది. అప్పుడు రచ్చ అవకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. అభివాదం చేయకపోతే... ఆ నటుడుపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్లో ఉంటుంది. వెళ్లి ఆ బిడ్ట కోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. సినిమా అంటే టీం... అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదు.ఈ ఘటనలో గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది నా అభిప్రాయంఅల్లు అర్జున్(Allu Arjun Row) విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపీంచింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. రేవంత్ రెడ్టిపై ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉందని.. సీఎం హోదాలో ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డికి రాంచరణ్, అల్లు అర్జున్లు చిన్ననాటి నుంచీ తెలుసు. అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా. కొన్నిసార్లు పరిస్థితులు బట్టి నిర్ణయాలు ఉంటాయి.రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడు. కింద నుంచి ఎదిగారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అలా చేశారు అని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) వీటన్నింటికీ మించిన నాయకుడు. ఆయన వైఎస్సార్సీపీ విధానాల తరహాలో అక్కడ(తెలంగాణలో) వ్యవహరించలేదు. అక్కడ బెన్ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంపుకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పుష్ప సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచారు. ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. ‘సలార్’, ‘పుష్ప2’వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి. ‘పుష్ప2’ సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుంది. మరి మనం రేవంత్ రెడ్డిను ఎలా తప్పు బడతాము?.రెండ్రోజుల కిందట.. ఇదే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప రిమ్స్ వద్ద మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ విలేకరి అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి ప్రశ్నించారు. ఇది సంబంధం లేని ప్రశ్న అంటూ పవన్ దాటవేసే యత్నం చేశారు. ‘‘మీ ఫ్యామిలీ మెంబర్ కదా?’’ అని అదే విలేకరి ప్రశ్నించగా.. ఆవేశంతో ఊగిపోయిన పవన్.. ‘‘ఇప్పుడు మనుషులు మరణిస్తుంటే సినిమాల గురించి ఎందుకు? పెద్ద పెద్ద సమస్యలకు సంబంధించిన విషయాలు అడగండి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను.. బియాండ్ సినిమా గురించి డిబేట్ పెట్టండి. ఇక్కడ సమస్యల గురించి మాట్లాడండి. అరాచకాలపై డిబేట్ పెట్టండి'' అని క్లాస్ పీకారు.కట్ చేస్తే.. దిల్ రాజుతో భేటీ అయిన సందర్భంలోనే అల్లు అర్జున్ ఇష్యూ.. ఆయనకు పెద్ద సమస్యగా కనిపించిందేమో!. అందుకే ప్రధానంగా భావించి చాలాసేపు మాట్లాడారు. ఒకవైపు తన అల్లుడిదే తప్పనంటూ.. మరోవైపు చంద్రబాబు శిష్యుడనో లేకుంటే తోటి పొలిటీషియన్ అనో కాకుంటే ఒక స్టేట్కు సీఎం అనో.. రేవంత్ చేసిందే కరెక్ట్ అంటూ ప్రశంసలు గుప్పించారాయన. అదే సమయంలో.. ఇక్కడ పాపం అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు అంటూ కర్రతో కాల్చి ఆపై బర్నల్ రాసినంత పని చేశారు. ఒకప్పుడు పవన్ కల్యాణ్(P)awan Kalyan) ప్రసంగాలు అంటే.. గజిబిజి గందరగోళంగా ఉండేవన్న పేరు ఉండేది. ఆయన ఎప్పుడు.. ఏం మాట్లాడాతారో అర్థంకాక అభిమానులు తలలు పట్టుకునేవారు. అదృష్టవశాత్తూ.. ఎన్నికల టైంలో ఆయన్నొక తోపుగా సోషల్ మీడియా విపరీతమైన హైప్ తెచ్చి పెట్టింది. అయితే.. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన వైఖరిలో మార్పు వస్తుందేమోనని భావించిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. పైపెచ్చు.. పబ్లిక్గా అభిమానులనే తిడుతూ పబ్లిక్గా అసహనం ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అనే చందాన హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై పవన్ మాట్లాడారు. అయితే ఇది ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పిస్తే.. ఇలాగైనా తమ లీడర్కు ఎలివేషన్ ఇద్దామని భావించిన ఆయన ఫ్యాన్స్ను మాత్రం షరామాములుగా అయోమయంలో పడేసింది. ఏది ఏమైనా పవన్ తన వ్యాఖ్యలతో మరోసారి ఫ్యాన్స్ వార్కు మాత్రం ఆజ్యం పోశారు. -
అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
గంటకు పైగా అల్లు అర్జున్ను విచారిస్తున్న పోలీసులు
-
అల్లు అర్జున్ ఇంటి గేటును పరదాలతో మూసివేసిన సిబ్బంది
-
అల్లు అర్జున్ ను విచారిస్తున్న చిక్కడపల్లి ఏసీపీ, సీఐ
-
అల్లు అర్జున్ ఎంక్వైరీ టైం.. వీడియో రికార్డ్!
-
అల్లు అర్జున్ వెంట తండ్రి, మామ
-
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్
-
మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్
-
అల్లు అర్జున్కు షాక్.. పోలీసుల నోటీసులు
సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ అరెస్ట్.. విడుదల..అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.మధ్యంతర బెయిల్..అయితే అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ బన్నీ హైకోర్టును ఆశ్రయించారు. బన్నీ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అరెస్ట్ అయిన రోజే నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మరుసటి ఉదయమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం)అసలే జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 చిత్రం విడుదలైంది. అయితే అంతకుముందు రోజే ఈ మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోను ప్రదర్శించారు. ఈ షోను వీక్షించేందుకు అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కు వెళ్లారు. అదే సమయంలో అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్పై కూడా కేసు నమోదు చేశారు. -
అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేక అతనిపై దుష్ప్రచారం
-
KA Paul: రేవతి కుటుంబానికి 300 కోట్లు ఇస్తా
-
సంధ్య ధియేటర్ ఘటనలో పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ వివాదం
-
పుష్ప-2 మూవీపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రి సీతక్క
-
బెనిఫిట్ షోలు రద్దు చెయ్యాలని డిమాండ్.. బండారు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
-
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్
-
ఈ-కార్ రేసు స్కామ్పై చర్చకు రెడీ:కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని సమస్యలపై సభలో చర్చిద్దామని.. దమ్ముంటే రెండువారాలపాటు అసెంబ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు. మంగళవారం కొడంగల్ బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..‘‘కేబినెట్లో మాట్లాడటం కాదు. సభలో చర్చ చేద్దాం. అన్ని సమస్యలపై సభలో చర్చిద్దాం. ఈ-కార్ రేసు కుంభకోణంపై కూడా చర్చకు నేను రెడీ. దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి’’ అని సీఎం రేవంత్కు సవాల్ విసిరారు.పేరు మర్చిపోయినందుకు యాక్టర్ను జైలులో పెట్టించారు. సీఎం పేరు మర్చిపోతే జైల్లో పెడతారా?అంటూ రేవంత్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. -
RGV: దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా ?
-
అల్లు అర్జున్ అరెస్ట్ పై నటుడు సుమన్ రియాక్షన్
-
అల్లు అర్జున్ అరెస్ట్ పై RGV కామెంట్స్
-
జనాలను మభ్యపెట్టేందుకే బాబు ‘విజన్’
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన విజన్–2047 జనాలను మభ్యపెట్టేందుకేనని, ఆ విషయంలో ఆయన ఘనుడని మాజీమంత్రి వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన విజన్–2047 పేదల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. గతంలో విజన్–2020 ప్రవేశపెట్టినప్పుడే కమ్యూనిస్టులు ‘విజన్–2020.. చంద్రబాబు 420’గా.. వరల్డ్ బ్యాంకు జీతగాడుగా పిలిచేవారు. ఇప్పటికీ ఆయన విజన్లో ఎలాంటి మార్పూలేదు. విజన్–2047 గురించి మాట్లాడే ముందు 2024 పరిపాలన విధానంపై ఆయన ఆలోచించాలి. విజన్ అనేది పేదవాడికి సహాయం చేయడానికి ఉండాలి.కానీ.. చంద్రబాబు ఒక్క రూపాయి అయినా సహాయం చేశారా? రైతులకు రూ.20 వేలు పెట్టుబడి రాయితీ, ఉచిత పంటల బీమా ఊసేలేదు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆయన 2014లో రుణమాపీ చేయకుండా రైతులను మోసం చేశారు. చంద్రబాబు 1998లో రూ.2 కోట్ల 50 లక్షలతో మెకాన్సీ సంస్థ ద్వారా విజన్ డాక్యుమెంట్ తయారుచేయించారు. అందులో.. అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేసి యూజర్ ఛార్జీలు వసూలుచేయమని ఉంది. మెడికల్ సీట్లు వద్దనడమే బాబు విజన్..జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలకు అనుమతిచ్చి ఐదింటిని పూర్తిచేస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్పరం చేస్తున్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాయడం చంద్రబాబు విజన్. అలాగే, వలంటీర్లు, బేవరేజ్ కార్పొరేషన్ సిబ్బందినీ తొలగించి వారిని రోడ్డున పడేశారు. సంపద సృష్టి అంటూ ప్రచారం చేస్తున్నా కొంతమందికే సంపద కలుగుతోంది. అమరావతికి రూ.15వేల కోట్ల అప్పు దొరకిందన్న అనందం తప్ప పేదవాడికి పది రూపాయలు సహాయం చేశామన్న సంతోషంలేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి కిందస్థాయి అధికారుల వరకు అందరినీ వేధిస్తున్నారు.ఈ ఏడు నెలల కాలంలో రూ.70 వేల కోట్ల అప్పుచేయగా.. ప్రజలకు ఏంచేశామో చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులతో రిమాండ్కు తరలిస్తున్నారు. కానీ, జగన్మోహాన్రెడ్డి మీద మీరు ఎన్ని పోస్టులైన పెట్టొచ్చా? మీ మాటలకు, చేతలకు పొంతనలేదు. ఉచిత ఇసుక ఎక్కడా అమలుకావడంలేదు. ఇలా ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు?ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ అరెస్టు..అల్లు అర్జున్ అరెస్టు నూటికి నూరుశాతం ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సా«ధింపులా ఉంది. నాలుగు రోజులు జైలులో ఉంచాలని చూసినట్లుగా ఉంది. తొక్కిసలాట సంఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదా? ఈ విషయంలో ఏపీలో ఒక చట్టం, తెలంగాణాలో ఒక చట్టం అమలవుతోంది. గత గోదావరి పుష్కరాల్లో 29 మంది తొక్కిసలాటలో చనిపోతే ఆనాడు చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం కనబడలేదు. అప్పుడాయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇక రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి. -
అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు
-
కటకటాల్లో అల్లు అర్జున్.. రేవంత్ సాధించిందేమిటి?
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. సినిమా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అర్జున్ను అరెస్ట్ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి సాధించిందేమిటి? అన్నది మొట్టమొదటి ప్రశ్న. అలాగే.. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి? ఈ అంశంపై సినీ రంగం తగు రీతిలో స్పందించిందా? ఈ ఘటనకు ఏపీ రాజకీయాలకు ఉన్న సంబంధాలేమిటి? పుష్ప2 విజయంతో కొందరిలో ఏర్పడ్డ ఈర్ష్య అసూయలే ఈ అరెస్ట్కు కారణమా? అల్లూ అర్జున్ ఎదుగుదలను ఎవరు సహించలేకపోతున్నారు? ఇలా.. బోలెడన్ని ప్రశ్నలపై రెండు రాష్ట్రాల్లోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. డిసెంబరు నాలుగున జరిగిన తొక్కిసలాట, శుక్రవారం అర్జున్ అరెస్ట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన అంత అర్థవంతంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే సెలెబ్రిటీలు, సినీ నటులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు తొక్కిసలాటలు జరుగుతూంటాయి. అయితే ఇందుకు వారే కారణమవుతారా? అభిమాన నటుడిని చూసే ప్రయత్నంలో ఎగబడే ప్రజలది తప్పు అవుతుందా? గుంపును కట్టడి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయని థియేటర్ యాజమాన్యం బాధ్యత ఎంతవరకూ? సెలిబ్రిటీ రాక గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా సీరియస్గా తీసుకోని పోలీసుల తప్పేమీ ఉండదా? ఆ మాటకు వస్తే గతంలో పలు రాజకీయ సభలలో, మతపరమైన ఉత్సవాలలోనూ తొక్కిసలాటలు జరిగాయి. ఆయా సందర్భాలలో రాజకీయ నేతలను, మతపరమైన పెద్దలను అరెస్టు చేశారా? అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అర్జున్ను శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేసిన తదుపరి కోర్టు రిమాండ్లో చంచల్గూడ జైలుకు తీసుకువెళ్లారు. హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా అర్జున్ దాదాపు పన్నెండు గంటలసేపు చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం అరెస్టు చేస్తే, శని, ఆదివారాలు సెలవు దినాలు కనుక అర్జున్కు బెయిల్ రాదన్న కుట్రతో ఇది జరిగిందని చాలామంది సందేహిస్తున్నారు. అయితే అర్జున్ లాయర్లు వెంటనే స్పందించి హైకోర్టును ఆశ్రయించి తగు ఉత్తర్వులు పొందినా జైలు అధికారులు సాంకేతిక కారణాలతో విడుదల లేట్ చేసినట్లు ఈ పరిణామం క్రమంపై మీడియా విశేషంగా వార్తలు ఇచ్చింది. యథాప్రకారం టీడీపీ మీడియా తన రాజకీయ కుయుక్తులను ప్రదర్శించింది. అర్జున్ను జైలు నుంచి అప్పుడే విడుదల చేయడం ఏమిటి? అన్న బాధ వారిలో ఉన్నట్లు కవరేజిని బట్టి అర్థమవుతుంది. ఈ అంశానికంటే ముందు రేవంత్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల మీదే ఎక్కువగా అభ్యంతరాలు కనిపిస్తున్నాయి. సినిమా నటులు ఏమైనా సైనికులా?ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్దం చేసి వచ్చారా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. ‘‘సినిమా తీశారు..డబ్బులు సంపాదించుకుంటున్నారు’’ అని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. సంపాదన అన్నది ప్రతి వ్యక్తి చేసేదే. అలాగే కొంతమంది సినీ రంగంలోకి వెళతారు. వారిలో కొద్దిమందే సఫలం అవుతుంటారు. ఇదీ చదవండి: సినీ నటులు సైనికులా?ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవాటిలో సినిమా రంగం ముఖ్యమైంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించే ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పలువురు కృషి చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు వంటివారు సినీ పరిశ్రమ ఇక్కడ అభివృద్ది కావడానికి వీలుగా పలు రాయితీలు ఇచ్చారు. ప్రఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు, కృష్ణ తదితర ప్రముఖులు సినీ స్టూడియోలు ఏర్పాటు చేయడానికి, నివాసానికి అవసరమైన స్థలాలు కేటాయించారు. ఫిలింనగర్ పేరుతో ఇప్పుడు వెలుగొందుతున్న ప్రాంతం అంతా అప్పుడు ప్లాన్ చేసినదే. ఆనాటి ప్రభుత్వాలు సినిమాను వ్యాపారంగానే చూసి ఉంటే, హైదరాబాద్కు సినీ రంగ పరంగా ఇప్పుడు ఇంత ప్రాధాన్యత వచ్చేదా? ఇన్ని వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సంగతి రేవంత్ కు తెలియదా? 1985 ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్లడానికి సరైన దారే ఉండేది కాదు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కుని నాగేశ్వరరావు దానిని అభివృద్ధి చేశారు. సినీ రంగంలో తిరుగులేని స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ నాచారం వద్ద, అలాగే ముషీరాబాద్ లోను స్టూడియాలు ఏర్పాటు చేశారు. అమీర్ పేట వద్ద సారధి స్టూడియో ఏర్పాటైంది. ఆ తర్వాత పలు రికార్డింగ్ ధియేటర్లు వచ్చాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి టైమ్ లో ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డికి , మరి కొందరికి రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు బంజారాహిల్స్లో స్థలం ఇచ్చారు. అంతేకాదు. రామోజీఫిలిం సిటీకి కీలకమైన రహదారి కోసం అవసరమైన ఐదెకరాల స్థలాన్ని మరో పారిశ్రామిక వేత్త అయిన సంఘీ నుంచి కోట్ల ప్రభుత్వం వెనక్కి తీసుకుని మరీ ఇచ్చింది. కృష్ణ నగర్ ప్రాంతం జూనియర్ ఆర్టిస్టులకు కేంద్రంగా మారింది. ఖాజాగూడ వద్ద సినీ కార్మికులకోసం ప్రత్యేక కాలనీ చిత్రపురిని ఏర్పాటు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ఇవన్ని ఎందుకు చేశాయి? ఈ సంగతులు రేవంత్ రెడ్డికి తెలియవా? లేక ఆవేశంలో జరిగిన తప్పును సమర్థించుకోవడానికి సిని పరిశ్రమ వారిని ఉద్దేశించి డామేజింగ్ వ్యాఖ్యలు చేశారా? అన్న భావన కలుగుతుంది. ప్రముఖ నటుడు కృష్ణ ఆర్థిక కష్టాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వపరంగా సాయం చేశారు. అంతే కాదు. మంచి సినిమాలు తీసేవారి కోసం,ఉత్తమ నటీనటులకు ఉమ్మడి ఏపీలో నంది అవార్డులను ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రభుత్వమే ప్రఖ్యాత గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణలో అవార్డులు ఇవ్వడానికి సంకల్పించింది. సినీ నటులను వ్యాపారులుగా చూస్తున్నట్లయితే ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నట్లు? అలాగే జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తారు.జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అల్లు అర్జున్ పొంది తెలుగు వారికి ఒక ఘనత తెచ్చిపెట్టారు. సినీ పరిశ్రమ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధితో పాటు, ప్రభుత్వానికి కూడా గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. ఉదాహరణకు పుష్ప2 సినిమా ద్వారా సుమారు రూ.300 కోట్ల పన్ను వచ్చిందట. అందువల్ల సినిమా పరిశ్రమను, హీరోలను తక్కువ చేసి మాట్లాడడం రేవంత్కు తగదని చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అనుభవ రాహిత్యాన్ని సూచిస్తాయన్న విమర్శ ఉంది. సినీ పరిశ్రమకే కాదు..ఇతర రంగాలకూ ప్రభుత్వాలు భూములు ఉచితంగా లేదా, తక్కువ ధరకు కేటాయిస్తాయి. రాయితీలు ఇస్తాయి. రేవంత్ సైతం ఇలాంటి ప్రోత్సహకాలతోనే పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి డావోస్ వరకు వెళ్లి ప్రయత్నించారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున ఎన్.కన్వెన్షన్ ను ఆకస్మికంగా కూల్చిన తీరు, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి నష్టం చేశాయి. మెగాస్టార్ చిరంజీవిని ఇంకా కాంగ్రెస్ వ్యక్తిగానే రేవంత్ చెప్పడం చిత్రంగానే ఉంది. అలాగే అర్జున్ మామ చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాట నిజమే కావచ్చు. కానీ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అర్జున్ విషయంలో జాగ్రత్తగా ఎందుకు అడుగులు వేయలేదు. అర్జున్ తదితరులు థియేటర్ వద్దకు వస్తున్నారని సంధ్యా ధియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసినా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అర్జున్ వెళ్లారని చెప్పడం సీఎం స్థాయి వ్యక్తికి తగునా?హోం మంత్రి బాధ్యతలు కూడా రేవంత్ చేతిలోనే ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఈ అరెస్టు జరిగే అవకాశమే లేదు. పోలీసులు తమ తప్పు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్కు పూర్తి సమాచారం ఇవ్వలేదన్న భావన కలుగుతుంది. దీనివల్ల రేవంత్కే అప్రతిష్ట. శాఖమీద సరైన కంట్రోల్ లేదు అనిపిస్తుంది. రేవంత్ చర్యలు అభద్రతాభావంతో చేసినవని మాజీ మంత్రి కేటీఆర్, స్పెషల్షోలకు అనుమతిచ్చినందుకు రేవంత్నే అరెస్ట్ చేయాలని ఇంకో మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్ ప్రభుత్వం అర్జున్ను లక్ష్యంగా పెట్టుకని పనిచేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అర్జున్ అరెస్ట్ను తప్పుపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇందులో కుట్ర, అసూయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఏపీలో చంద్రబాబు తప్పిదాల వల్ల పుష్కరాలలో 29 మంది, కందుకూరు సభలో ఎనిమిది మంది, గుంటూరులో టీడీసీ సభలో చీరల పంపిణీ కారణంగా నలుగురు మరణించారని, అయినా ఆయనపై కేసులు పెట్టలేదని అన్నారు. తెలంగాణలో అర్జున్కు సంబంధం లేకపోయినా తొక్కిసలాటలో ఒకరు మరణించారన్న అభియోగంపై అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అర్జున్ అరెస్ట్ సమాచారం తెలిసిన వెంటనే చిరంజీవి, నాగబాబు తదితరులు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం సరైన పద్ధతిలో స్పందించ లేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికల సమయంలో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్ధి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లడమే అల్లు అర్జున్ చెసిన పెద్ద తప్పా? అని కొందరు ప్రశ్నించారు. ఈ కక్షతోనే టీడీపీ, జనసేన ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చన్నది పలువురి డౌటుగా ఉంది. ఇందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు కానీ టీడీపీ, జనసేనలు అర్జున్ అరెస్టును ఖండించకపోవడంతో అనుమానాలు వస్తాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రముఖులు కూడా ఒకరిద్దరు తప్ప ఈ ఘటనపై పెద్దగా స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. వారిలో ఎక్కువ మంది రేవంత్ చేసిన వ్యాఖ్యలు, అర్జున్ అరెస్టు తీరుపై అంత సంతృప్తిగా లేకపోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఈఫార్ములా రేసు నిధుల దుర్వినియోగం కేసు పెట్టడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడానికి ముందు, తమ ప్రభుత్వం ఎవరినైనా అరెస్టు చేస్తుందని చెప్పడానికి ఏమైనా ట్రయల్ వేశారా? అన్నది మరో పాయింట్గా చెబుతున్నారు. పోలీసులు అర్జున్ను ముందు విచారణకు పిలిచి, తొక్కిసలాట ఘటనలో ఆయన ప్రమేయం ఏ మేరకు ఉంది.అందుకు ఆధారాలు ఏమిటి అన్న అంశాలపై దర్యాప్తు చేసి ఉండాల్సింది.అలా చేయకుండా శుక్రవారం నాడు నేరుగా ఇంటికి వెళ్లి అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం లో కుట్ర కోణం ఉందన్నది చాలామంది భావన. పోలీసుల అరాచకాలపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము వెనుకబడి పోకూడదన్నట్లుగా తెలంగాణ పోలీసులు కూడా ఇలాంటి అనుచిత చర్యలకు దిగితే వారికే పరువు తక్కువ. అనేక మంది సినీ నటులు పలు కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. వస్త్రాల షాపుల ప్రారంభోత్సవాలకు హీరో, హీరోయిన్ లు హాజరవుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా సభలలో పాల్గొంటుంటారు. ప్రభుత్వాలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియని స్థితిలో ఇకపై వారు భయపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రముఖులు నాని, రామ్ గోపాల్ వర్మ వంటి కొద్ది మంది తప్ప మిగిలిన సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లు లేదు. చంద్రబాబుతో ఉన్న సంబంధాల రీత్యా, ప్రభుత్వంతో గొడవపడడం ఎందుకు అన్న భయంతో వారు మాట్లాడడం లేదని కొందరు అంటున్నారు. పుష్ప2 సినిమా రికార్డు స్థాయిలో సుమారు రూ.1,500 కోట్ల మేర వసూళ్లు చేయడంపై కొంతమంది సినిమా వారిలో ఈర్ష్యం ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మరో సంగతి చెబుతున్నారు. రేవంత్ స్వగ్రామంలో ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక లేఖ రాసి అందులో సీఎం సోదరులపై కొన్ని ఆరోపణలు చేశారు. దానిపై పోలీసులు కేసు పెట్టకుండా, ముందస్తు విచారణ చేసి, వారి తప్పు ఏమీ లేదని తేల్చేశారట. అదే రూల్ అల్లు అర్జున్కు వ్యర్తించదా అన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, మూసి గందరగోళంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బ తిన్నదని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సినీ పరిశ్రమపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న భావన వస్తే రేవంత్ కు అది మరింత నష్టం చేస్తుంది.విశేషం ఏమిటంటే పార్లమెంటులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం చేసిన రోజున రేవంత్ ప్రభుత్వం ఇక్కడ అర్జున్ అరెస్టుకు పూనుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ అంశానికే ప్రాధాన్యత వచ్చిందట. ఫలితంగా ప్రియాంక గాంధీ ఉపన్యాసం ఊసే ఎవరూ పట్టించుకోలేదట. దీనివల్ల కాంగ్రెస్ కు ఏమి లాభం వచ్చింది. రేవంత్ తనకు తానే స్టార్ అని అభివర్ణించుకోవడం తప్పు కాకపోవచ్చు. కాని జనం కూడా ఆయనను స్టార్ అనుకునేలా వ్యవహరించాలి. పాలన సాగించాలి. అలా చేస్తున్నానా? లేదా?అన్నది ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. -
మేనల్లుడిని చూసి కన్నీరు పెట్టుకున్న సురేఖ..
-
అల్లు అర్జున్ ను కలిసిన శ్రీకాంత్
-
తప్పు జరిగిపోయింది SORRY
-
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై దర్శకుడు సునీల్ కుమార్ రియాక్షన్
-
ఎవరిది వైఫల్యం.. ఎవరికి శిక్ష?
అధికారులకు నాలుగు ప్రశ్నలు..1. పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమా ల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్ల ను అరెస్ట్ చేస్తారా?2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవ రైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? 3. సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో ఎవరైనా చని పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా?4. భద్రతా ఏర్పాట్లను పోలీసులు, నిర్వాహ కులు తప్ప సినిమా హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు?– ఎక్స్లో దర్శకుడు రాంగోపాల్ వర్మఅల్లు అర్జున్ హార్డ్వర్క్తో ఎదిగిన స్టార్పబ్లిక్ ర్యాలీల్లో, పలు ఘట నల్లో తొక్కిసలాటలు జరిగి ఎందరో అమాయ కులు చనిపోయారు. వారి జాబి తా కోసం వెతుకుతున్నా. ఈ మధ్యకాలంలో ఓ యంగ్ యాక్టర్ తొక్కి సలాటలో అసౌకర్యానికి గురై, కార్డియాక్ అరె స్ట్తో చనిపోయారు. అల్లు అర్జున్ హార్డ్వర్క్ తో ఎదిగిన స్టార్.. వారస త్వంతో కాదు. – పూనమ్ కౌర్, నటి నమ్మలేకపోతున్నానుఇప్పుడు నేను చూస్తున్న పరిణామాలను నమ్మలేక పోతున్నాను (అల్లు అర్జున్ అరెస్ట్ని ఉద్దేశించి). జరి గిన ఘటన చాలా బాధాకరం.. దురదష్టకరం. అయితే అందుకు ఒక వ్యక్తిని నిందించడం మాత్రం చాలా బాధగా ఉంది. ఈ ప్రస్తుత పరిస్థితి చాలా బాధాకరం.. – రష్మిక మందన్నా, నటి ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదుప్రభుత్వ అధికారులు, మీ డియా వారు సినిమా పరి శ్రమకు సంబంధించిన వా ళ్లపై చూపించే ఉత్సాహం సాధారణ ప్రజల విషయంలోనూ చూపించాలని కోరుకుంటున్నాను. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చు కోవాలి. మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్య త్లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసు కోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించటం సరికాదు. – నాని, సినీ నటుడుఒక్కరినే నిందించటం సరికాదుజరిగిన ఘటన హృదయ విదారకం. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఒక నటుడు భద్రతాపరమైన చర్యలకు పూర్తి బాధ్యత వహించలేడు. ఈ ఘటనకు ఒక వ్యక్తినే బాధ్యుణ్ణి చేసి, నిందించడం సరికాదు. – వరుణ్ ధావన్, సినీ నటుడు అందరూ బాధ్యులేనేను అల్లు అర్జున్కు గొప్ప మద్దతుదారును. జరిగిన ఘటన దురదృష్టకరం. మనం హైప్రొఫైల్ వ్యక్తు లం. ఇలాంటి పరిణామాలకు బాధ్యులుగా మారకూడదు. ప్రజల ప్రాణాలు ఎంతో విలు వైనవి. ఇలాంటి ఘటనలకు అందరూ బాధ్యత వహించాలి. – కంగనా రనౌత్, సినీనటి, ఎంపీ -
అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్
రాజకీయ నాయకుల ర్యాలీలు, ప్రదర్శనల్లో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం. అలాంటి కేసుల్లో నేతలకే ఊరట లభిస్తున్నప్పుడు అల్లు అర్జున్ అరెస్టు సరికాదు. ఈ దేశ పౌరుడిగా ఎక్కడికైనా వెళ్లే హక్కుఆయనకు ఉంటుంది. – హైకోర్టు న్యాయమూర్తిసాక్షి, హైదరాబాద్: పుష్ప–2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో నిందితుడు, ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ (ఏ11)కు హైకోర్టు 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య చేయాలన్న ఉద్దేశం, పదునైన ఆయుధాలతో దాడి చేయడానికి సంబంధించిన సెక్షన్లు ఇక్కడ వర్తించవని స్పష్టం చేసింది. పోలీసులు అనుమతి ఇచి్చన తర్వాతే హీరో సినిమా చూసేందుకు వచ్చారని, ఆయన్ను రావొద్దని పోలీసులు చెప్పారనడానికి ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా మరణం చోటుచేసుకున్నా, గరిష్టంగా ఐదేళ్లు శిక్ష పడే నేరంలో బెయిల్కు ఆయన అర్హు డని పేర్కొంది. పలు తీర్పులను ప్రస్తావి స్తూ.. 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలర్కు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమరి్పంచాలని స్పష్టం చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, దర్యా ప్తు అధికారులకు అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్కు సూచించింది. తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా వేసింది. భద్రత కల్పించని పోలీసులదే బాధ్యత: అల్లు అర్జున్ తరఫు న్యాయవాది పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేయడంతో ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో లంచ్మోషన్ రూపంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పిటిషన్ వేశాం. అది ఇంకా ధర్మాసనం ముందుకు రాకముందే అరెస్టు చేశారు. క్వాష్ పిటిషన్ ద్వారా మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చాయి. తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయిన కేసులో నటుడు షారుక్ఖాన్కు గుజరాత్ హైకోర్టు ఊరటనిచి్చంది. అర్నబ్ గోస్వామి కేసులో బాంబే హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు దానిని సవరించింది. కిందికోర్టు రిమాండ్ విధించినా.. దాన్ని నిరాకరించే అధికారం హైకోర్టుకు ఉంటుంది (బండి సంజయ్ కేసును ప్రస్తావించారు).రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందారు. అందుకు ఆయన్ను బాధ్యున్ని చేయలేదు కదా. పుష్ప ప్రీమియర్ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. హీరో, హీరోయిన్ వస్తారంటూ పోలీసులకు థియేటర్ యాజమాన్యం సమాచారం ఇచి్చంది. అల్లు అర్జున్ మొదటి అంతస్తులో ఉండగా, గ్రౌండ్ఫ్లోర్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. దానికి ఆయన బాధ్యుడెలా అవుతారు? ఇది ఉద్దేశపూర్వంగా లేదా కావాలని చేసింది కాదు. దురదృష్టవశాత్తు మహిళ మృతి చెందింది. 118 (1) బీఎన్ఎస్తో పాటు సెక్షన్ 105 ఈ కేసులో వర్తించదు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ స్థాయిలో భద్రత కల్పించని పోలీసులే దీనికి బాధ్యత వహించాలి. తొక్కిసలాటను ఆపే ప్రయత్నం వారు చేయలేదు. పిటిషనర్ బెయిల్కు అర్హుడు. విడుదలకు ఆదేశాలు ఇవ్వాలి..’అని కోరారు. లంచ్మోషన్ అనుమతించవద్దు: పీపీ ప్రభుత్వం తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. ‘క్వాష్ పిటిషన్పై విచారణ అత్యవసరం కాదు. బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకోవాలి. కోరగానే లంచ్మోషన్ ఇవ్వడం తప్పుడు సంకేతం ఇస్తుంది. లంచ్మోషన్ మధ్యాహ్నం వేయడాన్ని అనుమతించకూడదు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్లో ఎక్కడా కోరలేదు. కనీసం పిటిషన్ చదువుకునే సమయం అయినా ఇవ్వకుండా వాదనలు వినిపించాలంటే ఎలా? విచారణ సోమవారానికి వాయిదా వేయాలి. థియేటర్కు వెళ్లొద్దని అల్లు అర్జున్కు పోలీసులు చెప్పారు. ఆయన్ను ఇప్పటికే రిమాండ్కు తరలించాం..’అని తెలిపారు. హీరో అయినంత మాత్రాన స్వేచ్ఛను కోల్పోవాలా? ‘లంచ్ మోషన్ విచారణకు అనుమతి ఇవ్వొద్దని తొలుత భావించా. సామాన్యులైతే ఇద్దామనుకున్నా. అయితే సినీ హీరో అయినంత మాత్రాన స్వేచ్ఛను కోల్పోవాలా? అనే సందేహం వచి్చంది. అతని హోదా కారణంగా స్వేచ్ఛను కోల్పోవడం సరికాదని అనిపించింది. అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఇదే హైకోర్టు పలువురికి బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్కు పంపిన తర్వాత బీజేపీ నేత బండి సంజయ్కి, అలాగే 489ఏ వ్యవహారంలో ఒక సామాన్యునికి ఊరట దక్కింది..’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే అంశంపై సంధ్యా థియేటర్ యాజమాన్యం, తదితరులు దాఖలు చేసిన మరో పిటిషన్లో అరెస్టయిన మరో ఇద్దరిని (ఏ–1, ఏ–2) కూడా విడుదల చేయాలంటూ ఉత్తర్వులిచ్చారు. ఇతర పిటిషనర్లపై అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. -
సినీ నటులు సైనికులా?
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఘాటుగా స్పందించారు. సినీ నటులు ఏమైనా ఇండియా–పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధం చేసి మన దేశాన్ని గెలిపించి వచ్చారా? అని అల్లు అర్జున్ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. సినిమా తీశారు.. డబ్బులు సంపాదించుకున్నారు.. హాయిగా ఇంటికి వెళ్లిపోయారు అని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్తే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సినిమా థియేటర్ వద్ద తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబం గురించి ఎవరూ ఎందుకు ప్రశ్నించటంలేదని నిలదీశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. శుక్రవారం ఎజెండా ఆజ్తక్ కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘అల్లు అర్జున్ ఒక సినిమా నటుడు మాత్రమే. సినిమాకు డబ్బులు పెట్టారు.. డబ్బులు వసూలు చేసుకున్నారు’అని సీఎం అన్నారు. ఆయన అరెస్టు విషయంలో తన ప్రమేయం లేదని స్పష్టంచేశారు. పుష్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ తన పేరును చెప్పకపోవటం వల్లనే అరెస్టు చేశారన్న విమర్శలను సీఎం తోసిపుచ్చారు. రాజ్యాంగ హక్కులు అందరికీ సమానమే.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం భారత పౌరులందరికీ సమాన హక్కులు ప్రసాదించిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘గతంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఎందుకు అరెస్ట్ అయ్యారు? దేశంలో సామాన్య ప్రజల నుంచి ప్రధానమంత్రి వరకు అందరికీ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుంది. పుష్ప–2 బెనిఫిట్ షోకు మేమే అనుమతి ఇచ్చాం. కానీ, తొక్కిసలాట జరిగిన థియేటర్ వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు చేయని కారణంగానే ఆ ఘటన జరిగింది. తొక్కిసలాటలో ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత కూడా కేసు పెట్టకపోతే సినిమా నటుడికి ఏమైనా కొత్త రాజ్యాంగాన్ని తయారుచేశారా అని మీరే ప్రశి్నస్తారు కదా? నేరం జరగడానికి కారణం ఎవరు అనేది మాత్రమే ప్రభుత్వం చూస్తుంది. సినిమా స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండదు’అని స్పష్టంచేశారు. అల్లు అర్జున్ హంగామా వల్లే ఘటన సినిమా థియేటర్ వద్ద అల్లు అర్జున్ హంగామా చేయటం వల్లనే తొక్కిసలాట జరిగిందని సీఎం అన్నారు. ‘అల్లు అర్జున్ కారులోంచి బయటికి వచ్చి చేతులూపి హడావిడి చేశారు. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. కంట్రోల్ కాలేదు. ఆయనను ఈ కేసులో ఏ1గా కాకుండా ఏ11 గా చేర్చారు. అక్కడ మహిళ ప్రాణం పోయింది.. అందుకు ఎవరు బాధ్యులు? ఆమె కొడుకు ఇంకా కోమాలోనే ఉన్నాడు. కోమా నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి పోయిన తల్లిని తెచ్చివ్వగలరా?’అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ‘అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను అతనికి తెలుసు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ మనిíÙ. ఆయనకు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి నాకు బంధువు. ఈయన కూడా కాంగ్రెస్ నేతనే’అని పేర్కొన్నారు. కాగా తన ఫేవరెట్ హీరో కృష్ణ అని తెలిపారు. ‘ఇప్పుడు నేనే ఒక స్టార్ను. నాకే ఫాన్స్ ఉంటారు’అని రేవంత్రెడ్డి చమత్కరించారు. రైతులను పట్టించుకోని బీజేపీ బీజేపీ ఎప్పుడూ దేశం కోసం, రైతుల కోసం పనిచేయలేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. వాళ్లు ఇచ్చే నినాదాలకు, క్షేత్రస్థాయిలో చేసే పనికి చాలా తేడా ఉందని అన్నారు. ఈ తేడాను ప్రజలకు సవివరంగా తెలియచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ సుమారు 750 మంది రైతులు చనిపోతే.. ప్రధాని మోదీ ఒక్కసారైనా వారి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారా? అని ప్రశ్నించారు. బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తే.. వారే ఆ పార్టీని ఓడిస్తారని పేర్కొన్నారు. 11 ఏళ్లలో నరేంద్ర మోదీ ఒక్కసారి కాదు, మూడు సార్లు దేశ ప్రజలను మోసం చేశారని సీఎం విమర్శించారు. రాహుల్, రేవంత్ ట్యాక్స్ (ఆర్ఆర్ ట్యాక్స్) అని ఆరోపణలు చేస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ.. అందుకు ఒక్క ఆధారమైన చూపాలని సవాల్ విసిరారు. వచ్చే సంవత్సరం వైబ్రంట్ గుజరాత్కు కార్యక్రమానికి పోటీగా తెలంగాణ రైజింగ్ నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తామని ప్రకటించారు. అదానీ విషయంలో రాహుల్గాంధీ బాటలోనే తానూ ఉన్నానని తెలిపారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది (బాక్స్) సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ విషయంలో తన జోక్యమేదీ ఉండదని స్పష్టంచేశారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో నా ప్రమేయం కానీ, జోక్యం కానీ ఏముంటుంది? అంతా చట్టానికి లోబడే ఉంటుంది’అని అన్నారు. మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్బాబు దాడి చేసిన ఘటనలో కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు నడుచుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. తాను ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ కేబినెట్ విస్తరణ అంటూ కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
అల్లు అర్జున్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ను శుక్రవారం అరెస్టు చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్స్టేషన్కు తరలింపు, గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, చంచల్గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.అదే సమయంలో అల్లు అర్జున్ను తరలించిన ప్రతిచోటా భారీగా పోటెత్తిన అభిమానులు, ప్రముఖుల రాకతో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. చివరికి అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఆయనను శనివారం ఉదయం విడుదల చేయనున్నట్టు జైలు సూపరింటెండెంట్ ప్రకటించారు. బెడ్రూమ్ వరకు వెళ్లి అరెస్టు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. శుక్రవారం అల్లు అర్జున్ను అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఉదయం నుంచీ తగిన ఏర్పాట్లు చేసుకున్న టాస్్కఫోర్స్, చిక్కడపల్లి పోలీసులు 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో అర్జున్ తండ్రి అల్లు అరవింద్, భార్య స్నేహరెడ్డి ఇంట్లోనే ఉన్నారు. వారిద్దరూ బయటికి వెళ్లేవరకు సమీపంలోనే వేచి ఉన్న పోలీసులు.. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించారు.ఆ సమయంలో అల్లు అర్జున్ షార్ట్స్, టీ–షర్ట్ ధరించి.. ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నారు. ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. సంధ్య థియేటర్ కేసులో అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ‘సరే మీ పని మీరు చేసుకోండి’ అంటూ పోలీసులకు సహకరించిన అల్లు అర్జున్.. బట్టలు మార్చుకోవడం కోసం రెండు నిమిషాలు సమయం కోరారు. దీనికి అనుమతించిన పోలీసులు.. ఆయన వెంటే బెడ్రూమ్ వరకు వెళ్లారు. ఈలోపు విషయం తెలుసుకున్న అరవింద్, స్నేహరెడ్డి, అర్జున్ సోదరుడు శిరీష్ ఇంటికి చేరుకున్నారు. అరెస్టు చేసినా ఫర్వాలేదు.. కాఫీ తాగండి! పోలీసులు అల్లు అర్జున్ను ఆయన ఇంటి మొదటి అంతస్తులో ఉన్న బెడ్రూమ్ నుంచి కింద ఉన్న హాల్లోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడున్న తండ్రి అల్లు అరవింద్ కాసింత ఆందోళన చెందారు. అర్జున్ను హత్తుకుని ‘అరెస్టు చేస్తున్నారు.. చెయ్యనీ.. నువ్వేమీ కంగారు పడకు’ అంటూ ధైర్యం చెప్పారు. తర్వాత అల్లు అర్జున్, పోలీసులు ఇంటి బయట పోరి్టకో వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ పోలీసు వాహనాలను సిద్ధం చేశారు. అల్లు అర్జున్ కాఫీ తాగడానికి ఆగారు. ఇంట్లో నుంచి తెచ్చిన కాఫీని తన సమీపంలో ఉన్న ఓ పోలీసు అధికారికి ఇవ్వబోయారు. అధికారి కాఫీ వద్దని చెప్పడంతో ‘అది అదే (అరెస్టు చేసుకోండి).. ఇది ఇదే (కాఫీ తాగండి)’ అని నవ్వుతూ పేర్కొన్నారు. కాఫీ తాగడం పూర్తయ్యాక పోలీసులను ఉద్దేశించి ‘రెడీ సార్.. కాఫీ అయిపోయింది’ అంటూ ముందుకు నడిచారు. బెడ్రూం వరకు రావడం సరికాదు.. ఇంటి ముందు పోలీసు వాహనం ఎక్కే సమయంలో అల్లు అర్జున్ పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘బట్టలు మార్చుకోవడానికి వెళ్లి వస్తానని, ఒకరిని పంపాలని కోరితే ఇంత మంది పోలీసుల బెడ్రూమ్ వరకు వచ్చారు. నన్ను అరెస్టు చేయడంలో తప్పులేదు, తీసుకువెళ్లడం తప్పులేదు. కానీ రెండు నిమిషాలు టైమ్ ఇవ్వాలని కోరితే బెడ్రూమ్ వరకు వచ్చి ఇలా చేశారు. ఇది సరికాదు..’’ అని పేర్కొన్నారు. తర్వాత తన భార్యకు వీడ్కోలు చెప్పారు. అయితే అల్లు అర్జున్ పోలీసు వాహనం ఎక్కుతుండగా.. తానూ అదే వాహనంలో వస్తానంటూ అల్లు అరవింద్ బయలుదేరారు.అయితే తన తండ్రి పోలీసు వాహనంలో రాకూడదని భావించిన అర్జున్.. ‘మీరు పోలీసు వాహనంలో ఉంటే మీడియాలో అలానే వస్తుంది. ఏ క్రెడిట్ వచ్చినా నా మీదనే ఉండాలి. గుడ్ అయినా, బ్యాడ్ అయినా..’’ అని ఆపేశారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్ను తీసుకుని చిక్కడపల్లి ఠాణాకు బయలుదేరారు. అప్పటికే ఆ ప్రాంతమంతా అల్లు అర్జున్ అభిమానులతో నిండిపోయింది. ఠాణాలో గంటన్నర పాటు విచారణ.. పోలీసులు అల్లు అర్జున్ను చిక్కడపల్లి ఠాణాలో దాదాపు గంటన్నర పాటు విచారించారు. ఠాణా వద్దకు అల్లు శిరీష్, అల్లు అరవింద్, అర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి, దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పోలీసులు అల్లు అర్జున్తోపాటు శుక్రవారం ఉదయమే అదుపులోకి తీసుకున్న సంధ్య థియేటర్ పర్సనల్ మేనేజర్ జేబీ సంతోష్కుమార్ల అరెస్టు ప్రక్రియను పూర్తి చేసి, రిమాండ్ రిపోర్టులు తయారు చేశారు. ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నేరుగా సూపరింటెండెంట్ రాజకుమారి చాంబర్కు తీసుకెళ్లి.. అప్పటికే సిద్ధంగా ఉంచి పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించారు.అనంతరం వారిని నాంపల్లి కోర్టుకు తరలించారు. గాంధీ ఆస్పత్రికి వచ్చిన అల్లు అరవింద్ వైద్య పరీక్షల సమయంలో కుమారుడి వెంటే ఉన్నారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. గాంధీ ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతాలు సైతం అభిమానులతో నిండిపోయాయి. ఆస్పత్రి సిబ్బంది అభ్యర్థన మేరకు వారితో అల్లు అర్జున్ ఫొటోలు దిగారు. మరోవైపు సినీ నటుడు చిరంజీవి, ఆయన భార్య సురేఖ, నాగబాబుతోపాటు పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు అల్లు అర్జున్, సంతోష్లను చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు గంటన్నరకుపైగా ఇరుపక్షాల న్యాయవాదుల వాదోపవాదాలు జరిగాయి. చివరికి అల్లు అర్జున్, సంతో‹Ùలకు 14 రోజుల జ్యుడిíÙయల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు ఇరువురినీ చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. దీంతో అల్లు అర్జున్ నాలుగు గంటలకుపైగా జైలు రిసెప్షన్లోనే వేచిచూశారు. చివరికి హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చంచల్గూడ జైలు నుంచి విడుదల అవుతారని భావించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. రిమాండ్ ఖైదీ నంబర్ 7697తో.. అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఆయన శుక్రవారం రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా.. దానికి సంబంధించిన కాపీ రాత్రి వరకు కూడా ఆన్లైన్లో అప్లోడ్ కాలేదు. అల్లు అర్జున్ న్యాయవాదులు సరి్టఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చినా.. ఒరిజినల్ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు అంగీకరించలేదు. రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్ను జైలు రిసెప్షన్లోనే ఉంచిన సిబ్బంది.. ఆపై మంజీరా బ్యారక్లోని క్లాస్–1 రూమ్కు తరలించారు. రిమాండ్ ఖైదీగా నంబర్ 7697ను కేటాయించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్గూడ జైలు వద్దే ఉన్నారు. బెయిల్ కాపీ అందితే తన కుమారుడిని వెంట తీసుకువెళ్లాలని భావించారు. కానీ బాధగా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయారు. ఇక తమ అభిమాన హీరోకు బెయిల్ వచ్చినా విడుదల చేయకపోవడంపై అర్జున్ అభిమానులు జైలు వద్ద నిరసన తెలిపారు. క్షణక్షణం హైడ్రామా.. ఉత్కంఠ మధ్య.. ఉదయం 11.45: అల్లు అర్జున్ ఇంట్లోకి పోలీసులు మధ్యాహ్నం 12: అరెస్టు చేస్తున్నట్టు అల్లు అర్జున్కు చెప్పిన పోలీసులు 12.20: జూబ్లీహిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లికి తరలింపు 12.40: చిక్కడపల్లి ఠాణా వద్దకు వచ్చిన దిల్ రాజు, ఇతర ప్రముఖులు 1.00: చిక్కపడపల్లి ఠాణాకు అల్లు అర్జున్తో చేరుకున్న పోలీసులు 1.10: పోలీసుస్టేషన్ వద్దకు అల్లు శిరీష్, అరవింద్ 1.15: రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసిన దర్యాప్తు అధికారి 2.00: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు 2.19: అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు ప్రారంభించిన వైద్యులు 2.30: అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, ఆయన భార్య సురేఖ 2.45: అల్లు అర్జున్కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి 3.10: నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్.. లాయర్ల వాదనలు 5.00: అల్లు అర్జున్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధింపు 5.28: చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలింపు 5.40: అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు 7.15: బెయిల్ పేపర్లతో చంచల్గూడ జైలుకు చేరుకున్న లాయర్లు 7.30: ఆ పత్రాలు సక్రమంగా లేకపోవడం, ఆర్డర్ ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో జైల్లోనే బన్ని 10.00: జైలు రిసెప్షన్ నుంచి మంజీరా బ్యారక్కు అల్లు అర్జున్ -
Botsa Satyanarayana: చంద్రబాబుకు చట్టం వర్తించదా..?
-
Revanth Reddy: తెలుసుకొని మాట్లాడతా!
-
పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశం
-
అల్లు అర్జున్కు బిగ్ రిలీఫ్
-
అల్లు అర్జున్ అరెస్ట్ పై మార్గాని భరత్ రియాక్షన్
-
అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్
-
ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు: అల్లు అర్జున్ తరపు లాయర్
-
అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. కేసులు బనాయించి మరీ అతడ్ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సమ్మతం కాదని తీవ్రంగా ఖండించారాయన.హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనన్న వైఎస్ జగన్.. ఆ సమయంలో అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి.. ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. అయితే ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్ను బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? అని వైఎస్జగన్ ప్రశ్నించారు. తన ప్రమేయం లేకున్నా నేరుగా ఆయన్ని అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదని.. అరెస్టును ఖండించారు.హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్