bureaucrats
-
అసలు ఇంతకీ తప్పు ఎవరిది?
ఐఏఎస్, ఐపీఎస్, అఖిలభారత సర్వీసు అధికారుల తీరుతెన్నులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. అధికారులు తమతో తప్పులు చేయించరాదని, నిస్పక్షపాతంగా ఉండాలని రేవంత్ రెడ్డి అనడం ఆహ్వానించదగ్గ పరిణామం. యాదృచ్ఛికమైన అంశం ఇంకోటి ఉందిక్కడ. రేవంత్రెడ్డికి రాజకీయ గురువుగా భావించే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఈ విషయంలో పూర్తి వ్యతిరేకం!. రెడ్బుక్ పేరుతో ఇప్పటికే ఏపీలో అరాచకం సృష్టిస్తున్న ఆయన తమది రాజకీయ పాలనేనని మొహమాటం లేకుండా పచ్చిగా... బహిరంగంగానే మాట్లాడుతుంటారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రాసిన పుస్తకావిష్కరణ సభలో రేవంత్ అఖిలభారత సర్వీసు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఒక తప్పు చేయాలంటే.. అధికారులు మూడు తప్పులు చేద్దామంటున్నారని వ్యాఖ్యానించారు. తద్వారా రాజకీయ నేతలు అధికారులతో తప్పులు చేయిస్తున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ పాయింట్ ఆధారంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు విమర్శలు చేశారు. విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్లు నేతల కారణంగా అధికారులు తప్పులు చేస్తున్నారా? లేక అధికారులు నేతలతో తప్పులు చేయిస్తున్నారా? చర్చనీయాంశం. నిజానికి ఇది రెండువైపుల నుంచి జరుగుతున్న తప్పే. రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చేంత వరకూ ఒకలా.. ఆ తరువాత అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకోలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో గెలుపునకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. అధికారం దక్కితే పెట్టిన ఖర్చును ఎలాగోలా చక్రవడ్డీలతో రాబట్టుకోవాలని నేతలు యత్నిస్తూంటారు. ఈ క్రమంలో అధికారులు తమ మాట వినేలా చేసుకునేందుకు నేతలు అన్ని పన్నాగాలు పన్నుతూంటారు. చెప్పినట్లు వినని అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకూ వెనుకాడరు. ఇదిలా ఉంటే ఇంకోవైపు కొందరు అధికారులు ముఖ్యమంత్రిని తెగ పొగుడుతూంటే.. కొందరు మంత్రులతో గిల్లికజ్జాలకు దిగుతుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి ఎవరైనా సమర్థులైన అధికారులను విసృ్తత ప్రజా ప్రయోజనాల కోసం వాడుకోగలుగుతున్నారా? అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. రాజకీయ నేతల్లో మాదిరిగానే అధికార యంత్రాంగంలోనూ రాజకీయాలు, వర్గాలు ఉన్నాయన్నది నిజం. ఉత్తరాది, దక్షిణాది, కులం, ఒకే రాష్ట్రంలోని ప్రాంతం వంటి అంశాల ఆధారంగా అధికారులు ఒకరినొకరు విభేదించుకున్న సందర్భాలు బోలెడు. అఖిలభారత సర్వీసు అధికారులంటే పదవుల్లో ఉన్నవారు చాలా గౌరవం ఇచ్చేవారు. అధికారులు కూడా ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో వచ్చిన వారే ఎక్కువగా ఉండేవారు. కాని రాను, రాను నేతల్లో, అధికారుల్లోనూ మార్పు వచ్చింది. జనాన్ని నేతలు కరప్ట్ చేస్తున్నారా? లేక జనమే నేతలు కరప్ట్ అయ్యేలా చేస్తున్నారా? అంటే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు అధికారులతోపాటు న్యాయ వ్యవస్థలోనూ సమాజంలోని అన్ని అవలక్షణాలు వచ్చి చేరుతూందన్న బాధ చాలామందిలో ఉంది. అది వేరే విషయం. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు నిబంధనల ప్రకారమే నిర్ణయాలు చేయాలని చెప్పేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రజల ఆకాంక్షలలో మార్పులు రావడం వల్ల ,వారిలో స్వార్ధచింతన పెరగడం వల్ల నిబంధనలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యంకాదు.. అవసరమైతే వాటిని మార్చండి.. మేము చెప్పే పనులు చేయండి అని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో అధికారుల్లోనూ మార్పులు వచ్చాయి. పలువురు అధికారులు తమ సంగతేమిటి? అనే ఆలోచనకు వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో కొందరు ముఖ్యమంత్రుల అనుభవాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే సీనియర్ అధికారుల సంఖ్య పరిమితంగా ఉండేది. కానీ రాను, రాను సీఎం ఆఫీసులోనే అధికారం కేంద్రీకృతమవుతోంది. దాంతో తమకు కావల్సిన అధికారులనే వీరు నియమించుకుంటున్నారు. ఎస్వీ ప్రసాద్ వంటి అధికారులు కొద్ది మంది మాత్రం పార్టీ, ముఖ్యమంత్రి ఎవరన్న దానితో సంబంధం లేకుండా పలువురు సీఎంల వద్ద కీలకమైన బాధ్యతలలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మారితే ఆయన పేషీలోని అధికారులు, సీఎస్ పోస్టులో ఉన్నవారు సైతం తిరిగి పోస్టు కోసం ఇబ్బంది పడవలసి వస్తోంది. ఆ విషయంలో రేవంత్ ప్రభుత్వం కొంత బెటర్ అని చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సీఎస్ శాంతికుమారినే కొనసాగించారు. కానీ.. ఏపీలో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జగన్ వద్ద పనిచేసిన అధికారులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టింది. సీఎస్ జవహర్ రెడ్డి వంటి సీనియర్ అధికారుల పట్ల కూడా అవమానకర తీరులో వ్యవహరించింది. అంతెందుకు! రేవంత్ ఐసీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించారన్న ఆరోపణ ఒక్కటి లేదు. కానీ చంద్రబాబు గత హయాంలో జరిగిన స్కామ్లపై విచారించారన్న కారణంగా కొందరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లను ఇలా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని కులపరంగా కూడా చీల్చే యత్నం కనిపించదు. ఏపీలో మాత్రం కులం ఆధారంగా పోస్టింగ్లు, పార్టీ ఆధారంగా నియామకాలు జరుగుతున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకరు ఒక కుల సమావేశంలో పాల్గొని గత ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి ఆ కులం వారంతా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. అలాంటి అధికారికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లు పెద్ద పీట వేసి ఒక పెద్ద పదవి కూడా ఇచ్చేశారు. దీనిని బట్టే ఆ ప్రభుత్వ వ్యవహార శైలి అర్థమవుతుంది. ఆ అధికారి తన సర్వీసులో ఏ రకంగా వ్యవహరించింది చెప్పకనే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ల ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటే ఐపీఎస్ అధికారులు వారికి మద్దతు ఇస్తున్నారు. కేసులు పెట్డడంలోనూ వివక్ష చూపుతున్నారు. చివరికి కొందరు ఐపీఎస్లే ముందస్తు బెయిల్ తెచ్చుకోవలసి వచ్చింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ గొడవ తక్కువ. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులకు స్వేచ్చ ఉండేది. వారు తమ అభిప్రాయాలు చెబితే వాటిని విని అవసరమైతే నిర్ణయాలలో మార్పు చేసుకునే వారు. ఒకవేళ అధికారులతో విభేధిస్తే, ‘‘మీరు మీ అభిప్రాయాలు రాయండి.. దానిపై నా అభిప్రాయం నేను రాస్తాను..’’ అని చెప్పేవారట. తద్వారా అధికారులకు ఇబ్బంది లేకుండా చూసేవారని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్ కుమారుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించే ప్రక్రియలో భాగంగా కొంతమంది ఐఎఎస్ అధికారులను కూడా ఇరికించారు. ఉదాహరణకు బీపీ ఆచార్య అనే ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ది చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ కేసులో ఇరికించి జైలులో పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆయనపై కేసును కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల విషయంలో అధికార యంత్రాంగం తలొగ్గక తప్పలేదని అంటారు. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు పై ఏర్పడిన విచారణ కమిషన్ ను ఎదుర్కోవలసి వస్తోంది.ఇదే టైమ్లో ఇంకో సంగతి చెప్పాలి. కొంతమంది అధికారులు తమ తరపున ఏజెంట్లను పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడుతుంటారన్న ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లడం లేదని రేవంత్ అంటున్నారు. అది రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే నిధుల వినియోగంలో ఉండే ప్రాధాన్యత క్రమాలు కూడా ముఖ్యం అని భావించాలి. డబ్బులు లేకుండా జనంలోకి వెళ్ళినా వారితో తిట్లు తినడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. ఉదాహరణకు.. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేసే బాధ్యత అధికారులు ఏ రకంగా తీసుకోగలుగుతారు?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య అధికారులు ఇన్నోవేటివ్ ఆలోచనలు చేయాలని పదే,పదే చెబుతున్నారు. ఆ ఇన్నోవేటివ్ పద్దతి ఏమిటో చెప్పకుండా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అని కొందరు వ్యాఖ్యానించారు.పైగా చంద్రబాబు ఈ మధ్య ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. గంటల తరబడి సమీక్షలు పెట్టడం వల్ల అధికారులకు విసుగు వస్తోందని ఆయన అనుకూల మీడియానే పేర్కొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగన్ టైంలో స్పందన కార్యక్రమం పెట్టి అనేక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రయత్నించారు. అలాగే వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్.. ఇలాంటి కొత్త వ్యవస్థలు తీసుకు వస్తే వాటిని విధ్వంసం చేసే పనిలో చంద్రబాబు సర్కార్ ఉంది. మరి ఆ వ్యవస్థలను తీసుకురావడం కోసం పనిచేసిన అధికారులది తప్పవుతుందా? లేక ఇప్పుడు విధ్వంసంలో భాగస్వాములవుతున్న అధికారులది తప్పు అవుతుందా?. ఏది ఏమైనా నిబద్దత కలిగిన అధికారులకు ప్రోత్సాహం ఉంటుందని రేవంత్ చెప్పడం బాగానే ఉంది. కాని ముందుగా రాజకీయ నేతలలో ఆ నిబద్దత ఉంటే ఆటోమేటిక్ గా అధికార యంత్రాంగం కూడా చాలా వరకు సర్దుకుంటుందని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కార్పొరేట్ కంపెనీల్లో మాజీ బ్యూరోక్రాట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ వర్గాల్లో పరపతి పెంచుకునే దిశగా కార్పొరేట్ కంపెనీలు మాజీ బ్యూరోక్రాట్లపై దృష్టి పెడుతున్నాయి. వ్యూహాత్మకంగా వారిని తమ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించుకుంటున్నాయి. తాజాగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) మాజీ రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ను స్వతంత్ర డైరెక్టరుగా నియమించుకుంది. తద్వారా గత ఆరు నెలల వ్యవధిలో ఇలా ఒక మాజీ బ్యూరోక్రాట్ను నియమించుకున్న నిఫ్టీ 50 కంపెనీల్లో రెండోదిగాను, ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో మూడోదిగాను నిలి్చంది. నిఫ్టీ కంపెనీ అయిన లార్సన్ అండ్ టూబ్రో అక్టోబర్లో ఇలా ఒకరిని తీసుకోగా, హెచ్యూఎల్ పోటీ సంస్థలైన డాబర్, కోల్గేట్–పామోలివ్ కూడా అదే బాటలో నడిచాయి. హెచ్యూఎల్లో ఇప్పటికే మాజీ బ్యూరోక్రాట్ అయిన సంజీవ్ మిశ్రా, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఓపీ భట్ స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. మాజీ బ్యూరోక్రాట్లకు ప్రభుత్వ వర్గాలతో ఉండే సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని తమ పనులు జరిపించుకునే ఉద్దేశంతో కంపెనీలు ఇలా వారిని నియమించుకుంటూ ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని లిస్టెడ్ కంపెనీల్లో 6 శాతం.. తగినంత స్థాయిలో స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకోనందుకు గాను ప్రభుత్వ రంగ కంపెనీలకు ఒకవైపు అక్షింతలు పడుతుండగా.. మరోవైపు ప్రైవేట్ కంపెనీలు మాత్రం రిటైరైన బ్యూరోక్రాట్లను జోరుగా నియమించుకుంటున్నాయి. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అన్ని లిస్టెడ్ కంపెనీల్లోని స్వతంత్ర డైరెక్టర్లలో మాజీ బ్యూరోక్రాట్ల వాటా 6 శాతంగా ఉంది. అదే మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా టాప్ 200 కంపెనీలను మాత్రమే తీసుకుంటే ఇది మరింత అధికంగా 13 శాతంగా ఉంది. నిఫ్టీ 50లో 26 పైచిలుకు సంస్థలు రిటైరైన బ్యూరోక్రాట్లను నియమించుకున్నాయి. ఐటీసీ, మారుతీ సుజుకీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో, హెచ్యూఎల్ మొదలైన సంస్థల్లో అత్యధిక సంఖ్యలో మాజీ బ్యూరోక్రాట్లు స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. వ్యక్తులవారీగా చూస్తే ఏఎన్ రాయ్ 7 సంస్థల్లో స్వతంత్ర డైరెక్టరుగా ఉండగా అమిత్ కిరణ్ దేవ్ (6 సంస్థల్లో), దీపా గోపాలన్ వాధ్వా.. దినేష్ కుమార్ మిట్టల్.. యూకే సిన్హా ..సుమిత్ బోస్ .. వీరయ్య చౌదరి కొసరాజు తలో అయిదు సంస్థల్లో, సుధా పిళ్లయ్ .. మీరా శంకర్ .. నిరుపమా రావు తలో 4 సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక, అత్యధికంగా మాజీ బ్యూరోక్రాట్లు ఉన్న ప్రభుత్వ రంగయేతర సంస్థలను చూస్తే డాబర్ ఇండియాలో ఆరుగురు ఉన్నారు. ఐటీసీ, భారత్ రోడ్ నెట్వర్క్, అపోలో టైర్స్, సీసీఎల్ ప్రోడక్ట్స్ (ఇండియా)లో నలుగురు చొప్పున .. సెంచరీ ప్లైబోర్డ్స్ (ఐ), వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, లార్సన్ అండ్ టూబ్రో, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్లో ముగ్గురు చొప్పున ఉన్నారు. -
12 మంది ఐఏఎస్, ఐపీఎస్ ల కేటాయింపులపై నేడు హైకోర్టులో విచారణ
-
ముగిసిన మ్యాచ్కు కొత్తగా రూల్స్ ఏంటో?
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీల నియంత్రణపై అక్కడి ప్రభుత్వానికే సర్వాధికారం ఉందంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం సమీక్షకు వెళ్లింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఇవాళ ఓ పిటిషన్ దాఖలు చేసింది. అదే సమయంలో ఢిల్లీ వ్యవహారాలు తన అదుపులో ఉండేలా కేంద్రం తాజాగా పాస్ చేసిన ఓ ఆర్డినెన్స్ను సవాల్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేంద్రం శుక్రవారం ఓ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాని ప్రకారం.. బ్యూరోక్రాట్ల నియామకం, ట్రాన్స్ఫర్లకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేందుకు నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో కేంద్రం తరపున చివరి మధ్యవర్తిగా లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించింది. అంతేకాదు.. అథారిటీ చైర్పర్సన్ హోదాలో ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని, అలాగే హోం శాఖ ప్రధాన కార్యదర్శిని ఈ అథారిటీలో స్థానం కల్పించింది. అథారిటీలో మెజార్టీ ఓటింగ్ల ఆధారంగా అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఓటింగ్లో ఏదైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయితే.. అప్పుడు లెఫ్టినెంట్గవర్నర్ నిర్ణయాన్ని తుది నిర్ణయంగా తీసుకుంటారు. అయితే.. పోస్టింగులు, ట్రాన్స్ఫర్లపై ఎల్జీకే తుది అధికారం కట్టబెడుతూ కేంద్రం దొడ్డిదారిన తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కోర్టు ఇచ్చిన అధికారాన్ని సైతం లాక్కునేందుకు కేంద్రం సిద్ధపడిందని ఆరోపిస్తోంది. సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చేసింది. ఆట ముగిశాక.. రూల్స్ మార్చేసినట్లుంది ఇప్పుడు కేంద్రం తీరు.. అని ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. అలాగే ఆ ఆర్డినెన్స్ ఇంకా పార్లమెంట్లో పాస్ కాలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారాయన. ఈ ఆర్డినెన్స్ పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ కావాల్సి ఉంది. కానీ, రాజ్యసభలో బీజేపీకి సరిపడా సంఖ్యా బలం లేదు. దీంతో ప్రతిపక్షాలు ఈ ఆర్డినెన్స్ను అడ్డుకునే యత్నం చేయొచ్చు. కేంద్ర వర్గాలు మాత్రం.. రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో తలెత్తిన వైరుధ్యాన్ని తొలగించేందుకే ఈ ఆర్డినెన్స్ను ఆమోదించినట్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. మే 11వ తేదీన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీల విషయంలో సర్వాధికారాలు ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటుందని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ప్రభుత్వానికి భూకేటాయింపులను మాత్రం మినహాయించి.. మిగతా అన్నింట్లో అధికారం ఢిల్లీ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది కోర్టు. -
ఆప్ గుర్తింపు రద్దు చేయండి: ఈసీకి బ్యూరోక్రట్ల లేఖ
ఢిల్లీ: ఒకవైపు గుజరాత్లోనూ పాగా వేయాలని.. ఎన్నికల ముందస్తు ప్రచారంలో పాల్గొంటున్నారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈక్రమంలో ‘ఉచిత’ హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అయితే అధికార రాష్ట్రంలోనే కేజ్రీవాల్కు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ 57 మంది బ్యూరోక్రట్స్, డిప్లోమాట్స్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రాబోయే ఎన్నికల కోసం ఆప్ వాడుకోవాలని చూస్తోందని లేఖలో వాళ్లు ఆరోపించారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్.. పోలీస్ సిబ్బంది, హోం గార్డులు, అంగన్వాడీ వర్కర్స్, ప్రజారవాణ వ్యవస్థలోని డ్రైవర్లను, ఆఖరికి పోలింగ్ బూత్ ఆఫీసర్లను కూడా వచ్చే ఎన్నికల్లో ఆప్ కోసం పని చేయాలని పిలుపు ఇచ్చారు. కానీ, ఇలా ప్రజా సేవకులను.. ఒక పార్టీ, అదీ అధికారంలో ఉన్న పార్టీ తమ ఎన్నికల స్వార్థం కోసం వాడుకోవడం సరైంది కాదు. ఇది ప్రజా ప్రతినిధుల చట్టం 1951 నిబంధనలను ఉల్లంఘించేలా ఉంది. అంతేకాదు.. 1968 ఎన్నికల సింబల్స్ ఆర్డర్లోని 16ఏ ఉల్లంఘిస్తుంది. కాబట్టి, లేఖను పరిగణనలోకి తీసుకుని ఆప్ గుర్తింపు రద్దు చేయాలని లేఖలో బ్యూరోక్రట్లు కోరారు. ప్రభుత్వ ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ.. స్వలాభం కోసం ఆప్, వాళ్లను వాడుకోవాలని చూస్తోందని లేఖలో ఆరోపించారు వాళ్లు. అంతేకాదు.. ఆప్ కోసం పని చేస్తే ట్రాన్స్ఫర్లతో పాటు ఉచిత విద్యుత్, కొత్త స్కూల్స్.. ఉచిత విద్య హామీలను ఇచ్చి ప్రలోభపెట్టే యత్నం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు వాళ్లు. ఈ లేఖపై ఈసీ స్పందన తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా? -
సీబీఐ దాడుల ఎఫెక్ట్?.. భారీగా ఐఏఎస్ల బదిలీలు
ఢిల్లీ: ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఇతరులపై సీబీఐ దాడుల నేపథ్యంలో.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఆరోపణలపై.. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంపై శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించింది. సిసోడియాతో పాటు మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, మద్యం వ్యాపారులు తదితరుల నివాసాల్లో.. మొత్తం దేశవ్యాప్తంగా 31 చోట్ల సోదాలు చేసింది. సుమారు 14 గంటల తనిఖీల తర్వాత మనీశ్ సిసోడియా ఫోన్, కంప్యూటర్లను సీబీఐ సీజ్ చేసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జంకే ప్రసక్తే లేదని, ఉచిత విద్య-ఆరోగ్యం అందించి తీరతామంటూ ప్రకటన చేశారు. మరోవైపు ఆప్ జాతీయ కన్వీనర్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇది బీజేపీ ప్రతీకార రాజకీయమంటూ మండిపడ్డారు. దర్యాప్తు ఏజెన్సీలతో ప్రతీకార దాడులకు పాల్పడుతోందంటూ విమర్శించారు. క్లిక్: సిసోడియాపై దాడులు, కేసు ఏంటంటే.. ఇదిలా ఉంటే.. ఒకవైపు సీబీఐ తనిఖీలు కొనసాగుతున్న వేళ మరోవైపు ఎల్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీగా ఐఏఎస్లను బదలీలు చేశారు. బదిలీ అయిన వాళ్లలో ఆరోగ్య-కుటుంబ సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి ఉదిత్ ప్రకాశ్ రాయ్ సైతం ఉండడం గమనార్హం. ఆయన్ని పరిపాలన సంస్కరణల విభాగానికి బదిలీ చేసింది ఢిల్లీ సర్కార్. అరుణాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన ఉదిత్ ప్రకాశ్రాయ్పై ఈ మధ్యే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు. రెండు అవినీతి కేసులతో పాటు ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి రూ. 50 లక్షల లంచం తీసుకున్నాడని, వెంటనే తప్పించాలని కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖకు ఎల్జీ సిఫార్సు చేశారు. వీళ్లతో పాటు మనీశ్ సిసోడియాకు దగ్గరగా ఉండే.. విజేంద్ర సింగ్ రావత్, జితేంద్ర నారాయిన్, వివేక్ పాండేలు, శుభిర్ సింగ్, గరిమా గుప్తా సైతం ట్రాన్స్ఫర్డ్ లిస్ట్లో ఉండడం గమనార్హం. మొత్తం పన్నెండు మందిని ఆఘమేఘాల మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు ఎల్జీ వినయ్ కుమార్. ఇదీ చదవండి: బీజేపీ ఆరోపణలపై న్యూయార్క్ టైమ్స్ రియాక్షన్ -
నూపుర్ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు దురదృష్టకరం
ఢిల్లీ: అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ.. బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. అయితే ఆమెకు మద్దతుగా.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్పైనా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తప్పుబడుతూ మాజీలంతా కలిసి బహిరంగ ప్రకటన విడుదల చేయడం, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పదిహేను మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, 25 మంది ఆర్మీ మాజీ అధికారులు ఈ బహిరంగ ప్రకటనలో సంతకం చేశారు. నూపుర్ శర్మ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దీవాలా చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మునుపెన్నడూ వినలేదని పేర్కొన్నారు. తన భద్రత దృష్ట్యా.. దేశంలో తనకు వ్యతిరేకంగా నమోదు అయిన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై వాదనల సందర్భంగా.. నూపుర్ శర్మ భద్రతకు ముప్పు కాదని.. ఆమె తన వ్యాఖ్యలతో దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రవక్తకు సంబంధించి కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముందని, ఆమె వ్యాఖ్యలే దేశంలో కొన్ని దురదృష్టకర ఘటనలకు కారణమైందని(ఉదయ్పూర్ ఘటనను ఉద్దేశించి) బెంచ్ వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యక్తులు మతం కోసం మాట్లాడినట్లు కాదు. అసలు వీళ్లు ఇతర మతాలను గౌరవించే రకం కూడా కాదు. నోటి దురుసుతో దేశం మొత్తాన్ని రావణ కాష్టం చేశారని, యావత్ జాతికి ఆమె మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు మండిపడింది. అయితే సుప్రీం కోర్టు బెంచ్లో జస్టిస్ సూర్యకాంత్.. నూపుర్ను ఉద్దేశించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని, తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్, జమ్ము అండ్ లడఖ్ అనే సంస్థ లెటర్ను రిలీజ్ చేసింది. నూపుర్పై తీవ్రవ్యాఖ్యలతో న్యాయమూర్తులు లక్ష్మణరేఖ దాటారు.. తక్షణ దిద్దుబాటు అవసరం అంటూ ఈ మేరకు లేఖను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు పంపింది. An open letter has been sent to CJI NV Ramana, signed by 15 retired judges, 77 retd bureaucrats & 25 retd armed forces officers, against the observation made by Justices Surya Kant & JB Pardiwala while hearing Nupur Sharma's case in the Supreme Court. pic.twitter.com/ul5c5PedWU — ANI (@ANI) July 5, 2022 చదవండి: న్యాయవాది అని నూపుర్ చెప్పుకోవడం సిగ్గుచేటు- నూపుర్ -
ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని మోదీకి లేఖ!
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మత హింస కేసులపై 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో వారు..."దేశంలోని రాజకీయ పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ద్వేషపూరిత రాజకీయాలకు' స్వస్తి పలకాలని కోరారు. తాము అతి పెద్ద సామాజికి ముప్పును ఎదుర్కుటున్నాం అని, ఇది కేవలం రాజ్యంగ నైతికత, ప్రవర్తనకు సంబంధించినది మాత్రమే కాదని ఆ లేఖలో స్పష్టం చేశారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే మీ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏడాది 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో, పక్షపాత ధోరణికి అతీతంగా వ్యవహరించాలని తాము ఆశిస్తున్నాం. మీ పార్టీ నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు చాలా పట్టుదలతో ద్వేషపూరిత రాజకీయాలకు ముగింపు పలకడానికి కృషి చేస్తున్నాయి. అంతేకాదు మన వ్యవస్థాపక పితామహులు సృష్టించిన రాజ్యాంగ విధానాన్ని నాశనం చేసేలా పరిస్థితి తలెత్తడంతోనే తమ ఆవేదనను, భావనను, వ్యక్తికరీంచేలా ఈ లేఖ రాసేందకు పురికొల్పిందన్నారు. బీజెపీ పాలిత రాష్ట్రాల్లోని ముస్లింలు మతపరమైన ద్వేషానికి ఎక్కువగా గురవుతున్నారని ఆరోపణలు కూడా చేశారు. అంతేకాదు అధికారంలో ఉన్న బీజేపీ శాంతి, సామరస్యాన్ని కాపాడే సాధనంగా కాకుండా, మైనారిటీలను నిత్యం భయాందోళనకు గురిచేసే సాధనంగా మారిందన్నారు." ఈ మేరకు మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోం కార్యదర్శి జీకే పిళ్లై, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకేఏ నాయర్తో సహా 108 మంది ఆ లేఖపై సంతకాలు చేశారు. (చదవండి: అక్కడ గెలుపే టార్గెట్.. బీజేపీ మాస్టర్ ప్లాన్) -
ఖద్దరు చొక్కాకై ఖాకీ తహతహ!
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో అనేకమంది బ్యూరోక్రాట్లు తమ రెండో ఇన్సింగ్స్ను రాజకీయాల్లో మొదలు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. ఖద్దరు చొక్కా వేసుకొని ప్రజలకు మరింతగా సేవ చేసుకోవాలని ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఇటీవలే ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినా ఆశిమ్ అరుణ్ రెండ్రోజుల కిందటే బీజేపీలో చేరడం, ఆయనతో పాటు మారో మాజీ ఐఏఎస్ రామ్ బహదూర్ సైతం బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిధ్దపడుతుండటం ప్రస్తుతం ఆసక్తి రేపే అంశంగా మారింది. అఖిలేష్ అడ్డా నుంచే ఆశిమ్ పోటీ... 1994 బ్యాచ్కు చెందిన 51 ఏళ్ల ఆశిమ్ అరుణ్ పదిరోజుల కిందటే స్వచ్చంద పదవీ విరమణ ప్రకటించారు. 2017 ఎన్నికల్లో గెలిచిన అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనా«థ్ ఆశిమ్ను కాన్పూర్ మొదటి పోలీస్ కమిషనర్గా నియమించారు. ఇక్కడ రౌడీ మూకల ఆట పట్టించి ఆశిమ్ తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. అంతకుముందు ఆశిమ్ అలీఘర్, గోరఖ్పూర్, ఆగ్రా వంటి జిల్లాల్లో పోలీసు బలగాలకు నాయకత్వం వహించడమే కాకుండా, ఉత్తరప్రదేశ్లోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కు నేతృత్వం వహించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెందిన దళిత ఉపకులం ‘జాతవ్’ వర్గానికి చెందిన ఆశిమ్ అరుణ్ యూపీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే వీఆర్ఎస్ ప్రకటించి ఈ నెల 16న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం కన్నౌజ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ గతంలో ఎంపీగా గెలిచారు. ఇక్కడి నుంచే ఆశిమ్ అరుణ్ పోటీ చేస్తుండటంతో అప్పుడే ఆయన చేరికపై అఖిలేష్ ఘాటుగా స్పందించారు. ‘ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ఆశిమ్ అరుణ్ సహాయపడుతున్నారని నేను ఆరోపించాను. బీజేపీలో చేరికతో అది నిజమైంది’ అని విమర్శలు గుప్పించారు. ఇక ఆశిమ్ అరుణ్తో పాటే మాజీ ఐఏఎస్ అధికారి రామ్ బహదూర్ సైతం ఆదివారం బీజేపీలో చేరారు. 2017కు ముందే బీఎస్పీలో చేరి మోహన్లాల్గంజ్ నుంచి పోటీ చేసి ఓడిన రామ్ బహదూర్ ప్రస్తుతం అదే స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. బ్రిజ్లాల్ స్ఫూర్తితో.. యూపీ మాజీ డీజీపీ బ్రిజ్లాల్ స్ఫూర్తితోనే ఆశిమ్ అరుణ్ బీజేపీలో చేరారని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్ అయిన బ్రిజ్లాల్లో 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీలో చేరారు. పాసీ దళితుడైన బ్రిజ్లాల్ 2010–12లో బీఎస్పీ అధినేత్రి మాయావతి హయాంలో యూపీ డీజీపీగా పనిచేసిన సమయంలో ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‘గా పేరు గడించారు. బీజేపీలో చేరాక ఆయన్ను రాజ్యసభకు పంపడంతో పాటు యూపీలో నేరస్థులు, మాఫియాల అణిచివేతలో ఆయన సహాయాన్ని యోగి ప్రభుత్వం తీసుకుంటోంది. ఇక 1988 బ్యాచ్కు చెందిన గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఏ.కే. శర్మ గత ఏడాది బీజేపీలో చేరేందుకు వీఆర్ఎస్ తీసుకున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా పనిచేసిన సమయంలో, ఆ తర్వాత ప్రధాని అయ్యాక ఆయన కార్యాలయంలో పని చేసిన ఏ.కే. శర్మ, వీఆర్ఎస్ తీసుకున్నాక బీజేపీ ఆయన్ను శాసనమండలికి పంపింది. గత ఏడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మోదీ ఆశీస్సులతో యోగి కేబినెట్లో చేరతారనే అంతా భావించారు. కానీ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా ఎదుగుతారనే భయంతో ఏకే శర్మను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి యోగి సుముఖత చూపలేదు. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన శర్మ... మోదీ నియోజకవర్గం వారణాసితో పాటు తూర్పు యూపీలో క్రియాశీలంగా వ్యహరిస్తున్నారు. ఇక 2014 ఎన్నికల సంందర్భంగా మరో ఐపీఎస్ అధికారి, ముంబాయి పోలీస్ కమిషనర్గా ఉన్న సత్యపాల్సింగ్ను యూపీలోని భాగ్పట్ నుంచి పార్లమెంట్కు పోటీ పెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఆర్ఎల్డీ చీఫ్ అజిత్సింగ్ను ఓడించి వార్తల్లో నిలిచారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఆయన అజిత్సింగ్ కుమారుడు జయంత్ చౌదరీని ఓడించారు. గతంలోనూ అనేకమంది... యూపీలో బ్యూరోక్రాట్ల నుంచి పొలిటీషియన్లుగా మారిన వారి లిస్టు పెద్దదిగానే ఉంది. మాజీ ఐఏఎస్ అధికారులు కున్వర్ ఫతే బహదూర్, పన్నా లాల్ పునియా, అహ్మద్ హసన్, శిరీష్ చంద్ర దీక్షిత్, దేవేంద్ర బహదూర్ రాయ్, దేవి దయాల్, ఐసీఎస్ అధికారులు మహేంద్ర సింగ్ యాదవ్, బీపీ సింఘాల్ తదితరులు ఉన్నారు. వీరిలో చాలామంది ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల్లో రాష్ట్ర మంత్రులగానూ పనిచేశారు. – సాక్షి, న్యూఢిల్లీ -
ఉమా భారతి: అధికారులున్నది చెప్పులు మోయడానికే!
భోపాల్: ప్రభుత్వాధికారులున్నది నాయకుల చెప్పులు మోయడానికేనంటూ కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.‘అధికారుల గురించి మీకేమీ తెలియదు. వారున్నది మా స్లిప్పర్లు మోయడానికే’ అని ఉమ వ్యాఖ్యానించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. తన వ్యాఖ్యలపై ఆ తర్వాత ఉమా స్పందించారు. ఓబీసీ నేతలతో పిచ్చాపాటీ మాటల్లో ఈ వ్యాఖ్యలు చేశానని , నిజానికి తాను అధికారులను వెనుకేసుకొచ్చానని సమర్ధించుకున్నారు. నిజాయతీ ఉన్న అధికారులు బలమైన నాయకులకు మద్దతుగా ఉంటారన్నారు. అయితే తన భావన మంచిదైనా, వాడిన భాష బాగోనందున విచారిస్తున్నానని వివరించారు. -
ఎంపీలు, ఎమ్మెలేలకు పోర్న్ వీడియోలతో ఎర!..
ముంబై : ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులే టార్గెట్గా సాగుతున్న సెక్స్టార్సన్ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. ఈ రాకెట్తో సంబంధం ఉన్న రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గుర్ని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులను టార్గెట్గా చేసుకుంటుంది. మహిళలకు సంబంధించిన ఫేక్ ఫ్రొఫైల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకుంటుంది. అనంతరం వారాంతాలలో వాట్సాప్ వీడియోకాల్స్ ద్వారా మరింత దగ్గరవుతుంది. కొంతకాలం తర్వాత పోర్న్ వీడియోలు చూసేలా వారిని ప్రోత్సహిస్తుంది. పోర్న్ వీడియోలు చూస్తున్న సమయంలో ఓ యాప్ ద్వారా వారి ముఖ కవలికలను రికార్డ్ చేస్తుంది. ( వికారాబాద్లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య) ఆ తర్వాత ఆ వీడియోలను ఎడిట్ చేసి బ్లాక్ మెయిల్కు పాల్పడుతుంది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ డబ్బులు డిమాండ్ చేస్తుంది. మొదట్లో తక్కువ మొత్తం డబ్బులు.. ఆ తర్వాత పెద్ద మొత్తం అడగటం మొదలుపెడతారు. ఈ గ్యాంగ్ 171 ఫేక్ ఫేస్బుక్ ఖాతాలు, నాలుగు టెలిగ్రామ్ ఛానల్లు.. 54 మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత 58 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. ( కరోనా విజృంభణ.. 1,305 భవనాలకు సీల్ ) -
అవినీతి అధికారులకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: సస్పెండ్ అయిన, అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులకు పాస్పోర్ట్ జారీ చేయరాదని కేంద్రం ఆదేశాలిచ్చింది. అధికారులకు పాస్పోర్ట్ జారీ చేసే ముందు సీవీసీ నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారి సస్పెన్షన్లో ఉన్నా, దర్యాప్తు సంస్థలు అతడిపై కోర్టులో చార్జిషీట్ వేసినా పాస్పోర్టు జారీని నిలిపివేయవచ్చని తెలిపింది. అతడికి లేదా ఆమెకు పాస్పోర్టు జారీ చేయవచ్చని పై అధికారి సూచించినప్పటికీ అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్ క్లియరెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాలను కోరింది. అతడు/ఆమెకు అనుమతి ఇవ్వడం వల్ల భారత్కు ఆ దేశంతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని, ప్రజోపయోగం కాదని భావించినా, మరే ఇతర కారణంతోనైనా పాస్పోర్టును నిరాకరించే అధికారం విజిలెన్స్ కమిషన్కు ఉందని తెలిపింది. పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న అధికారికి కోర్టు సమన్లు జారీ చేసినా, అరెస్టు వారెంట్లు ఇచ్చినా, ఆ వారెంట్లు పెండింగ్లో ఉన్నా దేశం వదిలి వెళ్లరాదని ఏదైనా కోర్టు నిషేధం విధించినా కూడా పాస్పోర్టు ఇవ్వరాదని పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలపై విదేశాంగ శాఖ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)తో సమీక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది శాఖ తెలిపింది. (ఆ గుడిలో టాయిలెట్ వారికి మాత్రమే..) -
అలసత్వపు అధికారులు, సర్పంచ్లపై చర్యలు
సాక్షి, హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగనున్నాయని, పల్లెల్లో ప్రగతి కార్యక్రమాలు, నాణ్యతను ఈ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాయని సీఎం కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. అలసత్వం వహించినట్లు తనిఖీల్లో రుజువైన అధికారులు, వంద శాతం పనిచేయని సర్పంచులపై తగు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏ మాత్రం మొహమాటాలు లేవని స్పష్టం చేశారు. అలసత్వం వహించినట్లు తేలిన అధికారులపై కఠిన చర్యలుంటాయన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిపై ఆదివారం ఆయన ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. పచ్చని, పరిశుభ్రమైన పల్లెల కోసం సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభించిన 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం జనాదరణ పొందిందని సీఎం పేర్కొన్నారు. ఇందులో స్థానికులు భాగస్వామ్యం పంచుకోవడం శుభపరిణామమన్నారు. ప్రజలు చూపిస్తున్న ఉత్సాహాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు చూపించడం లేదని క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. 100 శాతం ఫలితాల కోసం తనిఖీలు చేపట్టి, ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చన్నారు. దీనిలో భాగంగానే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పనితీరు మెరుగుపరుచుకోని అధికారులు, ప్రజాప్రతినిధుల మీద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు.. ‘పల్లెలను బాగుచేసుకోవడం కన్నా మించిన పని ప్రభుత్వానికి లేదు. అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద విశ్వాసంతోనే, వారికి కావాల్సినంత సమయాన్ని ఇచ్చినం. అందుకే తనిఖీల కోసం ఆత్రపడలేదు. ఈ తనిఖీలు ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు. జనవరి 1 నుంచి పల్లె ప్రగతి తనిఖీలు ప్రారంభించనున్నం’అని సీఎం వివరించారు. మారకపోతే వారిదే బాధ్యత.. ‘పంచాయతీరాజ్ శాఖలో అన్ని స్థాయిల ఉద్యోగులకు వారు ఊహించని విధంగా పదోన్నతులు ఇచ్చాం. గ్రామ కార్యదర్శుల నియామకం చేపట్టడం నుంచి.. ఎంపీడీవో, డీఎల్పీవో, డీపీవో, జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో అన్ని స్థాయిల్లో వ్యవస్థను పటిష్టపరిచి, శాఖను బలోపేతం చేశాం. అలాగే పల్లె ప్రగతిలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం.. పంచాయతీలకు ప్రతినెలా రూ.339 కోట్లను టంచనుగా ప్రభుత్వం విడుదల చేస్తోంది. పల్లెను అభివృద్ధిపథంలో నడిపించేలా జిల్లా కలెక్టర్లను నిరంతరం అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తున్నం. పంచాయతీరాజ్ చట్టంలో కూడా కలెక్టర్లకు ఆ మేరకు అధికారాలిచ్చాం. పచ్చదనం, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు గ్రామస్థాయిలో పని వ్యవస్థలను కూడా పటిష్టం చేసినం. పంచాయతీ కార్మికుల జీతాలు కూడా పెంచినం. ఇన్ని చర్యలు తీసుకున్నాక కూడా పల్లెల్లో ప్రగతి అనుకున్ననట్లు ముందుకు పోకపోతే అది కలెక్టర్లు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులదే బాధ్యత’అని స్పష్టం చేశారు. గోప్యంగా తనిఖీలు... ‘ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, మూడు క్యాడర్లనుంచి ఉన్నతాధికారులను నియమించి తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేస్తం. ప్రతి అధికారికి ర్యాండమ్ విధానంలో వివిధ జిల్లాల్లోని 12 మండలాల చొప్పున ఆకస్మిక తనిఖీల బాధ్యత అప్పగిస్తం. ఎవరికి ఏ మండలాన్ని అప్పగిస్తామనేది ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. ఆకస్మికంగా విడతల వారీగా నిర్వహించే తనిఖీల ద్వారా పల్లె పురోగతి క్రాస్ చెక్ అవుతుంది. తద్వరా ప్రభుత్వానికి సరైన సూచనలు, సలహాలు అందుతాయని’సీఎం అన్నారు. పనితీరుకు ఓ పరీక్ష... ‘ఈ తనిఖీల ద్వారా పల్లె ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధిని వారి శక్తి సామర్థ్యాలను ప్రభుత్వం అంచనా వేస్తుంది. పలు రకాల తోడ్పాటు ఇచ్చినంక కూడా గ్రామాలు బాగుపడకపోతే ఇక జీవితంలో అవి బాగుపడవు. అలా కావడానికి వీల్లేదు’అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామాలన్నీ అద్దంలా తీర్చిదిద్దేవరకు ఎట్టి పరిస్థితిల్లో ప్రభుత్వం విశ్రమించదని చెప్పారు. అత్యవసర పనిమీద బెంగళూరు వెల్లవలసిన పంచాయతీరాజ్ కమిషనర్ రఘనందన్ రావు ప్రయాణాన్ని వాయిదా వేయించి మరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నం అంటే, పల్లె ప్రగతిపై ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చేసుకోవాలె అని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
సెక్స్ రాకెట్: వీడియోలు తీసి.. బ్లాక్మెయిల్ చేసి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం సెక్స్ రాకెట్ కుంభకోణం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ నిమిత్తం ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీ అధ్యక్షతన సిట్ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో 12మంది బ్యూరోక్రాట్లు, 8మంది రాజకీయ నాయకులు ఉన్నట్లు సిట్ వెల్లడించింది. వీరిలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఉండటం సంచలనంగా మారింది. ఈ మొత్తం కుంభకోణానికి సూత్రదారి అయిన శ్వేతా జైన్ను ప్రస్తుతం సిట్ విచారిస్తుంది. ఈ విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ హనీట్రాప్లోకి కాలేజీ విద్యార్థినులను ఎలా భాగం చేస్తున్నారు.. ఆనక వారితో చేయించే అకృత్యాలు, తద్వారా తాము పొందే లాభాల గురించి శ్వేతా జైన్ సిట్ ముందు వెల్లడించింది. ఆ వివరాలు.. శ్వేతా జైన్ భర్త స్వాప్నిల్ జైన్ ఓ ఎన్జీవోను ప్రారంభించాడు. ముందుగా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మధ్య తరగతి కుటుంబాలను ఎంచుకుంటుంది. ఆ ఇళ్లలో ఉన్న చదువుకునే, యుక్త వయసు అమ్మాయిలకు జాబ్ ఇప్పిస్తాను, చదువుకునేందుకు సాయం చేస్తామంటూ మాయమాటలు చెప్తుంది. ఆడంబర జీవితం, డబ్బు రుచి చూపి.. అందుకు ఆ కుటుంబం ఒప్పుకుంటే.. ఆ తర్వాత శ్వేతా జైన్ రంగంలోకి దిగుతుంది. నెమ్మదిగా సదరు యువతులకు ఆడంబరమైన జీవితాన్ని రుచి చూపిస్తుంది. భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి.. తాను చెప్పినట్లు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశపెడుతుంది. ఆ తర్వాత వారిని నెమ్మదిగా తన సెక్స్ రాకెట్ కోసం వాడుకుంటుంది. అలా కాలేజీకి వెళ్లే యువతులను రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు ఎర వేస్తుంది. ఆ అధికారులు, నాయకుల కోరిక మేరకు సదరు యువతులను వారి వెంట టూర్లకు, ఫైవ్స్టార్ హోటళ్లకు పంపేది. అనంతరం వారు శృంగారంలో పాల్గొంటుండగా చాటుగా వీడియో తీసేది. ఆ తర్వాత ఈ వీడియోలను చూపించి సదరు అధికారులను, నాయకులను బ్లాక్మెయిల్ చేసి భారీ కాంట్రాక్టులు, ఎన్జీవోకు అధిక మొత్తంలో విరాళాల రూపంలో డబ్బు సంపాదించేది. ఒక్కసారి శ్వేతా జైన్ చేతిలో పడిన యువతులు ఈ ఉచ్చు నుంచి బయటకు రావడం కష్టం. శ్వేత చేస్తున్న అక్రమాల గురించి పోలీసులకు గానీ, మీడియాకు గానీ చెప్పాలని చూస్తే.. వారి వీడియోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని బెదిరించేది. దాంతో యువతులు కూడా కామ్గా ఉండేవారు. ఇలా సాగుతున్న శ్వేతా జైన్ అక్రమాలకు ఓ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు అడ్డుకట్ట వేసింది. తీగ లాగడంతో డొంక అంతా కదిలింది. గొప్ప కాలేజీలో సీటు ఇప్పిస్తానని.. ఈ క్రమంలో మౌనిక అనే భాదితురాలు మాట్లాడుతూ.. ‘ఇంటర్ పూర్తయ్యాక నేను ఉన్నత విద్య అభ్యసించాలని ఆశించాను. కానీ నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఈ క్రమంలో శ్వేతా జైన్ భర్త నా తండ్రిని కలిసి.. తన ఎన్జీవో ద్వారా నేను చదువుకోడానికి సాయం చేస్తానని చెప్పాడు. మంచి పేరున్న కాలేజీలో సీటు ఇప్పిస్తానని.. నన్ను భోపాల్ పంపిచాల్సిందిగా కోరాడు. మా నాన్న అంగీకరించడంతో నన్ను భోపాల్ తీసుకెళ్లారు. అక్కడ నన్ను ఓ పాష్ హోటల్లో ఉంచారు. తిరగడానికి బీఎండబ్ల్యూ కార్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా వారి ప్లాన్ను నాకు వివరించారు. ఎంతో డబ్బు వస్తుందని.. ఫలితంగా నా కుటుంబ ఆర్థిక అవసరాలు అన్ని తీరతాయని నన్ను ప్రలోభాలకు గురి చేశారు. పైగా నన్ను మంచి కాలేజీలో చేర్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత శ్వేతా జైన్ నన్ను సెక్రటేరియట్ వద్దకు తీసుకెళ్లి పెద్ద పెద్ద అధికారులను నాకు పరిచయం చేసింది. వారి ద్వారా నాకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని నమ్మించింది. అలా నన్ను దీనిలో ఇరికించింది’ అంటూ మౌనిక వాపోయింది. చదవండి: సెక్స్ రాకెట్; మాజీ సీఎం సహా ప్రముఖుల పేర్లు! రూ. 3కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరింపు... ‘ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 30న శ్వేతా, ఆమె సహాయకులు ఆర్తి దయాల్, రూప నన్ను ఓ పాష్ హోటల్కు తీసుకెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం వారు నన్ను ప్రభుత్వ ఇంజనీర్ హర్భజన్ సింగ్ దగ్గరకు పంపించారు. హోటల్ గదిలో మేం శృంగారంలో పాల్గొంటుండగా ఆర్తి దయాల్ వీడియో తీశాడు. తర్వాత దాన్ని హర్భజన్కు చూపించి తనకు రూ. 3కోట్లు ఇవ్వాల్సిందిగా శ్వేత బ్లాక్మెయిల్ చేసింది. కానీ ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ విషయం గురించి మా తల్లిదండ్రులతో చెప్తే.. వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని శ్వేత నన్ను బెదిరించింది. దాంతో నేను మౌనంగా ఉన్నాను. శ్వేత దగ్గర నాలాంటి కాలేజీ యువతులు ఓ రెండు డజన్ల మంది ఉండగా.. కాల్ గర్ల్స్ 40 మంది దాకా ఉంటార’ని మౌనిక సిట్ ముందు వెల్లడించింది. కాగా ఈ సెక్స్ రాకెట్లో మాజీ మంత్రులు, బ్యూరోక్రాట్ల ప్రమేయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. భోపాల్, ఇండోర్ వంటి ప్రముఖ పట్టణాల్లో సెక్స్ రాకెట్ చాలా సంవత్సరాలుగా సాగుతోందని, బ్లాక్ మెయిల్కు గురైన రాజకీయ నాయకులలో 80 శాతం మంది బీజేపీకి చెందినవారేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
బ్యూరొక్రాట్లుగా ప్రైవేట్ నిపుణులు
న్యూఢిల్లీ: పలు కీలక ప్రభుత్వ విభాగాల్లో సీనియర్ స్థాయి ఉన్నతాధికారుల పోస్టులకు పబ్లిక్, ప్రైవేటు రంగాల్లోని నిపుణులకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దేశ నిర్మాణానికి దోహదం చేసే ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రముఖ దినపత్రికల్లో ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ప్రకారం.. రెవెన్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎకనమిక్ అఫైర్స్, వ్యవసాయం, రైతు సహకారం, సంక్షేమం, రోడ్డు రవాణా, హైవేలు, నౌకాయానం, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు, నూతన, పునరుత్పాదక ఇంధనం, పౌర విమానయానం, వాణిజ్య మంత్రిత్వ శాఖలకు నిపుణులైన పది మంది ప్రతిభావంతులైన వ్యక్తులు కావాలని ప్రభుత్వం ప్రకటించింది. లేటరల్ రిక్రూట్మెంట్ కింద ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారిని మూడేళ్ల కాల పరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో జాయింట్ సెక్రటరీలుగా నియమిస్తామని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది. ఈ కాంట్రాక్టు గడువును పనితీరు ఆధారంగా ఐదేళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, అలాగే వివిధ పథకాల అమలులో జాయింట్ సెక్రటరీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు వివిధ మంత్రిత్వ శాఖల్లో అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, వాటి అనుబంధ సర్వీసుల నుంచి వచ్చే సెక్రటరీ, అదనపు సెక్రటరీల కింద పనిచేయాల్సి ఉంటుంది. వేతనం నెలకు రూ.1.44 లక్షల నుంచి 2.18 లక్షలు. దరఖాస్తులకు ఆఖరి తేదీ జూలై 30. సంఘీలకు స్థానం కల్పించేందుకే ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగాల్లో ‘సంఘీ’ (ఆరె స్సెస్ వ్యక్తులు)లను కూర్చోబెట్టడానికే ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. -
‘చీకటి రోజులు.. మోదీ విఫలం’
సాక్షి, న్యూఢిల్లీ : మైనర్ బాలికలపై అత్యాచారాలు, హత్య ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్న వేళ.. వేలాది మంది రోడ్డెక్కి.. లక్షలాది మంది సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రిటైర్డ్ ఉన్నతాధికారుల బృందం కథువా-ఉన్నావ్ ఘటనలపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. ‘దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ప్రజలకు కనీస భద్రత కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామిక, లౌకికవాద, స్వేచ్ఛా విలువలు నానాటికీ క్షీణించిపోతున్నాయి. ఎనిమిదేళ్ల చిన్నారిపై కొందరు పశువుల్లా హత్యాచారానికి పాల్పడటం.. పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో తెలియజేస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత మేం చూస్తున్న చీకటి రోజులు ఇవే. ఈ పరిస్థితులపై ప్రభుత్వం, బలహీనమైన రాజకీయ పార్టీలు, నేతలు స్పందించకపోవటం మేం గమనించాం’ అని లేఖలో వారు పేర్కొన్నారు. సుమారు 49 మంది సివిల్ సర్వీసెస్ మాజీ అధికారులు ఈ లేఖ రాసినట్లు సమాచారం. కథువా ఘటన.. పూర్తి కథనాలు అంతేకాదు ప్రస్తుత అధికార గణంపై వారు లేఖలో విరుచుకుపడ్డారు.‘వారు వారి విధులను సక్రమంగా నిర్వహించటంలో విఫలం అయ్యారు’అని లేఖలో మాజీ అధికారులు ప్రస్తావించారు. ఉన్నావ్, కథువా, అస్సాం, సూరత్.. ఇలా వరుస ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు మెట్రో నగరాలతోపాటు పలు పట్టణాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా నిరసనలు చేపడుతున్నారు. -
మంత్రులకు 1000 కార్లు: కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్ కల్లా కేంద్ర మంత్రులు, కీలక అధికారులు దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ కార్లలో తిరగనున్నారు. దాదాపు 1000 ఎలక్ట్రిక్ కార్లను మంత్రులు, అధికారులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచంలో ఇంధన దిగుమతిలో మూడో స్ధానంలో ఉన్న భారత్.. ఆ భారం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. ఆలోచనను కార్యాచరణలో పెడుతూ.. ప్రభుత్వం నుంచే మార్పుకు నాంది పలికేందుకు సిద్ధమైంది. ఎలక్ట్రిక్ కార్ల కోసం నేషనల్ కేపిటల్ రీజయన్(ఎన్సీఆర్) పరిధిలో 400లకు పైగా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే యూరప్ ఖండంలోని కొన్ని దేశాలు ఎలక్ట్రిక్ కార్లను వినియోగిస్తూ అత్యధికంగా ఇంధనాన్ని ఆదా చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని పది వేల ఎలక్ట్రిక్ కార్లకు బిడ్లను ఆహ్వానించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కార్ల కోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) శుక్రవారం బిడ్లను ఆహ్వానించనుంది. పెట్రోల్ బంకుల వద్ద ఎల్ఈడీ విద్యుత్తు దీపాల అమ్మకానికి ఈఈఎస్ఎల్, పెట్రోల్ బంకుల యాజమాన్యాల మధ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సందర్భంగా వెయ్యి ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్కుమార్ వెల్లడించారు. ఒకసారి చార్జ్ చేస్తే 120-150 కిలోమీటర్ల మైలేజ్ను ఎలక్ట్రిక్కార్లు ఇస్తాయని చెప్పారు. ఈ కార్లకు మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుందని తెలిపారు. -
షాకైన ఐటీ: ఫామ్హౌజ్లో 15 ఎల్ఈడీ టీవీలు
న్యూఢిల్లీ : పన్నులు ఎగవేస్తూ.. కోట్లకు కోట్లు ఆర్జిజిస్తున్న అధికారుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝలిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్ రాష్ట్రాల్లో జరిపిన సెర్చ్ ఆపరేషన్లో ఖరీదైన ఆస్తులు, కార్లు, వస్తువుల బయటపడ్డాయి. గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్ వంటి ప్రాంతాల చెందిన కొంతమంది అధికారులపై ఆదాయపు పన్ను దాడులు జరిపింది. ఈ రైడ్స్లో 20 కోట్ల రూపాయల బ్లాక్ ఇన్కమ్ వెలుగులోకి వచ్చినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న అధికారుల ఫామ్హౌజ్ల్లో లెక్కలో చూపని చాలా పెట్టుబడుల డాక్యుమెంట్లను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇతర నగరాల్లో ఉన్న అధికారుల స్థిర ఆస్తులను సీజ్ చేసినట్టు వెల్లడించారు. రేంజ్ ఓవర్, ఆడియా, బీఎండబ్ల్యూ లాంటి ఖరీదైన వాహనాలను, ఖరీదైన ఆస్తులను ఈ పన్ను చెల్లించని అధికారులు కలిగి ఉన్నారట. ఓ ఫామ్హౌజ్లో ఏకంగా 15 పెద్దపెద్ద ఎల్ఈడీ టెలివిజన్ సెట్స్ ఫిట్ చేసి ఉన్నాయని, అవి చూసి తాము షాకయ్యామని తెలిపారు. ఆ ఫామ్హౌజ్లోనే ఎంతో పకడ్బందీగా నిర్మించిన జిమ్, గెస్ట్ హౌజ్, నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను అక్కడ గుర్తించినట్టు పేర్కొన్నారు. డెహ్రడూన్లోని ఉత్తరప్రదేశ్ రాజకీయ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తన అధికారిక పదవిని ఉపయోగించుకుని పన్ను ఎగొడుతున్నాడనే ఆరోపణల మీద ఈ దాడుల నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. మరో సెర్చ్ ఆపరేషన్లో యూపీలోని సిద్దార్థనగర్ కు చెందిన లోకల్ బాడీ చైర్మన్పై కూడా దాడులు జరిపినట్టు తెలిసింది. ఈ సెర్చ్ ఆపరేషన్లో ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పథకాల గ్రాంట్స్ ను ఆ చైర్మన్ వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని, ఇతనికి రెండు పెట్రోల్ బంకులు, ఓ గ్యాస్ ఏజెన్సీ ఉన్నట్టు గుర్తించినట్టు తేల్చారు. కాన్పూర్ కు చెందిన రోడ్డు రవాణా శాఖ అధికారిపై, నోయిడాకు చెందిన సీనియర్ అధికారి ఇళ్లపైనే ఐటీ దాడులు చేసింది. -
బ్యూరోక్రాట్ల వీఆర్ఎస్ నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు సంబంధించిన నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. వీఆర్ఎస్ కోసం బ్యూరోక్రాట్లు పెట్టుకున్న విజ్ఞప్తిని ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా, నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా మార్పులు తెచ్చింది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించకపోతే.. అప్పట్నుంచే వారి స్వచ్ఛంద పదవీ విరమణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలను డీఓపీటీ విడుదల చేసింది. -
ఎన్ఏబీ అధికారుల వలలో అవినీతి చేప!
నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో అధికారుల వలలో ఓ పాకిస్తానీ అవినీతి చేప చిక్కింది. కోట్లకొద్దీ అవినీతి సొమ్మును కూడబెట్టిన బలూచిస్తాన్ లోని ఆర్థిక శాఖ కార్యదర్శిని.. అరెస్టు చేసిన అధికారులు ఆయన ఇంట్లోని 730 మిలియన్ల విలువైన అంటే.. సుమారు 46 కోట్ల రూపాయల విలువైన బంగారం, డబ్బుతోపాటు అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి నిధులనుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేశాడన్న ఆరోపణలతో ఆర్థిక శాఖ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ రైజాని ఇంటిపై దాడులు నిర్వహించిన ఎన్ఏబీ అధికారులు భారీగా ఆస్తులను, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వలలో చిక్కిన అవినీతి తిమింగలం ముస్తాక్ అహ్మద్ రైజానీ ఇంటినుంచీ స్థానిక మరియు విదేశీ కరెన్సీతోపాటు బంగారం నింపిన సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఏబీ అధికారులు వెల్లడించారు. ముస్తాక్ ఇంట్లోని అన్ని గదుల్లోనూ జల్లెడ పట్టామని, తదుపరి దర్యాప్తుకోసం ఫైనాన్స్ శాఖ.. రికార్డులు కూడ స్వాధీనం చేసుకుట్లు తెలిపారు. బలూచిస్తాన్ లో ఓ ప్రభుత్వాధికారిగా పనిచేస్తున్న రైజాని గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పిపిపి ప్రభుత్వ పాలనా కాలంనుంచీ కూడ ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. దాడుల అనంతరం రైజానీ ఇంట్లో భారీ మొత్తంలో అవినీతి సొమ్ము చిక్కిన నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రభుత్వం రైజానీని సస్పెండ్ చేస్తున్నట్లుగా అర్థరాత్రి ప్రకటించింది. అంతేకాక ఓ బాధ్యతగల ప్రభుత్వాధికారిగా ఆయన ఎన్ ఏ బీ విచారణకు పూర్తిగా సహకరించాలని కూడ సూచించింది. రైజానీ అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు మిర్ ఖలిద్ తన పదవికి రాజీనామా చేశారు. తమ శాఖలో ఓ వ్యక్తి అవినీతికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్నందుకు గాను.. తాను స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసినట్లు మిర్ ఖలిద్ తెలిపారు. సింథ్ ప్రాంతంలో అరెస్టుల తర్వాత, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పాలక ప్రభుత్వంలోని ఆర్థిక శాఖలో అభివృద్ధి నిధులనుంచి కోట్లాది రూపాయల విలువచేసే సొమ్మును దోచుకొన్న అధిక ప్రొఫైల్ అధికారిని అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. -
కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో లేనంతగా గుర్తింపు లభించనుంది. పౌరులకు మంచి సేవలు అందించినందుకుగానీ ఇప్పటి వరకు అవార్డులు ఇస్తూ వస్తుండగా.. ఇకపూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఉత్తమ సహకారం అందించినందుకు ప్రధానమంత్రి అవార్డులతో సత్కరించనున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి మానస పుత్రికల్లాంటి స్వచ్ఛ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలు విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ఉద్యోగులుగానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గానీ విశేషంగా కృశిచేస్తే వారికి ప్రధాని చేతులమీదుగా అవార్డులను అందిస్తారు. ఈ అవార్డులను పౌర సేవల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21న అందించనున్నారు. సాధారణంగా ప్రతి సవత్సరం పౌరులకు ఉత్తమ సేవలు అందించే ఉద్యోగులకు ప్రధానమంత్రి అవార్డులు అందిస్తుంటారు. కానీ, ఈసారి స్వచ్ఛ భారత్ అభియాన్(గ్రామిణ్), స్వచ్ఛ విద్యాలయ, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకంతోపాటు సాయిల్ హెల్త్ కార్డ్ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఉద్యోగులకు అవార్డులు అందించాలని నిర్ణయించారు. -
'టూర్కి వెళతారా.. ఎయిడ్స్ ఉందో లేదో చెప్పండి'
న్యూఢిల్లీ: ఓ కార్యక్రమానికి సంబంధించి ప్రాణాంతక, ధీర్ఘకాలిక వ్యాధులు లేనట్లుగా మెడికల్ సర్టిఫికెట్లు జతపర్చాల్సిందిగా కేంద్రం ఆయా సీనియర్ ప్రభుత్వాధికారులను ఆదేశించింది. వచ్చే నవంబర్ 2 నుంచి అదే నెల 30వరకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగే ఓ అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికోసం ధారాళంగా ఆంగ్లంలో మాట్లాడటంతోపాటు రాయగల అనుభవజ్ఞులు, ఆరోగ్యపుష్టి కలవారు అర్హులని పేర్కొంది. దీంతోపాటు వారంతా తమకు ఎయిడ్స్, టీబీ, ట్రకోమా, చర్మవ్యాధులు లేనట్లుగా నిర్ధారించే మెడికల్ సర్టిఫికెట్లు జత చేర్చాలని షరతుగా పెట్టింది. ఇక మహిళలయితే ముందస్తు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న సర్టిఫికెట్లు జత చేర్చాలని స్పష్టం చేసింది. దీంతోపాటు వారు ఎందుకు ఆ సదస్సుకు హాజరుకావాలనుకుంటున్నారో, ఏ విధంగా లబ్ధి పొందాలనుకుంటున్నారో వివరంగా పేర్కొనాలని తెలిపింది. ఖర్చులతోపాటు ఈ టూర్ సమయంలో కేంద్రం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆర్థిక, సామాజిక అంశాలపై బ్యాంకాక్ సదస్సులో నెల రోజులపాటు శిక్షణా కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ శుక్రవారమే ఆఖరు తేది. -
బ్యాంకుల చైర్మన్ నియామక ప్రక్రియ షురూ!
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్లను ఎంపికచేసే ప్రక్రియను ఆర్థిక మంత్రిత్వశాఖ చేపట్టింది. ఇందుకోసం పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్స్, బ్యాంకర్లను గుర్తించే ప్రయత్నం ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పోస్ట్ను విభజించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్సహా ఎనిమిది బ్యాంకులకు ఈ నియామకాల అవసరం ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్కు కూడా చైర్మన్ నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకుల్లో మాజీ బ్యాంకర్లు లేదా, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ నియామకాల సందర్భాల్లో ఎటువంటి ఇంటర్వ్యూలూ నిర్వహించడం జరగదని సమాచారం. ఐదు ప్రభుత్వ రంగ సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్ల నియామకాలకు అర్హులైన అభ్యర్థుల కోసం మంత్రిత్వశాఖ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. మంగళవారంతో ఇందుకు సంబంధించి గడువు ముగుస్తుంది. -
రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఎన్.శ్రీధర్
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఎన్.శ్రీధర్, నిజామాబాద్ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్గా డి.వెంకటేశ్వరరావు, పోలీసు రిక్రూట్మెంట్ ఐజీగా బి.బాలనాగదేవి, హోంగార్డ్స్ డీఐజీగా జె.అజయ్ కుమార్, పరిపాలన డీఐజీగా డి.కల్పనానాయక్, గోదావరిఖని ఏఎస్పీగా కె.ఫకీరప్పలను నియమిస్తున్నట్లు జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది. తూనికలు, కొలతల కంట్రోలర్గా ఎస్.గోపాల్రెడ్డి, అంబర్పేట సీపీఎల్ కమాండెంట్గా మహేంద్రకుమార్ కొనసాగనున్నారు. -
రాజకీయ జోక్యం నుంచి సివిల్ సర్వెంట్లకు రక్షణ