Cargo ship
-
ఒమన్ సమీపంలో సరుకు రవాణా నౌక మునక
దుబాయ్: ఒమన్ సమీప సముద్రజలాల్లో సరకు మూడు రోజుల క్రితం రవాణా నౌక మునిగిపోయిన ఘటనలో ఐదుగురు భారత, ముగ్గురు శ్రీలంక సిబ్బంది గల్లంతయ్యారు. మూడ్రోజుల అన్వేషణ తర్వాత 8 మంది భారతీయులను, ఒక శ్రీలంక వ్యక్తిని కాపాడ గలిగారు. మిగతా వారికోసం అన్వేషణ సాగుతోంది. దుబాయ్ నుంచి బయలుదేరిన నౌక దుక్మ్ పట్టణం సమీప సముద్రజలాల్లో మునిగిపోయింది. కొమొరోస్ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌకలో 13 మంది భారత సిబ్బంది, ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నట్టు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఒమన్లోని ప్రధాన చమురు, గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు దుక్మ్ పోర్ట్ ప్రధాన కేంద్రంగా ఉంది. 117 మీటర్ల పొడవైన ఫాల్కన్ నౌకను 2007లో నిర్మించారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులే. -
దక్షిణ చైనా సముద్రంలో కలకలం
బీజింగ్/మనీలా: దక్షిణచైనా సముద్రంలో గుత్తాధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న వేళ ఆ సముద్రజలాల్లో సోమవారం జరిగిన ఓడల ప్రమాదం ఇరుదేశాల మధ్య మాటల మంటలు రాజేసింది. మీ వల్లే ప్రమాదం జరిగిందని ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. దక్షిణచైనా సముద్రంపై తమకు హక్కు ఉందని ఫిలిప్పీన్స్, మలేసి యా, వియత్నాం, బ్రూనై, తైవాన్లు అంతర్జాతీయ స్థాయిలో వాదిస్తున్న విషయం విదితమే. రెండు ఓడల ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు.అసలేం జరిగింది?నన్షా ద్వీపాల సమీపంలోని రెనాయ్ జివో పగడపు దిబ్బ దగ్గర తమ గస్తీ నౌక ఉందని తెల్సికూడా ఉద్దేశపూర్వకంగా అదే దిశలో దూసుకొచ్చి ఫిలిప్పీన్స్కు చెందిన సరకు రవాణా నౌక ఢీకొట్టిందని చైనా కోస్ట్ గార్డ్(సీసీజీ) ఆరోపించింది. చైనా కొత్త చట్టం ప్రకారం అనధికారికంగా ప్రయాణించిన ఆ నౌకపై మేం నియంత్రణ సాధించామని సీసీజీ ప్రకటించింది. చైనా చర్యను ఫిలిప్పీన్స్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘చైనా విధానాలు వాస్తవ పరిస్థితిని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. సమీపంలోని సెకండ్ థామస్ షావల్ స్థావరంలోని మా బలగాలకు సరకులు, నిర్మాణ సామగ్రిని తీసుకెళ్తున్న మా నౌకకు అడ్డంగా చైనా వారి నౌకను నిలిపింది’’ అని ఫిలిప్పీన్స్ సాయుధ విభాగ అధికార ప్రతినిధి ఎరేస్ ట్రినిడాడ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గతంలో ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి(ఈఈజెడ్) పరిధిలో ఉండేది. 2012 ఏడాదిలో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసా గుతోంది. దక్షిణ చైనా సముద్రజలాల గుండా ప్రయాణించే పొరుగుదేశాల సరకు రవాణా నౌకలపై తరచూ జల ఫిరంగులను ప్రయోగిస్తూ చైనా నావికాదళాలు తెగ ఇబ్బంది పెట్టడం తెల్సిందే. విదేశీ నౌకల సిబ్బందిని ఎలాంటి ముందస్తు విచారణ లేకుండా 60 రోజులపాటు నిర్బంధించేలా చేసిన చట్టం అమల్లోకి వచ్చిన రెండు రోజులకే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. -
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళా క్యాడెట్
న్యూఢిల్లీ: ఇరాన్ అధీనంలో ఉన్న సరుకు రవాణా నౌక ఎంఎస్సీ ఏరీస్లోని 17 మంది భారతీయ సిబ్బందిలోని ఏకైక మహిళా క్యాడెట్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. కేరళలోని త్రిసూర్కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్ను ఇరాన్ ప్రభుత్వం విడుదల చేయడంతో గురువారం మధ్యాహ్నం విమానంలో కొచ్చిన్కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగతా 16 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్లోని కుటుంబసభ్యులతో ఫోన్లో సంభాషిస్తున్నట్లు కూడా వివరించింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నాలుగు రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అమిర్ అబొల్లాహియన్తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది. ఇజ్రాయెల్తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇరాన్ ప్రత్యేక బలగాలు ఈ నెల 13న హొర్ముజ్ జలసంధిలో ఉన్న ఎంఎస్సీ ఏరీస్ నౌకను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
చైనాలో వంతెనను ఢీ కొట్టిన భారీ షిప్.. రెండు ముక్కలైన బ్రిడ్జి
దక్షిణ చైనాలో వంతెనను భారీ కార్గో షిప్ ఢీకొట్టడంతో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఈ ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ షిప్ ఫోష్మన్ నుంచి గ్వాంగ్జూ వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉన్న లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొట్టింది. తాకిడికి వంతెన రెండు ముక్కలుగా వీడిపోయింది. నౌక్ బ్రిడ్జి మధ్యే చిక్కుకుపోయింది ఈ ఘటనలో ఒక బస్సుతో సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ నౌకలో ఎటువంటి సరుకు లేదని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదానికి కారణమైన షిప్ కెప్టెన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్వాంగ్జూ నగరం నుంచి ఆరుగురు డైవర్లతో అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇదీ చదవండి: రియల్ లైఫ్ మోగ్లీ: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..! -
అరేబియా సముద్రంలో నౌక హైజాక్ !
న్యూఢిల్లీ: మాల్టా దేశానికి చెందిన సరుకు రవాణా నౌక ఒకటి అరేబియా సముద్రంలో హైజాక్కు గురైంది. ఈ ఘటన జరిగినపుడు నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారు. హైజాక్ విషయం తెల్సుకున్న భారత నావికాదళాలు వెంటనే స్పందించి ఆ వైపుగా పయనమయ్యాయి. సముద్రపు దొంగలు ఆ నౌకను తమ అ«దీనంలోకి తీసుకుని నడుపుతుండగా భారత యుద్ధనౌక దానిని విజయవంతంగా అడ్డుకుంది. అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు భారత నావికాదళం శనివారం తెలిపింది. ప్రస్తుతం నౌక సోమాలియా తీరం వైపుగా వెళ్తోంది. సంబంధిత వివరాలను ఇండియన్ నేవీ వెల్లడించింది. అరేబియా సముద్ర జలాల్లో గురువారం ‘ఎంవీ రుయెన్’ నౌకను ఆరుగురు సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. పైరేట్లు నౌకలోకి చొరబడుతుండగానే నౌకలోని సిబ్బంది ఆ విషయాన్ని బ్రిటన్ సముద్ర రవాణా పోర్టల్కు అత్యవసర సందేశం(మేడే)గా తెలియజేశారు. హైజాక్ విషయం తెల్సిన వెంటనే భారత నావికా దళాలు అప్రమత్తమయ్యాయి. అదే ప్రాంతంలో గస్తీ కాస్తున్న భారత గస్తీ విమానం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద విధుల్లో ఉన్న భారత నావికాదళ యాంటీ–పైరసీ పెట్రోల్ యుద్ధనౌకలు రంగంలోకి దిగాయి. హైజాక్కు గురైన నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అటుగా దూసుకెళ్లి ఆ నౌకను శనివారం ఉదయం విజయవంతంగా అడ్డుకున్నాయి. ‘ రవాణా నౌకల సురక్షిత ప్రయాణానికి భారత నావికాదళం కట్టుబడి ఉంది. అంతర్జాతీయ భాగస్వాములు, మిత్ర దేశాలకు సాయపడటంతో ఎప్పుడూ ముందుంటుంది’ అని భారత నేవీ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. -
భారత్కు రావాల్సిన కార్గో షిప్ హైజాక్!
టెల్ అవీవ్: తుర్కియే నుంచి భారత్ రావాల్సిన కార్గో షిప్ ఎర్ర సముద్రంలో హైజాక్కు గురైంది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ ఆధారిత ఉగ్రవాదంగా పేర్కొన్న ఇజ్రాయెల్.. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత తీవ్ర పరిణామాలకు దారితీసే చర్యగా తెలిపింది. వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది కూడా ఓడలో ఉన్నారని వెల్లడించింది. బ్రిటీష్ యాజమాన్యంలోని జపాన్ నిర్వహిస్తున్న కార్గో షిప్ను హౌతీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. షిప్లో ఇజ్రాయెల్ పౌరులెవ్వరూ లేరని స్పష్టం చేశారు. ఇది ఇరాన్ ఆధారిత ఉగ్రవాదంగా పేర్కొన్న నెతన్యాహు.. అంతర్జాతీయ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఇరాన్ చర్యలను ఆయన ఎండగట్టారు. The hijacking of a cargo ship by the Houthis near Yemen in the southern Red Sea is a very grave incident of global consequence. The ship departed Turkey on its way to India, staffed by civilians of various nationalities, not including Israelis. It is not an Israeli ship. — Israel Defense Forces (@IDF) November 19, 2023 షిప్ హైజాక్కు బాధ్యత వహిస్తున్నట్లు హౌతీ ఉగ్రవాదులు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్కు చెందిన ఓటను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. షిప్ను యెమెన్ పోర్టుకు తీసుకువచ్చినట్లు చెప్పారు. దీనిని ఇజ్రాయెల్ ఖండించింది. అది తమ ఓడ కాదని వెల్లడించింది. బ్రిటీష్ యాజమాన్యంలోని ఓడగా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ఓడ జపాన్ నిర్వహణలో ఉందని వెల్లడించింది. అందులో ఉన్న 25 మంది సిబ్బంది ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికోకు చెందినవారని పేర్కొంది. ఇజ్రాయెల్పై దాడులను ఉదృతం చేస్తామని హౌతీ తిరుగుబాటుదారులు గతవారం ప్రకటించారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ఆధారిత ఓడలన్నింటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ జెండాలు కలిగిన షిప్లను హైజాక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ ఓడల్లో ఇతర పౌరులు పనిచేయకూడదని కూడా హౌతీ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అయితే.. పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్ ఆధారిత హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్నారు. ఇదీ చదవండి: Napoleon Bonaparte: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే..
రియో డి జనేరియో: నైజీరియాకు చెందిన నలుగురు వలసదారులు 14 రోజులపాటు కార్గో షిప్ అడుగున ముందుభాగంలో ఉండే చుక్కానిపై కూర్చుని అత్యంత సాహసంతో కూడుకున్న యాత్ర చేసి బ్రెజిల్ చేరుకున్నారు. తిండి లేకుండా దీనావస్థలో ఉన్న వారిని ఆగ్నేయ పోర్టులోని బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు కనుగొని రక్షించారు. యూరప్ చేరుకోవాలన్న తపనతో నలుగురు నైజీరియా వలసదారులు అక్రమంగా ఒక పెద్ద ఓడ చుక్కానిపైకి ఎక్కి కూర్చున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం వైపుగా కదిలిన ఆ ఓడ యూరప్ వెళ్తుందనుకుంటే అదికాస్తా బ్రెజిల్ వైపుగా కదిలింది. నడిసంద్రంలో ఉన్నంతసేపు వారు ఎక్కడికి వెళ్తోంది కూడా వారికి తెలియదు. రేయింబవళ్లు ఆ చిన్న స్థలంలో ఇరుక్కుని అలా కూర్చుండిపోయారు. వారివద్ద తినడానికి కూడా ఏమీ లేదు. అలాగే బిక్కుబిక్కుమంటూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణించారు. ఆ ఓడ 14 రోజులపాటు మహాసముద్రంలో 5,600 కిలోమీటర్లు ప్రయాణించి బ్రెజిల్ పోర్టు చేరుకుంది. ఓడ బ్రెజిల్ చేరుకున్నాక దయనీయ స్థితిలో చుక్కానిపై కూర్చుని ఉన్న నలుగురిని అక్కడి అధికారులు జాగ్రత్తగా కిందికి దించారు. వారి పరిస్థితి చూసి వెంటనే వారికి ఆహారమిచ్చి ఆశ్రయమిచ్చారు. మొత్తం నలుగురు వలసదారుల్లో ఇద్దరి అభ్యర్ధన మేరకు వారిని తిరిగి నైజీరియా పంపించగా మరో ఇద్దరు మాత్రం బ్రెజిల్లోనే ఉండిపోయారు. వారు తమ అనుభవాలను పంచుకుంటూ చుక్కాని మీద కూర్చుని ప్రయాణించడం చాలా భయంకరమైన అనుభూతి. ఒక్కోసారి పెద్ద పెద్ద తిమింగలాలు మాకు దగ్గరగా వెళ్తూ కనిపించేవి. వాటిని చూస్తేనే భయమేసేది. ఒకపక్క సముద్రం మరోపక్క ఓడ ఇంజిన్ శబ్దం హోరెత్తించడంతో నిద్ర కరువైంది. దాహానికి మాత్రం అపుడప్పుడు వేరే మార్గంలేక సముద్రం నీళ్లనే తాగేవాళ్ళం. ఓడ సిబ్బంది కంటపడితే వారు మమ్మల్ని సముద్రంలోకి పడదోస్తారని భయపడి అలాగే ఉండిపోయాము. ఒక్కోసారి మాలో ఎవరైనా కూడా ఆ పని చేస్తారేమోనని భయపడి కళ్ళు తెరచుకుని ఉండే వాళ్ళమన్నాడు. నైజీరియాలో ఆర్ధిక, రాజకీయ అస్థిరత వల్లనే తాము వలస వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నాడు. సావో పాలోలో వారికి ఆశ్రయమిచ్చిన చోట ఒక వ్యక్తి మాట్లాడుతూ మేము చాలా మంది వలసదారుల గాధలు విన్నాం కానీ ఇటువంటి సాహస యాత్రను నేనెన్నడూ చూడలేదని అన్నారు. ఇది కూడా చదవండి: సైనిక తిరుగుబాటుతో ఫ్రాన్స్ దేశస్తులను వెనక్కి రప్పిస్తున్న ఎంబసీ -
Russia-Ukraine War: ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచి బయల్దేరిన ఆహార నౌక
కీవ్: రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ నుంచి నిలిచిపోయిన ఆహార సరకు నౌకల రవాణా ప్రక్రియ మళ్లీ మొదలైంది. 26,000 టన్నుల మొక్కజొన్నలతో నిండిన తొలి నౌక సోమవారం ఉక్రెయిన్లోని ఒడిశా నౌకాశ్రయం నుంచి లెబనాన్కు నల్ల సముద్రమార్గంలో బయల్దేరింది. పలు దఫాల చర్చల తర్వాత ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరకు నౌకల రవాణాకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు గత నెలలో తుర్కియే, ఐక్యరాజ్యసమితిలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నౌకాశ్రయాల్లో నెలలుగా నిలిచిపోయిన 2.2 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల అంతర్జాతీయ రవాణాకు మార్గం సుగమమైంది. గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనెల ఎగుమతుల్లో ఉక్రెయిన్, రష్యా అగ్రగాములుగా కొనసాగుతున్న విషయం విదితమే. యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు స్తంభించిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత తలెత్తింది. -
అదానీ పోర్టు సరికొత్త రికార్డులు..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్టుగా
దొండపర్తి (విశాఖ దక్షిణ): అదానీ పోర్టు సరికొత్త రికార్డును నమోదు చేసింది. కార్గో రవాణాలో 300 మిలియన్ మెట్రిక్ టన్నుల మైలురాయిని అధిగమించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీసెజ్)గా దేశ నౌకాశ్రయాల్లో రెండు దశాబ్దాల క్రితం కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుంచి గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. నిర్దిష్టమైన వ్యూహాలు, ప్రణాళికలతో కార్గో రవాణాలో వృద్ధిని నమోదు చేస్తుండడం అదానీ పోర్ట్స్ సామర్థ్యానికి నిదర్శనమని ఏపీసెజ్ సీఈఓ అండ్ హోల్టైమ్ డైరెక్టర్ కరణ్ అదానీ పేర్కొన్నారు. ఏటా 100 మిలియన్ మెట్రిక్ టన్నులు(పోర్ట్ఫోలియోలో 5 పోర్టులతో) సరకు రవాణా సాధించడానికి 14 ఏళ్లు పట్టిందని వెల్లడించారు. ఏపీసెజ్ తరువాత ఐదేళ్లలో దానిని రెట్టింపు చేసి ఏటా 200 మిలియన్ మెట్రిక్ టన్నులు (పోర్ట్ఫోలియోలో 9 పోర్టులతో) కార్గోను రవాణా చేసినట్లు తెలిపారు. ఇపుడు ఏపీసెజ్ పోర్ట్ఫోలియోలో 12 పోర్టులతో మూడేళ్లలోనే ఏటా 300 మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించిందని వివరించారు. కరోనా సమయంలోను, ప్రపంచ ఆర్థిక రంగం మందగమనంలో ఉన్నప్పటికీ ఈ ఘనతను సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. భారత తీరప్రాంతంలోని పోర్టుల నెట్వర్క్తో పాటు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపుతో పాటు సాంకేతికతతో కూడిన డిజిటలైజ్డ్ కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. 2025 నాటికి 500 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యానికి చేరుకుంటామన్నారు. అలాగే 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్టు కంపెనీగా ఎదుగుతుందని చెప్పారు. అదానీ పవర్ పునర్వ్యవస్థీకరణ న్యూఢిల్లీ: పూర్తి అనుబంధ సంస్థలు ఆరింటిని విలీనం చేసుకునే పథకానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు అదానీ పవర్ తాజాగా వెల్లడించింది. కంపెనీకి చెందిన విభిన్నతరహా సొంత అనుబంధ సంస్థలను విలీనం చేసుకోనున్నట్లు తెలియజేసింది. విలీనం చేసుకోనున్న సంస్థల జాబితాలో అదానీ పవర్ మహారాష్ట్ర, అదానీ పవర్ రాజస్తాన్, అదానీ పవర్ ముంద్రా, ఉడు పి పవర్ కార్పొరేషన్, రాయ్పూర్ ఎనర్జెన్, రాయ్గఢ్ ఎనర్జీ జనరేషన్ ఉన్నట్లు పేర్కొంది. ఈ పథకం అమలుకు 2021 అక్టోబర్ 1ను ఖరారు చేయగా.. ఆరు సంస్థల ఆస్తులు, అప్పులు అదానీ పవర్కు బదిలీకానున్నట్లు వివరించింది. -
తెన్నేటి పార్కులో ఫ్లోటింగ్ రెస్టారెంట్గా ఎంవీ మా కార్గోషిప్
సాక్షి, విశాఖపట్నం : సిటీ ఆఫ్ డెస్టినీ సాగర తీరంలో మరో సరికొత్త ప్రాజెక్ట్ సందర్శకులకు ఆహ్వానం పలకనుంది. విశాఖ నగర ప్రజలతో పాటు దేశ విదేశీ పర్యాటకులకు విభిన్న అనుభూతిని అందించేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. సరకు రవాణా కోసం వచ్చి అలల తాకిడికి ఒడ్డుకొచ్చిన బంగ్లాదేశ్ నౌకను నీటిపై తేలియాడే రెస్టారెంట్ గా మార్పు చేస్తోంది. పీపీపీ పద్ధతిలో నాలుగు నెలల్లో నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్గా అభివృద్ధి చేసి..పర్యాటకులకు అందించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా బలమైన గాలుల ధాటికి 2020 అక్టోబర్ 12 అర్ధరాత్రి 2 గంటల సమయంలో బంగ్లాదేశ్కు చెందిన ఎంవీ–మా షిప్ బోల్తా పడకుండా తెన్నేటి పార్కు సమీపానికి కొట్టుకువచ్చింది. ఆ సమయంలో నౌకలో కెప్టెన్ సహా 15 మంది సిబ్బంది ఉన్నారు. విశాఖ పోర్టు ట్రస్ట్, భారత తీరగస్తీ దళం(కోస్ట్ గార్డ్), మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, మర్చెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్(ఎంఎండీ), ఇండియన్ నేవీ, హిందూస్థాన్ షిప్ యార్డ్ ఇలా.. మొత్తం ఎనిమిది సంస్థలు షిప్ను తిరిగి సముద్రంలోకి పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినా సాధ్యం కాలేదు. దీంతో ఈ నౌకను ఇక్కడే వదిలేసేందుకు యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ తరుణంలో ఈ కార్గో షిప్ను ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మారీటైమ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం నౌకను వారం రోజుల పాటు పరిశీలించి.. టూరిజం శాఖకు నివేదిక ఇచ్చింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఈ కార్గో నౌకను ప్లాటింగ్ రెస్టారెంట్గా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు కొన్ని నెలల కిందట కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. రూ.4.50 కోట్లకు విక్రయించేందుకు యాజమాన్యం పీఎన్ఐ క్లబ్ సిద్ధమవగా.. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి రూ.1.25 కోట్లకు పర్యాటక శాఖ సొంత నిధులతో కొనుగోలు చేసింది. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రత్యేకతలివే.. నౌకను అరుదైన ఫ్లోటింగ్ రెస్టారెంట్గా తీర్చిదిద్దేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతోంది. ప్రపంచదేశాల పర్యాటకులను ఇట్టే ఆకర్షించేలా.. టూరిస్ట్ ఎమినిటీస్తో కూడిన ప్రాజెక్ట్గా డిజైన్ చేశారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతర శుభ కార్యాలు నిర్వహించేందుకు అనుగుణంగా బాంక్వెట్ హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. దేశ విదేశీ రుచులు అందుబాటులో ఉండేలా 500 మందికి సరిపడా మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ రానుంది. ఒక సందర్శకుడికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పీపీపీ పద్ధతిలో రూ.10.50కోట్లతో ఫ్లోటింగ్ రెస్టారెంట్ను మిస్టర్ గిల్ మెరైన్స్ సంస్థతో కలిపి అభివృద్ధి చేయనున్నారు. తెన్నేటి పార్కుతో కలిపి దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంతో.. ఆ పార్కును కూడా తమకు అప్పగించాలని జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులకు పర్యాటక శాఖ లేఖలు రాసింది. అంతర్జాతీయంగా ఆకర్షిస్తుంది విశాఖ తీరంలో ఐఎన్ఎస్ కురుసుర సబ్మెరైన్ మ్యూజియం, టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. త్వరలోనే సీ హారియర్ మ్యూజియం కూడా అందుబాటులోకి రానుంది. ఈ మూడింటితో పాటు ఎంవీ మా ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులోకి వస్తే.. ప్రపంచ పర్యాటక పటంలో ఈ తరహా మ్యూజియంలు, రెస్టారెంట్లు ఉన్న నగరంగా విశాఖపట్నం వినుతికెక్కనుంది. గిల్ సంస్థ డీపీఆర్ తయారు చేస్తోంది. నాలుగు నెలల్లో షిప్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. రెస్టారెంట్, ఏసీ గదులు, రూఫ్టాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల 29 నుంచి నౌక సందర్శించేందుకు పర్యాటకులను అనుమతినిస్తున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి -
సూయజ్లో ఎవర్ గివెన్ ప్రమాదానికి కారణం ఇదేనా?
సూయజ్ : ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణ నౌక ఎవర్ గివెన్ నీటిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం సూయజ్ కెనాల్ అథారిటీదే అంటోంది ఆ నౌక యాజమాన్య సంస్థ షోయి కిసైన్. వాతావరణం సరిగా లేనప్పుడు ఎవర్ గివెన్ వంటి పెద్ద నౌకను కెనాల్లో ప్రయాణానికి అనుమతించడం సూయజ్ చేసిన తప్పుగా ఆ సంస్థ పేర్కొంది. నౌక తరఫున ఎటువంటి లోటుపాట్లు లేవంటూ రికార్డులు చూపెడుతోంది. ప్రమాదానికి ముందు సూయజ్ కెనాల్ అథారిటీ, నౌకా సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణను సైతం వెల్లడించింది. భారీ నౌకల సముద్ర ప్రయాణానికి సంబంధించిన ప్రోటోకాల్ని సూయజ్ కెనాల్ అథారిటీ సరిగా పాటించలేదని ఎదురుదాడి చేస్తోంది. గత మూడు నెలలుగా ఎవర్గి వెన్ను సీజ్ చేసిందుకు గాను నష్టపరిహారంగా లక్ష డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. సూయజ్ కాలువ ప్రమాదంపై ఇస్లామియా ఎకనామిక్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎవర్గివెన్ నౌక యాజమాన్య సంస్థ షోయి కిసైన్ సంస్థ తన వాదనలు వినిపించింది. మార్చి 23న ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత రద్ధీ వాణిజ్య సముద్ర మార్గాల్లో ఒకటైన సూయజ్ కెనాల్లో మార్చి 23న ఎవర్ గివెన్ నౌక చిక్కుకుపోయింది. నౌక ముందు వెనక భాగాలు కెనాల్ చెరో తీరాన్ని ఢీకొట్టాయి. నౌక ముందు భాగం మట్టిలో కూరుకుపోవడంతో .. అక్కడే నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు వారం రోజులకు పైగా నిలిచిపోయాయి. టగ్ బోట్ల సాయంతో ఎట్టకేలకు ఎవర్ గీవెన్ను బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ ఎవర్ గివెన్ నౌకను సీజ్ చేసింది సూయజ్ కెనాల్ అథారిటీ. నష్టపరిహారంగా 916 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. -
భారత నౌకలో 14 మందికి పాజిటివ్: అధికారుల టెన్షన్
జొహన్నెస్బర్గ్: భారత్లో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు భారత్ నుంచి వెళ్లే విమానాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక నౌకలపై కూడా ఆంక్షలు విధించేలా పరిణామాలు కన్పిస్తున్నాయి. భారత్ నుంచి బియ్యం లోడుతో ఓ భారీ నౌక దక్షిణాఫ్రికాకు చేరుకుంది. అక్కడి పోర్టు అధికారులు నౌక సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా వారికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల భారత్ నుంచి ఓ నౌక సుమారు మూడు వేల టన్నులకు పైగా బియ్యం లోడుతో సాతాఫ్రికాలోని డర్బన్ పోర్టుకు చేరుకుంది. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నౌకలోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆశ్చర్యంగా అందులో 14 మంది సిబ్బందికి పాటిజివ్గా నిర్ధారణ అయిందని దక్షిణాఫ్రికాకు చెందిన ట్రాన్స్నెట్ నేషనల్ పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ప్రస్తుతం ఆ నౌకను క్వారంటైన్లో ఉంచామని, అందులోకి వెళ్లడానికి, బయటకు రావడానికి ఎవరికీ అనుమతి లేదని పోర్టు అధికారులు వెల్లడించారు. నౌకతో ముడిపడి ఉన్న అన్ని కార్యకలాపాలను ప్రస్తుతం నిలిపివేశారు. నౌకలోని సిబ్బందిని ఎవరెవరు కలిశారనే విషయాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలిపారు. ఆ నౌకలో గత ఆదివారం నుంచి సుమారు 200 మంది పోర్టు సిబ్బంది పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అందులో 50 కిలోల బ్యాగుల్లో బియ్యం ఉన్నాయని, వాటిని దింపడానికి ఈ సిబ్బంది పని చేసినట్లు తెలిసింది. భారతదేశంలో రోజూ వేలాది మంది మరణాలకు కారణమవుతున్న కరోనా కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా తీరాలకు చేరిందనే వార్త ప్రస్తుతం అక్కడి మీడియాలో వైరల్గా మారింది. ( చదవండి: 22 ప్రవేశమార్గాలను మూసేసిన నేపాల్ ) -
వైరల్: హాలీవుడ్ యాక్షన్ సీన్లను తలదన్నే ‘ఆపరేషన్’
ఆమ్స్టర్డామ్: చాలా సినిమాల్లో చూసే ఉంటాం.. కింద కారులో, సముద్రంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదంలో ఉంటే.. మన హీరో గారు హెలికాప్టర్లో వచ్చి.. తాడు నిచ్చెన సాయంతో కిందకు దిగి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడతాడు. సినిమాల్లో అంటే ఏం చూపించినా చెల్లుతుంది. పైగా ఇలాంటి రిస్కీ షాట్లలో పని చేసేది.. హీరోలు కాదు.. డూపులే అన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ సైన్యంలో రెస్క్యూ టీంలలో ఇలాంటి రియల్ హీరోలు ఉంటారు. వారు ప్రాణాలకు తెగించి మరి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడతారు. తమకు ప్రమాదం అని తెలిసినా.. వారి జీవితాలను పణంగా పెట్టి.. మరి ఇతరులను ఆదుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సముద్రంలో వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల కార్గో షిప్ భారీ ఆటుపోట్లకు గురవుతుంది. ఈ లోపే సహాయక సిబ్బంది అత్యంత చాకచక్యంగా షిప్లో ఉన్న 12 మందిని సురక్షితంగా కాపాడారు. ఆ వివరాలు.. జర్మనీలోని బ్రెమెర్హావెన్ నుంచి నార్వేలోని కొల్వరైడ్ వరకు పలు చిన్న నౌకలను తీసుకువెళుతున్న డచ్ కార్గో షిప్ "ఈమ్స్లిఫ్ట్ హెండ్రికా" సోమవారం సముద్రంలో ప్రయాణిస్తుండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆటుపోట్లకు గురవుతుంది. ప్రమాదం గురించి షిప్లో ఉన్న సిబ్బంది ముందే తమ యాజమాన్యానికి సమాచారం అందించడంతో వారు సహాయక సిబ్బందిని పంపిస్తారు. ఇక హెలికాప్టర్ ద్వారా రంగంలోకి దిగిన సిబ్బంది షిప్లో ఉన్న 12మందిని రెండు విడతల్లో కాపాడారు. ఆపరేషన్లో భాగంగా సహాయక సిబ్బంది తొలుత షిప్ డెక్ మీద ఉన్న వారిలో 8 మందిని గాల్లోకి లేపి హెలికాప్టర్లోకి చేరవేశారు. ఈలోపు షిప్ ప్రమాద తీవ్రత పెరగడంతో మిగిలిన నలుగురిని సముద్రంలోకి దూకమని చెప్పి.. ఆ తర్వాత వారిని కూడా రక్షించారు. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ సాగిన తీరు చూస్తే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డెక్ మీద ఉన్న వారిని కాపాడటం కోసం తొలత హెలికాప్టర్లో ఉన్న సహాయక సిబ్బంది ఒకరు ఇనుప తాడు సాయంతో షిప్ డెక్ మీదకు దిగుతాడు. ఆ తర్వాత అతడు ఒక్కొక్కరిని అదే తాడు ద్వారా హెలికాప్టర్లోకి పంపిస్తాడు. ఇలా 8 మందిని కాపాడిన తర్వాత షిప్ ఆటుపోట్లకు గురవుతూ ప్రమాదకర రీతిలో కదులుతుంది. దాంతో డెక్ మీద మిగిలిన నలుగురిని సముద్రంలోకి దూకమని చెప్పి.. ఆ తర్వాత వారిని కాపాడారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: సూయెజ్ దిగ్బంధనం నేర్పుతున్న పాఠాలు -
ఆ నౌక నేను నడపలేదు.. నాపై నిందలు వేస్తున్నారు!
పిడుగు ఆకాశంలోంచి ఊడిపడుతుంది. బడబాగ్ని నిప్పుకణంలోంచి జ్వలిస్తుంది. ప్రకంపన పుడమి నుంచి ఉద్భవిస్తుంది. సుడిగుండం సముద్రంలో జనిస్తుంది. కానీ.. మహిళపై నింద ఎక్కడి నుంచి ఊడి పడి, ఎలా జ్వలించి, ప్రకంపించి, సుడిగుండమై ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందో చెప్పలేం. ప్రస్తుతం మర్వా ఎల్సెల్హదార్ అనే నేవీ కెప్టెన్ అలాంటి ఒక నింద నుంచి బయటపడే ప్రయత్నంలోనే ఉంది. మర్వా ఎల్సెల్హదార్ ఈజిప్టు నేవీలోని మెరైన్ విభాగంలో తొలి మహిళా కెప్టెన్. 29 ఏళ్ల యువతి. ఐదేళ్ల క్రితమే ఆమె నేవీలో చేరింది. ఇటీవల అక్కడి ‘అరబ్ న్యూస్’లో ఆమె గురించి పెద్ద కథనం వచ్చింది. తెల్ల యూనిఫామ్లో ఉన్న మర్వా చక్కటి ఫొటో ఒకటి పెట్టి ఈజిప్టు మెరైన్లో తొలి కెప్టెన్గా ఆమె సక్సెస్ స్టోరీ రాసింది ఆ పత్రిక. మెరైన్లో చేరిన ఐదేళ్ల తర్వాత ఆమెపై ఈ తాజా స్టోరీ రాయడానికి ‘అరబ్ న్యూస్’ చెప్పిన కారణం ఆలోచింపజేసే విధంగా ఉంది. ‘ఒక మహిళా మెరైన్ కెప్టెన్ అవడం గొప్పే. అంతకన్నా గొప్ప.. ఆ మహిళ మెరైన్ కెప్టెన్గా కొనసాగడం!’ అనే వాక్యంతో ఆ వార్తా కథనం ముగిసింది. నిజమే. మర్వా మెరైన్లో చేరిన తొలిరోజు నుంచీ ప్రతికూల పరిస్థితులను నెగ్గుకుంటూ వస్తోంది. 2015 వరకు ఈజిప్టు నేవీ మెరైన్లో మహిళా కెప్టెన్ ఒక్కరూ లేరు. పూర్తిగా పురుష ప్రపంచం అది. ఆ ప్రపంచంలోకి ధైర్యం చేసి వెళ్లింది మర్వా. అరబ్ న్యూస్లో మొన్న మార్చి 22న వచ్చిన ఆమె సక్సెస్ స్టోరీ కొన్ని గంటల్లోనే ట్విట్టర్లో, ఫేస్బుక్లో అనేకసార్లు షేర్ అయింది. అయితే రెండు రోజుల తర్వాత అదే ఫొటోతో ఇంటర్నెట్లో ఆమెను నిందిస్తూ ఒక వార్త వైరల్ అయింది! ఆ వార్త మర్వా చేతిలోని ఫోన్ వరకు చేరింది. మధ్యలోని ఆ కొద్ది గంటల్లోనే ఏం జరిగింది? సూయజ్ కెనాన్లో మార్చి 23న ‘ఎవర్ గివెన్’ అనే నౌక ‘బ్లాక్’ అయింది. కాలువకు రెండు వైపులా వాహనాల రవాణా స్తంభించిపోయింది. ఆరు రోజులు కష్టపడి నౌకను మళ్లీ దారిలో పెట్టగలిగారు. అయితే ఈ రెండు వారాల్లో తనపై వైరల్ అవుతూ వచ్చిన నిందను ‘క్లియర్’ చేసుకోడానికి నానా అవస్థలు పడుతోంది మర్వా. ఇక ఆమెపై పడిన నింద ఏమిటంటే.. ఎవర్ గివెన్ను ఆమే నడుపుతున్నారని, ఆమె సరిగా నడపలేకపోవడం వల్లనే ఆ నౌక.. కెనాల్లో అడ్డం తిరిగి, ప్రపంచ వాణిజ్య రంగానికి లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెట్టిందనీ! ఇది మామూలు నింద కాదు. ఒక దేశం మాత్రమే తట్టుకోగల నింద. వ్యక్తులు భరించలేరు. తన గురించి అలాంటి అబద్ధపు వార్త ఒకటి వైరల్ అవుతున్నట్లు తెలియగానే మర్వా మొదట ఖిన్నురాలైంది. ఏమిటి ఆ నౌకకు, తనకు సంబంధం! తను నేవీలో కెప్టెనే తప్ప, సరకులను చేరవేర్చే ఓడకు కెప్టెన్ కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారు! ఆలోచించిన కొద్దీ మర్వా మళ్లీ మళ్లీ నివ్వెరపోతోంది. పురుషాధిక్య ప్రపంచంలో ఇలాంటి నివ్వెరపాట్లు ప్రతి మహిళకూ అనుభవంలోనికి వచ్చేవేనని ఆమెకు తెలియంది కాదు. ఒక మహిళపై వచ్చిన నిందను నమ్మేవారు నమ్ముతారు. కానీ, పుట్టించేవాళ్లు ఎలా పుట్టిస్తారు?! ‘‘నాకొకటి అనిపిస్తోంది. అలవాటు లేని రంగంలోనైనా అరుదైన విజయం సాధించిన మహిళలకు ఇలాంటివి తప్పవు. నాకూ అలాగే జరిగి ఉండొచ్చు’’ అంటోంది మర్వా. సముద్రంపై ఒక మహిళ ఉద్యోగం చేస్తోందంటే ఆమెను వీలైనంత త్వరగా ‘ఒడ్డుకు చేర్చేందుకు’ అక్కడి ప్రతికూలతలు అనుక్షణం అలల్లా నెట్టేస్తుంటాయి. ‘ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్’ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద కేవలం 2 శాతం మంది మహిళలు మాత్రమే సముద్ర ఉద్యోగాలు చేస్తున్నారు. మర్వాకు సముద్రం అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని చూసి ఆమె సోదరుడు ఆమె పేరును ఎ.ఎ.ఎస్.టి.ఎం.టి. (అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్)లో నమోదు చేయించాడు. అరబ్ లీగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాంతీయ విశ్వవిద్యాలయం అది. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యా నగరంలో ఉంది. అయితే పురుష అభ్యర్థులకే ఆ యూనివర్సిటీలో ప్రవేశం. మహిళలెందుకు చేరకూడదు అని మర్వా న్యాయపోరాటం చేసింది. ఆ పోరాటంతో స్త్రీలకూ తొలిసారి నేవీ మెరైన్లో ప్రవేశం లభించింది. పట్టు పట్టి చేరాక, నిలదొక్కుకోడానికి మర్వాకు మళ్లీ ఒక పోరాటం చేయడం అవసరమైంది! అదొక పురుష ప్రపంచం. అంతా తనకన్నా వయసులో పెద్దవాళ్లు. మహిళవు, నీకెందుకు ఇవన్నీ అన్నట్లే ఉండేది వారి చూపు, మాట. ట్రైనింగ్ పూర్తయ్యే సరికి మర్వాకు సప్త సముద్రాలలో మనకలేసి వచ్చినంత పనైంది. ‘‘నా మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకునేందుకు నేను చాలా కష్టపడవలసి వచ్చేది’’ అని మర్వా ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బహిర్గతం చేసింది. కోర్సులో పట్టభద్రురాలయ్యాక మర్వా ఫస్ట్ మేట్ (ఫస్ట్ ఆఫీసర్) ర్యాంకుకు చేరుకుంది. ‘ఐదా 4’ శిక్షణ నౌకకు కెప్టెన్ అయింది! సూయజ్ కాలువను 2015లో ఆధునీకరించాక అందులో ప్రయాణించిన తొలి నౌక ‘ఐదా’ నే. అప్పుడే మర్వా.. సూయజ్ కెనాల్పై అతి చిన్న వయసులో నౌకను నడిపిన ఈజిప్టు మహిళగా గుర్తింపు పొందింది. ఆ గుర్తింపును దెబ్బతీసేలా ఇప్పుడు ఏ మూల నుంచో ఆమెపై నింద వచ్చి పడింది! ‘ఎవర్ గివెన్’ నౌకను నడిపి, కెనాల్ బ్లాక్ అవడానికి కారణం అయిందని!! అయితే అది నిలబడే నింద కాదని, సోషల్ మీడియా వికృత కల్పననేని వెనువెంటనే తేలిపోయింది. ఇటీవల సూయజ్ కెనాల్లో ఇరుక్కుపోయిన ‘ఎవర్’ నౌక; (కాలువలో అడ్డుగా, విడిగా) ఎవర్ గివెన్ నౌక ఆ రోజు సూయజ కెనాల్లో బ్లాక్ అయిన సమయానికి మర్వా అక్కడికి కొన్ని వందల మైళ్ల దూరంలోని అలెగ్జాండ్రియాలో ఐదా 4 నౌకలో ఫస్ట్ మేట్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈజిప్టు సముద్ర భద్రతా సంస్థకు చెందినా ఐదా ఆ రోజు ఎర్ర సముద్రంలోని లైట్ హౌస్కు అవసరమైన సామగ్రిని తీసుకువెళుతోంది. అందులో కెప్టెన్గా ఉన్న మర్వా ఫొటోను ఎవర్ గివెన్కు కెప్టెన్గా ఉన్నట్లుగా మార్పులు చేసి నెట్లో కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని ఈజిప్టు నేవీనే స్వయంగా ఖడించడంతో మర్వా కాస్త ఊపిరి పీల్చుకుంది. సోషల్ మీడియాలో కూడా అధిక శాతం మర్వాకు మద్దతుగా నిలబడ్డారు. అయినా మర్వా గురించి ఈజిప్టు నేవీలో గానీ, ఈజిప్టులో గానీ తెలియనివారు లేరు. ధైర్యంగల అమ్మాయి. 2017 మహిళా దినోత్సవం సందర్భంగా నాటి అధ్యక్షుడు అబెల్ ఫతా ఆమెను సత్కరించారు కూడా. వచ్చే నెలలో మర్వా కెప్టెన్ ర్యాంకుకు చివరి పరీక్ష పూర్తవుతుంది. అప్పుడామె రాబోయే యవతరానికి శిక్షణ నిచ్చే కెప్టెన్ కూడా అవుతారు. ‘‘మనం ఒక ఉద్యోగాన్ని ఇష్టపడి చేస్తున్నప్పుడు మన మీద వచ్చే విమర్శలు మన పై, మన పనిపై ఏమాత్రం ప్రతికూల ప్రభావం చూపలేవు’’ అంటోంది మర్వా. l -
సూయెజ్ దిగ్బంధనం నేర్పుతున్న పాఠాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నౌకా రవాణాపై ఎంత అధికంగా ఆధారపడి ఉందనేది సూయెజ్ కాలువలో ప్రమాదం వల్ల తేటతెల్లమైంది. చాలాకాలంగా నౌకారవాణా ప్రాధాన్యత కొనసాగుతూ వస్తోంది. కానీ అంతర్జాతీయ నౌకా పరిశ్రమ చాలావరకు అదృశ్య రూపంలోనే ఉంటోంది. ప్రస్తుత సందర్భంలో ఎవర్ గివెన్ నౌక సూయెజ్ కాలువలో ఇరుక్కుపోవడం అనేది భద్రతాపరమైన ఘటన కాదు కానీ ఇలాంటి ఇరుకైన ప్రాంతాల సంక్లిష్ట స్వభావం గురించి ప్రపంచం ఇకపై చాలా సంవత్సరాలు చర్చించే అవకాశం మెండుగా ఉంది. సూయెజ్ కాలువలో సంభవించినటువంటి తాజా దిగ్బంధన పర్యవసానాలు చాలా రంగాలపై ప్రభావం చూపుతాయి. ఈజిప్ట్లోని సూయెజ్ కాలువకు అడ్డుపడి ఇరుక్కుపోయిన భారీ సరుకు రవాణా నౌక ఎవర్ గివెన్ వారంరోజుల పాటు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిపరిచింది. ఎవర్ గివెన్ నౌక పొడవు 400 మీటర్లు (1,321 అడుగులు), బరువు 2 లక్షల టన్నులు. దీని గరిష్ట సామర్థ్యం 20 వేల సరుకుల కంటైనర్లు. సూయెజ్ కాలువకు అడ్డుపడిన ఘటనలో ఆ మార్గంలో ప్రయాణించే నౌకల ట్రాఫిక్ను ఈ భారీ నౌక పూర్తిగా అడ్డుకుంది. మార్చి 29 సోమవారం వేకువ జామున నౌక పాక్షికంగా కదలడంతో దాన్ని తిరిగి కాలువలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఫలించినట్లయింది. ఇరుకైన ప్రాంతాలగుండా రవాణా షిప్పింగ్ పరిశ్రమ సకాలంలో సరుకులు చేరవేసే అత్యంత సమర్థవంతమైన అనుసంధానాన్ని అందిస్తుంటుంది. అయితే కరోనా మహమ్మారి విరుచుకుపడిన కాలంలో చాలా దేశాలు నౌకల్లో పనిచేసేవారిని కీలకమైన సిబ్బందిగా పరిగణించేంతవరకూ ఈ లింక్ దాదాపుగా బయటకు కనిపించలేదు. నౌకా రవాణాలో సూయెజ్ కాలువ వంటి ఇరుకైన జలసంధి ప్రాంతాలు దిగ్బంధనకు గురైనప్పుడు సముద్ర వాణిజ్యం తప్పనిసరిగా ప్రతిష్టంభనకు గురికావలసిన అవసరం లేదు. సాధారణ పరిస్థితుల్లో సుదీర్ఘ దూరాలకు నౌకల ద్వారా అన్నిరకాల సరుకుల రవాణా కారు చౌకగా సాధ్యపడుతుంటుంది. నౌకలో చేర్చిన సరుకుల ధరతో పోలిస్తే వాటి రవాణా ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. నౌకా రవాణా చార్జీలు అధికంగా ఉంటే అది ఆర్థికంగా మొత్తం మీద పెద్ద సమస్యగా మారుతుంది. కాకుంటే సూయెజ్ కాలువలో సంభవించినటువంటి తాజా దిగ్బంధన పర్యవసానాలు చాలా రంగాలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, చమురు శుద్ధి కర్మాగారాలకు నిత్యం ముడిచమురు అవసరం. ఫ్యాక్టరీలకు ముడిసరుకులు అవసరం. అమ్మడానికి షాపులకు సరుకులు అవసరం. ఇదొక గొలుసుకట్టుగా నడుస్తుంటుంది. భద్రతా ప్రమాదాలు సముద్రయానంలో భద్రతా ప్రమాదాలను అతిశయించి చెప్పడం సులభమే కానీ వాటిని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టంగా ఉంటుంది. సూయెజ్ కాలువలో ప్రతిష్టంభన నేపథ్యంలో ఆఫ్రికా చుట్టూ తిరిగి పోవలసిన మార్గంలో అదనంగా సముద్ర బందిపోట్ల ప్రమాదాన్ని మరీ అతిశయించి చూపుతున్నారని నా ఉద్దేశం. పైగా, అస్థిరతా ప్రాంతమైన సూయెజ్ కాలువ దక్షిణ కొసలో దిగ్బంధన కారణంగా వేచి ఉంటున్న షిప్పులు సముద్ర దొంగల దాడికి అనువుగా ఉంటున్నాయన్న వార్తలు పతాక శీర్షికలెక్కుతున్నాయి కూడా. ఎర్రసముద్రంలో నౌకా రవాణా కార్యక్రమాలకు కొంతమేరకు ప్రమాదం ఉండటం నిజమే కావచ్చు కానీ ఈ పరిస్థితులు రాత్రికిరాత్రే మారిపోవు. సూయెజ్ కాలువ గుండా సరుకుల నౌకల రవాణా కాన్వాయ్ల వారీగా సాగుతుంది కాబట్టి రవాణా నౌకలు ఎల్లప్పుడూ ఎంతో కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. పైగా అన్ని నౌకలకు ప్రమాద స్థాయి ఒకే రకంగా ఉంటుంది కానీ నష్ట ఫలితాలు అనేవి నౌక రకం, సరుకులు, నౌకా యజమాని జాతి వంటి కారణాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టే అనుకోని ప్రమాదాలను అధిగమించడానికి సముచిత చర్యలు తీసుకోవడానికి గాను పరిస్థితులకు అనుగుణమైన అప్రమత్తతో వ్యవహరించవలసి ఉంటుంది. భద్రత, రక్షణ భద్రతకు సంబంధించిన ప్రమాదాన్ని కూడా అదేవిధమైన సావధానతతో చూడాల్సి ఉంది. ఉగ్రవాద దాడుల వంటి ప్రమాదాలు అత్యధిక స్థాయిలో ఆర్థిక విచ్ఛిన్నతకు దారితీస్తాయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలను అత్యంత ఘోర దురంతాలుగా చూపుతుంటారు. సూయెజ్ కాలువ వంటి ఇరుకైన జలసంధి ప్రాంతాల్లో ఇలాంటివాటినే నిర్దిష్ట ప్రమాద హేతువులుగా గుర్తిస్తుంటారు. ఇక భద్రతాపరమైన ప్రమాదాలు పతాక శీర్షికల్లో చోటు చేసుకోవు. నౌకల్లో ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి కానీ ఇవి పెద్దగా చర్చనీయాంశాలు కావు. అయితే చాలా సందర్భాల్లో, భద్రత, రక్షణకు సంబంధించిన వాస్తవ చిక్కులు ఒకేరకంగా ఉంటాయి. నౌకల స్థితిస్థాపకతా శక్తిని పెంచేవిధంగా రూపొందిస్తూ యాజమాన్యాలు తీసుకునే చర్యలకు మరింత ప్రాధాన్యత లభించాల్సి ఉంటుంది. రక్షణకు సంబంధించిన ప్రమాదాలు చాలావరకు అస్థిరంగానూ, భద్రతకు సంబంధించిన ప్రమాదాలు మరింత గతిశీలంగానూ ఉంటాయి కనుక ఈ ప్రాంతంలో అన్ని రకాల ప్రమాదాల గురించి అప్రమత్తతను కలిగి ఉండటం కీలకం. సూయెజ్ కాలువలో జరిగిన ప్రమాదం చాలా అరుదైనది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నౌకా రవాణాపై ఎంత అధికంగా ఆధారపడి ఉందనేది ఈ ప్రమాదం వల్ల తేటతెల్లమైంది. అనేక సంవత్సరాలుగా నౌకా రవాణా ప్రాధాన్యత కొనసాగుతూ ఉంటూ వస్తోంది. కానీ అంతర్జాతీయ నౌకా పరిశ్రమ చాలా వరకు అదృశ్య రూపంలోనే ఉంటోంది. ప్రస్తుత సందర్భంలో ఎవర్ గివెన్ నౌక సూయెజ్ కాలువలో ఇరుక్కుపోవడం అనేది భద్రతాపరమైన ఘటన కాదు కానీ ఇలాంటి ఇరుకైన ప్రాంతాల సంక్లిష్ట స్వభావం గురించి ప్రపంచం ఇకపై చాలా సంవత్సరాలు చర్చించే అవకాశం మెండుగా ఉంది. మానవ నిర్మితమైన సూయెజ్ కెనాల్తో సహా ఇలాంటి ఇరుకైన జలమార్గాలతో పాటు పర్షియన్ గల్ఫ్లోని హోర్ముజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ లేదా మాలే ద్వీపకల్పం, ఇండోనేషియాలోని సుమత్రా దీవి మధ్య ఉండే మలక్కా జలసంధి వంటి సహజ జలమార్గాలు కూడా కీలకమైన సముద్ర మార్గాలుగా ఉంటున్నాయి. వీటి గుండా వాణిజ్య నౌకలు పయనించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు సరఫరాలో జాప్యం, నౌకా రవాణా చార్జీలు పెరిగిపోవడం కూడా జరుగుతుంది. చమురు మార్కెట్లో ఇది ఇప్పటికే కనిపిస్తోంది. కంటైనర్ షిప్పుల విషయానికి వస్తే, ఇప్పటికే కోవిడ్–19 సంబంధిత అంతరాయాలతో కల్లోల పరిస్థితిలో ఉన్నం దున తాజా ఘటన మరింత విషమ పరిస్థితులను నెలకొల్పుతుంది. షిప్పింగ్ పరిశ్రమపై, దాని కొనసాగింపుగా ప్రపంచ వాణిజ్యంపై వాణిజ్య ప్రభావాలు ఇప్పటికే గుర్తించదగిన స్థాయిలో ఉంటున్నాయి. పైగా షిప్పింగ్ పరిధికి మించి అనేక రంగాల్లో దీని పర్యవసానాలు ప్రపంచం అనుభవంలోకి రానున్నాయి. సూయెజ్ కాలువ గుండా నౌకా రవాణాకు ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా ఖండం చుట్టూ సుదీర్ఘంగా సాగిపోయే మార్గం ఒకటుంది. పైగా ఇటీవల సంవత్సరాల్లో వాణిజ్య నౌకల కార్యనిర్వాహకులకు సముద్ర దొంగల దాడి పెద్ద తలనొప్పిగా మారింది. మొదటగా సోమాలియా తీరప్రాంతం.. తర్వాత ఇటీవల గల్ఫ్ ఆఫ్ గినియా ఇందుకు ఉదాహరణలు. ఈ ప్రత్యామ్నాయ మార్గంలో ఎదురవుతున్న సముద్ర దొంగల దాడుల గురించి కొన్ని షిప్పింగ్ కంపెనీలు ఇప్పటికే ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇటీవల సంవత్సరాల్లో సోమాలియా కేంద్రంగా సాగుతున్న సముద్ర బందిపోట్ల దాడులను కాస్త అణచివేశారు తప్పితే పూర్తిగా ఓడించలేదని షిప్పింగ్ పరిశ్రమ సంస్థలు, అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు సూచించాయి. అదే సమయంలో హిందూ మహాసముద్రం గుండా దక్షిణాఫ్రికా వైపు నౌకా ప్రయాణంతో పోలిస్తే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గుండా సూయెజ్ కెనాల్ వైపు పయనించే నౌకలకు సముద్ర దొంగల నుంచి ఎదురవుతున్న ప్రమాదం ఏమంత తక్కువ స్థాయిలో ఉండటం లేదు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ని దాటిన తర్వాత యూరప్ చేరవలసిన నౌక సెనెగల్, కేబో వర్డే మధ్య ఉన్న ఇరుకు జలమార్గం గుండా పయనించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో వెళ్లే ఏ నౌక అయినా సరే పశ్చిమాఫ్రికాలో సముద్ర బందిపోట్లతో తలపడాల్సి ఉంది. పైగా ఆఫ్రికా చుట్టూ మరింత దగ్గర మార్గంలో వెళ్లాలనుకుంటే నైజీరియా నుంచి వెయ్యి నాటికల్ మైళ్ల దూరంలో రవాణా నౌకలు పయనించి తీరాల్సి ఉంటుంది. డిర్క్ సీబెల్స్ వ్యాసకర్త పీహెచ్డీ (సముద్ర భద్రత) స్కాలర్ గ్రీన్విచ్ యూనివర్సిటీ -
‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది
సూయెజ్(ఈజిప్ట్): సూయెజ్ కాలువలో కూరుకుపోయిన అత్యంత భారీ కంటెయినర్ ఓడ ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు వారం క్రితం ఈ ఓడ.. అంతర్జాతీయ సరుకు రవాణాలో కీలకమైన సూయెజ్ కాలువలో అడ్డం తిరిగి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో సూయెజ్ కాలువలో సరుకు రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది. వారం రోజులుగా అంతర్జాతీయ సరుకు రవాణా నిలిచిపోయి, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆ భారీ రవాణా నౌకను కదిలించేందుకు అంతర్జాతీయ నిపుణులు గత వారం రోజులుగా చేస్తున్న కృషి సోమవారానికి ఫలించింది. వాతావరణ పరిస్థితులు, పోటెత్తిన అలలు కొంతవరకు వారికి సహకరించాయి. కూరుకుపోయిన నౌక భాగాన్ని కదిలించేందుకు ఒకవైపు డ్రెడ్జింగ్ చేస్తూ, మరోవైపు 10 టగ్ బోట్లతో వెనక్కు లాగుతూ నిపుణులు ప్రయత్నించారు. అలాగే, నౌక చుట్టూ 18 మీటర్ల లోతు వరకు 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. అనంతరం, కెనాల్ ఉత్తర, దక్షిణ తీరాలకు మధ్యనున్న వెడల్పైన ‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్దకు 2.2 లక్షల టన్నుల బరువైన ఆ నౌకను తీసుకు రాగలిగారు. అక్కడ ఆ నౌకను క్షుణ్నంగా పరిశీలిస్తారు. నౌక సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. నౌక కదులుతున్న దృశ్యాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ‘మెరైన్ట్రాఫిక్.కామ్’ వెబ్సైట్లో పొందుపర్చారు. ఈ విధానం సఫలం కానట్లైతే, నౌకలోని దాదాపు 20 వేల కంటెయినర్లను వేరే షిప్లోకి మార్చి, అనంతరం, బరువు తగ్గిన ఈ నౌకను కదిలించాల్సి వచ్చేది. ఇసుక, బురదలో కూరుకుపోయిన ‘ఎవర్ గివెన్’ నౌకను తిరిగి కదిలించి, ప్రధాన మార్గంలోకి తీసుకువచ్చే బాధ్యతను ‘బొస్కాలిస్’ అనే నౌకా నిర్వహణ, మరమ్మత్తుల సంస్థకు అప్పగించారు. ఆ పని పూర్తికాగానే ‘మా పని పూర్తి చేశాం. సూయెజ్ కెనాల్ అథారిటీస్తో కలిసి మా నిపుణులు ఎవర్గివెన్ను జలాల్లోకి తీసుకురాగలిగారు. ఈ కాలువ ద్వారా రవాణా మళ్లీ ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమమయింది’ అని ఆ సంస్థ సీఈఓ పీటర్ ప్రకటించారు. కాలువ మార్గానికి అడ్డంగా గత మంగళవారం జపాన్కు చెందిన సరకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుపోవడంతో వారం రోజులుగా అంతర్జాతీయ రవాణా నిలిచింది. దాంతో రోజుకు దాదాపు 900 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. సూయెజ్ కాలువ మార్గంలో వారం రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో.. ఎవర్ గివెన్ నౌకను కదిల్చినప్పటికీ.. ఈ కాలువ గుండా సాధారణ స్థాయిలో నౌకల రవాణా జరిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే దాదాపు 367 నౌకలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఇవన్నీ క్లియర్ అయ్యేందుకు 10 రోజులు పడుతుందని రిఫినిటివ్ అనే సంస్థ అంచనా వేసింది. పలు నౌకలు ప్రత్యామ్నాయ, సుదూర మార్గమైన ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ ద్వారా వెళ్తున్నాయి. అంతర్జాతీయ సరకురవాణా వాణిజ్యంలో 10% సూయెజ్ కాలువ ద్వారా జరుగుతుంది. క్రూడాయిల్ రవాణాలో ఈ మార్గం వాటా దాదాపు 7%. గత సంవత్సరం ఈ మార్గం గుండా 19 వేలకు పైగా నౌకలు వెళ్లాయి. -
విశాఖ పోర్టుకు అతి భారీ రవాణా నౌక
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని విశాఖ ఓడ రేవుకు భారీ నౌక వచ్చింది. సోమవారం పోర్ట్ ఇన్నర్ హార్బర్లోకి ఓస్లో అనే అతి భారీ రవాణా నౌక చేరింది. ఈ నౌక 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల భీమ్ కలిగి ఉంది. గత ఏడాది భారీ నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకు వచ్చేందుకు విశాఖ పోర్ట్ అధికారులు సింగపూర్లో సిములేషన్ స్టడీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భారీ నౌక నేటి ఉదయం పోర్టు చేరగా.. అధికారలు ఏడో బెర్త్ను ఇచ్చారు. ఓస్లో భారీ రవాణా నౌక సౌత్ ఆఫ్రికాలోని రిచర్డ్ బే పోర్ట్ నుంచి బయలుదేరి స్టీమ్ కోల్తో విశాఖ పోర్టుకు చేరుకుంది. ఈ రవాణ(కార్గో) నౌక చూపరులను తెగ ఆకర్షిస్తోంది. పోర్టు చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఇటువంటి భారీ లోడ్ను కలిగిన కార్గో నౌక రావటం గొప్ప విషయమని ఓడరేవు అధికారులు భావిస్తున్నారు. -
పొట్టకూటికెళ్లి అగ్నికి ఆహుతి
విశాఖపట్నం, సబ్బవరం(పెందుర్తి): తండ్రి లేని లోటు కనిపించకుండా కుటుంబానికి అండగా నిలవాలని... తల్లిని చక్కగా చూసుకుని, సోదరికి పెళ్లి చేయాలని... పొట్ట చేతపట్టుకుని ఇరాన్ వెళ్లిన యువకుడు అగ్నికీలలకు ఆహుతైపోయాడు. తల్లి, సోదరి గుండెల్లో మంటలు నింపాడు. 25 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయా కొడుకా అంటూ ఆ తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేస్తోంది. చేతికందొచ్చిన కొడుకు తనువుచాలించడంతో మాకెవరు దిక్కంటూ భోరున విలిపిస్తున్నారు. ఈ హృదయవిదారకర ఘటనతో సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఆరిపాకకు చెందిన పిల్లా మోహన్ వెంకట అప్పలనాయుడు(25) చెన్నైలో 2012వ సంవత్సరంలో మెరైన్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. వెంకట అప్పలనాయుడు తండ్రి శ్రీనివాసరావు గతంలో మరణించాడు. ప్రస్తుతం తల్లి భవానీ, వివాహం కాని సోదరి దివ్యకుమారి ఉన్నారు. ఈ నేపథ్యంలో కుంటుంబానికి అండగా నిలిచేందుకు వెంకట అప్పలనాయుడు ఇటీవల ఇరాన్కు చెందిన ‘‘ఎరై మాక్రాన్ సి’’ అనే కంపెనీలో 9 నెలలు పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఈ సంవత్సరం జూన్లో విధుల్లో చేరాడు. అలారం వినిపించక మంటలకు చిక్కి... ఈ నేపథ్యంలో ఇరాన్ సముద్ర తీరంలో ఆలీ – 20 అనే కార్గో షిప్లో 12 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా శుక్రవారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో షిప్లో ఉండగా... ఒక ఫ్లోర్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అలారం మోగడంతో 10 మంది సిబ్బంది అప్రమత్తమై వెలుపలికి వచ్చేశారు. షిప్ నుంచి దూరంగా వెళ్లిపోయారు. అయితే వెంకట అప్పలనాయుడుతో పాటు హర్యానాకు చెందిన మరో వ్యక్తి చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంతో అలారం వినిపించక ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. అగ్ని కీలలకు ఆహుతై మృతిచెందారు. మంటలు చల్లారాక షిప్ వద్దకు చేరుకున్న మిగిలిన సిబ్బంది ఇద్దరు మృతి చెందిన విషయాన్ని గుర్తించారు. వారి ద్వారా మరణ వార్తను విశాఖలోని పల్ల మార్కెట్లో ఉంటున్న వెంకట అప్పలనాయుడు స్నేహితుడు భార్గవ్ తెలుసుకుని ఆరిపాకలోని కుటుంబ సభ్యులకు శనివారం తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు షిప్లో పనిచేస్తున్న కురు అనే ఉద్యోగికి ఫోన్ చేయడంతో ఆయన అప్పలనాయుడు మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో తల్లి భవానీ, సోదరి దివ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మాకు దిక్కు ఎవరిని గుండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామస్తులంతా వారిని ఓదార్చుతూ మద్దతుగా నిలిచారు. జరిగిన ప్రమాదంపై కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సాయంతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్కు తెలియజేశారు. భారత దౌత్య కార్యాలయం అధికారులు ప్రమాదంపై స్పందించి తన కుమారుని మృతదేహన్ని అప్పగించడంతో పాటు, తమకు న్యాయం చేయాలని తల్లి, సోదరి వేడుకుంటున్నారు. -
కోతి భయంతో ఆగిన నౌక
టీ.నగర్: చెన్నై హార్బర్ నుంచి బయలుదేరాల్సిన ప్రైవేటు కార్గో షిప్ దారి తెలియకుండా వచ్చిన కోతి కారణంగా మూడు రోజులు ఆగిపోయింది. చెన్నై హార్బర్లో కంటైనర్ల లోడింగ్, అన్లోడింగ్ కోసం నౌకలను నిలిపేందుకు వార్ప్ ప్రాంతంలో స్థలం కేటాయించారు. ఈ ప్రాంతంలో లంగరు వేసి నిలిపేందుకు హార్బర్ రవాణా శాఖ అధికారుల అనుమతి పొందాలి. వాణిజ్యపరంగా ఇక్కడ నౌకలు నిలుపుతున్నందున అద్దె వసూలు చేస్తారు. హార్బర్లో నిలిపేందుకు అనుమతి తీసుకునే ముందు తగిన ఏర్పాట్లను నౌక యాజమాన్యాలు చేస్తాయి. అంతవరకు హార్బర్ వెలుపల నౌకలను నిలిపి ఉంచుతారు. ఇలాఉండగా ప్రైవేటు సంస్థకు చెందిన కార్గో నౌక గత వారం చెన్నై హార్బర్ చేరుకుంది. హార్బర్ రవాణా విభాగం అనుమతితో స్థలాన్ని పొంది నౌక నిలిపిఉంచారు. సరుకులను దింపే పనులు ముగిసిన తర్వాత శుక్రవారం నౌక బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో నౌకలోకి ఒక కోతి ప్రవేశించినట్లు సిబ్బంది కెప్టెన్కు సమాచారం తెలిపారు. దీంతో కెప్టెన్ హార్బర్ అటవీ శాఖ అధికారుల సాయం కోరారు. దీంతో చెన్నై అటవీ శాఖ రేంజర్ మోహన్ ఆధ్వర్యంలోని అధికారులు శనివారం నౌకలో తనిఖీలు చేశారు. కోతి కనిపించకపోవడంతో వారు వెనుదిరిగారు. మళ్లీ కోతి ఉందని సమాచారం అందడంతో ఆదివారం మళ్లీ తనిఖీలు చేశారు. చివరిగా నౌకలో కోతి లేదని వెల్లడించడంతో శుక్రవారం బయల్దేరాల్సిన ఆ నౌక సోమవారం బయల్దేరి వెళ్లింది. -
వెండి సంద్రం
ఈ చిత్రం చూస్తుంటే తారు రోడ్డుపై షిప్ వెళుతున్నట్టు ఉంది కదూ! విశాఖ సముద్ర తీరానికి సుమారు 50 కిలోమీటర్ల దురంలో నడి సంద్రంలో ఈ దృశ్యం ఆవిష్కతమైంది. సముద్రాన్ని సూర్యకిరణాలు తాకుతుండగా వెండి మబ్బుల్లో ఈ కార్గో షిప్ వెళుతున్నట్లు కనిపించింది. -సాక్షి, ఫొటోగ్రాఫర్ -
బలమైన గాలులకు గోడను ఢీకొట్టిన కార్గోషిప్
-
నౌకలో భారీగా ఆయుధాలు, బాంబులు