dirty politics
-
పాన్ ఇండియా కల్తీ లీడర్స్.. కోడై కూస్తున్న నేషనల్ మీడియా..
-
చంద్రబాబు కెరీర్లోనే ఇది వరస్ట్ రాజకీయమట!
రాజకీయాల్లో సుద్దపూసలు భూతద్దంతో వెతికితేనే కనిపిస్తారని ఓ మహానుభావుడన్నాడు. చంద్రబాబులాంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేత ఆ కోవ కిందకు అసలే రారు. తాజాగా తిరుమల ప్రసాదంపై ఆయన చేసిన ప్రేలాపనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అదే టైంలో.. మునుపెన్నడూ లేనివిధంగా దిగజారిపోయి మరీ ఆయన మత రాజకీయాలకు దిగడం చూస్తున్నాం.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బీజేపీతో ఎన్డీయే పొత్తులో ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు జాతీయ మీడియాను కూడా బాగానే మేనేజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుపతి లడ్డూపై ఆయన కామెంట్లను అవి హైలెట్ చేసిన తీరే అందుకు నిదర్శనం. అయితే అందుకు భిన్నంగా ఓ ఆంగ్ల మీడియాలో ప్రచురితమైన సంచలనాత్మక వ్యాసం .. ఇప్పుడు చర్చనీయాంశమైంది.తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న రాజకీయాన్ని ఆ ఆర్టికల్ ఫుల్లుగా ఏకీపారేసింది. ముఖ్యంగా చంద్రబాబు తన స్వార్థ రాజకీయం కోసం ఆధారాల్లేకుండా చేసిన ఆరోపణలు.. ఆ ఆరోపణలను ఎలా అనుకూలంగా మార్చుకోవాలని చూసింది కపిల్ కోమిరెడ్డి ఆ వ్యాసంలో విశ్లేషించారు.చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, వాస్తవాల వక్రీకరణ, తప్పుడు ప్రచారాలను విపులంగా అందులో వివరించారు. అదే టైంలో.. చంద్రబాబు కొత్తగా మొదలుపెట్టిన మతపరమైన రాజకీయాలనూ ప్రశ్నించారు. బాబు జిత్తులమారి రాజకీయానికి నిజనిర్ధారణతో సంబంధం లేకుండా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలాంటి వాళ్లు పడిపోవడం సైతం ఆ ఆర్టికల్లో ప్రస్తావించారు.ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు మార్క్ కన్నింగ్ రాజకీయం రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎలా నడిచిందనేది సైతం డిటైయిల్డ్గా చర్చించింది ఆ వ్యాసం. తండ్రి వైఎస్సార్ బాటలో అన్ని మతాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఆదరించింది.. అయినా కూడా జగన్పై హిందూ వ్యతిరేకి ముద్ర వేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని టచ్ చేసింది.తిరుపతి ఆలయ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు.. ఉద్దేశపూర్వకమైనవేనని, పక్కా రాజకీయ లబ్ధి కోసమేనని కుండబద్ధలు కొట్టారు కపిల్. అలాగే.. ఆయన సుదీర్ఘ రాజకీయంలో ఇదే అత్యంత దిగజారిన పరిణామమని అభిప్రాయపడ్డారు.చివరగా.. రాజకీయ సంస్కృతిలో మతాన్ని జొప్పించడం ద్వారా చంద్రబాబు ఘోరమైన తప్పిదమే చేశారని, ఏపీ ప్రజానీకం బాబు కుట్రలను, కుతంత్రాన్ని అర్థం చేసుకోగలరని ఆ వ్యాసం విశ్లేషించింది. ఏపీలో అధికారం ఎల్లవేళ ఒకే పార్టీ దగ్గర ఉండదనే విషయాన్ని ప్రస్తావించింది. మత రాజకీయం చేద్దామనుకున్న చంద్రబాబు ప్రయత్నం.. బెడిసి కొట్టడమే కాకుండా జీవితాంతం ఆయన్ని, ఆయన రాజకీయ వారసత్వాన్ని వెంటాడుతూనే ఉంటుందని ఆ ఆర్టికల్ పేర్కొంది. ప్రింట్ ఆంగ్ల వ్యాసం కోసం క్లిక్ చేయండి -
కడపలో టీడీపీ చెత్త పాలిటిక్స్.. భగ్గుమన్న వైఎస్సార్సీపీ
వైఎస్సార్ కడప, సాక్షి: వైఎస్సార్ కడపలో టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్కు పాల్పడ్డారు. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గత మూడు రోజులుగా చెత్తపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చెత్తను కార్పొరేటర్లు మేయర్ ఇంటి ముందు వెయ్యాలని టీడీపీ నేతలను మాధవి రెడ్డి రెచ్చగొట్టారు. దీంతో ఇవాళ టీడీపీ నేతలను మేయర్ ఇంటి వద్దకు పంపించి చెత్తను వేయాలని ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్యే, నేతలు చేస్తున్న చెత్త పాలిటిక్స్పై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో ఇలాంటి రెచ్చగొట్టి రాజకీయాలు చేయవద్దని వైఎస్సార్సీపీ నేతలు సూచిస్తున్నారు. ఇన్ని ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెచ్చగోట్ట రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.మేయర్ ఆగ్రహంతన ఇంటి ముందు చెత్త వేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట మేయర్ సురేష్ బాబు ధర్నాకు దిగారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరి ధర్నాలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సురేష్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చెత్త పై టీడీపీ నేతలను రెచ్చగొట్టి తన ఇంటి ముందు చెత్త వేసేలా ఎమ్మెల్యే చేయడం దుర్మార్గం. హుందాగా వ్యవహరించాలని గతంలోనూ ఆమెను మేం కోరాం. గెలిచిన మూడు నెలలకే ఇలాంటి నీచపు రాజకీయాలా?. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. కడపలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవు. టీడీపీ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. ఇంటికొచ్చి చెత్త వేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడపలో అల్లర్లు చేస్తున్నారు. హత్యారాజకీయాలు చేస్తున్నారు. నా ఇంటి ముందు చెత్త వేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కఠినంగా శిక్షించాలి. -
టీడీపీ నీచ రాజకీయంపై నవాజ్ భాషా ఫైర్
-
KSR Comment: భూతం ఎవరు ?.. చంద్రబాబు రెండు నాలుకలు
-
టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి డర్టీ పాలిటిక్స్.. మహిళను నిర్బంధించి..
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ దుర్మార్గపు రాజకీయాలకు అంతులేకుండా పోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు వెస్ట్ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తుండగా, విడదల రజిని అనే పేరుగల మరొక మహిళ చేత నామినేషన్ వేయించడానికి గల్లా మాధవి ప్రయత్నించింది.మూడు రోజుల నుంచి గల్లా మాధవి ఉంటున్న అపార్ట్మెంట్లో విడదల రజిని అనే మహిళను నిర్బంధించారు. తన కుమార్తె విడుదల రజినిని కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళను అపార్ట్మెంట్ నుంచి నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని.. తండ్రికి అప్పగించారు.కాగా, గల్లా మాధవిపై ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ప్రచారం నిర్వహించినందుకు రెండు పోలీసు కేసులు నమోదయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ వేసిన గళ్లా మాధవి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పోలీసు కేసుల వివరాలతోపాటు పెద్ద ఎత్తున స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు చూపారు. -
చంద్రబాబు డర్టీ పాలిటిక్స్...కెఎస్ఆర్ కామెంట్స్
-
సూత్రధారి కుటిలనీతి చంద్రబాబు
-
కాంగ్రెస్ చెత్త రాజకీయాలకు దేవుడే గుణపాఠం చెప్తాడు
-
మా కుటుంబాన్ని విడదీసే కుట్ర..కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్
-
ప్రజల దృష్టి మరల్చేందుకే బాబు క్షుద్ర రాజకీయం
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు వికృత రాజకీయానికి తెర తీశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఓటమి భయంతోనే గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడితో సీఎం వైఎస్ జగన్ను అసభ్యంగా తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఉండవల్లిలోని అక్రమ నివాసంలో ఉంటూ చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే జోగి రమేష్పై దాడికి దిగడం దారుణమన్నారు. చంద్రబాబు తన కాపలాకుక్క బుద్ధా వెంకన్న, కాల్మనీ బ్యాచ్, టీడీపీ గూండాలను ఉసిగొల్పి దాడి చేయించడంతోపాటు జోగి వాహనాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు క్షుద్ర రాజకీయాలను కట్టిపెట్టాలని హితవు పలికారు. సీఎం వైఎస్ జగన్, మంత్రులకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే.. రాష్ట్రంలో ఎక్కడా చంద్రబాబును తిరగనివ్వబోమన్నారు. గంజాయి డాన్గా అయ్యన్న కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని.. అందులో చంద్రబాబుకు వాటా ఇచ్చారని విమర్శించారు. అయ్యన్నకు, పిచ్చికుక్కకు ఏమీ తేడా లేదన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సాయంత్రం పెగ్గు వేస్తే తప్ప.. పనిచేయలేకపోయేవారని టీడీపీ నేతలే చెప్పేవారన్నారు. ఇప్పుడు అధికారం పోవడంతో పగలు, రాత్రి తేడా లేకుండా పెగ్గు వేస్తున్నారేమోనన్నారు. అయ్యన్న తినేది అన్నమేనా? అయ్యన్న అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. అయ్యన్న అవినీతి, అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టమొచి్చనట్లు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు గతంలో దళితులను అవమానించారన్నారు. బీసీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే తోకలు కత్తిరిస్తానని హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. జోగి రమే‹Ùపై టీడీపీ నేతలు దాడి చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. దిశ ప్రతులు తగలబెట్టిన లోకేష్ కూడా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ఎంపీ నందిగం సురేష్ ధ్వజమెత్తారు. -
డాక్టర్ డ్రామా : అయ్యన్నపై సోదరుడి ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కూడా టీడీపీ నాయకులు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఓ వైద్యుడితో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించి అడ్డంగా బుక్కయ్యారు. అయితే అయ్యన్న చేసినపనిపై ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెధవ రాజకీయాలు చేయడంపై మండిపడ్డారు. మొదటి నుంచి అయ్యన్నకు కుట్ర పూరితమైన రాజకీయాలు చేయడం అలవాటేనని ఆయన సోదరుడు తెలిపారు. అయ్యన్న వ్యవహార శైలి ఎప్పుడు వివాదస్పదమేనని గుర్తుచేశారు. ఓడిన ప్రతిసారి అయ్యన్న తీరుమారిపోతుందని అన్నారు. అయ్యన్నను కలవడానికి వెళ్లానని ఒప్పకున్న డాక్టర్ను విచారించి అసలు దోషులను శిక్షించాలని పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు. అసలేం జరిగిందంటే.. ఓ వైపు కరోనా రక్కసి విజృంభిస్తుంటే.. మరోవైపు దాన్ని మించి పచ్చ కరోనా వైరస్ విషం చిమ్ముతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మరకలు అంటిండానికి కుట్రలు, కుతంత్రాలతో పెచ్చరిల్లుతోంది. నర్సీపట్నంలో జరిగిన మత్తు డాక్టర్ ఎపిసోడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తమిళనాడు నుంచి నర్సీపట్నం వచ్చి బస చేసిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అధికారులతో సోమవారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికార యంత్రాంగంతో సమీక్షించారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ సమీక్ష జరుగుతుంటే.. అనస్థీషియా డాక్టర్ సుధాకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వచ్చి రంకెలు వేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఆయన రాజకీయాలను ప్రస్తావిస్తూ.. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంతా బాగుండేదని చేసిన వ్యాఖ్యలతోనే ఇదంతా డ్రామా అని స్పష్టమైంది. ఆ తర్వాత బయటికొచ్చిన వీడియోలతో మొత్తం కుట్ర బట్టబయలైంది. సమావేశానికి ముందు సదరు డాక్టర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్ళి గంటన్నర సేపు ఉండటం.. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే టీడీపీకి అనుకూలంగా మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శించడంతో మొత్తం స్క్రీన్ప్లే అయ్యన్న ఇంటి నుంచే నడిచిందని అర్ధమైంది. డాక్టర్ నిజ స్వరూపమూ బయటపడింది. వివాదాస్పద ట్రాక్ రికార్డ్ సస్పెన్షన్లు, షోకాజ్లు, నిత్యం వివాదాలు.. ఇదే డాక్టర్ సుధాకర్ ట్రాక్ రికార్డ్గా కనిపిస్తోంది.. విధులకు ఆలస్యంగా వస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే.. మీ సంగతి తేలుస్తానంటూ బెదిరించడం, నానాయాగీ చేయడం అతనికి పరిపాటిగా మారింది. గతంలో అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయ్యారు. ఇటీవల నర్సీపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్తో వివాదం కూడా పోలీస్స్టేషన్ వరకు వెళ్ళింది. కరోనా వేళ... సెలవులు కావాలని ఒత్తిడి చేయడం, విధులకు ఆలస్యంగా రావడం, నిర్లక్ష్యంగా పనిచేయడం.. బరితెగించి టీడీపీ నేతలతో కలిసి కుట్రలకు దిగడం ద్వారా సుధాకర్ వివాదాస్పద తీరు పరాకాష్టకు చేరిందన్న వ్యాఖ్యలు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. చదవండి : డాక్టర్ సుధాకర్పై సస్పెన్షన్ వేటు -
రాజకీయాల్లో విలువలెక్కడ?
సాక్షి, హైదరాబాద్ : ‘మహిళలపై హింస పెరిగింది. అనేక రకాల హింసలను ఎదుర్కొంటున్నారు. ఏటా గృహ హింస కేసులు వందల్లో నమోదవుతున్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ హింస గురించి మాట్లాడడం లేదు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా’.. ప్రముఖ మహిళా హక్కుల నేత, రాజనీతిశాస్త్ర అధ్యాపకులు, ప్రొసర్ఫె రమా మెల్కోటే ఆవేదన ఇది. అనేక దశాబ్దాలుగా మహిళల సమస్యలపై పోరాడే సంస్థలతో కలిసి పనిచేస్తున్నారామె. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీల భాగస్వామిగా నిలిచారు. కానీ ఏ ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు మహిళల పక్షాన మాట్లాడకపోవడం పట్ల ప్రొఫెసర్ రమా మెల్కోటే విస్మయం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హింస, లైంగిక దోపిడీ పెరిగాయని, అయినా రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో మహిళల సమస్యలు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అల్వాల్లో నిన్న ఆరేళ్ల పసిపాపను దుర్మార్గులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపారు. 48 గంటలు గడిచాయి.. కానీ ఏ రాజకీయ పార్టీ గొంతు విప్పలేదు. బాధిత కుటుంబాన్ని ఓదార్చిన దాఖలా లేదు. స్థానిక ప్రజలు, స్కూల్ పిల్లలు ఆందోళన చేశారు. కానీ నాయకులు, పార్టీలు మాత్రం ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. మహిళలపైనా, పిల్లలపైన జరుగుతున్న హింసను గురించి ఏ పార్టీ పట్టించుకోవడం లేదనేందుకు ఇంతకంటే నిదర్శనం మరేముంటుంది. మహిళలపై గృహహింస పెరిగింది. ఇంట్లోకి, బయటకు పెద్దగా తేడా లేదు. లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. అత్యంత అమానవీయమైన పద్ధతిలో పరువు హత్యలు జరుగుతున్నాయి. ఒకచోట కన్న కూతుళ్లనే కిరాతకంగా హతమార్చే తండ్రులు ఉంటే, మరో చోట అగ్రకుల అహంకారంతో హత్యలు చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి గూడూరులో ఇలాంటి హత్యలే జరిగాయి. మహిళలపై ఎక్కడ ఏ రూపంలో హింస జరిగినా మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మాత్రమే మాట్లాడుతున్నాయి.. ఆందోళనలు చేస్తున్నాయి. మహిళా సంఘాల పోరాటాలే జరుగుతున్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీలైనా మహిళా హింసకు వ్యతి రేకంగా పోరాడుతున్నాయా..? మహిళలకు సంబంధించిన అంశాల పట్ల ఇంచుమించు అన్ని పార్టీలు ఒకే తాను ముక్కల్లా వ్యవహరిస్తున్నాయి. ఇది చాలా దారుణం. దరిద్రపు రాజకీయాలు ఇవి.. రాజకీయ పార్టీలు, నాయకుల వైఖరులు పూర్తిగా డబ్బు చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. రాజకీయాలను వ్యాపారంగా మార్చు కుంటున్నారు. పెట్టుబడులు పెట్టి లాభాలను రాబట్టుకుంటున్నారు. డబ్బులు, మద్యం ఏరులై పారిస్తున్నారు. ఎక్కడా రవ్వంత విలువలకు స్థానం లేదు. చాలా దరిద్రపు రాజకీయాలు ఇవి. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదు. తిరిగి మరే పార్టీకి మారుతారో తెలియదు. ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానిస్తున్నారు. దీర్ఘకాలికమైన సమస్యల పట్ల ఒక దృక్పథం లేదు. ఒకప్పుడు రాజకీయ నాయకులు తమ పార్టీల ఆలోచనలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. తాము నమ్మిన విలువలను ఆచరించారు. అక్రమార్జనే ధ్యేయంగా పార్టీలు మారడాన్ని ఎంతో అవమానంగాభావించారు. కానీ ఇప్పుడు.. ఎలాంటి విలువలు ఎక్కడా లేవు.. చాలా హాస్యాస్పదంగా ఉంది. వీళ్లా రాజకీయ నాయకులు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ల గురించి ఏం మాట్లాడగలం’ అంటూ ముగించారు. -
‘చంద్రబాబు మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదు’
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం 20వేల రూపాయలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోని పక్షంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రంలో ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రులు ఉన్నారా అని ప్రశ్నించారు. చుక్క భూములు కూడా పెద్ద స్కాం అని ఆరోపించారు. ఆ భూములను చంద్రబాబుకి చెందిన వ్యక్తులకు ధారాదత్తం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసును హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర డీజీపీకి చట్టాలు తెలుసా? తెలియవా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అబద్ధాలకు అవార్డ్స్, రివార్డ్స్ ఇస్తే చంద్రబాబుకు ఇవ్వచ్చని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని.. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 100 రోజులు ఆగితే ప్రజా వ్యతిరేకత అంటే ఏమిటో చంద్రబాబుకు తెలుస్తుందన్నారు. త్వరలో వైఎస్సార్ సీపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.. చంద్రబాబు నాయుడు ఓ వీడియో ప్లే చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మిథున్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మదనపల్లిలో ఆగస్టు నుంచి తిప్పారెడ్డి 60వేల గడియారాలు పంచుతున్నారని తెలిపారు. ఓ గడియారంలో టీఆర్ఎస్ ఫొటో ఉంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కుట్ర కోణమని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ను పిలవలేదా అని గుర్తుచేశారు. ఓటుకు కోట్లు కేసులో అప్పటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డికి ఇచ్చింది మీ డబ్బు కాదా అని నిలదీశారు. నందమూరి హరికృష్ణ మృతదేహం దగ్గర టీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించారని కేటీఆర్ చెబితే.. అందులో తప్పేముందని చంద్రబాబు వ్యాఖ్యానించడం చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంటో అర్థమవుతుందన్నారు. వైఎస్సార్ సీపీకి ఎవరితోను కుమ్మక్కు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తామని పేర్కొన్నారు. -
రాష్ట్ర డీజీపీకి చట్టాలు తెలుసా? తెలియవా?
-
హత్యా రాజకీయాలు బైరెడ్డి నైజం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : హత్యా రాజకీయాలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబం నైజమని వైఎస్ఆర్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. స్మగ్లింగ్, హత్యలు, దొంగసారా వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడించిన బైరెడ్డి బండారం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. నాలుగేళ్ల పాటు సీఎం చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్తున్నారని విమర్శించారు. గౌరు వెంకటరెడ్డి కుటుంబంపై విమర్శలు చేయడానికి ఆయనకు అర్హత ఏముందని ప్రశ్నించారు. మంగళవారం ఆమె కర్నూలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ కుటుంబం శాంతియుతంగా నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేస్తోందన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా పాణ్యం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. బైరెడ్డి సొంత గ్రామంలో సైతం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సీసీరోడ్డు వేయించానని చెప్పారు. పాణ్యం అభివృద్ధిపై దమ్ముంటే బైరెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్నాయంటే హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గత ఎన్నికల సమయంలో నందికొట్కూరు మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు సాయిఈశ్వర్ను హత్య చేయించడం, రెండు రోజుల క్రితం కర్నూలులో రఘురామిరెడ్డిపై కొడుకు సిద్దార్థరెడ్డితో దాడి చేయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మరోవైపు బైరెడ్డి మాత్రం అందరూ తన ఆప్తులే అని చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన హత్యా రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. ఆయన చెప్పించిన తప్పుడు సాక్ష్యాల వల్ల గౌరు వెంకటరెడ్డి జైలుకు వెళ్లి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బైరెడ్డిని ప్రజలు ఎప్పుడో మరచిపోయారని, నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన పార్టీకి 154 ఓట్లు రావడం, గత పాణ్యం ఎన్నికల్లో కూతురు శివానికి 500 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ను కోల్పోవడం నిదర్శనమన్నారు. 2004 నుంచి కూడా తమదే పైచేయి అన్నారు. 2004లో తాను బైరెడ్డిపై ఎమ్మెల్యేగా గెలిచానని, 2009లో తాము బలపరిచిన అభ్యర్థి గెలుపొందారని, 2014లో మళ్లీ తానే గెలుపొందానని వివరించారు. ఇప్పుడు ఉనికి కోసమే బైరెడ్డి కుటుంబీకులు హత్యలు, దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. రెండు నియోజకవర్గాల్లోని ప్రజలకు గౌరు కుటుంబ వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. బైరెడ్డికి నిజంగా దమ్ము ఉంటే 2019లో జరిగే ఎన్నికల్లో పాణ్యం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు తీగల కృష్ణారెడ్డి, అబ్దుల్ రహమాన్, ఫీరోజ్, ఓసీఎం రంగ, కరుణాకరరెడ్డి, శ్రీధర్రెడ్డి, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆయనతో కష్టమే!
సీనియర్ అని గౌరవమో... లేక ఓల్డేజ్ గైతో రొమాన్స్లో పసలేదనో... మొత్తానికి మల్లికాషెరావత్ మనసులో మాటైతే బయట పెట్టేసింది. ‘డర్టీ పాలిటిక్స్’ సినిమాలో ఓంపురితో కలసి చేసిన మల్లిక... ఆయనతో ‘బోల్డ్’ సీన్స్లో నటించడం ఎంతో కష్టమంటోంది. అయితే... ఆయన ‘ఎక్స్పీరియన్స్’ తనను కంఫర్టబుల్గా మార్చేసిందని వెంటనే కవరింగ్ ఇచ్చేసింది. ‘ఈ సినిమాలో ఓంపురితో నాకు కొన్ని బోల్డ్ సన్నివేశాలున్నాయి. తొలుత ఎలా చేయాలో ఆందోళన పడ్డా. కానీ ఆయన అనుభవం నాలోని ఆందోళన పోగొట్టింది. నిజంగా ఆయన ఓ ప్రొఫెషనల్’ అంటూ తన ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుందీ సెక్సీ తార! కెరీర్లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని... గాడ్ఫాదర్ ఎవరూ లేకనే ఈ పరిస్థితని గోడు వెళ్లబోసుకుంది. -
మల్లికా షెరావత్ పై మరో కేసు నమోదు
హైదరాబాద్: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్పై ఫలక్ నుమా పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఆమె నటించిన డర్టీ పాలిటిక్స్ అనే హిందీ చిత్రం ప్రచార పోస్టర్లో మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని అవమానకర రీతి లో ధరించించారని నగరానికి చెందిన ఖాదిర్, సమూద్దీన్ లు స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. ఆమెపై కేసు నమోదు చేయాలని ఆదేశింనట్లు అసిస్టెంట్ కమీషనర్ మహ్మద్ అబ్దుల్ బారీ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు మల్లికా షెరావత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. డర్టీ పాలిటిక్స్ చిత్ర పోస్టర్లలో బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తన ఒంటికి జాతీయ పతాకాన్ని చుట్టుకుని అవమానించారని ఫిర్యాదులు రావడంతో ఆమెపై ఇప్పటికే పలుకేసులు నమోదైన సంగతి తెలిసిందే. -
నటి మల్లికా షెరావత్పై కేసు నమోదు
కరీంనగర్: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్పై కరీంనగర్ మూడో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఆమె నటించిన డర్టీ పాలిటిక్స్ అనే హిందీ చిత్రం ప్రచార పోస్టర్లో మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని అవమానకర రీతి లో ధరించించారని కరీంనగర్కు చెందిన న్యాయవాది బేతి మహేందర్రెడ్డి గురువారం అదనపు ఫస్ట్క్లాస్ జుడిషియల్ మేజిస్ట్రేల్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన న్యాయమూర్తి అజర్ హుస్సేన్ దర్యాప్తు నిమిత్తం కరీంనగర్ మూడో పట్టణ పోలీస్స్టేషన్కు పంపించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నటి మల్లికా షెరావత్పై గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
మల్లికా షరావత్ పై కేసు నమోదు
-
మల్లికా షెరావత్కు హైకోర్టు నోటీసులు...
సాక్షి, హైదరాబాద్: డర్టీ పాలిటిక్స్ చిత్ర పోస్టర్లలో బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తన ఒంటికి జాతీయ పతాకాన్ని చుట్టుకుని అవమానించారని, ఆమెపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన టి.ధనగోపాల్రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, బీఎంబీ మ్యూజిక్, మల్లికా షెరావత్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
మల్లికా షెరావత్కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : బాలీవుడ్ నటి మల్లికా షెరావత్కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో జాతీయ జెండాను అవమానపరిచారని దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం ఈమేరకు స్పందించింది. నిర్మాతతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. బాలివుడ్ నటి మల్లికా షెరావత్పై హైకోర్టులో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. డర్టీ పాలిటిక్స్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో జాతీయ పతాకాన్ని అవమానిచే విధంగా ధరించినందుకు మానవ హక్కుల కార్యకర్త ధన్గోపాలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. మల్లికా షెరావత్పై చర్య తీసుకోవాల్సిందిగా కోర్టుకు పిర్యాదు చేసారు. సినిమా ఫస్ట్లుక్లో మల్లిక షెరావత్ ఒక అంబాసిడర్ కారుపై అభ్యంతరకరంగా త్రివర్ణ పతాకాన్ని ధరించి ఉన్నట్లుగా రూపొందించారు. దీనిపై స్పందించిన ధన్గోపాలరావు మువ్వన్నెల జెండాను వ్యాపార పరంగా వినియోగించడం దేశ గౌరవాన్ని అవమానించినట్లేనని ఇకపై చిత్ర నిర్మాత ప్రమోషన్ కోసం ఆ పోస్టర్ను వినియోగించరాదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఈ చర్యకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు మల్లికాకు నోటీసులు ఇచ్చింది. కాగా ఇదే వివాదంపై రాజస్థాన్ లోనూ కేసు నమోదు అయ్యింది. -
మువ్వన్నెల జెండాతో దుశ్చర్య
సినిమా తీసేవాళ్లకే కాదు, చేసేవాళ్లకు కూడా నైతికత అవసరం. అది లేకపోతే... వాళ్లకే కాదు... సమాజానికీ ఎంతో నష్టం. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే వెండితెరపై... దేశ ప్రతిష్ఠకే మచ్చ తెచ్చే కథాకథనాల్ని, పాత్ర చిత్రణల్ని, ఆహార్యాల్ని ప్రోత్సహించడం ఒక రకంగా క్షమించరాని నేరం. బాలీవుడ్లో మల్లికా శరావత్ చేసిన ఓ దుశ్చర్య... ప్రస్తుతం ఈ స్థాయి విమర్శలకు కారణం అయ్యింది. ఆమె నటిస్తున్న ‘డర్టీ పాలిటిక్స్’ సినిమాకు సంబంధించిన దృశ్యాలను ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ముందు చిత్రీకరించారు. జాతీయ జెండాను ఒంటికి చుట్టుకొని ప్రభుత్వ వాహనంపై కూర్చొని రెచ్చగొట్టే భంగిమలు మల్లిక ఇస్తుండగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. పైగా మల్లికా తన నగ్న దేహానికి మువ్వన్నెల జెండాను చుట్టుకున్న స్టిల్ని ఈ సినిమా ఫస్ట్ లుక్గా విడుదల చేయడం మరో దారుణం. మొత్తంగా ఈ చిత్రం బృదం చేసిన దుశ్చర్య తీవ్రమైన వివాదానికి తెర లేపింది. జాతీయ జెండాను ఇలా అవమానించడం బాధాకరమే కాక, క్షమించరాని నేరం. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. -
పచ్చి పచ్చ దగా
-
షర్మిళతో సాక్షి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
-
ప్రజలే జగన్ను బయటికి తెచ్చుకుంటారు