Hyderabad realty
-
హైదరాబాద్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు.. ఏ ప్రాంతంలో ఎక్కువంటే..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024లో గణనీయమైన వృద్ధిని కనబరిచింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగాయి. ఈమేరకు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. నగరంలో 2023లో 71,912 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరగ్గా, 2024లో 76,613 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నమోదైన మొత్తం ఆస్తుల విలువ కూడా 23 శాతం పెరిగి రూ.47,173 కోట్లకు చేరింది.ప్రీమియం ప్రాపర్టీస్హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ విలువ చేసే గృహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2023లో అంతకుముందు ఏడాది కంటే 10 శాతం పెరగ్గా, ఇప్పుడు రిజిస్ట్రేషన్లలో 14 శాతం వృద్ధి నమోదైంది. వినియోగదారులు ప్రీమియం ప్రాపర్టీల వైపు మళ్లడం గృహ కొనుగోలుదారుల ఆకాంక్షలను, నగరవాసుల ఆర్థిక మూలాలను ప్రతిబింబిస్తుంది.జిల్లాల వారీగా..రియల్టీ వ్యాపారం సీటీ పరిసరాల్లో పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్లలో 83 శాతం మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. మేడ్చల్-మల్కాజ్గిరిలోనే 42 శాతం, రంగారెడ్డిలో 41 శాతం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మిగిలిన 17% వాటా హైదరాబాద్ జిల్లా నుంచి ఉంది.ప్రాపర్టీ పరిమాణాల వారీగా..ప్రాపర్టీ పరిమాణాల పరంగా చూస్తే 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వాటిని గృహాల నిర్మాణానికి వినియోగించారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 69%గా ఉంది. 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆస్తులు 2023లో 11 శాతం ఉండగా, 2024లో 14 శాతానికి పెరిగాయి. 2024 డిసెంబరులో లావాదేవీల సగటు ధర 6% పెరిగింది.ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపదనైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. లగ్జరీ జీవనానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో ప్రీమియం గృహాలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అధునాతన ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా డెవలపర్లు వినియోగదారుల డిమాండ్కు వేగంగా స్పందిస్తున్నారని చెప్పారు. -
అపార్ట్మెంట్, విల్లా కలిస్తే..
అవునూ.. హైదరాబాద్ నిర్మాణ రంగం (Hyderabad realty) ట్రెండ్ మారింది. అపార్ట్మెంట్, విల్లా రెండింటినీ మిక్స్ చేస్తూ స్కై విల్లాస్ (Sky villa) హాట్ కేక్లుగా అవతరించాయి. ఒక అపార్ట్మెంట్లో ఫ్లోర్కు ఒక్క ఫ్లాట్ మాత్రమే, అది కూడా 6 వేల నుంచి 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. పైగా విలాసవంతమైన వసతులు, భద్రత, ప్రైవసీలతో కట్టిపడేస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), ప్రవాసులు స్కై విల్లాస్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుండటంతో నగరంలో వీటి నిర్మాణాలు జోరందుకున్నాయి.గతంలో విలాసవంతమైన ఇళ్లలో నివసించాలనుకునేవారి కోసం విల్లాలు, బంగ్లాలు నిర్మించేవారు. వీటికి కొంత పరిమితులున్నాయి. భూమి ధర విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డెవలపర్లకు ప్రధాన నగరంలో విల్లాలు, బంగ్లాలు నిర్మించడం సాధ్యం కాదు. దీంతో ఎత్తయిన అపార్ట్మెంట్లలో స్కై విల్లాలను నిర్మిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని పచ్చదనం, సిటీ వ్యూ అనుభూతిని కలిగిస్తుండటంతో ఎత్తయిన భవనాల్లో నివసించాలనే కోరిక పెరిగింది. దీంతో మల్టీ లెవల్ స్కై విల్లాలు నివాస సముదాయ విభాగంలో హాటెస్ట్ ట్రెండ్గా మారింది. జీవనశైలి పట్టణ వినియోగదారుల్లో ప్రజాదరణ పొందుతోంది. – సాక్షి, సిటీబ్యూరోస్కై విల్లాస్ అంటే? విల్లాలు, అపార్ట్మెంట్ల డిజైన్, వసతులు ఒకే భవనంలో కలిపి ఉండేవే స్కై విల్లాలు లేదా విల్లామెంట్లు. సాధారణంగా విల్లాలు పెద్ద ఫ్లోర్ ప్లాన్, ఎక్కువ స్థలం కలిగి ఉండే స్వతంత్ర గృహాలు. వీటిల్లో లగ్జరీ వసతులు, ఔట్డోర్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇక, అపార్ట్మెంట్లు చిన్నగా, సమూహంగా ఉంటాయి. వీటిల్లో నివాసితులు కామన్ ఏరియాలను షేరింగ్ చేసుకుంటారు. ఈ రెండు కాన్సెప్ట్లు కలిపి.. విల్లాలోని విశాలమైన స్థలం, లగ్జరీ, ప్రైవసీ, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని సౌకర్యాలు, భద్రత కలిపి డిజైన్ చేసేవే స్కై విల్లాస్. సరళభాషలో చెప్పాలంటే ఇదొక డూప్లెక్స్ అపార్ట్మెంట్.ప్రైవసీ, ఆధునిక వసతులు.. ఒక స్వతంత్ర బంగ్లా మాదిరి కాకుండా స్కై విల్లాలు భవనం మొత్తం అంతస్తులో విస్తరించి ఉంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులో విస్తరించి ఉండే విశాలమైన బహుళ స్థాయి గృహాలే స్కై విల్లాలు. ఈ ప్రాజెక్ట్లలో జన సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైవసీ, భద్రత ఎక్కువ. ఇంటి పరిమాణాన్ని బట్టి స్కై విల్లాలను ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఆటోమేషన్, టెక్నాలజీతో విలాసవంతంగా తీర్చిదిద్దవచ్చు.స్కై విల్లాల్లో చాలా వరకు నాలుగు వైపులా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దీంతో సూర్యరశ్మి, గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. స్కై విల్లాలలో ప్రైవేట్ లాన్, సన్డెక్తో కూడిన ప్రైవేట్ పూల్, ప్రత్యేక లిఫ్ట్, సెంట్రల్ ఎయిర్ కండీషనర్, హోమ్ థియేటర్, లగ్జరీ బెడ్ రూమ్స్, కిచెన్, స్టాఫ్ క్వార్టర్స్ వంటివి ఉంటాయి. అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్లు, విశాలమైన పిల్లల ఆట స్థలాలు, విలాసవంతమైన క్లబ్హౌస్, కాఫీ షాప్, స్విమ్మింగ్ పూల్తో పాటు ల్యాండ్ స్కేప్ గార్డెన్, వాకింగ్ ట్రాక్స్ వంటి వాటితో ప్రశాంత వాతావరణం ఉంటుంది.ఎక్కడ వస్తున్నాయంటే? స్కై విల్లాస్ ధరలు అపార్ట్మెంట్ల కంటే 30–40 శాతం ఎక్కువగా, విల్లా కంటే 20–30 శాతం తక్కువగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ల్లోని ఫ్లాట్లు భారీ విస్తీర్ణంతో పాటు సకల సౌకర్యాలు ఉండటంతో వీటి ప్రారంభ ధర రూ.6 కోట్ల నుంచి ఉంటాయి. కొల్లూరు, ఉప్పల్, కోకాపేట, కొండాపూర్, నార్సింగి, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్ట్లు వస్తున్నాయి. 30–50 అంతస్తుల భవనాల్లో ఇలాంటి స్కై విల్లాలు నిర్మిస్తున్నారు. ఆకాశహర్మ్యల్లో ఎత్తుకు వెళ్లే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది.అందుకే ఖర్చును తగ్గించుకునేందుకు 6 వేల నుంచి 16 వేల చ.అ. విస్తీర్ణంలో ఒకటే ఫ్లాట్ ఉండేలా ప్రత్యేకంగా డిజైనింగ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లోని పైఅంతస్తులో ఈ తరహా స్కై విల్లాలను కడుతున్నారు. సౌకర్యాలకు లోటు లేకుండా ఆకాశహరమ్యల్లో ప్రతీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నట్లే క్లబ్హౌస్తో పాటు అన్ని రకాల ఆధునిక వసతులను కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్హౌస్ 50 వేల చ.అ.విస్తీర్ణంలో ఉంటుంది.ప్రయోజనాలివీ..» విల్లామెంట్ ప్రయోజనాల్లో ప్రధానమైనది విల్లాలాంటి అనుభూతి. నివాసితులు విడిగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వసతులు, సౌలభ్యాలను ఆస్వాదించవచ్చు. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్లు వంటి భాగస్వామ్య సౌకర్యాలతో పాటు భద్రత, నిర్వహణ సేవలు ఉంటాయి.» డూప్లెక్స్ డిజైన్ బెడ్ రూమ్లు, బాత్రూమ్లు, లివింగ్, డైనింగ్ ఏరియాలతో పాటు ప్రైవేట్ టెర్రస్ లేదా గార్డెన్ ఉంటాయి. అదనంగా విల్లామెంట్లలో ప్రైవేట్ లిఫ్ట్, విశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యాలుంటాయి.» స్కై విల్లాస్ సాంప్రదాయ అపార్ట్మెంట్ కంటే ఎక్కువ స్థలం, ప్రైవసీని అందిస్తాయి.» విల్లామెంట్ కాంప్లెక్స్లు సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నివాసితులకు సురక్షితమైన జీవనం, మనశ్శాంతిని అందిస్తాయి.» విల్లాలాగే ప్రాపర్టీ మొత్తం నిర్వహణ వ్యయం యజమాని భరించాల్సిన అవసరం లేదు. విల్లామెంట్ల నిర్వహణ కమ్యూనిటీలోని అందరూ పాలుపంచుకుంటారు. దీంతో నివాసితులకు వ్యయం, సమయం ఆదా అవుతుంది. -
త్వరలో టీజీ రెరా యాప్..
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించినదే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA). సాంకేతికత వినియోగం పెరిగిన ఈ రోజుల్లో టీజీ రెరా సేవలకు కూడా ఆధునికత చేర్చాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్(Real Estate) ప్రాజెక్ట్లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల ట్రాకింగ్, రియల్ టైం నోటిఫికేషన్ల క్రమబద్ధీకరణ కోసం టీజీ రెరా యాప్ను తీసుకురానున్నట్లు టీజీ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. అలాగే ప్రాజెక్ట్లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లు తక్షణ ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీజీ రెరా వెబ్సైట్(Website)లో రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే దీన్ని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనివాస సముదాయాలు మాత్రమే రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వాణిజ్య భవనాలకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదా?జవాబు: నివాస, వాణిజ్య ఏ భవనమైనా సరే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతీ ప్రాజెక్ట్ కూడా ఆర్ఈ(R and D) చట్టంలోని సెక్షన్–3 కింద రిజిస్ట్రేషన్ చేయాలి.రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?జవాబు: బ్రోచర్లు, కరపత్రాలతో సహా అన్ని ప్రింట్, ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో ప్రచురించే ప్రకటనలు, ప్రాజెక్ట్(Project)లకు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. దాన్ని ప్రదర్శించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల వ్యవధిలో ప్రత్యుత్తరాన్ని సమర్పించాలి. లేని పక్షంలో ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత ప్రమోటర్కు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.ఇల్లు కొనేందుకు కొనుగోలు దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?జవాబు: ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు సంబంధిత ప్రాజెక్ట్కు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ(HMDA), డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడంతో పాటు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. రెరా వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ నంబర్ను పరిశీలించవచ్చు. అలాగే లీగల్ టైటిల్, ఆమోదిత లేఔట్ ప్లాన్, ప్రాజెక్ట్ పేరు, వసతులు, ప్రాంతం వివరాలు, చట్టపరమైన టైటిల్ డీడ్స్, ప్రాజెక్ట్ నిర్మాణ గడువు వంటి అన్ని రకాల వివరాలను పరిశీలించవచ్చు.బాధితులు రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి? జవాబు: రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీమ్ల పేరిట ప్రచారం చేసినా, విక్రయాలు చేసినా టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. 040–29394972 లేదా 9000006301 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://rera.telangana.gov.in/complaint/ లేదా rera-maud@telangana.gov.in లేదా secy-rera-maud@telangana.gov.inలకు ఈ–మెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదా సేల్డీడ్లో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్ట్ను పూర్తి చేయకపోయినా, అడ్వాన్స్గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.ఇప్పటి వరకు రెరాలో ఎన్ని ప్రాజెక్ట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి?జవాబు: ఇప్పటివరకు టీజీ రెరాలో 9,129 ప్రాజెక్ట్లు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డిలో 2,954, అత్యల్పంగా ఆసిఫాబాద్లో 2 ప్రాజెక్ట్లు రిజిస్టర్ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్–మల్కాజ్గిరి 2,199, సంగారెడ్డి 986, హైదరాబాద్ 516, వరంగల్ అర్బన్ 414, యాదాద్రి భువనగిరి 349, మహబూబ్నగర్ 257, ఖమ్మం 280, నిజామాబాద్ 158, కరీంనగర్ 144, సిద్దిపేట 101, వికారాబాద్ 101, సూర్యాపేట 98, నల్లగొండ 87, నాగర్కర్నూల్ 66, మెదక్ 61, కామారెడ్డి 53, మంచిర్యాల 37, భద్రాది కొత్తగూడెం 34, జగిత్యాల 32, ఆదిలాబాద్ 31, మహబూబాబాద్ 27, పెద్దపల్లి 26, జనగాం 24, వనపర్తి 21, రాజన్న సిరిసిల్ల 19, జోగులాంబ గద్వాల్ 17, నిర్మల్ 12, వరంగల్ రూరల్ 12, జయశంకర్ 11 ప్రాజెక్ట్లు రిజిస్టరయ్యాయి.ఇప్పటి వరకు రెరా ఎంత జరిమానా విధించింది? ఎంత వసూలైంది?జవాబు: ఇప్పటి వరకు రెరా నిబంధనల ఉల్లంఘనదారులపై రూ.40.95 కోట్ల జరిమానాలు విధించాం. ఇందులో రూ.15.64 కోట్లు వసూలు చేశాం.నిర్మాణ సంస్థలు జరిమానా చెల్లించకపోతే రెరా తదుపరి చర్యలు ఏంటి?జవాబు: రెరా విధించిన జరిమానా లేదా వడ్డీ పరిహారం చెల్లించడంలో ప్రమోటర్ విఫలమైతే.. అది రెవెన్యూ బకాయిగా పరిగణిస్తారు. ఈ తరహా కేసులను ఆర్ఈ(ఆర్అండ్డీ) చట్టం–2016లోని సెక్షన్ 40(1) కింద జరిమానా లేదా వడ్డీ రికవరీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేస్తాం.ఇప్పటి వరకు ఎంత మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు?జవాబు: రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రెరా రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ఏజెంట్లు ప్లాట్లు, ఫ్లాట్, ఇల్లు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ను విక్రయించకూడదు. ఇప్పటి వరకు టీజీ–రెరాలో 3,925 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టరయ్యారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..ఈమధ్య కాలంలో బిల్డర్ల చీటింగ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిలో చాలా మంది బిల్డర్లు ఏజెంట్ల ద్వారా విక్రయాలు చేసినవాళ్లే.. మరి, ఏజెంట్ల మీద రెరా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?జవాబు: రెరా చట్టంలోని 9, 10లను ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కూడా రెరా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు భృగు ఇన్ఫ్రా, సాయిసూర్య డెవలపర్స్, భారతి ఇన్ఫ్రా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ అవెన్యూ కన్సల్టెంట్ సర్వీసెస్, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రై.లి. వంటి ఏజెంట్లపై రెరా చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిమానా రికవరీ చేసేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ చర్యలు కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకు రెరా ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించింది?జవాబు: టీజీ రెరా పోర్టల్ ద్వారా ప్రాజెక్ట్లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో కేసుల విచారణ కూడా చేపడుతున్నాం. దీంతో ఎక్కడి నుంచైనా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక వాదనాలు వినిపించవచ్చు. ఇప్పటి వరకు 1,216 ఫిర్యాదులను పరిష్కరించాం. -
హైదరాబాద్లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..
డిమాండ్కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్లో అమ్మకానికి ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. ఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. ప్రస్తుతం గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది.రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: ట్రంప్ కలం నుంచి జాలువారిన అక్షరాలునగరాల వారీగా ఇన్వెంటరీ (యూనిట్లలో)ఎన్సీఆర్ ఢిల్లీ 85,460 ఎంఎంఆర్ ముంబయి 1,86,677 బెంగళూరు 46,316 పుణే 88,176 హైదరాబాద్ 1,01,091 చెన్నై 28,758 కోల్కతా 25,938 -
సోలారే సోబెటరూ..
సాక్షి, సిటీబ్యూరో: ఈ మధ్య కాలంలో వచ్చిన అధునాతన సాంకేతిక మార్పుగా అవతరించి, సామాజికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వాటిలో ‘సోలార్ విద్యుత్ శక్తి, ఈ–వాహనాలు’ హవా కొనసాగిస్తున్నాయి. ఈ రెండు అంశాలు సామాజిక జీవన వైవిధ్యంలో పెను మార్పులకు నాంది పలికాయి. ఒక వైపు విపరీతంగా పెరిగిపోతున్న కరెంట్ వాడకం, దానికి అనుగుణంగానే పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలు. వెరసీ అందరి చూపూ సోలార్ విద్యుత్ వైపునకు మళ్లింది.దశాబ్ద కాలంగానే సోలార్కు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ అది నగరాల వరకే పరిమితమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సోలార్ సెట్పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సోలార్ వ్యవస్థను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక సబ్సిడీలను సైతం అందిస్తున్నారు. కొన్నేళ్లుగా సోలార్ వ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యాపార సంస్థలు సైతం ఈ సందర్భంగా వారి సేవలు పెంచుతున్నాయి. కొన్ని సంస్థలైతే వివిధ జిల్లాల్లోని టౌన్లలో ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఆవిష్కరించి ఈ సోలార్ సెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.సూర్య ఘర్ స్కీంతో సబ్సిడీ..హైదరాబాద్ వంటి నగరాల్లో సోలార్ వాడకంపై అవగాహన మెరుగ్గానే ఉంది. సోలార్ విద్యుత్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ విధానానికి అలవాటు పడుతున్నారు. ఈ సోలార్ పద్ధతులు వ్యక్తిగత ఇళ్లతో పాటు చిన్న–పెద్ద తరహా పరిశ్రమల్లోనూ విరివిగా వాడుతున్నారు. వారి వారి విద్యుత్ వాడకానికి అనుగుణంగానే పీఎం సూర్య ఘర్ స్కీంలో ఒక కిలో వాట్ నుంచి వినియోగాన్ని బట్టి అవసరమైనన్ని కిలో వాట్ల సోలార్సెట్లను, వాటికి సబ్సిడీని అందిస్తుంది. ఈ సోలార్ విధానాన్ని రెసిడెన్షియల్ ఏరియాలో, స్కూల్స్, ఫామ్ హౌజ్లు, రైస్మిల్స్ వంటి చిన్న తరహా పరిశ్రమల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. పరిశ్రమలైనా, వ్యక్తిగత వినియోగమైనా.. టెక్నాలజీ పెరగడంతో కరెంట్ వినియోగం సైతం అధికంగా పెరిగిపోయింది. గతంలో ఇళ్లలో రూ.200 నుంచి రూ.500ల కరెంట్ బిల్ అత్యధికం అనుకుంటే.. ఇప్పుడది రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పెరిగిపోయింది. ఇక పరిశ్రమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిషనరీ, అధునాతన సాంకేతికత వినియోగం పెరగడంతో వాటి చార్జీలు మూడింతల కన్నా పైగానే పెరిగాయని నిపుణులు తెలుపుతున్నారు. పర్యావరణ హితం.. సోలార్ సిస్టం..విద్యుత్ తయారీ కోసం ప్రస్తుతం వాడే పద్ధతులన్నీ ఏదో విధంగా పర్యావరణానికి హాని చేసేవే అని పరిశోధకుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా థర్మల్, గ్యాస్, విండ్, హైడ్రో తదితర పద్ధతుల్లో విద్యుత్ను సేకరిస్తున్నారు. ఈ తరుణంలో కిలో వాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే కొన్ని వందల మొక్కలు పెంచిన దానితో సమానమని, అంతటి కాలుష్యాన్ని తగ్గించే విధానంగా సోలార్ నిలుస్తుందని నిపుణుల మాట. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ పెరగడం, కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు పెరగడం.. తదితర కారణాలతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం, వెరసీ పర్యావరణ మార్పులతో పెను ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో కాలుష్యరహిత పద్ధతులైన సోలార్ సిస్టమ్ అత్యంత శ్రేయస్కరమని భావిస్తున్నారు. అంతా లాభమే.. – రాధికా చౌదరి, ఫ్రెయర్ ఎనర్జీ కోఫౌండర్రాష్ట్రంలో సోలార్ వినియోగంపై అవగాహన పెరిగింది. ఈ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ సేవలందిస్తున్నాం. కరోనా అనంతరం సోలార్ ఎనర్జీను వినియోగించేవారి సంఖ్య అధికంగా పెరిగింది. పీఎం సూర్య ఘర్ స్కీం కూడా దీనికి కారణం. ఇందులో భాగంగా రూ.2 లక్షల సోలార్ సెట్ బిగించుకుంటే దాదాపు రూ.78 వేల సబ్సిడీ లభిస్తుంది. మిగతా పెట్టుబడి కూడా రెండు మూడేళ్ల కరెంట్ ఛార్జీలతో సమానం. కాబట్టి మూడేళ్ల తర్వాత వినియోగించే సోలార్ కరెంట్ అంతా లాభమే. -
రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు భారీగా ఎగిశాయి. ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2024)లో ఇప్పటివరకూ 4.15 బిలియన్ డాలర్లు లభించాయి. రియల్టీ రంగ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం వార్షికంగా ఇవి 32 శాతం అధికం. పెట్టుబడుల్లో అత్యధికంగా హౌసింగ్ విభాగానికి ప్రవహించినట్లు తెలియజేసింది. 2024 ఇండియాలో పీఈ పెట్టుబడుల ట్రెండ్ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం 2024లో ఇప్పటివరకూ రియల్టీలో పీఈ పెట్టుబడులు 415 కోట్ల డాలర్లను అధిగమించాయి.వేర్హౌసింగ్ ఆధిపత్యంరియల్టీ రంగ మొత్తం పీఈ పెట్టుబడుల్లో వేర్హౌసింగ్ 45 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా.. రెసిడెన్షియల్ విభాగం 28 శాతం వాటాను ఆక్రమించింది. కార్యాలయ విభాగం 26 శాతం పెట్టుబడులను ఆకట్టుకుంది. అయితే గతేడాదితో పోలిస్తే రెసిడెన్షియల్ విభాగం రెట్టింపునకుపైగా వృద్ధితో 117.7 కోట్ల డాలర్లు అందుకుంది. గృహ కొనుగోళ్లలో వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ ప్రభావం చూపుతోంది. కాగా.. వేర్హౌసింగ్కు 187.7 కోట్ల డాలర్లు అందితే.. ఆఫీస్ ప్రాపర్టీలకు 109.8 కోట్ల డాలర్లు లభించాయి. పదేళ్లుగా పెరుగుదల..ప్రధానంగా భారత్లో గత దశాబ్ద కాలం నుంచి పెట్టుబడులు పుంజుకుంటున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. ఇందుకు ఆర్థిక సుస్థిరత, నిరవధిక వృద్ధి సహకరిస్తున్నట్లు తెలియజేశారు. ఈకామర్స్, థర్డ్పార్టీ లాజిస్టిక్స్ ఊపందుకున్న నేపథ్యంలో వేర్హౌసింగ్కు భారీ డిమాండ్ నెలకొన్నట్లు వివరించారు. వెరసి వేర్హౌసింగ్ విభాగం అత్యధిక పెట్టుబడులకు నెలవుగా మారినట్లు తెలియజేశారు. ఈ బాటలో గృహ రంగం సైతం ప్రస్తావించదగ్గ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?ఆఫీసులు కళకళపీఈ పెట్టుబడుల్లో కార్యాలయ విభాగం కొంతమేర నీరసించినప్పటికీ ఉద్యోగులు తిరిగి వర్క్ప్లేస్లకు రావడం, ఆఫీసులు పెరగడం, అద్దెలు బలపడటం వంటి అంశాలు అండగా నిలుస్తున్నట్లు శిశిర్ వివరించారు. ఇక దేశీయంగా మొత్తం రియల్టీ పీఈ పెట్టుబడుల్లో ముంబై 50 శాతం వాటాను ఆక్రమించడం గమనార్హం! మొత్తం పెట్టుబడుల్లో 42 శాతం వాటాకు సమానమైన 1.7 బిలియన్ డాలర్లు యూఏఈ నుంచి లభించాయి. దేశీ పీఈ ఇన్వెస్టర్లు 32 శాతం వాటాకు సమానమైన 1.3 బిలియన్ డాలర్లు సమకూర్చారు! సింగపూర్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్ నుంచి 63.37 కోట్ల డాలర్లు ప్రవహించాయి. -
హైదరాబాద్ ‘రియల్’ ట్రెండ్
దేశీయ స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ పవర్ హౌస్గా మారింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), లైఫ్ సైన్స్ రంగాల బహుళ స్థిరాస్తి పెట్టుబడులకు వేదికగా అభివృద్ధి చెందింది. గతంలో సిటీ రియల్ ఎస్టేట్లో ఐటీ కంపెనీలు, ఉద్యోగుల లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండేవి. కానీ, కొంతకాలంగా ఫార్మాసూటికల్స్ రంగం నుంచి కూడా పెట్టుబడులు, కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీంతో గృహాలు, ఆఫీసులు, గిడ్డండులు, డేటా సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరోఇదీ రియల్ వృద్ధి..హైదరాబాద్లో ఈ ఏడాది తొమ్మిది నెలల్లో రూ.36,461 కోట్లు విలువ చేసే రూ.59,386 గృహాలు అమ్ముడుపోయాయని నైట్ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అలాగే మార్కెట్లోకి కొత్తగా 85 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్తో కలిపి మొత్తం 87 లక్షల చ.అ. కార్యాలయాల స్థలాల లావాదేవీలు జరిగాయి. ఇక గ్రేటర్లో 54 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం, 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 20 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. మరో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక తెలిపింది.భవిష్యత్తులో మరింత జోష్ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, టీ–స్క్వేర్, ఫార్మా క్లస్టర్లు, మెట్రో విస్తరణతో పాటు విమానాశ్రయంతో కనెక్టివిటీ, రీజినల్ రింగ్రోడ్ వంటి బృహత్తర ప్రాజెక్ట్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో సిటీ విస్తరణ పెరగడంతో పాటు పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఏర్పడతాయి. దీంతో హైదరాబాద్లో ఇళ్లు, ఆఫీసులు, వేర్హౌస్, డేటా సెంటర్లకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే 3–4 ఏళ్లలో నగరంలో కొత్తగా లక్ష గృహాలు లాంచింగ్ అవుతాయని, 2026 నాటికి ఏటా 1.7–1.9 కోట్ల చ.అ. ఆఫీసు స్థలాన్ని అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వచ్చే రెండేళ్లలో వేర్హౌస్ స్థలం 40 లక్షల చ.అ.కు, డేటా సెంటర్ల సామర్థ్యం 23 మెగావాట్లకు విస్తరిస్తాయని అంచనా.ఐటీ వర్సెస్ ఫార్మా..ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతులు, ఉత్పత్తులతో హైదరాబాద్ ఐటీ హబ్గా పేరొందింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 11.3 శాతం పెరిగి రూ.2.68 లక్షల కోట్లను అధిగమించాయి. ప్రస్తుతం 1,500లకు పైగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 9 లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. టీ–హబ్, టీ–వర్క్స్ వంటి ఇన్నోవేషన్ పవర్హౌస్లతో నగరం 4 వేల స్టార్టప్లకు ఆతిథ్యం ఇస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ), సెమీకండక్టర్ల డిజైన్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి పెట్టడంతో అభివృద్ధి మరింత జోరందుకుంటుంది.లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా పిలిచే హైదరాబాద్లో 1,500లకు పైగా ఫార్మాసూటికల్స్, బయోటెక్ కంపెనీలున్నాయి. దేశంలోని మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మన రాష్ట్రం వాటా 20–30 శాతం. దేశంలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. 2023–24లో రూ.36,893 కోట్ల ఫార్మాసూటికల్స్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వచ్చే పదేళ్లలో లైఫ్ సైన్స్ పరిశ్రమ వంద బిలియన్ డాలర్ల అభివృద్ధి చేయాలని, కొత్తగా 4 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మా క్లస్టర్లు, జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైస్ పార్క్ల విస్తరణ తదితర బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఎగుమతులు రూ.1,16,182 కోట్లు కాగా.. ఇందులో రూ.2,68,233 కోట్లు ఐటీ, రూ.36,893 కోట్ల ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల వాటాను కలిగి ఉన్నాయి. నగరంలో ఐటీతో మొదలైన రియల్ బూమ్ ఫార్మా ఎంట్రీతో నెక్ట్స్ లెవల్కి చేరింది. బలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలు, వ్యాపార అనుకూల విధానాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, అందుబాటులో ప్రాపర్టీల ధరలు.. ఇవన్నీ ఐటీ, ఫార్మా రంగాలకు చోదక శక్తిగా మారాయి. బహుళ రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరడంతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా ఎగుమతుల్లో గ్రేటర్ వాటా 60 శాతానికి పైగానే ఉంటుంది. వెస్ట్ హైదరాబాద్తో పాటు పోచారం, ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలు, మేడ్చల్, కొత్తూరు, పటాన్చెరు వంటి ప్రాంతాల్లో వేర్హౌస్లు, శంషాబాద్, కందుకూరు, మేకగూడ వంటి ప్రాంతాల్లో డేటా సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. -
హైదరాబాద్లో ఇల్లు.. రూ.కోటి అయినా కొనేద్దాం!
కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్లో గృహాల ధరలు పెరిగిపోయాయి. 2024 తొలి అర్ధ ఆర్థిక సంవత్సరం(హెచ్1)లో నగరంలో ఇళ్ల సగటు ధర రూ.84 లక్షలుగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.15 కోట్లకు పెరిగింది. ఏడాది కాలంలో 37 శాతం ధరలు వృద్ధి చెందాయని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. అలాగే నగరంలో 2024 హెచ్1లో రూ.25,059 కోట్లు విలువ చేసే 29,940 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి 27,820 ఇళ్లు విక్రయించారు. వీటి విలువ రూ.31,993 కోట్లు. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో విక్రయాలు, లాంచింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. 2024 హెచ్1 గృహాల ధర సగటున రూ.కోటిగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి 23 శాతం పెరిగి, ఏకంగా రూ.1.25 కోట్లకు చేరింది. ఇక, 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో టాప్–7 సిటీస్లో రూ.2,79,309 కోట్లు విలువ చేసే 2,27,400 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి రూ.2,35,800 కోట్ల విలువైన 2,35,200 విక్రయమయ్యాయి. యూనిట్ల అమ్మకాల్లో 3 శాతం క్షీణత ఉన్నప్పటికీ.. సేల్స్ వ్యాల్యూ మాత్రం 18 శాతం పెరిగింది.ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్..ముంబైలో స్థిరంగా ధరలు.. ఆసక్తికరంగా ఏడాది కాలంలో ముంబై(ఎంఎంఆర్)లో యూనిట్ల ధరలు పెరగలేదు. 2024 హెచ్1లో ధర సగటున రూ.1.45 కోట్లుగా ఉండగా.. 2025 హెచ్1లోనూ అదే ధర ఉంది. ఇక, అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్లో ఇళ్ల ధరలు పెరిగాయి. 2024 హెచ్1లో ఇక్కడ ధర సగటు రూ.93 లక్షలు కాగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.45 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత బెంగళూరులో గతంలో రూ.84 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.1.21 కోట్లు, చెన్నైలో రూ.72 లక్షల నుంచి రూ.95 లక్షలకు, పుణేలో రూ.66 లక్షల నుంచి రూ.85 లక్షలకు, అలాగే 2024 హెచ్1లో కోల్కత్తాలో యూనిట్ ధర సగటు రూ.53 లక్షలుగా పలకగా.. 2025 హెచ్1 నాటికి రూ.61 లక్షలకు పెరిగింది. -
ఏడు నెలల్లో 46 వేల ఇళ్లు రిజిస్ట్రేషన్..ఎక్కడంటే..
హైదరాబాద్లో రియల్ఎస్టేట్ వ్యాపారం దూసుకుపోతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా ఇన్వెస్టర్లు రియల్టీలో పెట్టుబడులను మాత్రం ఆపడంలేదు. 2024లో జులై నెలాఖరు వరకు హైదరాబాద్లో రిజిస్టర్ అయిన గృహాల సంఖ్య ఏకంగా 46,000గా ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే రెవెన్యూ పరంగా 40 శాతం వృద్ధి చెందినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా అధికమవుతున్న భౌగోళిక అనిశ్చితుల వల్ల ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు అంత సురక్షితం కాదని కొందరు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దాంతో ఎక్కువ ఒడిదొడుకులకు లోనుకాని, స్థిరంగా పెరిగే రియల్టీ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. అందులోనూ వేగంగా వృద్ధి చెందుతున్న హైదరాబాద్ వంటి నగరాలవైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో స్థానికంగా రియల్టీ రంగం జోరందుకుంది.నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికల ప్రకారం.. భాగ్యనగరంలో 2024 జనవరి నుంచి జులై చివరి నాటికి ఏకంగా 46,368 గృహాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. రెవెన్యూలో మాత్రం 40 శాతం వృద్ధి కనిపించింది. జులై నెలలోనే రూ.4,266 కోట్ల ఇళ్లు నమోదయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 48 శాతం వృద్ధి చెందింది. గృహాల సంఖ్యాపరంగా 7,124 ఇళ్లతో 28 శాతం వృద్ధి కనబరిచింది.20245 జులైలో రూ. 50 లక్షల ధర కేటగిరిలో రిజిస్టర్ అయిన ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా జూలై 2023లో 69 శాతంగా ఉండేది. అదే 2024 జూలై నాటికి అమ్మకాలు 61 శాతానికి తగ్గింది. రూ. కోటి, అంతకంటే ఎక్కువ ఎక్కువ ధర కలిగిన ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా గణనీయంగా పెరిగి 13కి పెరిగింది. -
సిమెంటుకు మంచి రోజులు!
తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ స్థాయికి డిమాండ్ * మార్చిలో 22 లక్షల టన్నుల విక్రయాలు * ఐదేళ్ల కిందట ‘ఉమ్మడి’గా 24 లక్షల టన్నులు * గాడిలో రియల్టీ; ప్రభుత్వ ప్రాజెక్టుల జోరు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటుకు సంబంధించి ఐదేళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సానుకూల పరిస్థితి మళ్లీ వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమ్మకాలు బాగా పెరగ్గా... మార్చిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్మకాలు ఏకంగా 22 లక్షల టన్నులకు చేరాయి. ఐదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఒక నెలలో అమ్ముడైన 24 లక్షల టన్నుల రికార్డుకు ఇది చేరువలో ఉండటం గమనార్హం. హైదరాబాద్ రియల్టీ తిరిగి గాడిన పడటం... కొత్త ప్రాజెక్టులు మొదలుకావటం దీనికి ప్రధాన కారణంగా కంపెనీలు చెబుతున్నాయి. ఐటీ, ఈ-కామర్స్తోపాటు పలు రంగాల్లో ఎంఎన్సీల వస్తున్నాయని, దీంతో నిర్మాణ రంగం పుంజుకోవటమే కాక ఉద్యోగావకాశాలూ మెరుగైనట్లు హెచ్ఆర్ నిపుణులు బి.అపర్ణరెడ్డి తెలిపారు. గత రెండేళ్లలో వేతనాలు 10-15 శాతం పెరిగాయి. ఇది కూడా రియల్టీకి సానుకూల పరిణామమే. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లు, బలహీన వర్గాలకు గృహాలను నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పాలసీ అమలవుతోంది. కొత్త రాజధానిలో నిర్మాణాలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లో మండల, జిల్లా కేంద్రాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం జరుగుతోంది. వెరశి సిమెంటు అమ్మకాలు పుంజుకోవడానికి మంచి వాతావరణం ఏర్పడినట్లు కంపెనీలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇలా.. భారత్లో సిమెంటు కంపెనీల మొత్తం వార్షిక స్థాపిత సామర్థ్యం 400 మిలియన్ టన్నులు. 2015-16లో 300 మిలియన్ టన్నుల సిమెంటు అమ్ముడైంది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంకన్నా ఇది 20 మిలియన్ టన్నులు అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంటు వినియోగం 330 టన్నులకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకు 45-50 లక్షల టన్నులు సిమెంటు అమ్ముడవుతోంది. మార్చిలో ఇది 66 లక్షల టన్నులకు చేరింది. కన్సాలిడేషన్ దిశగా.. దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు ధరల్లో భారీ తేడాలున్నాయి. సిమెంటురకాన్ని బట్టి బస్తా ధర కేరళ మార్కెట్లో రూ.400-420 ఉండగా తమిళనాడులో రూ.370-400, కర్నాటకలో రూ.350-380 ఉంది. ఇక ఆంధ్ర ప్రదేశ్లో రూ.270-300 ఉంటే, తెలంగాణలో బస్తా రూ.220-250కి లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ధరల్లో తమకు నష్టమేనన్నది కంపెనీల మాట. ఇదే పరిస్థితి కొనసాగితే నాలుగు కంపెనీలు పెద్ద సంస్థల చేతుల్లోకి వెళ్లొచ్చునని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో సిమెంటు ధరలు పెరగడంతో సంబంధిత కంపెనీల షేర్లు ర్యాలీ చేస్తున్నాయని ప్రముఖ సిమెంటు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. విజయవంతంగా వైట్ టాపింగ్.. సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్లో (సీఎంఏ) ఉన్న భారతి సిమెంట్, అల్ట్రాటెక్, మహా, సాగర్ సిమెంట్స్ సహా 17 కంపెనీలు ప్రయోగాత్మకంగా హైదరాబాద్ బంజారాహిల్స్లో వైట్ టాపింగ్ టెక్నాలజీతో కాంక్రీటు రోడ్డును విజయవంతంగా వేయటం తెలిసిందే. 30 ఏళ్లకుపైగా మన్నటం వీటి ప్రత్యేకత. ఈ రోడ్లు చెన్నై వరదల్లో చెక్కు చెదరలేదని, బెంగళూరులో 300 కిలోమీటర్ల మేర రూ.900 కోట్ల పెట్టుబడితో మొదలయ్యాయని కంపెనీలు పేర్కొన్నాయి.