Indian diplomat
-
ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలే
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిన పాకిస్తాన్కు భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలను స్వయంగా ఆహ్వానించినట్లే అవుతుందన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు ఉగ్రవాద దాడులపై పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయని స్పష్టంచేసింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో శుక్రవారం భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ మాట్లాడారు. ఇదే సభలో తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్టికల్ 370పై మాట్లాడారు. దీనిపై భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించారు. సైన్యం పెత్తనం కింద నలుగుతూ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేసే దేశమైన పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడడం ఏమటని నిలదీశారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా రిగ్గింగ్లు జరిగే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. భారతదేశ భూభాగాన్ని కబళించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ఆటంకాలు సృష్టించడానికి ఉగ్రవాదాన్ని నమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదానికి, మాదక ద్రవ్యాల వ్యాపారానికి, చీకటి నేరాలకు మారుపేరైన పాకిస్తాన్కు భారత్ గురించి నోరువిప్పే అర్హత లేదని భవిక మంగళానందన్ పరోక్షంగా హెచ్చరించారు.పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఒక ఆయుధంగా ప్రయోగిస్తోందన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు. తమ దేశ పార్లమెంట్పై, ఆర్థిక రాజధాని ముంబై నగరంపై, మార్కెట్లపై, యాత్రా మార్గాలపై దాడులు చేసిన నీచ చరిత్ర పాకిస్తాన్ ఉందని నిప్పులు చెరిగారు. అలాంటి ధూర్త దేశం హింస గురించి నీతులు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అల్ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. -
అదుపు తప్పితే అణుముప్పే!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రపంచానికి కొత్త అస్థిరతల్ని తెచ్చిపెట్టింది. యుద్ధం ఏ విధంగా ముగింపునకు వచ్చినా ఒకటి మాత్రం స్పష్టం. అణ్వాయుధ నియంత్రణ అవకాశాలు, అణు నిరాయుధీకరణ అన్నవి ఇకపై మరింతగా వెనక్కు మళ్లుతాయి. 1991లో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై 15 స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాక సోవియెట్ యూనియన్కు తనే వారసత్వ రాజ్యం అని రష్యా భావిస్తుండటం, స్వతంత్ర రాజ్యాలుగా అవతరించిన బెలారస్, కజఖ్స్థాన్, ఉక్రెయిన్లు రష్యాతో పాటుగా తమ భూభాగాలలో అణ్వాయుధాలను కలిగి ఉండటం ఇప్పుడు మానవాళి ఎదుర్కోక తప్పని ఒక కీలకమైన సవాలుగా మారింది. ఉక్రెయిన్ పెద్ద సంఖ్యలో అణ్వస్త్ర కేంద్రాలను, క్షిపణి కార్మాగాలను, అణ్వాయుధ నౌకాశ్రయాలను, 5000 యుద్ధ విధ్వంస శతఘ్నులను కలిగి ఉంది. కజఖ్స్థాన్లోని సెమిపలంటిన్సక్ అణ్వా యుధ పరీక్షా కేంద్రం ఉన్నప్పటికీ వాటిని ఎక్కుపెట్టి సంధించే ‘లాంచ్ కోడ్’లు మాత్రం రష్యాలో ఉన్నాయి. అణ్యాయుధ ప్రయోగాల నైపుణ్యం రష్యాలో ఉండటమే అందుకు కారణం. అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్, రష్యా అధ్యక్షుడిగా బోరిల్ ఎల్త్సిన్ ఉన్నప్పటి నుంచే అణ్వస్త్రాలను కుప్పలుగా పేర్చుకుని కూర్చున్న ఈ మూడు దేశాలూ ప్రపంచానికి పీడకలలు తెప్పిస్తున్నాయి. 1970లో అగ్రరాజ్యాలు 25 ఏళ్ల వ్యవధికి కుదుర్చుకున్న ఎన్పీటీ (అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం) గడువు 1995లో ముగిసిన తర్వాత, తిరిగి ఒప్పందాన్ని నిరవధికంగా కొనసాగించాలన్న నిర్ణయమైతే జరిగింది. ఎన్పీటీతో సమస్య ఏమిటంటే 1967 జనవరి 1కి ముందు అణుపరీక్షలను నిర్వహించిన 5 దేశాలు మాత్రమే ఈ ఒప్పందం పరిధిలో ఉండటం. ఎన్పీటీలో ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ‘వీటో’ హక్కు కలిగిఉండటం ఒక సౌలభ్యాంశం అయింది. ఈ ఐదుదేశాలూ ఆరో దేశాన్ని వీటో పవర్లోకి రానివ్వవు. రష్యా, చైనా అణు ఇరుగు పొరుగులను సహించవు. బెలారస్, కజఖ్స్థాన్, ఉక్రెయన్ల చేత అణ్వా యుధాలను త్యజింపజేసి, ఎన్పీటీ పరిధిలోకి వాటిని తీసుకు వచ్చేందుకు అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు రాజకీయ, దౌత్య పరమైన ప్రయత్నాలెన్నో చేశాయి. బెలారస్, కజఖ్స్థాన్ దారికి వచ్చాయి కానీ, ఉక్రెయిన్ మాత్రం తన దారి తనదే అన్నట్లుగా ఉండిపోయింది. అంతేకాదు, 10,000 కి.మీ. దూరం ప్రయోగించగల ఎస్.ఎస్.–24 అనే పది తలల క్షిపణిని వృద్ధి చేసింది. చివరికి సామ, దాన, భేద, దండోపాయాలతో ఉక్రెయిన్ ఎన్పీటీకి తలొగ్గింది. హంగేరి రాజధాని బుడాపెస్ట్లో 1994 డిసెంబరులో జరిగిన సమావేశంలో ఇరుపక్షాలు..బెలారస్– కజఖ్స్థాన్–ఉక్రెయిన్; అమెరికా, బ్రిటన్, రష్యా.. కూర్చొని అణ్వాయుధాల ప్రయోగం విషయమై భద్రత హామీలను ఇచ్చి పుచ్చుకున్నాయి. ఫ్రాన్స్, చైనా కూడా ఇదే రకమైన పూచీకత్తును ఇచ్చాయి. సార్వ భౌమత్వాన్ని గౌరవించడం, జోక్యం చేసుకోకపోవడం, బలప్రయోగం చేస్తామని బెదరించకపోవడం వంటివి ఆ హామీలలో భాగంగా ఉన్నాయి. అలాగే దాడికి గురైన దేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించవచ్చన్నది మరొక అంశం. ఆ నేపథ్యంలో 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించడంతో బుడాపెస్ట్ మెమోరాండమ్ను రష్యా ఉల్లంఘించినట్లయింది. ఇప్పుడు మళ్లీ ఉక్రెయిన్పై దాడితో మరోసారి రష్యా మాట తప్పినట్లయింది. 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాను బెదిరిస్తూ, ప్రపంచం మునుపెన్నడూ చూడని ఆగ్రహజ్వాలల్ని చూడబోతోందని అన్నారు. అందుకు ఉత్తర కొరియా ట్రంప్ని ‘మతిస్థిమితం తప్పిన ముదుసలి’గా అభివర్ణిస్తూ, అమెరికా కనుక దాడికి తెగిస్తే, పశ్చిమ పసిఫిక్ సముద్రలోని యు.ఎస్. ద్వీపం గ్వామ్ను భస్మం చేస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత కిమ్ను ట్రంప్ ‘తన దేశాన్ని తనే పేల్చేసుకునే’ ఆత్మాహుతి దళ సభ్యుడిగా అభివర్ణించారు. గత ఫిబ్రవరి 27న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే.. యూఎస్ అణ్వస్త్రాలకు జపాన్లో స్థావరాలను ఏర్పరచడం అనే ఒక అనూహ్యమైన ఆలోచనను పైకి తెచ్చారు. తైవాన్పై చైనా దురాక్రమణకు ఉన్న అవకాశాల నేపథ్యంలో.. జపాన్ భూభా గంపై అణ్వాయుధాలను.. ‘వృద్ధి చేయరాదు, కలిగి ఉండరాదు, చోటు కల్పించరాదు’ అని జపాన్ విధించుకున్న స్వీయ నియంత్రణకు విరుద్ధమైన ఆలోచన అది. ఏమైనా అణ్వాయుధ ప్రయోగాలను సమర్థించుకునే కొత్తకొత్త సిద్ధాంతాలు అణు భయాలను పెంచుతున్నాయి. – రాకేశ్ సూద్, భారత మాజీ దౌత్యవేత్త (హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో) -
చైనా చేష్టలు.. భారత్ రియాక్షన్ ఇది
గల్వాన్ లోయ ఘర్షణల్లో పాల్గొన్న కమాండర్, ఉయిగర్ల ఊచకోతలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిని టార్చ్బేరర్గా అర్హత ఇవ్వడం ద్వారా పెను వివాదానికే కేంద్రం బిందువుగా మారింది వింటర్ ఒలింపిక్స్ 2022. పైపెచ్చు ఇప్పుడు అథ్లెటిక్స్ను స్వేచ్ఛగా మాట్లాడేందుకు వీలు లేకుండా ఆంక్షలు పెట్టింది. ఇక గల్వాన్ లోయ ఘర్షణలకు కారణమైన సీపీఏల్ఏ కమాండర్ క్వీ ఫబోవోను టార్చ్బేరర్గా ఎంపిక చేయడంపై భారత్, చైనా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరిహద్దు అంశాన్ని కెలిగి.. రాజకీయం చేయాలని చూస్తోందని భారత్ అంటోంది. అందుకే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత రాయబారి, దౌత్యవేత్తలు పాల్గొనడని స్పష్టం చేసింది. ఈ బహిష్కరణతో పాటు ఒలింపిక్స్ ఈవెంట్స్ను టెలికాస్ట్ చేయడంలో దూరదర్శన్ దూరంగా ఉంటుందని ప్రసారభారతి స్పష్టం చేసింది. Consequent to the announcement by @meaindia, @ddsportschannel will not telecast live the Opening and Closing ceremonies of the Winter Olympics being held in Beijing. https://t.co/sSP1EX9pSQ — Shashi Shekhar Vempati शशि शेखर (@shashidigital) February 3, 2022 పదహారు రోజులపాటు బీజింగ్ వేదికగా శీతాకాల ఒలింపిక్స్ జరగున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనంతగా అథ్లెటిక్స్ మీద ఆంక్షలు విధించింది. అంతేకాదు చైనా చట్టాల మీద, రూల్స్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే.. శిక్ష తప్పదని హెచ్చరించింది బీజింగ్ ఆర్గనైజింగ్ కమిటీ. అంతేకాదు నిరసనలు తెలిపే హక్కును తొలగిస్తూ.. అందుకు సంబంధించిన పోడియంలను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. -
భారత దౌత్యవేత్తకు పాక్ ఐఎస్ఐ బెదిరింపు
లాహోర్: భారత సీనియర్ దౌత్యవేత్తను పాకిస్తాన్ ఐఎస్ఐ(ఇంటర్ సర్వీస్ ఇంటిలిజెన్స్)కు చెందిన ఓ వ్యక్తి వేధించాడు. ఐఎస్ఐ వ్యక్తి, భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లువాలియా నివాసం వెలుపల వేచి ఉండి బయటకు రాగానే అతడి కారును వెంబడిస్తూ.. బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోలో గౌరవ్ అహ్లువాలియా కారును ఓ వ్యక్తి వెంబడించడం చూడవచ్చు. పాకిస్తాన్ ఐఎస్ఐ, గౌరవ్ ఇంటి బయట కార్లు, బైక్ల మీద మనుషులను ఉంచి అతడిని వేధింపులకు గురి చేయడమే కాక భయపెట్టేందుకు ప్రయత్నించింది. #WATCH Islamabad: Vehicle of India's Chargé d'affaires Gaurav Ahluwalia was chased by a Pakistan's Inter-Services Intelligence (ISI) member. ISI has stationed multiple persons in cars and bikes outside his residence to harass and intimidate him. pic.twitter.com/TVchxF8Exz — ANI (@ANI) June 4, 2020 న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఐఎస్ఐ అధికారులను భారత్ బహిష్కరించిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులు అబిద్ హుస్సేన్, ముహమ్మద్ తాహిర్లు న్యూ ఢిల్లీలోని భారత సైన్యానికి సంబంధించిన పత్రాలను పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భారత గూఢచార సంస్థలు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించారు. -
తీరు మార్చుకోని పాకిస్తాన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో మరో భారత రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. ఇస్లామాబాద్లో భారత రాయబారి నివాసంలో పాకిస్తాన్ అధికారులు ఉద్దేశపూర్వకంగా నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. డిసెంబర్ 25న జరిగిన ఈ ఘటనపై భారత హైకమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ విదేశాంగ శాఖకు లేఖ రాసింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఇస్లామాబాద్లో కొత్తగా నిర్మించిన భారత హైకమిషన్ నివాస సముదాయానికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు పాకిస్తాన్ నిరాకరిస్తున్న సమయంలోనే తాజా విద్యుత్ కోత ఘటన వెలుగుచూడటం గమనార్హం. కొత్త భవనాలకు టెలికాం కనెక్షన్లు సమకూర్చని పాకిస్తాన్.. భారత్ పంపిన సామగ్రిని సరిహద్దుల్లోనే నిలిపేసిన సంగతి తెలిసిందే. -
తీరు మార్చుకోని పాక్...
ఇస్లామాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది. తమ దేశంలో ఉంటున్న భారత దౌత్యాధికారులను తీవ్ర ఇబ్బందుకు గురి చేస్తోంది. వారికి గ్యాస్ కనేక్షన్లు ఇవ్వకుండా ఉండటం, ఇంటర్నెట్, విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ విషయాల గురించి సమాచారం అందుకున్న భారత విదేశాంగ శాఖ.. పాక్ అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అంతేకాక భారత దౌత్యాధికారులను కలవడానికి వచ్చిన అతిథులను కూడా పాక్ అధికారులు ఇలానే వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఇస్లామాబాద్లోని తమ ఇంట్లోకి చొరబడ్డాడని ఓ భారత దౌత్యాధికారి తెలిపారు. భారత దౌత్యాధికారులను ఇలా వేధిపులకు గురి చేయడం ఇదే ప్రథమం కాదు. అయితే గత కొంత కాలంగా భారత్, పాక్ మధ్య దౌత్యపర ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. గత నెల గురుద్వారా నన్కానా సాహిబ్లోకి భారత దౌత్యాధికారులు వెళ్తుండగా పాక్ భద్రతా సిబ్బంది అడ్డుకున్న విషయం తెలిసిందే. అంతేగాక వారిని తీవ్రంగా అవమానించారు. ఈ చర్యలను భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌత్యాధికారులను ప్రార్థానా మందిరాల్లోకి వెల్లకుండా ఆపే హక్కు పాక్ అధికారులకు లేదని తెలిపింది. ఇందుకు సంబంధించి 1974లో చేసుకున్న ఒప్పందాన్ని గుర్తు చేసింది. దౌత్యాధికారులు ప్రార్థనా మందిరాల్లోకి వెళ్లవచ్చంటూ 1974లో ఇరు దేశాలు ధ్వైపాక్షిక ప్రొటోకాల్పై ఒప్పందం చేసుకున్నాయి. అలాగే, 1992లో ఈ విషయం గురించి కోడ్ ఆఫ్ కండక్ట్ను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. కానీ పాక్ వీటిని ఉల్లంఘించింది. ఈ ఏడాది మార్చిలోనూ దౌత్యపరంగా తలెత్తుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం ఓ ఒప్పందానికి వచ్చాయి. అయినప్పటికీ పాక్ తన తీరును మార్చుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దౌత్యాధికారుల కోసం ఇస్లామాబాద్లో నిర్మిస్తోన్న భవనాల్లో సోదాలు జరిపి.. విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. నిర్మాణ పనులు ముగుస్తున్న సమయంలో ఆ పనులను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే పాక్ ఈ చర్యకు పాల్పడిందని అధికారులు ఆరోపించారు. -
దేశం విడిచి వెళ్లండి: అమెరికా
వీసా కేసులో దేవయానికి అమెరికా ఆదేశం భారత్ ప్రతిచర్య.. అమెరికా దౌత్యవేత్త ‘బహిష్కరణ’ ఖోబ్రగడేపై నేరాభియోగాలు నమోదు చేసిన అమెరికా కోర్టు యూఎన్ మిషన్కు దేవయూని బదిలీకి ఎట్టకేలకు యూఎస్ ఆమోదం న్యూయూర్క్/న్యూఢిల్లీ: భారత్-అమెరికా దౌత్య సంబంధాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత దౌత్యవేత్త దేవయూని ఖోబ్రగడే (39) ‘వీసా కేసు’లో.. తాజాగా చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలతో ఈ పరిస్థితి తలెత్తింది. దేవయూనిని అమెరికా బహిష్కరించడం, ఇందుకు ప్రతిచర్యగా భారత్ సీనియర్ అమెరికా దౌత్యవేత్త ఒకరిని బహిష్కరించడం.. తదితర పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయూరుు. వీసా కేసులో విచారణ గడువును పొడిగించాల్సిం దిగా దేవయూని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన అమెరికా కోర్టు.. తాజాగా శుక్రవారం ఆమెపై ఈ కేసుకు సంబంధించిన నేరాభియోగాలు నమోదు చేసింది. దీనికిముందు.. అరెస్టు నేపథ్యంలో భారత్ దేవయూనిని ఐక్యరాజ్యసమితిలోని తమ శాశ్వత కార్యాలయూనికి బదిలీ చేయడాన్ని అమెరికా ఎట్టకేలకు ఆమోదించింది. తద్వారా ఆమెకు పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. అరుుతే కోర్టు నేరం నమోదు చేసిన నేపథ్యంలో ఈ హోదాను రద్దు చేయూల్సిందిగా కోరిన అమెరికా.. భారత్ అందుకు నిరాకరించడంతో ఖోబ్రగడేను తక్షణమే అమెరికా విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో దేవయూని న్యూ యూర్క్ నుంచి భారత్కు పయనమయ్యూరు. రాత్రి 9.40 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రతి చర్య చేపట్టింది. న్యూఢిల్లీలోని పేరు తెలియని డెరైక్టర్ స్థారుు (దేవయూని హోదాతో సమానమైన హోదా) అమెరికా దౌత్యవేత్తను బహిష్కరించింది. 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఆయన పేరు వెల్లడి కానప్పటికీ పనిమనిషి రిచర్డ్ కుటుంబాన్ని భారత్ నుంచి అమెరికాకు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించిన దౌత్యవేత్తపైనే బహిష్కరణ వేటు పడినట్లు సమాచారం. అరుుతే ‘బహిష్కరణ’ అనే పదాన్ని ఉపయోగించేందుకు భారత అధికారులు నిరాకరించారు. అమెరికా ఎంబసీలోని ఓ దౌత్యవేత్తను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ కార్యాలయూన్ని కోరినట్టు అధికారవర్గాలు వెల్లడించారుు. భారత్ ఈ విధంగా ‘దెబ్బకు దెబ్బ’ వంటి చర్య తీసుకోవడం ఇది రెండోసారి. 33 ఏళ్ల క్రితం అమెరికా ప్రభాకర్ మీనన్ అనే భారత దౌత్యవేత్తను బహిష్కరించినప్పుడు.. ఇండియూ కూడా ఢిల్లీలోని అమెరికా పొలిటికల్ కాన్సులర్ను బహిష్కరించింది. దేవయూనిపై అమెరికా కోర్టు నేరారోపణలు నమోదు చేయడాన్ని భారత్ ఓటమిగా బీజేపీ అభివర్ణించింది. అమెరికాలో కేసు పెండింగ్లోనే ఉంటున్నందున ఇది మన ఓటమేనని, విజయం కాదని బీజేపీ నేత, మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. అభియోగాలు అలాగే ఉంటారుు: యూఎస్ అటార్నీ పూర్తిస్థారుు దౌత్యరక్షణ ఉన్న నేపథ్యంలో దేవయూని భారత్ తిరిగి వెళ్తున్నప్పటికీ దేవయూనిపై మోపిన అభియోగాలు అలాగే ఉంటాయని అమెరికా కోర్టు విస్తృత ధర్మాసనం (గ్రాండ్ జ్యూరీ) స్పష్టం చేసింది. దౌత్య రక్షణ లేకుండా దే వయూని కనుక అమెరికా తిరిగివచ్చిన పక్షంలో విచారణ ఎదుర్కొనవలసి ఉంటుందని యూఎస్ అటార్నీ ప్రీత్ బరారా చెప్పారు. జిల్లా జడ్జి షీరా షీండ్లిన్కు రాసిన లేఖలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. తన పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా దరఖాస్తుకు సంబంధించిన వ్యవహారంలో.. మోసం, తప్పుడు ప్రకటనలు చేయడం వంటి రెండు నేరాలు కోర్టు దేవయూనిపై మోపినట్టు బరారా వివరించారు. దేవయూనికి దౌత్య రక్షణ హోదా ఇటీవలే కల్పించిన విషయం తమకు తెలుసునని చెప్పారు. పనిమనిషి రిచర్డ్ వీసా దరఖాస్తులో తప్పుడు ధ్రువీకరణలు ఇవ్వడంతో పాటు దేవయూని ఆమెకు తగిన వేతనం చెల్లించడం లేదని, ఇతర ఆరోపణలతో మొత్తం 21 పేజీలతో ఖోబ్రగడేపై చార్జిషీట్ దాఖలైంది. తప్పుడు, ఆధారరహిత అభియోగాలు: దేవయూని తనపై మోపిన అభియోగాలు తప్పు, ఆధార రహితమని 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అరుున ఖోబ్రగడే పేర్కొన్నారు. భారత్కు విమానం ఎక్కేముందు ఆమె పీటీఐతో మాట్లాడారు. ఈ పరిణామాలు తన కుటుంబంపై, ముఖ్యంగా ఇప్పటికీ అమెరికాలోనే ఉన్న తన పిల్లలపై ఎలాంటి దుష్ర్పభావాన్నీ చూపబోవని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన భారత విదేశాంగ శాఖ మంత్రికి, సహచరులకు, రాజకీయ నాయకత్వానికి, మీడియూకు.. ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో తనకు వెన్నుదన్నుగా నిలిచిన దేశ ప్రజానీకానికి ఆమె కృతజ్ఞత లు తెలిపారు. పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించిన నేపథ్యంలో దేవయూని అమెరికా బయ ట కూడా పర్యటించవచ్చని, ఈ నేపథ్యంలోనే భారత్ వెళుతున్నారని ఆమె తరఫు న్యాయవాది డేనియల్ అర్షాక్ చెప్పారు. మౌనం వీడిన సంగీత దేవయూని ఇటు ఇండియూ విమానమెక్కగానే పనిమనిషి సంగీత రిచర్డ్ మౌనం వీడారు. దౌత్యవేత్త వద్ద పనిచేస్తుండగా తానెన్నో బాధలు పడ్డట్టు చెప్పారు. తనలా బాధలకు గురికాకుండా చూసుకోండంటూ ఇతర పని మనుషులకు సూచించారు. కుటుంబం కోసం కొన్నాళ్లు అమెరికాలో పనిచేసి తిరిగి ఇండియూ వెళ్లిపోవాలనుకున్నట్టు సంగీత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక సంస్థ ‘సేఫ్ హారిజాన్’ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాజీ నిరాకరించిన దేవయూని దేశ సార్వభౌమాధికారాన్ని సమున్నత స్థారుులో నిలిపేందుకు పోరాటం కొనసాగిస్తున్న తన కుమార్తె.. కేసులో రాజీ పడి అమెరికాలోనే ఉండాల్సిందిగా వచ్చిన ప్రతిపాదనను నిరాకరించినట్లు దేవయూని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే శుక్రవారం ఢిల్లీలో తెలిపారు. పనిమనిషికి పరిహారం చెల్లించడం, జరిమానా కట్టడం, దర్యాప్తు చేసిన వ్యక్తికి కూడా చెల్లింపులు చేస్తే ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటామని, తద్వారా అమెరికాలోనే ఉండవచ్చని చెప్పారన్నారు. ఈ రాజీ ప్రతిపాదనను దేవయూని నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెప్పారు. పరిణామాల క్రమం.. వీసా కేసులో డిసెంబర్ 12న దేవయూనిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. దుస్తులు విప్పి మరీ ఆమెను సోదా చేశారు. నేరగాళ్లతో కలిపి లాకప్లో ఉంచారు. అరెస్టు నేపథ్యంలో ఆమె పాస్పోర్టును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు కోటిన్నర రూపాయల పూచీకత్తుతో ఖోబ్రగడే విడుదలయ్యూరు. దేవయూని అరెస్టు భారత్, అమెరికాల మధ్య వివాదం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే భారత్ ఆమెను ఐక్యరాజ్యసమితిలోని తమ శాశ్వత కార్యాలయూనికి బదిలీ చేసింది. తద్వారా ఆమెకు డిప్యూటీ కాన్సులర్ హోదాలో పాక్షిక దౌత్య రక్షణ కాకుండా పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. అరుుతే అమెరికా ఈ విధమైన యూఎన్ గుర్తింపునకు ఆమోదం తెలపకుండా తాత్సారం చేసింది. ఎట్టకేలకు భారత్, అమెరికా ప్రధాన కార్యాలయూల ఒప్పందాన్ని అనుసరించి ఈ నెల 8న దేవయూనికి పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. ఈ నెల 9న ఆ హోదాను రద్దు చేయూల్సిందిగా అమెరికా భారత్ను కోరింది. తద్వారా ఖోబ్రగడేను కోర్టులో విచారించేందుకు వీలవుతుందని ఆ దేశం ఆశించింది. -
రాజీ లేదు పోరాటమే.. అమెరికాకో దండం
అమెరికాలో అవమానకర పరిస్థితుల్నిఎదుర్కొన్న భారతీయ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకు రాజీచేసుకుని అమెరికాలో ఉండే అవకాశం వచ్చినా నిరాకరించారు. తన పట్ల అనుచితంగా వ్యవహరించిన అధికారులపై న్యాయపరమైన పోరాటం చేయాలని నిర్ణయించుకుని భారత్కు తిరిగివస్తున్నారు. దేవయాని తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే ఈ విషయాల్నివెల్లడించారు. ఈ వివాదంపై భారతీయ కోర్టులోనే న్యాయపోరాటం చేయనున్నట్టు తెలిపారు. 1999 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి దేవయాని వీసా నిబంధనల్ని అతిక్రమించినట్టు అభియోగాల్ని మోపారు. ఖోబ్రగడేకు సంకెళ్లు వేసి అరెస్ట్ చేయడంతో పాటు పూర్తిగా దుస్తులు విప్పి తనిఖీ చేశారని వెలుగులోకి రావడంతో భారత దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ''దేవయానీ ఖోబ్రగడేకు 2014 జనవరి 8వ తేదీన పూర్తి దౌత్య రక్షణతో జీ1 వీసా మంజూరైంది. ఆమె భారతదేశానికి విమానంలో బయల్దేరారు" అని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 12న ఆమె న్యూయార్క్లో అరెస్టయినప్పుడు భారత్ తరఫున అక్కడున్న ఏకైక డిప్యూటీ కాన్సల్ జనరల్ ఆమే. తర్వాత ఆమెను ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్కు పూర్తి దౌత్య పరమైన రక్షణలతో బదిలీ చేశారు. ఎట్టకేలకు గురువారం నాడు ఖోబ్రగడేపై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాల నమోదు పూర్తిచేసింది. ఖోబ్రగడేకు దౌత్యరక్షణ మంజూరు చేశారని, అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిందిగా కోరారని న్యాయవాదులు తెలిపారు. మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓప్రకటన విడుదల చేసింది. ''న్యూయార్క్లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారతదేశానికి ఉన్న శాశ్వత మిషన్లో కౌన్సెలర్ అయిన ఖోబ్రగడేకు జనవరి 8న పూర్తిస్థాయి దౌత్య రక్షణ కల్పించాం. ఐక్యరాజ్యసమితికి, అమెరికాకు మధ్య ఉన్న హెడ్క్వార్టర్స్ ఒప్పందంలోని సెక్షన్ 15 కింద ఇవి మంజూరయ్యాయి. అదే సమయంలో, ఖోబ్రగడేకు ఉన్న దౌత్యపరమైన రక్షణను తొలగించాలని అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది'' అని ఆ ప్రకటనలో చెప్పారు. అయితే, భారత ప్రభుత్వం అందుకు నిరాకరించి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఖోబ్రగడేను బదిలీ చేసింది. తనపై మోపిన నేరాల గురించి తనకేమీ తెలియదని దేవయాని విమానాశ్రయంలో తెలిపారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రికి, భారతదేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. -
భారత్కు తిరిగొస్తున్న దేవయాని
భారతీయ దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగడేపై ఎట్టకేలకు అమెరికా గ్రాండ్ జ్యూరీ నేరాన్ని నిర్ధరించింది. అమెరికా వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా కోరడంతో ఆమె తిరిగి భారత్ వస్తున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. ''దేవయానీ ఖోబ్రగడేకు 2014 జనవరి 8వ తేదీన పూర్తి దౌత్య రక్షణతో జీ1 వీసా మంజూరైంది. ఆమె భారతదేశానికి విమానంలో బయల్దేరారు" అని అందులో చెప్పారు. ఖోబ్రగడేకు సంకెళ్లు వేసి, పూర్తిగా దుస్తులు విప్పి వెతకడంతో భారత దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. డిసెంబర్ 12న ఆమె న్యూయార్క్లో అరెస్టయినప్పుడు భారత్ తరఫున అక్కడున్న ఏకైక డిప్యూటీ కాన్సల్ జనరల్ ఆమే. తర్వాత ఆమెను ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్కు పూర్తి దౌత్య పరమైన రక్షణలతో బదిలీ చేశారు. ఎట్టకేలకు గురువారం నాడు ఖోబ్రగడేపై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాల నమోదు పూర్తిచేసింది. ఖోబ్రగడేకు దౌత్యరక్షణ మంజూరు చేశారని, అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిందిగా కోరారని న్యాయవాదులు తెలిపారు. మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓప్రకటన విడుదల చేసింది. ''న్యూయార్క్లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారతదేశానికి ఉన్న శాశ్వత మిషన్లో కౌన్సెలర్ అయిన ఖోబ్రగడేకు జనవరి 8న పూర్తిస్థాయి దౌత్య రక్షణ కల్పించాం. ఐక్యరాజ్యసమితికి, అమెరికాకు మధ్య ఉన్న హెడ్క్వార్టర్స్ ఒప్పందంలోని సెక్షన్ 15 కింద ఇవి మంజూరయ్యాయి. అదే సమయంలో, ఖోబ్రగడేకు ఉన్న దౌత్యపరమైన రక్షణను తొలగించాలని అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది'' అని ఆ ప్రకటనలో చెప్పారు. అయితే, భారత ప్రభుత్వం అందుకు నిరాకరించి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఖోబ్రగడేను బదిలీ చేసింది. తనపై మోపిన నేరాల గురించి తనకేమీ తెలియదని దేవయాని విమానాశ్రయంలో తెలిపారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రికి, భారతదేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. -
అమెరికా ఎగతాళిని సహించేది లేదు: కమల్నాథ్
న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయ దౌత్యవేత్త దేవయానిపై అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల కేంద్ర పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి కమల్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం కమల్నాథ్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... దేవయానిపై నమోదు చేసిన కేసును వెంటనే ఉప సంహరించుకోవాలని ఆయన అమెరికాను డిమాండ్ చేశారు. అలాగే ఆమెను తనిఖీ చేసే క్రమంలో ఆ దేశ ఉన్నతాధికారు వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడ్డారు. భారతీయులపై తరచుగా అమెరికా తనిఖీల పేరిట నిర్వహిస్తున్న సోదాలను ఖండించారు. అమెరికా చర్యలను ఎంత మాత్రం సహించేది లేదని కమల్నాథ్ స్పష్టం చేశారు. దేవయాని విషయంలో వెనక్కి తగ్గేది లేదని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి ప్రతినిధి మేరీ హార్ఫ్ శుక్రవారం ఉదయం అమెరికాలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో హార్ఫ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటని విలేకర్లు కమల్నాథ్ను ప్రశ్నించారు. దీంతో ఆయనపై విధంగా స్పందించారు. -
దేవయానికి మర్యాద చేశాం.. కాఫీ కూడా ఇచ్చాం!!
అమెరికాలోని భారత దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగాదేను అసలు ఏమాత్రం అవమానించలేదట. పైపెచ్చు ఆమెకు కాఫీ కూడా ఇచ్చారట, సొంత కారులో కాసేపు ఫోన్లు మాట్లాడుకోడానికి అనుమతించారట!! ఇవన్నీ చెబుతున్నది ఎవరో కాదు. అమెరికాలోని భారత సంతతి అటార్నీ ప్రీత్ బరారా. అమెరికాలో అసలు దేవయానికి అవమానమే జరగలేదని, అంతా చట్టప్రకారమే చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు వెయ్యి పదాలతో కూడిన ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు. అసలు దేవయానికి సంకెళ్లు వేయలేదని, మర్యాద చేశామని అన్నారు. ఆమె ఇంట్లో పనిమనిషి సంగీతా రిచర్డ్ కుటుంబాన్ని భారత్ నుంచి తరిమేశారని, ఆమెను నోరు తెరవకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, బలవంతంగా సంగీతను భారత్ రప్పించాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అమెరికా విదేశాంగ శాఖ ఏజెంట్లు దేవయానిని అరెస్టుచేసిన మాట నిజమే గానీ, ఆమెకు మాత్రం సంకెళ్లు వేయలేదని బరారా చెప్పారు. ఓ మహిళా డిప్యూటీ మార్షల్ ప్రత్యేకమైన గదిలో దేవయానీ ఖోబ్రగాదేను 'పూర్తిగా' గాలించారని, ధనవంతులైనా, పేదలైనా, అమెరికన్లయినా, కాకపోయినా అందరికీ ఆ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఆమెకు తాము కాఫీకూడా ఇచ్చామని, తన పిల్లవాడి సంరక్షణ చూసుకోడానికి ఫోన్ కాల్స్ చేసుకోడానికి కూడా అనుమతించామని చాలా గొప్ప పని చేసినట్లు చెప్పారు. బయట బాగా చల్లగా ఉన్నందున కారులో కూర్చునే ఫోన్లు చేసుకోడానికి అనుమతించామన్నారు. పౌరహక్కులు, చట్టాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అమెరికా న్యాయవాదులదా లేక భారత ప్రభుత్వం, ఆ దేశ దౌత్యవేత్తలదా అని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని పరిరక్షించడం, బాధితులను కాపాడటం, చట్టాన్ని ఉల్లంఘించినవారు ఎవరైనా సరే వారిని బాధ్యులుగా చేయడం, వాళ్ల సామాజిక హోదా ఏదైనా సరే, వాళ్లు ఎంత ధనవంతులైనా, శక్తిమంతులైనా సరే ఒకే న్యాయాన్ని అమలుచేయడమే తమ బాధ్యత అని ప్రీత్ బరారా గొప్పగా చెప్పుకొన్నారు. సంగీతా రిచర్డ్కు పాస్పోర్టు కూడా లేనందున ఆమెకు తాత్కాలికంగా చట్టబద్ధమైన హోదా కల్పించి, అమెరికాలోనే ఉండి పనిచేసుకోడానికి అనుమతించినట్లు ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది డానా సుస్మన్ తెలిపారు. -
అమెరికన్ కాన్సులేట్ వద్ద ఆందోళన
-
అమెరికన్ కాన్సులేట్ వద్ద ఆందోళన
బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద వామపక్షాలు, విద్యార్థి సంఘాలు భారీగా ధర్నా చేశాయి. అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగాదేకు జరిగిన అవమానానికి నిరసనగా వీళ్లంతా అక్కడ ధర్నా చేసి, కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే, అలా జరగకుండా ముందుగానే పోలీసులు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటుచేశారు. కిలోమీటరు దూరం వరకు బారికేడ్లు ఏర్పాటుచేసి చివరకు మీడియాను కూడా అక్కడకు అనుమతించలేదు. పోలీసులను కూడా భారీ సంఖ్యలో మోహరించారు. చుట్టుపక్కల ఉన్న మిగిలిన కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని కూడా అటువైపు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వామపక్షాల కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. కాన్సులేట్ కార్యాలయం వద్ద ఎవరినీ అనుమతించబోమంటూ బోర్డు కూడా పెట్టారు. అయినా విద్యార్థులు ఎలాగోలా సమీపం వరకు వెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేసి, తీవ్ర స్థాయిలో నినదించారు. ఆందోళనకారులకు మొదటి బ్యారికేడ్ దాటి కార్యాలయం వదరకు వెళ్లడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోలీసులు గట్టిగా అడ్డుకున్నారు. -
దేవయాని తప్పేంటి.. పనిమనిషి జీతం 2.80 లక్షలా?
దేవయానీ ఖోబ్రగాదే నిజంగా తప్పు చేశారా? వీసా పత్రాలలో పనిమనిషికి ఒక జీతం ఇస్తున్నట్లు చూపించి వాస్తవంగా ఆమెకు అంతకంటే తక్కువ ఇచ్చారా? సరిగ్గా ఇవే ఆరోపణలతో అమెరికన్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కానీ వాస్తవానికి జరిగిందేంటో తెలుసా? ఐఎఫ్ఎస్ అధికారిణి అయిన దేవయాని అమెరికాలోని భారత కాన్సులేట్లో సహాయ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమెకు వచ్చే జీతం భారతీయ కరెన్సీలో సుమారు 4 లక్షల రూపాయలు. తన ఇంట్లో పనులు చూసుకోడానికి ఆయాగా నియమించుకున్న మహిళకు ఆమె ఇవ్వాల్సిన జీతం అమెరికన్ నిబంధనల ప్రకారం అయితే అక్షరాలా 2.80 లక్షల రూపాయలు!! అంటే దాదాపు మూడొంతుల జీతాన్ని ఆమె తన పనిమనిషికే ఇచ్చేయాలి. అలా ఇచ్చేస్తే ఇక ఆమె దైనందిన జీవితానికి మిగిలేది ఏమీ ఉండదు. అందుకే దాదాపుగా అమెరికాలో ఉండేవాళ్లు ఎవరైనా సరే పనిమనుషుల విషయంలో అగ్రిమెంటులో చూపించే అంకె ఒకటైతే వాస్తవంగా ఇచ్చేది వేరే ఉంటుంది. ఇది అక్కడ సర్వ సాధారణం కూడా. కానీ, దేవయాని ఇంట్లో పనిమనిషిగా వెళ్లిన మహిళ తనకు డబ్బులు సరిపోవడం లేదని, వారాంతపు సెలవుల్లో వేరే ఉద్యోగం చేసుకుంటానని చెప్పింది. అందుకు వీసా నిబంధనలు అంగీకరించవని, ఇబ్బంది అవుతుందని దేవయాని చెప్పగా, ఆమె చెప్పా పెట్టకుండా ఇంటినుంచి వెళ్లిపోయి, నేరుగా న్యాయవాదులను సంప్రదించి కేసు పెట్టింది. అయితే అప్పటికే ఆమె వ్యవహార శైలితో విసిగిపోయిన దేవయాని, ఢిల్లీలో ఆమెపై కేసు పెట్టగా.. అధికారులు సదరు పనిమనిషిని వెనక్కి వచ్చేయాల్సిందిగా ఆదేశించారు. ఢిల్లీ వెళ్తే తనను అరెస్టు చేస్తారన్న భయంతో ఆమె అమెరికాలోనే ఉండిపోయింది. దాంతో దేవయానికి చిక్కులు వచ్చిపడ్డాయి. అయితే.. భారత దౌత్యవేత్తలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం అగ్ర రాజ్యానికి కొత్తకాదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నప్పటికీ.. నీచంగా ప్రవర్తించడం ఆ దేశానికి అలవాటేనని, ఇలాంటి తనిఖీలతో అమెరికా ఉద్దేశపూర్వకంగా భారత్పై దాడి చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 2010లో అమెరికాలో భారత రాయబారిగా ఉన్న మీరా శంకర్ విషయంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దౌత్య పర్యటనకు సంబంధించి ఆమె మిసిస్సిపీ వెళ్లినప్పుడు.. జాక్సన్ ఎవర్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత సిబ్బంది ఆమెను భద్రత గీత దాటి బయటకు రమ్మని సూచించారు. ఆమె వచ్చాక ఓ భద్రత సిబ్బంది ఆమె ఒళ్లంతా తడుముతూ తనిఖీ చేశారు. తనకు దౌత్య హోదా ఉందని చెప్పినప్పటికీ వినకుండా బహిరంగంగా అవమానించారు. మరో ఘటనలో.. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హర్దీప్ పూరీని కూడా ఒళ్లంతా తడుముతూ తనిఖీలు చేశారు. ఆయన్ను ఓ ప్రత్యేక గదిలోనికి తీసుకెళ్లి.. తలపాగాను సైతం తెరవాల్సిందిగా కోరారు. దానికి ఆయన నిరాకరించారని సమాచారం. -
పెద్దన్నకు బుద్ధోచ్చేలా,.
-
పెద్దన్నకు బుద్ధోచ్చేలా,.
దౌత్యాధికారికి అవమానంపై భారత్ ఆగ్రహం ప్రతిచర్యలకు దిగిన కేంద్ర ప్రభుత్వం అమెరికా దౌత్యాధికారుల ‘మర్యాద’ తగ్గింపు.. {పత్యేక గుర్తింపు కార్డుల ఉపసంహరణ ఎయిర్పోర్ట్ పాస్లూ వెనక్కి... ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయం వద్ద భద్రత కుదింపు.. బారికేడ్లను బుల్డోజర్లతో తొలగించిన పోలీసులు అమెరికా దౌత్యాధికారుల ఇళ్లలో పని మనుషుల వివరాల సేకరణ.. అమెరికా ప్రతినిధి బృందంతో భేటీలు రద్దు చేసుకున్న నేతలు.. న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రాగాదేకు జరిగిన అవమానం దేశాన్ని కుదిపేసింది. మహిళ.. అందులోనూ దౌత్యవేత్త.. అయినప్పటికీ బహిరంగంగా బేడీలు వేసి అరెస్టు చేయడమే కాక.. దుస్తులు విప్పి తనిఖీలు చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. అటు ప్రభుత్వ, ప్రతిపక్షాలు కూడా పార్టీలకతీతంగా ఒక్కతాటిపైకి వచ్చి అగ్రరాజ్యానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించాయి. మీ దేశంలో మాకు గౌరవం ఇవ్వకపోతే.. మా దేశంలో మీకూ గౌరవమిచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. భారత్లో అమెరికా దౌత్యవేత్తలు, వారి కుటుంబాలకిచ్చే ‘మర్యాద’ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో పర్యటిస్తున్న అమెరికా ప్రతినిధి బృందంతో సమావేశమవడానికి నిరాకరించడం ద్వారా అటు ప్రభుత్వ, ఇటు విపక్ష నాయకులు.. అగ్రరాజ్యానికి తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. అగ్రరాజ్యం కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే.. చూస్తూ ఊరుకోమని గట్టి సందేశం పంపారు. మర్యాద తగ్గించారు.. మన దేశంలో పనిచేస్తున్న అమెరికా దౌత్య కార్యాలయ అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబాలకు సాధారణంగా లభించే గౌరవ స్థాయిని తగ్గించాలని, అగ్రరాజ్యంలో వారు మన కాన్సులేట్లలో సిబ్బందికి కల్పించే స్థాయి మాత్రమే వారికి కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తక్షణం అమలు చేస్తూ మంగళవారం చర్యలు చేపట్టింది. ఈ మేరకు వారికిచ్చిన ప్రత్యేక గుర్తింపు కార్డులను వెనక్కి ఇచ్చేయాలని భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఫలితంగా దౌత్యకార్యాలయ అధికారులు, వారి కుటుంబ సభ్యులకు దక్కుతున్న ‘దౌత్య మర్యాదలు’ ఇక మీదట పొందడానికి అవకాశం ఉండదు. అలాగే ఎయిర్పోర్ట్పాస్లతోపాటు వారికి కల్పిస్తున్న పలు సదుపాయాలనూ ఒక్కసారిగా ఉపసంహరించుకుంది. అమెరికా రాయబార కార్యలయానికి మద్యంతోపాటు పలు దిగుమతులకు సంబంధించి ఉన్న అనుమతులను కూడా నిలిపివేసింది. ఢిల్లీలోని అమెరికా ఎంబసీ(దౌత్య కార్యాలయం)కి కల్పిస్తున్న భద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసు శాఖకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఎంబసీ వద్ద ఉన్న బారికేడ్లను పోలీసులు మంగళవారం బుల్డోజర్లు ఉపయోగించి మరీ తొలగించారు. కేవలం అక్కడ ఇప్పుడు పోలీస్ పికెట్ మాత్రమే మిగిల్చారు. రాయబార కార్యాలయం చుట్టుపక్కల ప్రజలు సంచరించకుండా, అటువైపుగా వాహనాలు రాకుండా ఇంతవరకు ఈ బారికేడ్లు అడ్డుగా ఉండేవి. భారత్లో పని మనుషుల సంగతేమిటి? దేవయాని ఖోబ్రాగాదే(39) భారత్ నుంచి పని మనిషిని అమెరికా తీసుకెళ్లడానికి వీలుగా తప్పుడు సమాచారం ఇచ్చి వీసా సంపాదించారని ఆరోపిస్తూ ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాను మరింత ఇరుకున పెట్టేందుకు వీలుగా.. భారత్లో పనిచేస్తున్న అమెరికా దౌత్య అధికారుల ఇళ్లలో ఉన్న పని మనుషులకు ఎంత జీతాలు ఇస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం ఆరా తీస్తోంది. కనీస వేతన చట్టానికి లోబడి జీతాలు చెల్లిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి వీలుగా అన్ని వివరాలు ఇవ్వాలని దౌత్య అధికారులను కోరింది. ఇక్కడి అమెరికా స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బంది జీత భత్యాల వివరాలనూ సేకరిస్తోంది. వారి బ్యాంకు ఖాతాలనూ పరిశీలించనుంది. జీత భత్యాల చెల్లింపుతో పాటు మరే విషయంలో అయినా నిబంధనలను ఉల్లంఘించారా? అనే విషయాలను కేంద్రం పరిశీలిస్తోంది. నిబంధనలను ఉల్లంఘించారని తేలితే.. బాధ్యుల మీద కేసులు పెట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అమెరికా ప్రతినిధి బృందాలతో భేటీలు రద్దు చేసుకున్న నేతలు.. అమెరికా చర్యపై భారత జాతీయ భద్రత సలహాదారు శివశంకర్ మీనన్ మండిపడ్డారు. ఇది నీచమైన, అనాగరికమైన చర్య అని విమర్శించారు. ఆ వెంటనే పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులందరూ అమెరికాపై విమర్శల వర్షం కురిపించారు. మన దౌత్య అధికారిణిని అవమానించినందుకు నిరసనగా.. అమెరికా ప్రతినిధి బృందాలతో భేటీలను లోక్సభ స్పీకర్ మీరా కుమార్, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ తదితరులు రద్దు చేసుకున్నారు. అమెరికా ప్రతినిధి బృందాలతో భేటీ రద్దు చేసుకున్న వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. అమెరికాలో భారత మహిళకు జరిగిన అవమానానికి నిరసనగానే అమెరికా బృందంతో భేటీకి తిరస్కరిస్తున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధి బృందంలో జార్జి హోల్డింగ్(రిపబ్లికన్-నార్త్ కరోలినా), పెటె ఓస్లాన్(రిపబ్లికన్-టెక్సాస్), డేవిడ్ ష్వైకర్ట్(రిపబ్లికన్-అరిజోనా), రాబర్ట్ వూడాల్(రిపబ్లికన్-జార్జియా), మడెలైనా బోర్డాలో(డెమొక్రాట్-గువామ్) ఉన్నారు. విదేశాంగ, హోం మంత్రులతో దేవయాని తండ్రి భేటీ దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రాగాదే మంగళవారమిక్కడ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, హోం మత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. దేవయాని అరెస్టును ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని, తగిన విధంగా చర్యలు తీసుకుంటోందని ఖుర్షీద్.. ఉత్తమ్కు తెలిపారు. ‘‘సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ ఆయన నాకు తెలిపారు. వెంటనే నేను సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలకు ఆదేశించాను. ఆమెకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం’’ అని సుశీల్ కుమార్ షిండే విలేకరులతో అన్నారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నా కూతురుపై మోపిన అభియోగాలను తొలగించేలా చూస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు. తను ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నందున తనకు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని చెప్పారు’’ అని వెల్లడించారు. అంతకుముందు ఆయన మరోచోట విలేకరులతో మాట్లాడుతూ.. అరెస్టు చేసినా దేవయానిని గౌరవంగా చూడాల్సి ఉందని, కానీ రెండు దేశాల మధ్య యుద్ధంలో తన బిడ్డను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కలుగజేసుకుని తన కుమార్తెను వెనక్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనికిముందు విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్.. అమెరికా రాయబారి నాన్సీ పావెల్ను పిలిచి మాట్లాడారు. ఈ విషయంలో భారత ఆగ్రహాన్ని తెలియజేశారు. ఆ ‘గే’లను అరెస్టు చేయండి స్వలింగ సంపర్కం నేరమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అమెరికా దౌత్యాధికారుల వెంట వచ్చిన స్వలింగ సంపర్కులను(గే) వెంటనే అరెస్టు చేయాలి. చాలా మంది దౌత్యాధికారులతోపాటు వారి ‘సహధర్మచారు’లకు కూడా మనం వీసాలు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అమెరికాలో తక్కువ వేతనం ఇవ్వడం ఎలా నేరమో.. ఇక్కడ స్వలింగ సంపర్కం కూడా అలాగే నేరం కాబట్టి.. వారందరికీ ఇచ్చిన వీసాలను రద్దు చేసి వారిని శిక్షించండి. - యశ్వంత్ సిన్హా, బీజేపీ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి బేషరతు క్షమాపణ చెప్పాల్సిందే దేవయానికి జరిగిన అవమానానికి అమెరికా భారత్కు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. ప్రపంచం మారిందని అమెరికాకు తెలిసొచ్చేలా చేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. భారత్ చిన్నాచితకా దేశంగా చూస్తే సహించం. ఈ విషయాన్ని అమెరికా గ్రహించాలి. ఇతర దేశాల గౌరవ మర్యాదలను కూడా అమెరికా గుర్తించాలి. - కమల్నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కుక్క కాటుకు చెప్పుదెబ్బ కొట్టాల్సిందే.. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు అమెరికాకు తగని విధంగా బుద్ధి చెప్పాల్సిందే. దేవయానిని అవమానించినట్లుగానే అమెరికా దౌత్యాధికారులను కూడా బట్టలు విప్పి తనిఖీ చేయాల్సిందే. ఇంత జరుగుతున్నా.. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. అమెరికా ప్రతినిధి బృందాన్ని కలవడం దారుణం. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని అమెరికాకు గట్టి సందేశం పంపాలి. దీనిపై చర్చించాల్సిందిగా నేను రాజ్యసభలో నోటీసు ఇచ్చినప్పటికీ.. లోక్పాల్ ఉన్నందువల్ల చర్చకు రాలేదు. బుధవారం మళ్లీ నోటీసు ఇస్తాను. - కె.సి.త్యాగి, జేడీయూ ఎంపీ నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం: అమెరికా వాషింగ్టన్: దేవయానిని దుస్తుల విప్పి తనిఖీలు చేసింది నిజమేనని, అయితే తమ నిబంధనల ప్రకారమే పోలీసులు నడుచుకున్నారని విదేశాంగ శాఖ ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆమె మీద ఆరోపణలు ఉన్నందున.. ఆమెకు దౌత్యపరమైన రక్షణ పూర్తిగా లభించదని పేర్కొన్నారు. ‘‘అరెస్టు చేసిన తర్వాత తదుపరి చర్యల నిమిత్తం ఆమెను అమెరికా మార్షల్స్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందన్న దానిపై ప్రశ్నలు వేయాలంటే మీరు వారినే సంప్రదించాలి.. మమ్మల్ని కాదు’’ అని విలేకరుల ప్రశ్నలకు ఆమె సమాధానంగా చెప్పారు. లోక్సభ స్పీకర్ మీరాకుమార్, జాతీయ భద్రత సలహాదారు శివశంకర్ మీనన్లు.. అమెరికా ప్రతినిధి బృందంతో భేటీలను రద్దుచేసుకోవడంపై ప్రశ్నించగా.. ఆ వివరాలు తనకు తెలియవని, ఏమైనా అడగాలంటే ఆ ప్రతినిధి బృందాన్నే అడగాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె దౌత్యపరమైన రక్షణకు, వాణిజ్య దౌత్యపరమైన రక్షణకు తేడా ఉందని చెప్పారు. అవమానించడం కొత్తకాదు.. న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్తలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం అగ్ర రాజ్యానికి కొత్తకాదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నప్పటికీ.. నీచంగా ప్రవర్తించడం ఆ దేశానికి అలవాటేనని, ఇలాంటి తనిఖీలతో అమెరికా ఉద్దేశపూర్వకంగా భారత్పై దాడి చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 2010లో అమెరికాలో భారత రాయబారిగా ఉన్న మీరా శంకర్ విషయంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దౌత్య పర్యటనకు సంబంధించి ఆమె మిసిస్సిపీ వెళ్లినప్పుడు.. జాక్సన్ ఎవర్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత సిబ్బంది ఆమెను భద్రత గీత దాటి బయటకు రమ్మని సూచించారు. ఆమె వచ్చాక ఓ భద్రత సిబ్బంది ఆమె ఒళ్లంతా తడుముతూ తనిఖీ చేశారు. తనకు దౌత్య హోదా ఉందని చెప్పినప్పటికీ వినకుండా బహిరంగంగా అవమానించారు. మరో ఘటనలో.. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హర్దీప్ పూరీని కూడా ఒళ్లంతా తడుముతూ తనిఖీలు చేశారు. ఆయన్ను ఓ ప్రత్యేక గదిలోనికి తీసుకెళ్లి.. తలపాగాను సైతం తెరవాల్సిందిగా కోరారు. దానికి ఆయన నిరాకరించారని సమాచారం. అయితే ఇదే అంశంపై హర్దీప్ను ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ జరగలేదని అప్పట్లో ఆయన చెప్పారు. క్షమాపణ చెప్పాల్సిందే: కమల్నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి దేవయానికి జరిగిన అవమానానికి అమెరికా భారత్కు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. భారత్ను చిన్నాచితకా దేశంగా చూస్తే సహించం. ఇతర దేశాల గౌరవ మర్యాదలను కూడా అమెరికా గుర్తించాలి. -
దీటుగా స్పందిస్తున్న భారత్
వీసా కేసులో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాదేను అరెస్టు చేయడం పట్ల భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. అగ్రరాజ్యం అమెరికా అడుగులకు ఇన్నాళ్లూ మడుగులు ఒత్తుతూ వస్తున్న భారత్.. తొలిసారిగా జూలు విదిల్చింది. మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు అందరూ తమ గుర్తింపుకార్డులను భారత విదేశాంగ శాఖకు అప్పగించేయాలని ఆదేశించింది. అంతేకాదు, దేవయాని విషయంలో భారత్కు సంఘీభావం ప్రకటించడానికి ఢిల్లీ వచ్చిన అమెరికా ప్రతినిధి బృందాన్ని కలిసేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరస్కరించారు. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీ కూడా అమెరికా డెలిగేషన్ను కలిసేందుకు నిరాకరించారు. దాంతోపాటు అమెరికా నుంచి అన్ని రకాల దిగుమతులను భారత్ ఆపేసింది. అమెరికన్ ఎంబసీలు, కాన్సులేట్లకు జారీ చేసిన అన్ని ఎయిర్పోర్టు పాస్లను భారత్ ఉపసంహరించుకుంది. అమెరికన్ రాయబార కార్యాలయం వెలుపల భద్రత కోసం ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను కోరింది. వాళ్లు ఎలా వ్యవహరిస్తే తామూ అలాగే ఉంటామని, చెప్పుదెబ్బకు అదే స్థాయిలో సమాధానం ఇస్తామని మన దౌత్యవర్గాలు ఆవేశంగా వ్యాఖ్యానించాయి. కాగా, దేవయాని పట్ల అమెరికా చాలా నీచంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్కు అలవాటుపడినవారిని ఉంచే జైలు గదిలో ఆమెను ఉంచారు. దీనిపై భారత్ అమెరికాకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ప్రవాస భారతీయుల శాఖ మంత్రి వయ్లార్ రవి మండిపడ్డారు. అయితే, అమెరికా మాత్రం ఖోబ్రగాదే తన పనిమనిషికి గంటకు కేవలం మూడు డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నారని, అది కనీస వేతనాల కంటే చాలా తక్కువని అంటున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలు తమకు సమ్మతం కాదని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. ఈ సమస్యను వీలైనంత మర్యాదపూర్వకంగా పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికన్ కాన్సులేట్లలో భారతీయ సిబ్బందికి ఎంత వేతనం చెల్లిస్తున్నారు, అలాగే అమెరికన్ అధికారులు తమ ఇళ్లలో పనిచేసేవాళ్లకు ఎంత జీతం ఇస్తున్నారనే విషయాలను కూడా భారత్ కూపీ లాగుతోంది. అమెరికన్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వీసా వివరాలు, వాళ్ల బ్యాంకు ఖాతాలు, జీతాల వివరాలు కూడా తెలుసుకుంటోంది. అమెరికన్ ఎంబసీలకు దిగుమతి క్లియరెన్సులను స్తంభింపజేశారు. ఇవి ఆరంభం మాత్రమేనని, దేవయాని విషయంలో సరిగా వ్యవహరించకపోతే మరిన్ని కఠిన చర్యలు ఎదురవుతాయని దౌత్యాధికారులు చెబుతున్నారు. -
అమెరికాలో దౌత్యవేత్త అరెస్ట్ అవమానకరం: ఖుర్షీద్
ఫర్కుహాబాద్: అమెరికాలో భారత దౌత్యవేత్త పట్ల అమర్యాదగా ప్రవర్తించడాన్ని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తప్పుబట్టారు. డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయాని ఖోబ్రాగాదేను నడిబజార్లో అరెస్ట్చేసి, చేతికి సంకెళ్లు వేయడం అవమానకరమని ఆయన అన్నారు. తాము ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఖుర్షీద్ ఆదివారమిక్కడ విలేకరులతో పేర్కొన్నారు. దీనిపై అమెరికా స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, దాన్నిబట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన ఇంట్లో పనిచేస్తున్న మహిళ వీసా పత్రాల్లో తప్పుడు సమాచారమిచ్చారన్న ఆరోపణలపై 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారిణి అయిన దేవయానిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్చేసిన సంగతి తెలిసిందే.