Jagananna Videshi Vidya Deevena
-
Andhra Pradesh: విదేశీ విద్య.. ఇప్పుడు మిథ్య!
పేద పిల్లలకు విదేశాల్లోనూ ఉన్నత చదువులు అందించాలనే గొప్ప ఆలోచనతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని దెబ్బ తీసేందుకు కూటమి సర్కారు కుయుక్తులు పన్నుతోంది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలు గడిచినా విదేశీ విద్యకు పైసా విదల్చకుండా ఆ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కొత్తగా విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను సైతం పట్టించుకోవడం లేదు.విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి జనవరి నుంచి పేద విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మరికొందరి అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదలను నిలిపివేశారు. ప్రభుత్వ సాయం అందుతుందనే ఆశతో ఇంటర్వ్యూ పూర్తయిన చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా వారికి సాయం అందించే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ వరకు విదేశీ విద్యా దీవెన పథకం కింద పేద విద్యార్థులకు రూ.107.07 కోట్లు అందించింది. గతేడాది విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు నాలుగు విడతల్లో ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం అందించాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్లో మరోమారు నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వారికి సాయం విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విదేశీ విద్యా పథకం మంజూరైందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటేకనీసం సమాధానం చెప్పే వారే కరువయ్యారు.ఏదైనా అప్డేట్ ఉందేమో చూద్దామనుకుంటే జ్ఞాన భూమి పోర్టల్ అసలు తెరుచుకోవడం లేదు. ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తులను సైతం అధికారులు తొలగించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఈ పథకాన్ని కొత్త ప్రభుత్వం ఎత్తేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల వినతులు సమర్పించనప్పటికీ వారి నుంచి స్పష్టత రాక పోవడం శోచనీయం. – సాక్షి, అమరావతిప్రభుత్వ సాయం అందుతుందని మా అబ్బాయిని విదేశీ చదువుకు పంపించా. కూటమి ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యకు సాయం అందించలేదు. కనీసం మా దరఖాస్తు ఏమైందో తెలుసుకుందామంటే జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. సమాధానం చెప్పే నాథుడే లేడు. నెలలు గడుస్తున్నా మా ఆవేదన పట్టించుకోవడం లేదు. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికి సాయం అందేది. ఇప్పుడొచ్చిన చంద్రబాబు ప్రభుత్వ సాయం అందించకపోతే మా అబ్బాయి చదువు కోసం మేము అప్పులు చేసి అవస్థలపాలుకాక తప్పదు. – గుంటూరుకు చెందిన ఒక చిరుద్యోగి మా అమ్మాయిని విదేశాల్లో డాక్టర్ చదివిద్దామని విదేశీ విద్యా సాయం కోసం దరఖాస్తు చేసి నాలుగు నెలలు దాటింది. మా దరఖాస్తు ఏమైందో తెలియదు. జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. విదేశీ విద్య పథకాన్ని కొత్త ప్రభుత్వం నిలిపేస్తుందని అంటున్నారు. నిబంధనల పేరుతో సాయాన్ని అరకొరగా పరిమితం చేస్తారంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం సాయం అందిస్తుందో లేదో తెలిస్తే.. మా తిప్పలు మేము పడతాం. – పశ్చిమదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ రైతు ఆవేదనపేద బిడ్డలపై పెద్ద మనసు చూపిన జగన్విదేశాల్లో చదివేందుకు వెళ్లిన పేద బిడ్డలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 408 మందికి రూ.107.07 కోట్లు అందించారు. గత చంద్రబాబు ప్రభుత్వం 2016–17 నుంచి అమలు చేసిన పథకంలో 3,326 మందికి రూ.318 కోట్లు ఎగ్గొట్టింది. అదే మాదిరి ఈసారి కూడా విదేశీ విద్య పథకంలో ఎంపికైన వారికి మొండి చెయ్యి చూపించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.⇒ గత చంద్రబాబు ప్రభుత్వం అగ్రవర్ణ పేదలను విస్మరించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కేవలం రూ.15 లక్షలు చొప్పున మాత్రమే సాయం అందించి చేతులు దులుపుకొంది. అదే జగన్ సర్కారు ఒక్కొక్కరికి రూ.కోటి నుంచి రూ.కోటి 25 లక్షల వరకు సాయం అందించింది. వైఎస్ జగన్ అగ్రవర్ణ పేదల(ఈబీసీ)తో పాటు కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో చదువులకు ఊతమిచ్చారు.⇒ ప్రపంచంలో టాప్ 50 క్యూఎస్ ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంíపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు.. కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల(సెమిస్టర్)ల్లో ఆ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేవారు.⇒ విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించేది. పీజీ, పీహెచ్డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులకూ పథకాన్ని వర్తింపజేశారు. అటువంటి గొప్ప పథకాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దివిసీమ బిడ్డకు ‘జగనన్న దీవెన’
మోపిదేవి(అవనిగడ్డ): పేదింటి బిడ్డలు ఉన్నతంగా జీవించాలనేదే వైఎస్ జగన్ తపన. అందులో భాగంగానే జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చారు. ఎందరో భావి భారత పౌరులకు అందించారు. ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కృష్ణాజిల్లా దివిసీమ బిడ్డ. ఐక్యరాజ్య సమితిలో ఉన్నత స్థాయి రాజకీయ సమూహం ముందు ’సుస్థిర అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు.వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు కృష్ణకిషోర్ ఆగస్టు 2023 నుంచి యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ (సీపా–ఎస్ఐపీఏ)లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మిని్రస్టేషన్ విద్య అభ్యసిస్తున్నాడు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణకిషోర్కు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ.కోటి మంజూరు చేసింది. నాటి ప్రభుత్వం అందించిన సాయానికి పూర్తి న్యాయం చేస్తూ కృష్ణకిషోర్ అమెరికాలో అదీ ఐక్యరాజ్య సమితి ఆహా్వనంతో ఉన్నత స్థాయి ప్రతినిధుల ముందు తన వాణి వినిపించే అద్భుత అవకాశాన్ని పొందాడు.న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన సుస్థిర అభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్మెంట్) అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆహా్వనం అందుకున్నాడు. ఎస్ఐపీఏ స్టూడెంట్ అసోసియేషన్ అకడమిక్ చైర్మన్గా, సౌత్ ఏసియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న కృష్ణకిషోర్ ప్రపంచ విశ్వవిద్యాలయాల అధ్యక్షులు, కార్పొరేట్ నాయకులు, సీనియర్ యునైటెడ్ నేషన్స్ అధికారులతో వేదికను పంచుకుని పది నిమిషాల పాటు ప్రసంగించి ఆకట్టుకున్నాడు.జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన అందించిన జగనన్న విదేశీ విద్యా దీవెనతోనే మా బాబు కృష్ణకిషోర్ అమెరికా వెళ్లాడు. అటు ప్రభుత్వానికి, ఇటు మాకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. – తల్లిదండ్రులు పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ -
విదేశీ విద్యా దీవెన సమాచార బుక్ లెట్ ఆవిష్కరణ
-
విద్యాదీవెన..ఉన్నత శిఖరాలకు వంతెన
-
AP: విదేశాల్లో చదువుతున్నారా? ఉచిత బీమా పథకాన్ని సద్వినియోగించుకోండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు అనేక సేవలను అందిస్తోంది. ఇందులో ఒకటి ముఖ్యమైన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులు, విదేశాల్లో పనిచేసే వారు ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తీగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం 15 జనవరి 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 15 తర్వాత బీమా ప్రీమియం పెరిగి, ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున వెంటనే నమోదు చేసుకోగలరు. (ఇంతకుముందు సంవత్సరానికి రూ.180 ల ప్రీమియంగా ఉండేది). లక్షలు ఖర్చుపెట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశీ విద్యకు పంపుతున్నారు. అలా వెళ్ళిన ఎంతో మంది విద్యార్థులకు మరియు వారి కుటుంబానికి ఈ పథకం ఒక భరోసా. ఈ మధ్యకాలంలో మనం పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము... విద్యార్థులు సరదాగా బయటకు వెళ్లినప్పుడు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలకు గురవ్వడం అత్యంత బాధాకరం. ఈ బీమా లో నమోదు చేసుకోవడం వలన హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఇది ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది. విద్యార్థులు, లేదంటే వారి తరఫున వారి పేరు మీద తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా ప్రవాసాంధ్ర భరోసా బీమా లో ఉచితంగా నమోదు చేసుకోమని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి కోరారు. ఈ పథకం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ బీమా వలన ముఖ్య ప్రయోజనాలు ► బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ► ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ. 1లక్ష వరకు చెల్లింపు ► ప్రమాదం/అస్వస్థతకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే, స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీల చెల్లింపు ... ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ప్రవాసాంధ్ర భరోసా బీమా నందు నమోదు కొరకు APNRTS 24/7 హెల్ప్లైన్ +91-863-2340678; +91 85000 27678 (వాట్సప్) ను సంప్రదించండి మరియు వెబ్ సైట్-బీమా పేజి https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లో లాగిన్ అవ్వండి. లేదా insurance@apnrts.com; helpline@apnrts.com కు ఇమెయిల్ చేయండి. ఏపీఎన్ఆర్టీఎస్ అందించే వివిధ సేవలు, అప్డేట్స్ కొరకు https://www.apnrts.ap.gov.in/ ని సందర్శించండి. -
స్టూడెంట్ మాటలకు సీఎం జగన్ ఫిదా
-
విదేశీ విద్యా దీవెన స్కాలర్షిప్ తో మా కల నెరవేరింది: విద్యార్థులు
-
జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
చదుకునేందుకు పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదు: సీఎం జగన్
-
పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ‘విదేశీ విద్యా దీవెన’: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్లను.. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమచేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదే విధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాసైతే లక్ష, మెయిన్స్కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు. చదవండి: Dec 20th: AP పొలిటికల్ అప్డేట్స్ జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల నిధులు విడుదల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కామెంట్స్.. ‘ అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కలెక్టర్లు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ వీసీల్లో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు, మన తల్లిదండ్రులకు, మనకు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నాం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లోగానీ, లేదా క్యూఎస్ ర్యాకింగ్స్లో గానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు.. వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు చెల్లిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారికి రూ.కోటీ 25 లక్షల దాకా, మిగిలిన వారికి రూ.కోటి దాకా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతోంది. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి. వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇస్తున్నాం ఇదొక్కటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటి దాకా చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇస్తున్నాం. దాదాపుగా రూ.107 కోట్లు 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నాం. ఈ పథకం ఎంత సంతృప్తినిస్తుందంటే.. ఇదొక యాస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు స్పూర్తి పొంది, టాప్ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడాలి. ఎక్కడో ఒక చోట కెరీర్లో గొప్పగా ఎదిగిన తర్వాత.. ఈ తరహా సాయం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో.. అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలగాలి. మంచి సీఈవోలుగా పెద్ద పేరు తెచ్చుకుంటే రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకొని మన పిల్లలకు మీరు మంచి చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. ఈ ఫీజులు ఆశ్చర్యకరం అనిపించేలా ఉన్నాయి. ►కార్నిగిమెలన్ యూనివర్సిటీలో రూప అనే చెల్లెమ్మకు 89 లక్షలు కంప్యూటర్ సైన్స్ ► సాంబశివ అనే తమ్ముడికి న్యూయార్క్ లో కంప్యూటర్ సైన్స్ 89 లక్షలు.. ►కొలంబియా యూనివర్సిటీలో ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 75.87 లక్షలు ఫీజు ►వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ లో శ్రేయ 70 లక్షలు ఫీజు ► యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో మరియంకు సీటు వచ్చింది 67.50 లక్షలు ఫీజు.. ఇలా 51 మంది పేర్లు ఉన్నాయి. ►సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్లి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా ఈ నంబర్స్ ఉన్నాయి. ► ఫీజులు కట్టడానికి ఎంత అప్పులు, ఎక్కడ చేయాలి, ఎలా రీ పే చేయాలనే సంశయం ప్రతి తల్లిదండ్రికీ కలిగే పరిస్థితి. ► అటువంటి పరిస్థితి మార్చడానికి టాప్ కాలేజీలో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం, భరోసా కల్పిస్తూ, శాచురేషన్ పద్ధతిలో, ప్రతి ఒక్కరికీ మీరు స్పూర్తి అయ్యేలా అడుగులు పడుతున్నాయి. ►ఈ 408 మందిలో ఎవరైనా కూడా వార్షికాదాయం రూ.8 లక్షల్లోపు ఉన్న ప్రతి కుటుంబానికీ ఇదొక బూన్ కింద, దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ, సహకారాలు అందుతున్నాయి. తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతోంది. ►ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ నుంచి 45 శాతం ఉంటే, మిగిలిన 55 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అందరి పిల్లలు ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి, ఎక్కువ మంది ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును, వాళ్ల కుటుంబాలను ఈ స్థాయి నుంచి ఇంకో మెట్టు స్థాయిలోకి తీసుకుపోయేలా రావాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ వల్ల రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని ఆశీస్తున్నా. ► మన దేశంలో ఎక్కడైనా ఉత్తీర్ణత సాధించిన వాళ్లు, మన రాష్ట్రంలో ఐఏఎస్ లు కావాలనుకుంటారు. ►ఇక్కడ కూడా ఒక స్పూర్తినిచ్చే కథలు రావాలని తపన, తాపత్రయంతో, ఆరాటంతో దీనికి సంబంధించి ఈరోజు మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ►ఎవరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే రూ.లక్ష ఇచ్చేట్టుగా, మెయిన్స్కు ఎలివేట్ అయితే దానికి రూ.50 వేలు.. మొత్తంగా లక్షన్నర ఇచ్చేట్టుగా ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతుంది. ►ఈ రకంగా చేయడం వల్ల ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. ►చదువులు మన రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయని అడుగులు వేగంగా అడుగులు వేస్తున్నాం. ►చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ►ఈ రెండో కార్యక్రమం ద్వారా 95 మంది పిల్లలు నా తమ్ముళ్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్లకు రూ.లక్ష ఇస్తున్నాం. ►11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ కి పోయిన వాళ్లకు రూ.50 వేలు ఇస్తున్నాం ► గవర్నమెంట్లో శాచురేషన్, ట్రాన్స్పరెన్సీ పదాలు మీ అందరి ముందు ఉంచుతున్నా. ►అర్హత ఉంటే ఎవరికైనా మంచి జరిగిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాలు ఇవి. ► ఎక్కడా రికమెండేషన్లు పని చేయవు, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ► అప్లికేషన్ పెట్టుకుంటే చాలు నేరుగా మనందరి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని భరోసా ఇస్తున్నా. ►గతంలో ఇదే విదేశీ విద్యా దీవెన గత ప్రభుత్వాలు కొద్దో గొప్పో చేయాలని ప్రారంభించినవి. ►ఫీజులు 60, 70 లక్షలు కనపడుతున్నాయి. రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. ►ఇలా చేస్తే ఏ ఒక్కరికీ కూడా మంచి జరగదు. అప్పులపాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ► ఎప్పుడూ బతుకులు మారవు. ఏదో చేశాం అంటే చేశాం అన్నట్లు నడిచిన కార్యక్రమాలవి. ►* దాదాపు 3,326 మందికి 2016-17కు సంబంధించి రూ.318 కోట్లు బకాయిలుగా వదిలేశారు. యూనివర్సిటీల ఎంపికలోనూ పారదర్శకత లేదు. ►ఎల్లయ్య.. పుల్లయ్య కాలేజీల్లో సీట్లు వచ్చినా రికమెండేషన్లు పెట్టుకొని కొంతమంది మాత్రమే పొందేవారు. ►అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. పొలిటికల్ జోక్యం, కరప్షన్, లంచాలు లేవు. ►ఎవరికైనా టాప్ 50 కాలేజీలు 21 ఫ్యాకల్టీలు 350 కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా కోటీ 25 లక్షల దాకా లిమిట్ పెట్టి చేశాం. ► ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. లీడర్స్గా ఎదగాలి. ► మీరు రాష్ట్రానికి ఏదో ఒకరోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి. మీ స్టోరీలు స్పూర్తిగా నిలవాలి. ►ఇవన్నీ జరగాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ మనస్పూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్. ►నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం’ అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా.. ప్రపంచంలోని టాప్–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు ఏపీ విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు. -
Live: జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల
-
నేడు జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం జమ
-
Vidya Deevena: నిధుల్ని విడుదల చేయనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పేద విద్యార్థులకు సైతం కల్పిస్తూ.. మరోవైపు, సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలల సాకారానికి ఆర్థిక తోడ్పాటునందిస్తూ.. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అందించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.6 కోట్లను, సివిల్ సర్విసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.5 లక్షలను మొత్తం రూ.42.6 కోట్లను ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం సివిల్ సర్విస్ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ.1లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణతోపాటు వారు సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది. అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పాసైన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. నిజానికి.. గత ప్రభుత్వంలో సివిల్ సర్వీసెస్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు మేలు కలిగేలా అరకొరగా పథకాన్ని అమలుచేసింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం లంచాలకు, వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతి అభ్యర్థికీ లబ్ధిచేకూరుస్తూ నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన కేవలం శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న విదేశీ విద్యను పేద విద్యార్థులు సైతం అభ్యసించే వీలు కల్పిస్తూ.. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్/టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకలీ్టలలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు విమాన ప్రయాణం, వీసా ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. దీనిద్వారా ప్రపంచంలోని టాప్–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు. -
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం పేదలకు వరం
-
విదేశీ విద్యా దీవెన కింద 1,830 మందికి సాయం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్న ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం కింద ఇప్పటివరకు 1,830 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం లభించింది. గత ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్య పథకం అక్రమాల పుట్టగా మారిందని విజిలెన్స్ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకంలోని లోపాలను చక్కదిద్ది మరింత ఎక్కువ మందికి, మరింత ఎక్కువ ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికింద రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ విద్యార్థులందరికీ సంతృప్త విధానంలో విదేశీ విద్యకు ప్రభుత్వం సాయమందిస్తోంది. 21 నిర్దేశిత సబ్జెక్ట్ కేటగిరీల్లో 50 విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో ప్రవేశం పొందినవారికి ట్యూషన్ ఫీజు కింద రూ.కోటి 25 లక్షల వరకు ఆర్థిక సాయం (వాస్తవ రుసుం) అందిస్తోంది. ఈబీసీలు రూ.కోటి వరకు ఆర్థిక సాయానికి అర్హులు. గత టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు మాత్రమే సాయం అందించేది. అంతేకాకుండా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 లక్షలకే పరిమితం చేసింది. ఆ ఆదాయ పరిమితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.8 లక్షలకు పెంచింది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులకు మేలు జరుగుతోంది. -
విదేశీ విద్యకు రూ.కోటి మంజూరు.. కృతజ్ఞతగా సీఎం ఫొటోకు క్షీరాభిషేకం
సాక్షి, అవనిగడ్డ: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్ కుమారుడు కృష్ణకిషోర్ అమెరికాలోని కొలంబియా వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్య అభ్యసించేందుకు ఫీజుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. దీనికి కృతజ్ఞతగా విద్యార్థి కృష్ణ కిషోర్ తన తల్లిదండ్రులతో వచ్చి స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు విదేశీ విద్య అందిస్తోందని చెప్పారు. చేసిన విద్యార్థి -
విద్యకి విలువనిచ్చే వ్యక్తి మా జగన్ మామ
-
విదేశీ విద్యపై రామోజీ విష ప్రచారం
-
చదువులే అసలైన ఆస్తి అని చాటుతున్న జగన్ సర్కార్
-
విదేశీ విద్యపైనా ‘ఈనాడు’ విషం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాన్ని రూపొందించేటప్పుడు లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, ఎంపికలో నిబంధనలను స్పష్టంగా పేర్కొంటుంది. వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం అత్యున్నత ప్రతిభావంతులకు రూ. కోటికి పైగా సాయం అందించే అద్భుత పథకం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’. ఈ పథకానికీ నిబంధనలు రూపొందించి పారదర్శకంగా అమలు చేస్తోంది. అది కూడా సంతృప్త స్థాయిలో సాధ్యమైనంత ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా రూపొందించిన పథకమిది. ఈ పథకంతో రాష్ట్రానికి చెందిన అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు నోబెల్ గ్రహీతలకు నిలయమైన గొప్ప సంస్థల్లో చదువుకుంటున్నారు. టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు చదువుకున్న విశ్వవిద్యాల యాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఇదే ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. అవాస్తవా లతో ‘ఈనాడు’ పత్రిక ఓ విష కథనాన్ని ప్రచురించింది. గత ప్రభుత్వంలో ఊరూ పేరూ లేని కొన్ని విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించడంతో పాటు నిబంధనలకు పాతరేసి నిధులను దోచుకున్నా పట్టించుకోని ఈ విష పత్రిక.. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిభ ఉన్నవారికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు, గుర్తింపు పొందిన గొప్ప యూనివర్సిటీల్లో చేరిన వారికి అవకాశాలు కల్పిస్తుంటే తప్పుగా చూపిస్తోంది. ప్రభుత్వ నిబద్ధతను, ఉన్నత ఆశయాలను దెబ్బతీసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా కథనాన్ని ఇచ్చింది. గతం కంటే పెరిగిన విదేశీ విద్యా సంస్థలు ప్రభుత్వం 2022 జూలై 11న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్యూఎస్/ టైమ్ ర్యాంకుల్లో ఉన్న 200 యూనివర్సిటీలనే తీసుకుంది. కానీ, ఎక్కువ మంది విద్యార్థులు ప్రయోజనం పొందేలా 21 కోర్సులకు సంబంధించి ప్రతి కోర్సుకు టాప్ 50లో ఉన్న విద్యా సంస్థలకూ వర్తింపజేసింది. దీంతో మొత్తం విద్యా సంస్థల సంఖ్య 320కి పెరిగింది. అంటే గతంలోకంటే 120 యూని వర్సిటీలు అధికంగా ఉన్నాయి. పైగా విద్యా ర్థులు ఫలానా దేశంలోని యూనివర్సిటీ లకు మాత్రమే వెళ్లాలనే నిబంధన ఏదీ విధించకుండా ఆ ర్యాంకింగ్లో ఉన్న ఏ విద్యా సంస్థకైనా వెళ్లి చదువుకునే అవకాశం కల్పించింది. మరి విద్యా సంస్థలు ఎక్కడ తగ్గిపోయాయో రామోజీనే చెప్పాలి. గత ప్రభుత్వంలో విదేశీ విద్యా సంస్థల ఎంపికకు ఎలాంటి ప్రమాణాలు పాటించలేదు. ర్యాంకింగ్ను పట్టించుకోకుండా 15 దేశాల్లోని విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశమిచ్చారు. దాంతో విద్యార్థులు నాసి రకమైన సంస్థల్లో ప్రవేశాలు పొంది భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టుకున్నారు. బాబు పాలనలో ఫీజు రూ.15 లక్షలే.. ఇప్పుడు రూ.1.25 కోట్లు గత చంద్రబాబు ప్రభుత్వం విదేశాల్లో చదువు కునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గరి ష్టంగా రూ.15 లక్షల చొప్పున, ఓసీలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించి చేతులు దులుపుకొంది. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం నూరు శాతం ఫీజు చెల్లిస్తోంది. ఓసీలకు రూ.కోటి, ఇతర వర్గాలకు రూ.1.25 కోట్లు వెచ్చిస్తోంది. ♦ గత చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను, వర్గాన్నిబట్టి 100 నుంచి 500 మందికి మాత్రమే పరిమితం చేసింది. దాంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరిగింది. విద్యార్థుల ఎంపికలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంది. విద్యార్థి కుటుంబ వార్షికాదాయ పరిమితిని కూడా రూ.6 లక్షల కు పరిమితం చేసింది. కుటుంబంలో ఒక్కరికే పథకం వర్తింపజేస్తూ నిబంధన పెట్టారు. ♦ ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిభావంతులు ఎందరున్నా వారందరికీ అవకాశం కల్పిస్తోంది. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు పెంచింది. ♦ గత ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ కార్డు రాగానే ఒకసారి, మొదటి సెమిస్టర్ పూర్తవగానే రెండోసారి ఫీజు చెల్లించి వదిలేసేది. తర్వాత విద్యార్థి ఏమయ్యాడో పట్టించుకోలేదు. పైగా 2016–17, 2018–19 సంవత్సరాల్లో 3,326 మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.318 కోట్లు ఎగ్గొట్టింది.దీంతో వారి తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపో యారు. చాలామంది విద్యార్థులు విదేశీ చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం నిధుల దుర్వి నియో గానికి తావు లేకుండా విద్యార్థి సెమి స్టర్/ టర్మ్ పత్రాలు సమర్పించగానే ఆ నిధు లను విడుదల చేస్తోంది. ఈ మార్గదర్శ కాల్లో ఎలాంటి మార్పు లేకున్నా ఈనాడు పత్రిక మాత్రం నిధుల విడుదలకు అదనపు ఆంక్షలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. ♦గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలులో జరిగిన తీవ్రమైన లోపాలు విజిలె న్స్ విచారణలో బయటపడ్డాయి. చాలా మంది విద్యార్థులు నిధులు మంజూరైన తర్వాత విద్యా సంస్థను మార్చే యగా, మరికొంత మంది కోర్సును మధ్య లో ఆపేసి వచ్చేశారు. పథకానికి ఎంపికైన వారిలో కొందరు దరఖా స్తులో ఇచ్చిన చిరు నామాలో లేకపోవడం గమనార్హం. ఇప్పుడు ప్రతి విద్యార్థీ ఎక్కడ ఏ కోర్సు చదువుతు న్నారు, వారి చిరునామా, కుటుంబ వివరా లతో సహా పారదర్శకంగా పరిశీలిస్తున్నారు. 357 మంది లబ్ధిదారులకు రూ.142.71 కోట్లు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద గత ఏడాది 290 మంది, ఈ ఏడాది 67 మందికి కలిపి రూ.142.71 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి గత ఏడాది ఫిబ్రవరిలో లబ్ధిపొందిన 290 మందిలో ఎస్సీ విద్యార్థులు 27 మంది, బీసీలు 64 మంది, క్రిస్టియన్లు నలుగురు, ముస్లింలు 20 మంది, ఈబీసీలు 175 మంది ఉన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఫాల్ సీజన్ కింద ఎంపికైన 67 మందిలో ఎస్సీ విద్యార్థులు ఐదుగురు, ఎస్టీ ఒకరు, బీసీలు 13 మంది, క్రిస్టియన్లు నలుగురు, ముస్లింలు 8 మంది, ఈబీసీలు 36 మంది ఉన్నారు. 2022–23 బ్యాచ్ విద్యార్థులకు రెండో విడత వాయిదా ఫీజు, వీసా చార్జీలు, విమాన ఖర్చులతో సహా రూ.35.40 కోట్లను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఈనాడు మాత్రం కేవలం ఐదుగురు ఎస్సీ, ఒక ఎస్టీ విద్యార్థులు మాత్రమే లబ్ధి పొందారని, బీసీ విద్యార్థులెవరికి ఈ పథకం వర్తించలేదని అబద్ధపు కథనం ప్రచురించింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేద విద్యార్థులకు ఎంతగా మేలు చేస్తుందో చెప్పడానికి లబ్ధిపొందిన ఓ విద్యార్థి అధికారులకు రాసిన లేఖే ఉదాహరణ.. ఇదిగో లేఖ.. ‘‘రెస్పెక్టెడ్ సర్, నా పేరు సుకుమార్ దొడ్డ. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా వణుకూరు గ్రామం నుంచి వచ్చాను. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్ చదువుతున్నా. వణుకూరులోనే పాఠశాల విద్య పూర్తి చేశాను. అండర్ గ్రాడ్యుయేట్ వరంగల్ ఎన్ఐటీలో చేశాను. మా నాన్న దినసరి కూలీ. అమ్మ గృహిణి. మా ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నప్పటికీ, నాన్న నన్ను కష్టపడి చదవమని ప్రోత్సహించేవారు. నేను విదేశాలలో మాస్టర్స్ చదవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ అవకాశం లేదని విరమించుకున్నాను. అదృష్టవశాత్తూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టడంతో నా కల మలుపు తిరిగింది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు తోడ్పాటు నిచ్చింది. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని టాప్ 50 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేశాను. ఎస్ఎల్సీ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా ఈ పథకానికి ఎంపికయ్యా ను. 2023 జూలై 24 నుంచి క్లేటన్లోని మోనాష్ విశ్వవిద్యాలయంలో చదువుతు న్నాను. విదేశాలలో చదువుకో వాలనే నా కలను సాధ్యం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను రూ.52 లక్షల స్కాలర్షిప్ కూడా ప్రభుత్వం నుంచి అందుకున్నాను, ఇది నా రెండేళ్ల ట్యూషన్ ఫీజు మొత్తం. ఈ ఉదారమైన స్కాలర్షిప్ నా కలను నెరవేర్చుకునేందుకు, నన్ను నేను నిరూపించుకునేందుకు దోహదపడింది. కృతజ్ఞతలతో – అసుకుమార్ దొడ్డ -
జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల
-
జగనన్న విదేశీ విద్యా దీవెన.. విద్యారంగంలో విప్లవాత్మక మార్పు అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విద్యార్థులకు ‘విదేశీ’ వరం!
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం విద్యా రంగంలో విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో నిలిచిపోతుంది. మన పిల్లలు టాప్ సీఈవోలుగా ప్రపంచాన్ని శాసించే ఉద్యోగాలు చేసే స్థాయికి చేరుకుంటారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచిన కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేస్తున్నాం. అలాంటి యూనివర్సిటీల్లో చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు అప్పుల బారిన పడకుండా.. పిల్లలు దిగులు చెందకుండా విదేశాల్లో ఉన్నత చదువులకు అండగా నిలుస్తున్నాం. ఇలా పిల్లలకు బాసటగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని రూపొందించినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పథకానికి పరిమితులు లేకుండా శాచ్యురేషన్ విధానంలో అర్హులందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నట్లు చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన 357 మందికి రూ.45.53 కోట్లను ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ ఏమన్నారంటే.. వీసా నుంచి విమాన చార్జీల దాకా.. మంచి కాలేజీలో సీటు వచ్చినా అంత డబ్బులు కట్టే స్ధోమత లేని రాష్ట్ర విద్యార్ధులకు విదేశాల్లో చదువులకు ఒక వరంలా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అన్ని రకాలుగా తోడ్పాటునిస్తుంది. ఒక భరోసా కల్పిస్తుంది. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా అమలు చేస్తున్నాం. క్యూఎస్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిల్చిన టాప్ 50 విద్యాసంస్ధల్లో సీటు సాధించిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. శాచ్యురేషన్ పద్ధతిలో ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నా అర్హత ఉంటే సపోర్టు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకైతే రూ.కోటి వరకు చెల్లిస్తున్నాం. విదేశీ విశ్వ విద్యాలయాలకు వెళ్లే పిల్లలను విమాన చార్జీలు, వీసా చార్జీల దగ్గర నుంచి ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. పది ఉత్తమ విద్యాసంస్థల్లో ఫీజులిలా.. ఈ టాప్ 50 కాలేజీల్లో చదవాలంటే ఫీజులు ఎలా ఉన్నాయి? సీటు వచ్చినా సామాన్యుడు, పేదవాడు చదువుకునే పరిస్థితి ఉందా? అన్నది ఒక్కసారి గమనిస్తే.. చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ రూ.1.32 కోట్లు, యూనివర్సిటీ ఆఫ్ మాంఛెస్టర్లో ఎంఎస్ రూ.1.02 కోట్లు, కార్నిగీ మిలన్ యూనివర్సిటీలో టెపర్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ రూ.1.16 కోట్లు, లండన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ రూ.1.13 కోట్లు, కొలంబియా యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.11 కోట్లు, న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.09 కోట్లు, ఇన్సీడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫ్రాన్స్లో ఎంబీఏ రూ.88 లక్షలు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఏంబీఏ రూ.68.86 లక్షలు, ఎంఐటీలో స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో రూ.67 లక్షలు, యూసీ బర్క్లీలో ఎంఎస్ రూ.61 లక్షల నుంచి రూ.2.06 కోట్ల వరకూ ఫీజులున్నాయి. ఉదాహరణగా పది మంచి విద్యాసంస్ధలు గురించి చెప్పాను. ప్రపంచాన్ని శాసించే లీడర్లు కావాలని.. ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలలో మన పిల్లలకు ఎవరికైనా సీట్లు వచ్చినా సామాన్యులు, పేదరికం కారణంగా అంత ఫీజులు కట్టి చదవడం సాధ్యమేనా? అన్నది మొట్టమొదట ఈ పథకం గురించి ఆలోచించినప్పుడు నాకు తట్టిన ఆలోచన. ఇలాంటి కాలేజీలలో మన పిల్లలు చదివి బయటకు వస్తేనే రేపొద్దున ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్ మోస్ట్ కంపెనీలలో సీఈవోలుగా రాణించే స్థాయికి చేరుకుంటారు. పెద్ద స్ధాయిలోకి వెళ్లే అవకాశం వస్తుంది. అందుకే అలాంటి కాలేజీలలో సీట్లు సాధించిన మన పిల్లలను సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నాం. అలా చేయకపోతే ఏ రకంగా మన పిల్లలను, మన రాష్ట్రాన్ని లీడర్లుగా చూడగలుగుతాం అన్నది ఈ ఆలోచనలకు ప్రేరణ. నాడు.. ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా గత ప్రభుత్వంలో పరిస్థితి చూస్తే కేవలం రూ.10 లక్షలు.. ఎస్సీ ఎస్టీలకు అయితే రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఈ అమౌంట్ ఎక్కడ? మనమిస్తున్న రూ.1.02 కోట్లు, రూ.1.16 కోట్లు, రూ.1.09 కోట్లు, రూ.87 లక్షలు, రూ.70 లక్షలు, రూ.1.32 కోట్లు ఫీజు ఎక్కడ? గతంలో ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చారు. అక్కడ కూడా ప్రతిదానిలో కోత పెట్టేవారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ దొరికేది కాదు. శాచ్యురేషన్ విధానం లేదు. సిఫార్సులతో ఇచ్చేవారు. అది కూడా సక్రమంగా ఇవ్వకుండా 2016–17 నుంచి దాదాపు రూ.318 కోట్లు బకాయిలు పెట్టి ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. నేడు అర్హులందరికీ.. ఈరోజు పథకంలో పూర్తి మార్పులు తీసుకొచ్చి శాచ్యురేషన్ విధానంలో అమలు చేస్తున్నాం. అర్హత కలిగి ఉండి టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా వర్తింప చేస్తున్నాం. గతంలో ఆదాయ పరిమితి రూ.6 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.8 లక్షల వరకూ పెంచాం. అర్హత ఉంటే చాలు.. రూపాయి లంచం లేకుండా, వివక్షకు తావు ఇవ్వకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా మన పిల్లలకు తోడుగా ఉండేలా అడుగులు వేస్తున్నాం. ఏకైక రాష్ట్రం ఏపీ ఇదో విప్లవాత్మకమైన అడుగు. రాబోయే రోజుల్లో భావితరాలు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని గుర్తుంచుకునేలా ఇంత సపోర్టు చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీలలో ఎవరికి సీటు వచ్చినా పారదర్శకంగా సపోర్టు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ పిల్లలు గొప్పగా ఎదిగి పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, ఉన్నత స్థాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాలుగు విడతలుగా స్కాలర్షిప్.. ఈ స్కాలర్షిప్ పథకాన్ని నాలుగు విడతలుగా అమలు చేస్తున్నాం. ఇమ్మిగ్రేషన్ కార్డు పొందిన విద్యార్ధులకు వెంటనే తొలివిడత ఇస్తాం. ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల అనంతరం రెండో విడత, రెండో సెమిస్టర్ టెర్మ్ ఫలితాలు విడుదలైనప్పుడు మూడో విడత, విజయవంతంగా నాలుగో సెమిస్టర్ పూర్తి చేసి మార్క్స్ షీటు అప్లోడ్ చేయగానే చివరి విడతను విద్యార్థులకు అందించేలా పథకాన్ని డిజైన్ చేశాం. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ పిల్లలందరికీ ఈ టాప్–50 కాలేజీలలో, 21 ఫ్యాకల్టీలలో ఎక్కడ సీటు వచ్చినా దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. తోడుగా ఉంటామని భరోసా ఇస్తున్నా. మన రాష్ట్ర ఖ్యాతిని పెంచాలి మన పిల్లలకు అంతా మంచి జరగాలి. తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం పడకూడదు. అప్పుల పాలవుతామనే భయం లేకుండా పిల్లలను గొప్ప చదువులకు పంపించాలి. పిల్లలకు కూడా తమ తల్లిదండ్రులు అప్పులు చేసి పంపారనే బాధ ఎక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించాం. పిల్లలు అక్కడకు (విదేశాలకు) వెళ్లి గొప్పగా చదివి మన రాష్ట్ర ఖ్యాతిని ఇంకా పెంచాలన్న మంచి సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి.జయలక్ష్మి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కె.విజయ, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ జె.వెంకటమురళి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆల్ ది బెస్ట్ చరణ్: సీఎం జగన్
-
జగనన్న విదేశీ విద్య లేకపోతే నాలాంటి వాళ్ళ పరిస్థితి..
-
విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల
-
జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
గత ప్రభుత్వంలో విదేశీ విద్యకు ఇంత ప్రాధాన్యత లేదు..
-
నా కల నెరవేరింది సార్.. తిరిగి వచ్చి ఈ రాష్ట్రం ఋణం తీర్చుకుంటా..
-
రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు అండగా ఉంటున్నాం: సీఎం జగన్
-
మన విద్యార్థులను మనమే సపోర్టు చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. 357 మంది విద్యార్ధులకు రూ.45.53 కోట్లు దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మంచి కాలేజీలలో సీట్లు వచ్చి కూడా అంతంత డబ్బులు అక్కడకి వెల్లి కట్టాలంటే కట్టలేని పరిస్థితుల్లో ఉంటూ.. ఆ స్ధోమత లేని రాష్ట్ర విద్యార్ధులకు విదేశాల్లో చదువులకు ఒక వరంలా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అన్నిరకాలుగా తోడ్పాటు నిస్తుంది. వారికి ఒక భరోసా ఇస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యకోసం అటువంటి మంచి కాలేజీలలో సీట్లు వచ్చి చదువుతున్న దాదాపు 357 మంది పిల్లలకు ఫీజుల కింది రూ.45.53 కోట్లు ఇవాళ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా అమలు చేస్తున్నాం. ఏ ఒక్కరికైనా క్యూఎస్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిల్చిన టాప్ –50 విద్యా సంస్ధల్లో సీటు వచ్చిన ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. సాచ్యురేషన్ పద్ధతిలో ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా.. అర్హత ఉంటే వాళ్లకు సపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకైతే రూ.1 కోటి వరకు చెల్లిస్తున్నాం. విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే పిల్లలకు... వారి విమాన ఛార్జీలు, వీసా ఛార్జీల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి అడుగులోనూ వారిని చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. టాప్ కాలేజీలు చూస్తే... ఈ టాప్ 50 కాలేజీల్లో చదవాలంటే... ఫీజులు ఏ రకంగా ఉన్నాయి ? ఎవరికైనా సీటు వచ్చినా సామాన్యుడు, పేదవాడు చదువుకునే పరిస్థితి ఉందా ? అని గమనిస్తే... చికాగోయూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ రూ.1.32 కోట్లు, యూనివర్సీటీ ఆఫ్ మాంఛెస్టర్లో ఎంఎస్ రూ.1.02 కోట్లు, కార్నిగీమిలన్ యూనివర్సిటీలో టెపర్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ రూ.1.16 కోట్లు, లండన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ రూ.1.13 కోట్లు, కొలంబియా యూనివర్సిటిలో ఎంఎస్ రూ.1.11 కోట్లు, న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.09 కోట్లు, ఇన్సీడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫ్రాన్స్లో ఎంబీఏ రూ.88 లక్షలు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఏంబీఏ రూ.68.86 లక్షలు, ఎంఐటీలో స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్లో రూ.67 లక్షలు, యూసీ బర్క్లీలో ఎంఎస్ రూ.61 లక్షల నుంచి రూ.2.06 కోట్ల వరకూ ఫీజులు ఉన్నాయి. ఉదాహరణగా పది మంచి విద్యాసంస్ధలు గురించి చెప్పాను. మన పిల్లలు లీడర్లు కావాలని.. ఇలాంటి ప్రపంచప్రఖ్యాత కాలేజీలలో మన పిల్లలకు ఎవరికైనా సీట్లు వచ్చినా.. సామాన్యుడికి, పేదరికంలో ఉండేవాళ్లకు ఇంత ఫీజులు కట్టి ఇలాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదవడం సాధ్యమేనా ? అన్నది మొట్టమొదట నేను ఈ పథకం గురించి అనుకున్నప్పుడు నాకు తట్టిన మొదట ఆలోచన. ఇలాంటి కాలేజీలలో మన పిల్లలు చదివి బయటకు వస్తేనే.. రేపు పొద్దున ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్ మోస్ట్ కంపెనీలలో సీఈఓలుగా ఉద్యోగాలు చేసే స్ధాయి వస్తుంది. పెద్ద స్ధాయిలోకి వెళ్లే అవకాశం వస్తుంది. ఇటువంటి కాలేజీలలో సీట్లు సాధించిన మన పిల్లలను మనం సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నాం. అలా చేయకపోతే... ఏ రకంగా మన పిల్లను, మన రాష్ట్రాన్ని లీడర్లుగా చూడగలుగుతాం అన్నది ఈ ఆలోచనలకు ప్రేరేణ. గత ప్రభుత్వంలో అరకొరగా.. గతంలో పరిస్థితి చూస్తే.. కేవలం రూ.10 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు అయితే రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఈ అమౌంట్ ఎక్కడ? ... మనమిస్తున్న రూ.1.02 కోటి, రూ.1.16 కోట్లు, రూ.1.09 కోట్లు, రూ.87 లక్షలు, రూ.70 లక్షలు, రూ.1.32 కోట్లు ఫీజు ఎక్కడ ? గతంలో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు ఇచ్చారు. అక్కడ కూడా ప్రతిదానిలో కోత పెట్టేవారు. దరఖాస్తు చేసుకున్నవారందిరికీ దొరికేది కాదు. సాచ్యురేషన్ విధానం లేదు. సిఫార్సులతో ఇచ్చేవారు. అది కూడా సక్రమంగా ఇవ్వకుండా 2016–17 నుంచి దాదాపు రూ.318 కోట్లు బకాయిలు పెట్టి ఈ పథకాన్ని నీరుకార్చే ప్రయత్నం చేశారు. మన ప్రభుత్వంలో ఈ రోజు మనం ఆ పథకానికి పూర్తిగా మార్పుతీసుకుని వచ్చి... సాచ్యురేషన్ విధానంలో ఏ ఒక్కరికైనా అర్హత ఉండి, టాప్ – 50 కాలేజీలు, దాదాపు 320 ఫ్యాకల్టీలలో సీట్లు ఎవరికి వచ్చినా వర్తింపు చేస్తున్నాం. గతంలో ఆదాయపరిమితి రూ.6లక్షలు ఉంటే దాన్ని రూ.8లక్షల వరకూ పెంచి సాచ్యురేషన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటే చాలు.. అర్హత ఉంటే రూపాయి లంచం ఇవ్వకుండా... వివక్షకు తావు ఇవ్వకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పిల్లలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు వేస్తూ దేవుడి దయతే చేయగలిగాం. విప్లవాత్మక అడుగు. ఇదో విప్లవాత్మకమైన అడుగు. రాబోయే రోజుల్లో, రాబోయే తరాలు ఆంధ్రరాష్ట్ర ఖ్యాతిని గుర్తుంచుకునే విధంగా.. ఈ రకంగా సపోర్ట్ చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే టాప్– 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీలలో ఎవరికి సీటు వచ్చినా.. పారదర్శకంగా సపోర్టు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ పిల్లలు గొప్పగా ఎదగాలి. పెద్ద కంపెనీల్లో సీఈఓలుగానూ, పెద్ద పెద్ద స్ధాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలుగు విడతలుగా స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ పథకాన్ని నాలుగు విడతలుగా అమలు చేస్తున్నాం. ఇమ్మిగ్రేషన్ కార్డు పొందిన విద్యార్ధులకు వెంటనే తొలివిడత, ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు అనంతరం రెండో విడత, రెండో సెమిస్టర్ టెర్మ్ ఫలితాలు విడుదలైనప్పుడు మూడో విడత, విజయవంతంగా నాలుగో సెమిస్టర్ పూర్తి చేసి, మార్క్స్ షీటు అప్లోడ్ చేసిన తర్వాత చివరి విడతగా నాలుగో వాయిదా కూడా పిల్లలకు ఇచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశాం. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ పిల్లలందరికీ ఈ టాప్–50 కాలేజీలలో, 21 ఫ్యాకల్టీలలో ఎక్కడ సీటు వచ్చినా... దరఖాస్తు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. తోడుగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను. ఈ కార్యక్రమం వల్ల మన పిల్లలకు ఇంతా మంచి జరగాలని,ఆ తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం పడకూడదని, అప్పులపాలవుతామనే భయం లేకుండా తల్లిదండ్రులు ఆ పిల్లలను గొప్ప చదువులకు పంపించాలని, పిల్లలకు కూడా తమ తల్లిదండ్రులు అప్పులు చేసి తమను పంపించారన్న బాధ ఎక్కడా ఉండకూడదనే ఈ పథకాన్ని రూపొందించాం. ఆ పిల్లలు అక్కడకు వెళ్లి గొప్పగా చదివి మన రాష్ట్ర ఖ్యాతిని ఇంకా పెంచాలన్న మంచి సంకల్పంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి దేవుడి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది కూడా చదవండి: ‘పకడ్బందీగా కామన్ వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్’ -
నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన అమలు
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకు రూ. కోటి వరకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది. ఈ విడతలో అర్హులైన 357 మంది విద్యార్థులు రూ.45.53 కోట్లు అందుకోనున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో.. గత చంద్రబాబు ప్రభుత్వంలో విదేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు చేసిన ఆర్థిక సాయం అరకొరే. ఎస్సీ, ఎస్టీలకు కేవలం రూ.15 లక్షలు, ఇతరులకు రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చారు. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ. 6 లక్షలుగా నిర్ణయించడంతో కొద్ది మందికే ప్రయోజనం కలిగింది. లబ్ధిదారుల ఎంపికలోనూ అవినీతి, సిఫార్సులకే పెద్దపీట వేశారు. ఈ కాస్త ఫీజునూ చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు ఎగనామం పెట్టింది. 2016 – 17 సంవత్సరం నుండి 3,326 విద్యార్థులకు రూ.318 కోట్ల ఫీజులు ఎగ్గొట్టి, ఆ తర్వాత పథకాన్నే ఎత్తివేసింది. ప్రమాణాలు లేని, పేలవమైన ర్యాంకులున్న సంస్థలను ఎంపిక చేయడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి నెలకొంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో.. సీఎం వైఎస్ జగన్ సంతృప్త స్థాయిలో అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి ఫీజులు అందేలా ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఏడాది 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన వారికి లబ్ధి చేకూరుస్తున్నారు. సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నగదును నేరుగా లబ్ధిదారులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఎంపిక చేసిన 21 కోర్సుల్లో టాప్ 50 యూనివర్శిటీలకు ఎంపికైన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలా వారి చదువులు ఒక్కో మెట్టూ ఎక్కేకొద్దీ 4 వాయిదాల్లో స్కాలర్షిప్స్ మంజూరు చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ కార్డు (ఐ–94) పొందాక తొలి వాయిదా, మొదటి సెమిస్టర్ ఫలితాల తర్వాత 2వ వాయిదా, 2వ సెమిస్టర్ ఫలితాల తర్వాత 3వ వాయిదా, 4వ సెమిస్టర్ విజయవంతంగా పూర్తి చేసి మార్క్ షీట్ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేశాక చివరి వాయిదా చెల్లిస్తున్నారు. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఈ పథకం పూర్తి వివరాలను https://jnanabhumi.ap.gov.in వెబ్సైట్లో ఉంచారు. పథకానికి సంబంధించి సహాయం, ఫిర్యాదుల కోసం ‘జగనన్నకు చెబుదాం (1902 టోల్ ఫ్రీ నంబర్)’లోనూ సంప్రదించవచ్చు. ఇదీ పథకం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకల్టీల్లో టాప్ 50 ర్యాంకుల్లోని విదేశీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకొనేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. గడచిన 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన‘ కింద అందించిన ఆర్థిక సాయం రూ.65.48 కోట్లు. -
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో సీఎం జగన్ పర్యటన
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని తిరువూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 700 కోట్ల రూపాయలు జమచేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సీఎం జగన్ తిరువూరు పర్యటన నేపథ్యంలో.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత చదువుల్లో విప్లవం తెచ్చారని ప్రశంసించారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెనను చేరువ చేశారని తెలిపారు. ‘గతంలో పేదలకు చదువు భారంగా మారింది. ప్రభుత్వ విద్యను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ప్రైవేట్ విద్యాసంస్థల బలోపేతం చేసే దిశగా పనిచేశాడు. చంద్రబాబు కేవలం 16 లక్షలు మందికి ఫీజులరీయింబర్స్ మెంట్ ఇచ్చారు చదువు ద్వారానే అన్నీ సాధ్యమని నమ్మిన వ్యక్తి జగన్. అందుకే విద్యకు పెద్దపీట వేశారు’ అని పేర్కొన్నారు. విద్యాదీవెన కార్యక్రమం రేపు తిరువూరులో సీఎం ప్రారంభిస్తారు. పేదలు సైతం కార్పొరేట్ స్కూల్స్ లో చదవాలనేది సీఎం ఆలోచన. ఇంగ్లీష్ మీడియానికి ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నా న్యాయం మా వైపు ఉంది. రూ. 700 కోట్లు రేపు నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేయనున్నారు. చంద్రబాబు విద్యారంగాన్ని విస్మరించాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సీఎం జగన్ తరహాలో ఎవరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్ ను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఏపీలోలాగా తమ రాష్ట్రాల్లోని స్కూల్స్ను తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నాయి. - ప్రభుత్వ విప్, సామినేని ఉదయభాను చదవండి: రెండు సీట్లకు ఎగిరి గంతేయడమే టీడీపీ స్టైల్! -
టీడీపీ నేత కుమార్తెకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’
సాక్షి, విజయనగరం: ప్రభుత్వ పథకం ఏదైనా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ అందాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. తాజాగా ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద టీడీపీ నేత కుమార్తెకు లబ్ధి చేకూరడం ఇందుకు నిదర్శనం. విజయనగరం జిల్లా వంగర మండలం సంగాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచి బొడ్రోతు శ్రీనివాసరావు, వేణమ్మల కుమార్తె శైలజ ఈ పథకానికి ఎంపికైంది. తొలి విడతగా శుక్రవారం ఆమె ఖాతాకు రూ.13,99,154 ప్రభుత్వం జమ చేసింది. నమూనా చెక్కును శైలజ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, వేణమ్మలకు కలెక్టర్ ఎ.సూర్యకుమారి శుక్రవారం అందజేశారు. రెండేళ్లలో విద్యార్థిని చదువుకు ప్రభుత్వం సుమారు రూ. 84 లక్షలు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సుపరిపాలన అందిస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం అర్హతే ప్రామాణికంగా విద్యార్థులను గుర్తించి సాయం అందిస్తున్నారని బొడ్రోతు శ్రీనివాసరావు హర్షం వ్యక్తంచేశారు. -
AP: రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచి పోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ పథకం కింద విదేశీ టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని చెప్పారు. పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి వచ్చిన గొప్ప వాళ్లను చూసి.. ఆ స్థాయిలో కలలు కని, వాటిని నిజం చేస్తూ దేశ, రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య మీద పెట్టే ప్రతి పెట్టుబడి మానవ వనరుల మీద పెట్టినట్టేనని తెలిపారు. అందుకే రాష్ట్రంలో ఈ రంగానికి పెద్ద పీట వేశామని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రతిభతో ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా చేపట్టిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అమలుకు శుక్రవారం ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ ఏడాది టాప్ 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పథకంలో భాగస్తులైన ప్రతి చెల్లెమ్మ, తమ్ముడు ఉన్నత స్థానంలోకి వెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం మీపై పెడుతున్న పెట్టుబడితో రేపు మీరు మెరుగైన స్థానానికి వెళ్లినప్పుడు రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అప్పుడే ప్రపంచ స్థాయిలో మన దేశ, రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సామాన్యులకు అండగా.. – రూ.1.16 కోట్ల ఫీజుతో కార్నిగీ మిలన్ యూనివర్సిటీ, రూ.కోటి ఫీజుతో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, బోస్టన్ యూనివర్సిటీ, రూ.97 లక్షల ఫీజు, రూ.88.70 లక్షల ఫీజుతో హార్వర్డ్ యూనివర్సిటీ.. వీటన్నింటిలో ప్రతిభతో సీటు తెచ్చుకున్నప్పటికీ పేదలు, సామాన్యులు డబ్బులు కట్టలేని పరిస్థితి. ఈ యూనివర్సిటీలో చదవగలమా అన్న పరిస్థితి. – తల్లిదండ్రుల మీద భారం పెట్టలేక ఎందుకు ఇంత పెద్ద యూనివర్సిటీకి వెళ్లడం.. మనకు స్తోమత లేదు కదా.. అని వెనుకడుగు వేస్తారు. ఇకపై ఆలా పెట్టుబడి పెట్టలేక వెనుకడుగు వేసే పరిస్థితి ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా మీకు అండగా, తోడుగా నిలిచి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం మీద పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి వల్ల ఎన్నో కుటుంబాల తలరాతలు మారడమే కాకుండా ప్రతి ఒక్కరి తలరాత మార్చే గొప్ప పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వ స్కీం వైట్ వాష్ – విదేశాల్లో చదివించే విషయమై గత ప్రభుత్వంలో ఉన్న స్కీం ఎలా అమలు జరిగేదో చూశాం. అదొక వైట్ వాష్ కార్యక్రమం. కేవలం రూ.10–15 లక్షలకు పరిమితమైన కార్యక్రమం. దీనివల్ల ప్రయోజనం అరకొరే. దీనివల్ల వారికి మంచి జరగదు. కేవలం నీరుగార్చే కార్యక్రమం తప్ప మరో ప్రయోజనం లేదు. 2016–17కు సంబంధించిన బకాయిలను కూడా పిల్లలకు చెల్లించలేదు. దాదాపు రూ.300 కోట్ల బకాయిలు ఇవ్వకపోవడంతో దాదాపు పథకాన్ని ఆపేసే పరిస్థితులు వచ్చాయి. అలాంటి పరిస్థితులు మార్చాలనే ఉద్దేశంతో కొత్త ఆలోచనతో ఇవాళ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. – ఒకవైపు మన రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీల రూపురేఖలను మారుస్తూ విద్యా ప్రమాణాలను పెంచుతున్నాం. మరోవైపు పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నాం. దీంతో పాటు పెద్ద యూనివర్సిటీల్లో మన పిల్లలకు సీట్లు వస్తే.. వారికి తోడుగా నిలవాలన్న ఆలోచనలో నుంచే విదేశీ విద్యాదీవెన పథకం వచ్చింది. పారదర్శకంగా ఎంపిక – పారదర్శకంగా టాప్ లిస్ట్ను ఎంపిక చేశాం. టాప్ 100 కాలేజీలు అయితే గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు సపోర్ట్ చేస్తామని చెప్పాం. టాప్ 100 – 200 వరకు ఉన్న కాలేజీలకు అయితే గరిష్టంగా రూ.75 లక్షల వరకు చెల్లిస్తామని చెప్పాం. టాప్ 100 కాలేజీల జాబితాలో 100 శాతం ట్యూషన్ ఫీజు చెల్లిస్తామని గతంలో చెప్పాం. అందుకు అనుగుణంగానే రూ.1.60 కోట్ల ఫీజు కూడా కవర్ చేస్తున్నాం. – 100 నుంచి 200 వరకు క్యూఎస్ ర్యాంకులు పొందిన వాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 100 శాతంతో రూ.75 లక్షల వరకు ఇచ్చాం. ఇవన్నీ పారదర్శకంగా చేపడుతున్నాం. తల్లిదండ్రుల మీద భారం తగ్గేలా మీ కాళ్ల మీద మీరు నిలబడే పరిస్థితి వచ్చేలా అడుగులు వేస్తున్నాం. నాలుగు వాయిదాల్లో ఇస్తున్నాం. – ఐ–94 వచ్చిన వెంటనే మొదటి వాయిదా ఇస్తాం. మొదటి సెమిస్టర్ ఫలితాల తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ ఇస్తాం. రెండో సెమిస్టర్ తర్వాత మూడో ఇన్స్టాల్మెంట్, విజయవంతంగా నాలుగో సెమిస్టర్ పూర్తి చేసి మార్క్స్షీట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ చెల్లింపు చేస్తాం. రూ.8 లక్షల వరకు ఆదాయం ఉన్న ఏ కుటుంబానికి అయినా ఈ పథకం వర్తింపజేసే దిశగా అడుగులు వేశాం. రెండు సీజన్లలోనూ వచ్చే అడ్మిషన్లను ప్రోత్సహిస్లూ.. వాళ్లను కూడా ఈ జాబితాలో యాడ్ చేసున్నాం. – ఇప్పటి వరకు ఈ ఏడాది 213 మంది పారదర్శకంగా ఎంపికయ్యారు. వీరిలో ఎస్సీలు 30 మంది, మైనార్టీలు 35, బీసీలు 35, ఈబీసీలు 67 మంది, కాపులు 46 మంది ఉన్నారు. ఎవరికైనా మంచి ప్రతిభ ఉంటే వారందరికీ మంచి జరగాలని ఈ పథకం పెట్టాం. ఆర్థికంగా దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గరిష్టంగా రూ.1.25 కోట్ల సీలింగ్ పెట్టాం. మిగిలిన వాళ్లకు కూడా టాప్ 100 కాలేజీల జాబితాలో రూ.1 కోటి వరకు సీలింగ్ పెట్టాం. 100–200 కాలేజీల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.75 లక్షలు, మిగిలిన వాళ్లకు రూ.50 లక్షల వరకు పెట్టాం. ఏ అవసరం ఉన్నా సిద్ధంగా ఉన్నాం – ముఖ్యమంత్రి కార్యాలయంలో(సీఎంవోలో) మీకు ఒక ఐఏఎస్ అధికారిని కేటాయిస్తున్నాం. మీకు ఆ అధికారి నంబర్ ఇస్తాం. మీకు ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేసి.. వెంటనే సహాయం తీసుకోవచ్చు. ప్రతి విషయంలో మీకు తోడుగా ఉంటాం. తద్వారా మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చేదోడుగా ఉంటాం. మీ కుటుంబతో పాటు రాష్ట్రానికి కూడా గర్వకారణంగా నిలబడాలి. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. – ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమం) షేక్ అంజాద్ బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎఎండి ఇంతియాజ్, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి, కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ జి రేఖారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతిభతో విదేశీ వర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్నప్పటికీ, ఆర్థిక స్తోమత లేక ఆ చదువులకు దూరం కాకూడనే సంకల్పంతో పేద విద్యార్థులను చేయి పట్టుకుని నడిపించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ లాంటి గొప్ప నాయకులు గొప్ప, గొప్ప యూనివర్సిటీల నుంచి వచ్చిన వాళ్లే. నేటి ప్రపంచంలో మెరుగైన స్థానాల్లో ఉన్న ఇండస్ట్రీ లీడర్స్.. మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదేళ్ల, ఐబీఎం సీఈఓ అరవింద కృష్ణ, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, గూగూల్ సీఈవో సుందర్ పిచాయ్, ఛానెల్ సీఈఓ లీనా నాయర్ మొదలు.. బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ వరకు ఎంతో మంది ఉన్నారు. మీరు కూడా ఆ స్థాయిలో కలలను నిజం చేయాలి. అలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అందుకోసం అద్భుతమైన వేదికను మీకందిస్తున్నాం. ఆ స్థాయిలోకి మీరు కూడా వెళ్లి దేశ, రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి. – సీఎం వైఎస్ జగన్ -
‘థ్యాంక్యూ సీఎం జగన్ సార్.. మా కల నెరవేరుస్తున్నారు’
సాక్షి, అమరావతి: ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జమ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ దేశాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బండి సుచరిత పథకం ఒక చారిత్రాత్మకం: బండి సుచరిత బండి సుచరిత, కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్ధిని, హార్వర్డ్ యూనివర్శిటీలో గ్లోబల్ హెల్త్ అండ్ పాపులేషన్పై మాస్టర్స్ చదువుతూ బోస్టన్ నుంచి మాట్లాడారు. గుడ్ మార్నింగ్ సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఈ స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది, విద్యారంగంలో ఇది గొప్ప పథకం. మెరుగైన సమాజ నిర్మాణానికి విద్య ఒకటే మార్గమని సీఎం గారు చెప్పిన విధంగా ఈ పథకం ఒక చారిత్రాత్మకం. ఏపీ ప్రభుత్వానికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు, థ్యాంక్యూ సార్ అని ముగించగా వెల్కమ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, మే గాడ్ బ్లెస్ యూ అంటూ సీఎం చెప్పారు. అల్లాడి జ్యోతిర్మయి ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు: అల్లాడి జ్యోతిర్మయి అల్లాడి జ్యోతిర్మయి, ఏలూరుకు చెందిన విద్యార్ధిని, వార్విక్ యూనివర్శిటీలో పీజీ ఇన్ పబ్లిక్ హెల్త్, కోవెంటీ నుంచి మాట్లాడారు. హలో సార్, ఇంత గొప్ప యూనివర్శిటీలో చదవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను చిన్నప్పటి నుంచి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, కాలేజీలలో చదివి ఈ రోజు ఇక్కడికి రాగలిగాను, ధ్యాంక్యూ సార్ అని ముగించగా వండర్ఫుల్ స్టోరీ అంటూ సీఎం గారు ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు. నిరూషాదేవి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి: నిరూషాదేవి నిరూషాదేవి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విద్యార్ధిని, యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్హామ్లో ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, బర్మింగ్హామ్ నుంచి మాట్లాడారు. గుడ్ మార్నింగ్ సార్. జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్ ద్వారా నేను బర్మింగ్ హామ్ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్నాను. సీఎం గారు మీరు విద్యావ్యవస్ధలో మీరు తీసుకొస్తున్న సంస్కరణల వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెంపొందింది. మా విద్యార్ధుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మా కుటుంబాలు కూడా ఆర్ధికంగా నిలదొక్కుంటున్నాయి. మా యువతకు మీరు ఒక ఆదర్శం. నేను చదువుతున్న ఇదే యూనివర్శిటీలో మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్ధులు కూడా ఉన్నారు కానీ వారికి ఎవరికీ కూడా ఇలాంటి స్కీమ్స్ లేవు. మన దేశంలో ఏ సీఎం కూడా ఇలాంటి స్కీమ్ ఏర్పాటుచేయలేదు, థ్యాంక్యూ సార్, విదేశాలలో ఉన్నత విద్యను చదవాలన్న కలను మీరు నెరవేరుస్తున్నారు. థ్యాంక్యూ సో మచ్ సార్. యోగేంద్ర నాగ సాత్విక్ మా కల నెరవేరుస్తున్నారు: యోగేంద్ర నాగ సాత్విక్ యోగేంద్ర నాగ సాత్విక్, కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్ధి, గ్లాస్గో యూనివర్శిటీలో ఎంఎస్సీ ఇన్ డేటా సైన్స్, గ్లాస్గో నుంచి మాట్లాడారు. గుడ్ మార్నింగ్, థ్యాంక్యూ వెరీమచ్ సీఎం సార్, మా విద్యార్థుల కలను మీరు నెరవేరుస్తున్నారు. ఇలాంటి టాప్ యూనివర్శిటీలలో చదవాలన్న మా కోరికను మీరు నెరవేర్చుతున్నారు. కృతజ్ఞతలు. నేను ఇక్కడే పీహెచ్డీ చేసి ఫ్రొఫెసర్గా చేస్తూ ఎంతోమంది నాలాంటి విద్యార్ధులకు భోదించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నాను. నా కుటుంబానికి ఇంత పెద్ద యూనివర్శిటీలలో చదివించే స్ధోమత లేదు. కానీ మీరు మా కల నెరవేరుస్తున్నారు. నాలాంటి ఎంతోమంది పేద విద్యార్ధులకు మీరు చేసే సాయం ఎప్పటికీ మరువలేము, ధ్యాంక్యూ వెరీమచ్ సార్. -
ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద నిధులను ప్రభుత్వం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ఉచిత విదేశీ విద్యను అందిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో టాప్-200 వర్సిటీల్లో ఉచిత ఉన్నత విద్య అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడతలో సాయంగా రూ. 19.95 కోట్లను బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. పేద విద్యార్థులు ప్రపంచంలోనే టాప్ వర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేద విద్యార్థులకు అవకాశం ఇచ్చాము. పేదల చదువుకు పేదరికం అడ్డుకాకూడదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరికి తొలివిడతగా రూ.19.95 కోట్ల సాయం అందిస్తున్నాము. ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలి. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాక్షించారు. చిత్తశుద్ధితోనే పరిస్థితులు మార్చాలనే తాపత్రయం నుంచి ఈ ఆలోచన వచ్చింది. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. విద్య మీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవ వనరుల మీద పెట్టినట్టే. కుటుంబాల తలరాతలే కాదు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాతలు కూడా మారుస్తాయి. మహాత్మ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి వాళ్లు పెద్ద యూనివర్శిటీల నుంచి వచ్చినవారే. అందుకే పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నామని అన్నారు. గతంలో కేవలం రూ. 10లక్షలు మాత్రమే ఇచ్చేవారు. 2016-17కి సంబంధించి రూ.300 కోట్లు బకాయిలు పెట్టారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.కోటి వరకు సాయం అందిస్తున్నాము. ట్యూషన్ ఫీజు వందశాతం రీయింబర్స్మెంట్స్ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సీఎంఓలో అధికారులు అందుబాటులో ఉంటారు. ఇబ్బంది ఉంటే వెంటనే కాల్ చేయండి. ప్రతీ విషయంలో మీకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
జగనన్న విదేశీ విద్యా దీవెన ఇలా
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య నభ్యసించేలా ఆర్థిక సాయం అందించే జగనన్న విదేశీ విద్యా దీవెన అమలుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మందికి మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన ఇలా నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 200 యూనివర్సిటీల ఎంపిక చేతురు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి గరిష్టంగా రూ.కోటి వరకు 100% ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్. 100 – 200 క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 100% ట్యూషన్ ఫీజు గరిష్టంగా రూ.75 లక్షల వరకు రీయిబర్స్మెంట్ చేస్తారు. మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.50 లక్షలు లేదా ట్యూషన్ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు విమాన, వీసా చార్జీలను సైతం ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోంది. -
జగనన్న విదేశీ విద్యా దీవెనకు 546 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద వర్గాలకు చెందిన పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’కు సోమవారం నాటికి మొత్తం 546 దరఖాస్తులొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తొలుత సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన సంగతి తెల్సిందే. ఆ గడువు ముగిసిన అనంతరం ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకుగాను అక్టోబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ విదేశీ విద్య అందాలనే లక్ష్యంతో తాజాగా ఆ గడువును మరింత కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్థన్ చెప్పారు. సోమవారంతో ముగిసిన గడువు మరికొంత కాలం కొనసాగుతుందని.. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు విదేశాల్లో చదువుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన వర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తుంది. ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన వర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ఫీజు రూ.కోటి అయినా నూరు శాతం ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. అలాగే క్యూఎస్ ర్యాంకుల్లో 101 నుంచి 200 లోపు కలిగిన వర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే.. రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చేసేలా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి వార్షిక ఆదాయం రూ.8 లక్షల వరకు పెంచడం విశేషం. అర్హులందరికీ ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. ఇప్పటి వరకు 546 దరఖాస్తులు రాగా, వాటిలో శాఖల వారీగా పరిశీలించి ఆమోదించినవి 82 ఉన్నాయి. మరో 48 ధరఖాస్తులు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తిరస్కరించారు. 416 దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. -
28, 29 తేదీల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి దరఖాస్తు చేసిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులు/తల్లిదండ్రులకు ఈ నెల 28, 29 తేదీల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. భారత్లో ఉన్న విద్యార్థులకు ఈ నెల 28న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు ఈ ఏడాది ఆగస్టు తర్వాత విదేశాలకు వెళ్లిన విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేసేందుకు వారి తల్లిదండ్రులకు 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ విద్యార్హతలు, ఇతర ఒరిజనల్ సర్టిఫికెట్లు, అటెస్ట్ చేసిన జిరాక్స్ కాపీలతో తాడేపల్లిలోని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావాలని తెలిపింది. -
జగనన్న విదేశీ విద్యా దీవెనకు 392 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు పెద్ద చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన కోసం 392 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈ పథకంలో దరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆర్థికసాయంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ఈ పథకం రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలు (ఈబీసీ), బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వర్తిస్తుంది. వచ్చిన దరఖాస్తులు, వాటికి జతచేసిన ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించిన తరువాత ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెనను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారందరికీ వర్తింపజేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది మేలు చేస్తుంది. ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న వారికి ఫీజు రూ.కోటి అయినా నూరుశాతం ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. 101 నుంచి 200 క్యూఎస్ ర్యాంకులున్న యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఈ పథకానికి వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షల వరకు పెంచడం విశేషం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె.హర్షవర్ధన్ తెలిపారు. (క్లిక్ చేయండి: ట్రిపుల్ ఐటీ సీట్లలో అగ్రభాగంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా)