Mamta Kulkarni
-
'సల్మాన్, షారూఖ్ నన్ను చూసి నవ్వారు'.. హీరోయిన్ కామెంట్స్
మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సడన్గా సన్యాసం స్వీకరించడం హాట్ టాపిక్గా మారింది. గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసిన మమతా ఇండియాను వదిలేసి రెండు దశాబ్దాలయింది. సుదీర్ఘ విరామం తర్వాత మహాకుంభ్ మేళా కోసం భారత్కు తిరిగొచ్చింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ అవకాశం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా మమతా కులకర్ణి.. హిందీలో కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడీ వంటి పలు సినిమాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాలతో మెప్పించింది.తాజాగా మమతా బాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తాను కరణ్ అర్జున్ మూవీ గురించి మాట్లాడింది. ఆ మూవీ షూటింగ్ సమయంలో తనను చూసి సల్మాన్, షారుక్ ఖాన్ నవ్వుకున్నారని తెలిపింది. సల్మాన్ ఖాన్ ఏకంగా తనను చూసి తలుపులు వేసుకున్నాడని పేర్కొంది.మమతా కులకర్ణి మాట్లాడుతూ.. "కరణ్ అర్జున్ మూవీ షూట్ షారుఖ్, సల్మాన్తో కలిసి చేశాను. అక్కడే ఓ సాంగ్ షూట్లో కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్ను సింగిల్ టేక్లో చేశా. కానీ వాళ్లిద్దరూ రీటేక్స్ ఎక్కువగా తీసుకున్నారు. దాంతో కొరియోగ్రాఫర్కు కోపం వచ్చి ప్యాకప్ చెప్పేశాడు. ఆ తర్వాత సల్మాన్ అసహనానికి గురయ్యాడు. నేను గదిలోకి వెళ్తుంటే నా ముఖంపై తలుపు వేశాడు. కానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సల్మాన్ ఎప్పుడూ నన్ను ఆటపట్టించేవాడు. నేను సెట్లో సమయపాలన పాటిస్తాను.' అని తెలిపింది.(ఇది చదవండి: 23 ఏళ్లుగా దీనికోసమే.. ఒలంపిక్ గెల్చినంత సంతోషంగా ఉంది: మమతా)కాగా.. మమతా కులకర్ణి 2000 సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్కు గుడ్బై చెప్పేసింది. ఆమె చివరిసారిగా 2002లో విడుదలైన కభీ తుమ్ కభీ హమ్లో కనిపించింది. అంతకుముందు మేరా దిల్ తేరే లియే, తిరంగా, దొంగ పోలీస్, కిస్మత్ లాంటి చిత్రాల్లో నటించింది. -
సన్యాసిగా మారిన హీరోయిన్పై బహిష్కరణ వేటు
మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి (Mamta Kulkarni)కి షాక్ తగిలింది. ఆమెను కిన్నార్ అఖాడా నుంచి బహిష్కరించారు. మహామండలేశ్వర్గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు. మత పెద్దలు, అఖాడాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిన్నార్ అఖాడా వ్యవస్థాపకులు రిషి అజయ్ దాస్ వెల్లడించారు. ఆమెకు ఏకంగా మహామండలేశ్వర్ హోదాను ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. మమతా కులకర్ణితో పాటు ఆమెను అఖాడాలో చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి (Laxmi Naarayan Tripathi)పైనా బహిష్కరణ విధించారు.ఇటీవలే సన్యాసం.. ఇంతలోనే..ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన మమతా కులకర్ణి ఇటీవల కుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. కిన్నార్ అఖాడా గురువు లక్ష్మీనారాయణ్ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాసం తీసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు మహామండలేశ్వర్ హోదాను ఇచ్చారు. అలాగే ఆమె పేరును శ్రీయామై మమతానందగిరిగా మార్చారు. హీరోయిన్ను అఖాడాలో చేర్చుకోవడమే ఇబ్బందికరం అంటే తనకు ఆరంభంలోనే అంత పెద్ద హోదా ఎలా ఇస్తారని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.సడన్గా సన్యాసమేంటో? బిరుదేంటో?యోగా గురువు రాందేవ్ బాబా సైతం.. మహా పవిత్రమైన కుంభమేళాలో కొందరు వ్యక్తులు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయినవారు ఒక్కసారిగా సన్యాసులుగా మారిపోవడంతో పాటు మహామండలేశ్వర్ వంటి బిరుదులను కూడా పొందుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మమతా కులకర్ణితో పాటు గురువు లక్ష్మీనారాయణ త్రిపాఠిని సైతం అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ నిర్ణయంపై లక్ష్మీనారాయణ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. అజయ్ దాస్ అఖాడా నుంచి బయటకు వెళ్లి కుటుంబంతో నివసిస్తున్నాడని, కావున ఆయనకు ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు లేదని తెలిపారు.చదవండి: వీల్చైర్లో రష్మిక.. సాయం చేసిన హీరోకు మంగళహారతిచ్చి. -
మొన్న హీరోయిన్ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా..
హీరోయిన్ మమతా కులకర్ణి (Mamta-kulkarni) సన్యాసం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా ఇదే బాటలో హీరోయిన్ నిఖిలా విమల్ సోదరి అఖిలా విమల్ (Akhila Vimal) అడుగులు వేసింది. ప్రస్తుతం మహాకుంభమేళాలో ఉన్న ఆమె సన్యాసం (Sanyas) తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె గురువు అభినవ్ బాలనందభైరవ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. జూనా పీఠాదీశ్వరులు, అచార్య మహా మండలేశ్వర్ స్వామి అవధేశానంద గిరి మహారాజ్ సమక్షంలో అఖిల సన్యాసం స్వీకరించింది. ఇక మీదట తన పేరు అవంతిక భారతి అని వెల్లడించారు.కొద్ది రోజుల క్రితమే హింట్..కొద్ది రోజుల క్రితం అఖిల కాషాయ వస్త్రాలు ధరించి భక్తిమైకంలో మునిగి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అది చూసిన జనాలు.. తను ఏం చేయబోతుంది? సన్యాసం తీసుకుంటుందా? ఏంటి? అని అనుమానించారు. అందరూ ఊహించినట్లుగానే సాధ్విగా మారిపోయింది. ఆధ్యాత్మిక మార్గంలోనే మిగిలిన జీవితం గడపనుంది. అఖిల.. హీరోయిన్ నిఖిలా విమల్కు స్వయానా అక్క. చిన్న వయసులోనే నిఖిల సినిమాల్లో ఎంట్రీ ఇవ్వగా.. అఖిల మాత్రం పూర్తిగా చదువుపైనే ధ్యాస పెట్టింది. ఉన్నత చదువులు.. సడన్గా సన్యాసంఅమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో థియేటర్ అండ్ పర్ఫామెన్స్ సబ్జెక్ట్పై రీసెర్చ్ చేసింది. ఉన్నత విద్యనభ్యసించిన ఆమె సడన్గా భక్తి మార్గం పట్టడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. నిఖిల (Nikhila Vimal) విషయానికి వస్తే.. మలయాళంలో పొర్ తొళిల్, అంజూమ్ పాతిరా, తెలుగులో మేడ మీద అబ్బాయి, గాయత్రి సినిమాలు చేసింది. రీసెంట్గా గురువాయూర్ అంబలనాడయిల్, నునక్కుళి చిత్రాల్లో మెప్పించింది.(చదవండి: హీరోగా నటించనున్న తమన్? 22 ఏళ్ల తర్వాత..!)సన్యాసం తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్హీరోయిన్ మమతా కులకర్ణి ఇటీవలే సన్యాసం తీసుకుంది. ఈమె 1990'sలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి పెద్ద పెద్ద హీరోలతో జోడీ కట్టింది. కరణ్ అర్జున్, బాజీ, ఆషిఖ్ ఆవారా, దిల్బర్, కిస్మత్, జానే జిగర్ ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ మూవీస్తో మెప్పించింది. 2003లో ఓ బెంగాలీ సినిమా చేసిన అనంతరం మళ్లీ వెండితెరపై కనిపించలేదు.డ్రగ్స్ కేసులో మమత పేరుఆ మధ్య రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో మమతా పేరు ప్రముఖంగా వినిపించింది. అంతేకాక కెన్యాలోనూ ఓ డ్రగ్స్ కేసులో అరెస్టయింది. చాలాకాలంగా కెన్యాలోనే నివసిస్తున్న ఆమె దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇండియాకు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. కిన్నారా అఖాడా(ఆశ్రమం)లో ఆచార్య మహా మండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాసిగా మారింది. కారణం ఏమై ఉంటుందో?ఇకపై సాధ్విగా తన ప్రయాగం సాగుతుందన్న ఆమె తన పేరును శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది. అయితే ఆమె సాధ్విగా మారడంపై విమర్శలు కూడా వచ్చాయి. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన నటి సడన్గా సన్యాసిగా మారిపోవడం వెనుక కారణమేంటని ట్రాన్స్జెండర్, జగద్గురు మహామండలేశ్వర్ హిమాంగి సఖి ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.చదవండి: మోనాలిసా సరే.. వీళ్ల గ్లామర్ ఎందుకు నచ్చదు..?: కంగనా రనౌత్ -
23 ఏళ్లుగా దీనికోసమే.. ఒలంపిక్ గెల్చినంత సంతోషంగా ఉంది: మమతా
మమతా కులకర్ణి (Mamta Kulkarni).. గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసి చాలాకాలమే అవుతోంది. ఆ మధ్య డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ఇండియాను వదిలేసి రెండు దశాబ్దాలయింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఇటీవలే భారత్కు తిరిగొచ్చింది. మళ్లీ సినిమాల్లోకి వస్తుందా? అని అభిమానులు ఆశగా ఆరా తీశారు. అటువంటి ఆలోచనే లేదని కుండ బద్ధలు కొట్టింది మమత. మహాకుంభమేళా కోసమే వచ్చానంది. 23 ఏళ్లుగా దీనికోసమే చూస్తున్నా..ఈ వేడుకలో పాల్గొని వెళ్లిపోతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ మమత తీసుకున్న ఊహించని నిర్ణయం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆమె అన్నింటికీ స్వస్తి పలుకుతూ సన్యాసం తీసుకుంది. కిన్నార్ అఖారాకు మహామండలేశ్వర్గా మారిపోయింది. శ్రీయామై మమతా నందగిరిగా పేరు మార్చుకుంది. సినిమాల్లో రీఎంట్రీ, ఆధ్యాత్మిక మార్గం గురించి మమతా కులకర్ణి మాట్లాడుతూ.. 23 ఏళ్లుగా దీనికోసమే తపస్సు చేస్తున్నాను. ఇన్నాళ్లకు సన్యాసం స్వీకరించాను. ఒలంపిక్ పతకం గెల్చినంత సంతోషంగా ఉంది. అందుకే ఆ సమూహంలోకి..మళ్లీ సినిమాలు చేయాలన్న ఆలోచన కూడా నాకు రావట్లేదు. ఇక అది అసాధ్యమే అవుతుంది. కిన్నార్ అఖారా (వీరు ట్రాన్స్జెండర్స్) సమూహంలోని వారు అర్ధనారీశ్వరునికి ప్రతీకగా నిలుస్తారు. ఈ అఖారా గ్రూపులో మహామండలేశ్వర్గా స్థానం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆదిశక్తి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైంది. నేను కిన్నార్ అఖారానే ఎందుకు ఎంచుకున్నానంటే వీరు స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ ఎలాంటి కట్టుబాట్లు ఉండవు.బుద్ధుడు కూడా అంతేగా!సినిమాల గురించి మాట్లాడుతూ.. జీవితంలో ప్రతీదీ ఉండాలి. అందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఒక భాగమే! అయితే మీరు దేన్నైనా పొందుతారేమో కానీ ఆధ్యాత్మిక భావం అనేది అదృష్టం ఉంటేనే కలుగుతుంది. సిద్దార్థుడు జీవితంలో అన్నీ చూసిన తర్వాతే మార్పు దిశగా ప్రయత్నించాడు. గౌతమ బుద్ధుడిగా మారిపోయాడు అని చెప్పుకొచ్చింది. కాగా మమతా కులకర్ణి.. హిందీలో కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడీ వంటి పలు సినిమాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాలతో మెప్పించింది. View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) చదవండి: నా కూతురు పోయాకే చేదు నిజం తెలుసుకున్నా.. ఇళయరాజా ఎమోషనల్ -
జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే!
జీవితంపై విరక్తి చెందినవారు, ఆధ్యాత్మిక మార్గంలోనే జీవితాన్ని కొనసాగించాలనుకునేవారు సన్యాసం బాట పడుతుంటారు. ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ మమతా కులకర్ణి (Mamta Kulkarni) కూడా అదే దారిలోకి వెళ్లాలని ఆశపడింది. ఇందుకోసం రెండు దశాబ్దాల తర్వాత ఇండియాకు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం పుచ్చుకుంది.సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్కిన్నారా అఖాడా(ఆశ్రమం)లో ఆచార్య మహా మండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాసిగా మారింది. ఇకపై సాధ్విగా తన ప్రయాగం సాగుతుందన్న ఆమె తన పేరును శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది. ఈ వ్యవహారంపై ట్రాన్స్జెండర్, జగద్గురు మహామండలేశ్వర్ హిమాంగి సఖి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమను మహామండలేశ్వర్గా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఏం చెప్పాలనుకుంటున్నారు?హిమాంగి సఖి మాట్లాడుతూ.. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే మహామండలేశ్వర్గా మారింది. తన గతమేంటో అందరికీ తెలుసు. డ్రగ్స్ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చింది. సడన్గా భారత్కు రావడం.. మహాకుంభమేళాకు హాజరవడం.. ఏకంగా సన్యాసిగా మారిపోవడం ఏంటో.. దీనిపై కచ్చితంగా విచారణ జరపాలి. అలాంటి వ్యక్తికి మహామండలేశ్వర్ హోదా ఇచ్చి సనాతన ధర్మానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అర్హత లేని మనిషికి గురువు హోదా ఎందుకిచ్చారు? ఇది అనైతికం అని మండిపడింది.(చదవండి: మోనాలిసా.. ఆంటీలతో పోలిక.. ఎంత అన్యాయమన్న విశ్వక్సేన్)ఎవరీ మమతా కులకర్ణి?1990'sలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది మమతా కులకర్ణి. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి పెద్ద పెద్ద హీరోల సరసన కథానాయికగా యాక్ట్ చేసింది. కరణ్ అర్జున్, బాజీ, ఆషిఖ్ ఆవారా, దిల్బర్, కిస్మత్, జానే జిగర్ ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ మూవీస్తో మెప్పించింది. 2003లో ఓ బెంగాలీ సినిమా చేసిన అనంతరం మళ్లీ వెండితెరపై కనిపించలేదు.వివాదంమమతా 2016లో ప్రియుడితో కలిసి డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడటం అప్పట్లో సంచలనమైంది. రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్ రాకెట్ కేసులో ఇరుక్కుంది. ఏళ్ల తరబడి విచారణ జరిపిన బాంబే హైకోర్టు గతేడాది ఆగస్టులో మమతకు క్లీన్చిట్ ఇచ్చింది. అప్పట్లో టాప్లెస్ ఫోటోషూట్తోనూ వివాదాల్లోకెక్కింది.చదవండి: మాఫియా డాన్తో ప్రేమాయణం.. జైలుకెళ్లిన ఈ నటి గుర్తుందా? -
మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న హీరోయిన్
హీరోయిన్ మమత కులకర్ణి (Mamta Kulkarni) సన్యాసం తీసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె మహామండలేశ్వర్గా మారుతున్నట్లు ప్రకటించింది. ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించానలుకున్న ఆమె ఫిబ్రవరి వరకు కుంభమేళాలో ఉంటానని పేర్కొంది. జనవరి 24న కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాస దీక్ష తీసుకుంది. తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకుంది.సాధ్విగా మారిపోయిన హీరోయిన్కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్షతో, భుజానికి వేలాడుతున్న కుంకుమపువ్వుతో ఆమె నిజమైన సాధ్విగా మారిపోయింది. 25 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన ఆమె ఇలా సాధ్విగా మారిపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మమత కులకర్ణి సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగొందింది. కరణ్ అర్జున్, దిల్బర్, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాలతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ చిత్రాల్లో కథానాయికగా యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) చదవండి: అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్తో క్లారిటీ.. -
డ్రగ్ రాకెట్ : బాలీవుడ్ నటి ఆస్తులు అటాచ్
సాక్షి, థానే : కోట్లాది రూపాయల డ్రగ్ రాకెట్ కేసులో కీలక నిందితురాలు, బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రత్యేక ఎన్డీపీస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్ కేసుకు సంబంధించి పలుమార్లు కోర్టు ఎదుట హాజరు కావడంలో విఫలమవడంతో మమతా ఆస్తులను అటాచ్ చేయాలని న్యాయమూర్తి హెచ్ఎం పత్వర్ధన్ ఆదేశించారు. మమతా కులకర్ణికి చెందిన ముంబయిలోని మూడు విలాసవంతమైన ఫ్లాట్లను అటాచ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫ్లాట్ల ప్రస్తుత విలువ రూ 20 కోట్లుగా ఉంటుందని అంచనా. మమతా ఆస్తుల అటాచ్ను కోరుతూ ప్రాసిక్యూషన్ దరఖాస్తుకు సానుకూలంగా స్పందించిన కోర్టు మమతా కులకర్ణికి చెందిన మూడు ఆస్తులను అటాచ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హిరే చెప్పారు. రూ 2000 కోట్ల విలువైన డ్రగ్ రాకెట్ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకానందున మమతా కులకర్ణి పరారీ ఉన్నారని కోర్టు ప్రకటించింది. డ్రగ్ బ్యారన్ విక్కీ గోస్వామితో సన్నిహిత సంబంధాలతో అక్రమ కార్యకలాపాల్లో ఆమె చురుకుగా పాల్గొనేదని పోలీసులు పేర్కొంటున్నారు. రెండేళ్ల కిందట థానే పోలీసులు వెలుగులోకి తెచ్చిన డ్రగ్ రాకెట్కు మమతా కులకర్ణిని సూత్రధారిగా పోలీసులు ఆరోపిస్తున్నారు. కెన్యాలో తలదాచుకున్న గోస్వామి, మమతా కులకర్ణిలను భారత్కు రప్పించే ప్రక్రియను చేపట్టామని థానే పోలీసులు పేర్కొన్నారు. -
డ్రగ్స్ కేసు; మాజీ హీరోయిన్పై రెడ్ కార్నర్..
సాక్షి, ముంబై : దేశంలో ఇప్పటివరకు వెలుగు చూసిన అతిభారీ డ్రగ్స్ కుంభకోణం ‘సోలాపూర్లో ఎఫిడ్రీన్ పట్టివేత’ కేసులో మాజీ హీరోయిన్ మమతా కులకర్ణిపై రెడ్కార్నర్ నోటీసుల జారీకి రంగం సిద్ధమైంది. తన సహచరుడు వికీ గోస్వామితో కలిసి ఆమె పలుదేశాల్లో డ్రగ్స్ దందా నిర్వహించేవారని, మహారాష్ట్రలోని సోలాపూర్లో ఏవన్ లైఫ్సైన్సెస్ ఫ్యాక్టరీలో ఎఫిడ్రీన్ తయారీ ముఠాతో వారికి నేరుగా సంబంధాలున్నాయని సీఐడీ పక్కా ఆధారాలు సేకరించింది. ఆ ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సమర్పించింది. వాటిని అంతర్జాతీయ సంస్థ ఇంటర్పోల్కు పంపిన సీబీఐ.. మమతపై రెండ్ కార్నర్ నోటీసులు జారీచేయాలని కోరింది. ఈ తతంగమంతా రెండు నెలల కిందటే జరిగినప్పటికీ, చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడ్డాయి. కెన్యాలోనే మమతను దిగ్బంధించే దిశగా : ఎఫిడ్రీన్ తయారీ కేసుకు సంబంధించి మహారాష్ట్ర సీఐడీ పోలీసులు కొద్దిరోజుల కిందటే(సెప్టెంబర్ 29న) చార్జిషీట్ దాఖలు చేసి, సీబీఐ ద్వారా ఇంటర్పోల్కు పంపారు. ‘నేడో, రేపో మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది’ అని ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మమత ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. రెడ్కార్నర్ నోటీసులు జారీ అయిన వారిని ఎయిర్పోర్టుల్లో సులువుగా చిక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇక మమత సహచరుడు వికీ గోస్వామి అమెరికా అండర్ గ్రౌండ్లో తలదాచుకున్నట్లు సమాచారం. 2014లో వెలుగుచూసిన సోలాపూర్ ఎఫిడ్రీన్ పట్టివేత కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్ల పైమాటే! ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నైజీరియన్లు సహా 14 మందిని అరెస్టు చేశారు. కీలక నిందితులైన మమత, గోస్వామిలు సహా నలుగురి కోసం వేట కొనసాగుతోంది. గతంలో డ్రగ్స్ సంబంధిత కేసులోనే కెన్యాలో మమతా కులర్ణిని అరెస్టయి, విడుదలయ్యారు. -
హీరోయిన్కు అరెస్ట్ వారెంట్
థానె: 2 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి మమతా కులకర్ణి పీకల్లోతు కష్టాల్లో పడింది. థానెలోని ప్రత్యేక కోర్టు మమతా కులకర్ణితో పాటు అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ వికీ గోస్వామికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు వెలుగు చూసిన తర్వాత మమత, గోస్వామి అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని సమాచారం. డ్రగ్ రాకెట్ కేసులో మమత, గోస్వామికి సంబంధమున్నట్టు బలమైన ఆధారాలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హీరే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులు వీరేనని, వీరిపై వారెంట్ జారీ చేయాలని కోరారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపారు. భారత్, కెన్యాలో డ్రగ్ రాకెట్ నడుపుతున్నారని, కెన్యాలోని ఓ హోటల్లో మమత, గోస్వామి, ఇతర నిందితులు సమావేశమైనట్టు విచారణలో తేలిందని చెప్పారు. వాదనలు విన్న అనంతరం కోర్టు.. మమత, గోస్వామికి వారెంట్ జారీ చేసింది. 2014 ఏప్రిల్లో థానె క్రైమ్ బ్రాంచ్ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గోస్వామికి, కెన్యాకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు ప్రమేయమున్నట్టు కనుగొన్నారు. ఆ తర్వాత విచారణలో చాలామంది పేర్లు వెలుగు చూశాయి. మమత కెన్యాలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. -
ఆ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు: నటి
ముంబై: రెండువేల కోట్ల రూపాయల అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితురాలిగా ఉన్న బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతోంది. తానొక యోగిని అని, నిర్దోషిని అని చెప్పింది. ‘నేనొక యోగిని. గత 20 ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. డ్రగ్స్ కేసులో నేను నిర్దోషిని’ అని రికార్డు చేసిన వీడియో టేపులో మమత చెప్పింది. ఆమె ప్రస్తుతం కెన్యాలో ఉంటోంది. డ్రగ్స్ కేసులో తన పేరును అక్రమంగా ఇరికించిన మహారాష్ట్ర పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, కిరెన్ రిజిజులకు లేఖ రాసింది. కాగా ఈ కేసులో మమతా కులకర్ణి బ్యాంక్ ఖాతాలను ఇటీవల మహారాష్ట్ర పోలీసులు స్తంభింపజేశారు. గుజరాత్, ముంబై ఇతర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో మమతకు ఉన్న కనీసం 8 ఖాతాలను ఆపివేసినట్టు థానె పోలీసులు చెప్పారు. మమతా కులకుర్ణితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న విక్కీ గోస్వామి కూడా డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితుడు. ముంబైలో వెలుగుచూసిన అంతర్జాతీయ డ్రగ్స్ కేసులో మమత, విక్కీ గోస్వామితో పాటు మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు. -
హీరోయిన్ బ్యాంక్ అకౌంట్లు సీజ్
అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్తో సంబందాలున్నాయన్న ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణికి మరో షాక్ తగిలింది. ఈ బ్యూటి ఆర్థిక లావాదేవిల మీద దృష్టి పెట్టిన పోలీసు అధికారులు మమతా కులకర్ణికి సంబందించిన అన్ని బ్యాంక్ అకౌంట్స్ను సీజ్ చేశారు. ఇప్పటికే ఎనిమిది బ్యాంక్ అకౌంట్ లను సీజ్ చేసినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. ఒక్క మలాద్ బ్యాంక్ ఎకౌంట్ లోనే 67 లక్షల రూపాయల నగదు ఉండగా.. ఇతర అకౌంట్లన్నింటిలో కలిపి మరో 26 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ఖాతాల నుంచి ఎలాంటి లావాదేవిలు జరపలేదని తెలిపారు. త్వరలో ఇండియాలో ఉన్న మమత ఆస్తులను కూడా సీజ్ చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. -
హీరోయిన్ 8 బ్యాంక్ ఖాతాల స్తంభన
ముంబై: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్లో నిందితురాలిగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి బ్యాంక్ ఖాతాలను మహారాష్ట్ర పోలీసులు స్తంభింపజేశారు. గుజరాత్, ముంబై ఇతర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో మమతకు ఉన్న కనీసం 8 ఖాతాలను ఆపివేసినట్టు థానె పోలీసులు చెప్పారు. మమత ఎకౌంట్లలో 90 లక్షల రూపాయలకుపైగా నగదు ఉంది. మలాడ్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్లోని మమత ఖాతాలో 67 లక్షలు ఉండగా, ఇతర బ్యాంకుల్లో మరో 26 లక్షల రూపాయల నగదు నిల్వ ఉన్నట్టు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మమతా అక్కతో పాటు ఇతరులను ప్రశ్నిస్తున్నారు. ఇక మమత ఆస్తులకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సంబంధిత అధికారులను సంప్రదించారు. మమతా కులకుర్ణితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న విక్కీ గోస్వామి కూడా డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితుడి. ముంబైలో వెలుగుచూసిన అంతర్జాతీయ డ్రగ్స్ కేసులో మమత, విక్కీ గోస్వామితో పాటు మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు. 10 మందిని అరెస్ట్ చేయగా, మిగిలినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మమత ప్రస్తుతం నైరోబీలో ఉంటోంది. -
నేను యోగిని.. ఆ కేసులో ఇరికించారు: నటి
ముంబై: 1990వ దశకంలో కరణ్ అర్జున్, ఆషికీ అవారా వంటి సినిమాలతో బాలీవుడ్ను ఉర్రూతలూగించిన భామ మమతా కులకర్ణి.. ప్రస్తుతం నైరోబీలో ఉంటున్న ఈమె ముంబైలో ఇటీవల వెలుగుచూసిన అంతర్జాతయ డ్రగ్స్ రాకెట్లో నిందితురాలిగా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ రాకెట్ నిందితుడు విక్కీ గోస్వామితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న మమతా కులకుర్ణి తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వివరాలు తెలిపింది. ఒకప్పుడు అందాల శృంగార తారగా వెలుగొందిన తాను ఇప్పుడు యోగినిగా మారానని, తన ఆత్మకథను చదివితేనే.. తన ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరిస్తానని ఆమె తెలిపింది. నైరోబీలో ఉన్న ఆమె ఈమెయిల్ ద్వారా తన ఆత్మకథను పంపి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చింది. బాలీవుడ్లో టాప్-2 హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నప్పుడే తనకు ఈ రంగం సరిపడదని అర్థమయిందని, ఆ తర్వాత తాను ఆధ్యాత్మికత వైపు మళ్లానని, కాపాలిలోని శ్రీ గగన్గిరి మహారాజ్ గురువు దగ్గర ఆథ్మాత్మిక దీక్ష తీసుకొని యోగినిగా మారినట్టు ఆమె తెలిపింది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే మమతా కులకర్ణి డ్రగ్స్ మాఫియా నేరగాడు విక్కీ గోస్వామితో ప్రేమలో పడి.. అర్ధాంతరంగా దుబాయ్ వెళ్లిపోయింది. విక్కీ తన స్నేహితుడని, అతడు ప్రపంచం చూపిస్తానని తనను తీసుకెళ్లాడని, ప్రస్తుతం తాను ఒంటరిగా నైరోబీలోని ఓ అపార్ట్మెంటులో ఉంటూ యోగా, ధ్యానం ద్వారా పూర్తిగా ఆధ్యాత్మిక దీక్షలో గడుపుతున్నానని మమత చెప్పింది. ముంబై డ్రగ్స్ రాకెట్ కేసులో తన ప్రమేయం ఏమాత్రం లేదని, పోలీసులే కావాలని తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని తెలిపింది. తన ఆత్మకథ చదివితే తానేమిటో అందరికీ అర్థమవుతుందని, తనపై కేసులు కూడా తేలిపోతాయని ఆమె పేర్కొంది. -
ఆ హీరోయిన్ నా భార్య కాదు!
న్యూఢిల్లీ: డ్రగ్స్ స్మగ్లర్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్కీ గోస్వామి తాజాగా సంచలన విషయాలు వెల్లడించాడు. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, ఆమెను తాను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదని ఆయన చెప్పాడు. తొలిసారి టీవీ చానెల్తో మాట్లాడిన ఆయన డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు. 'మమతా కులకర్ణి నా శ్రేయోభిలాషి మాత్రమే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడింది. అంతేకానీ ఆమె నా భార్య కాదు. ఆమెను నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు' అని విక్కీ గోస్వామి చెప్పాడు. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా అధినేతగా గుర్తింపు పొందిన విక్కీ గోస్వామి ప్రస్తుతం కెన్యాలోని మొంబాసాలో ఉంటున్నాడు. అక్కడి నుంచి తనను భారత్కు అప్పగించాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నదన్నాడు. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం (డీఈఏ) తనను కిడ్నాప్ చేయాలని భావిస్తున్నదని, కాబట్టి తాను భారత్కు వచ్చే అవకాశమే లేదని అతను తేల్చిచెప్పాడు. తనను కొందరు లక్ష్యంగా చేసుకున్నారని చెప్పాడు. ఇటీవల థానెలో పట్టుబడిన రూ. 2వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు తన గ్యాంగ్కే చెందినవని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చాడు. కాగా, విక్కీ గోస్వామి భార్యగా భావిస్తున్న మమతా కులకర్ణి గతంలో ఆయనకు మద్దతుగా మీడియాతో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
డ్రగ్స్ రాకెట్ లో హీరోయిన్!
థానే: బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన మమతా కులకుర్ణిపై 'డ్రగ్స్' మేఘాలు కమ్ముకున్నాయి. నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు ఆమెపై దృష్టి సారించారు. థానే పోలీసులు ఇటీవల 20 టన్నుల నిషేధిత ఎఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ స్మగ్లింగ్ లో మమత భర్త విక్కీ గోస్వామి కీలకపాత్రధారి అని పోలీసులు వెల్లడించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాలో అతడు తలపండిపోయాడు. 1997లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన విక్కి 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత భార్యతో కలిసి కెన్యా రాజధాని నైరోబికి మకాం మార్చాడు. అక్కడి నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. అమెరికా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అమెరికా సమాచారంతో థానే పోలీసులు కూడా అతడిని వాంటెడ్ జాబితాలో చేర్చారు. మమత పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని థానే పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తెలిపారు. 1990లో అగ్రతారగా వెలుగొందిన మమతా కులకుర్ణి టాప్ హీరోల సరసన నటించింది. తనపై ఇంటర్ పోల్ నోటీసు ఉండడంతో దుబాయ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, అమెరికాలో కార్యకలాపాలు చూసే బాధ్యత తన భార్యకు విక్కి అప్పగించాడని థానే పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మహారాష్ట్రలోనూ ఆమె డగ్స్ నెట్ వర్క్ నడుపుతున్నట్టు అనుమానిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలకు మమత పేరు విక్కి వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు హవాలా మార్గంలోనూ వీరు లావాదేవీల జరుపుతున్నట్టు భావిస్తున్నారు. అంతకుముందు మమతా కులకుర్ణి పేరు బయటికి రాలేదు. విక్కి గోస్వామికి, ముంబైలోని డ్రగ్స్ స్మగ్లర్లకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న పునిత్ శ్రింగి అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతడు తెలిపిన వివరాలు ఆధారంగా మమత పాత్రపై పోలీసులు దృష్టి పెట్టారు. -
కెన్యాలో డ్రగ్స్ కేసు: మమతాకులకర్ణి అరెస్టు!
ఒకప్పుడు బాలీవుడ్ తెరను ఏలిన అలనాటి హీరోయిన్ మమతా కులకర్ణిని, ఆమె భర్తను కెన్యాలో డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా వెల్లడించింది. కెన్యాలోని డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, మొంబాసా పోలీసులు కలిసి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. 90ల కాలంలో బాలీవుడ్ హీరోయిన్గా వెలుగొందిన మమతా కులకర్ణి దాదాపు దశాబ్ద కాలం నుంచి మీడియాకు దూరంగా గడుపుతున్నారు. చిట్ట చివరి సారిగా దేవానంద్ తీసిన సెన్సార్ అనే సినిమాలో 2001లో ఆమె కనిపించారు. దుబాయ్లో కొంతకాలం అజ్ఞాతంగా గడిపిన అనంతరం ఆమె నైరోబీకి వెళ్లిపోయారు. ఆమె స్నేహితుడు, అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారి విజయ్ 'విక్కీ' గోస్వామితో కలిసి ఆమె దుబాయ్ వెళ్లినట్లు తొలుత కథనాలు వచ్చాయి. తర్వాత అతడిని పెళ్లిచేసుకుంది. విక్కీని పోలీసులు దుబాయ్లో 1997లో డ్రగ్స్ కేసులో అరెస్టుచేయగా, 25 ఏళ్ల జైలుశిక్ష పడింది. అతడిని చూసేందుకు మమత కూడా జైలుకు వెళ్లారు. అప్పట్లో తెల్లబడిపోయిన జుట్టు, కళ్లజోడుతో దుబాయి జైలుకు వెళ్లినప్పుడు ఆమెను అక్కడి మీడియా గుర్తుపట్టి ఫొటోలు ప్రచురించింది. అయితే.. సత్ప్రవర్తన కారణంగా విక్కీని గత నవంబర్ 15న విడుదల చేశారు. ఆ తర్వాతే వీళ్లిద్దరూ కలిసి నైరోబీకి వెళ్లిపోయినట్లు తెలిసింది. తాజాగా నైరోబీలో డ్రగ్స్ కేసులో భార్యాభర్తలు ఇద్దరినీ అక్కడి పోలీసులు అరెస్టుచేశారు.