muralikrishna
-
మరణిస్తూ మరికొందరికి ప్రాణం పోసి..
మల్కాపురం/సింహాచలం/తిరుపతి తుడా: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన జర్నలిస్ట్ అవయవాలను దానం చేసి, వారి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాపురం గొల్లవీధికి చెందిన ఉరుకూటి మురళీకృష్ణయాదవ్(52) ఓ పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తూ సింహాచలం దరి అడవివరంలో మెడికల్ షాపు నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నాడు. అతనికి భార్య శిరీష, బీటెక్ చదువుతున్న కుమారుడు, బీటెక్ పూర్తిచేసిన కుమార్తె ఉన్నారు. ఈ నెల 14న బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. చికిత్సకు స్పందించకపోవడంతో మంగళవారం వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు జీవన్దాన్ అధికారులకు సమాచారం అందించారు. జీవన్దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు ఆస్పత్రికి వచ్చి, మృతుడి నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లు సేకరించారు. 22 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడిప్రకాశం జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడికి మురళీకృష్ణ యాదవ్ గుండెను తిరుపతిలోని శ్రీ పద్మావతీ కార్డియాక్ కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అమర్చారు. -
‘మేడిగడ్డ’ ఎప్పుడు దెబ్బతింది?
సాక్షి, హైదరాబాద్: ‘వరదనీటి మళ్లింపు కోసం ని ర్మించే బరాజ్లను నీటినిల్వ డ్యామ్లుగా ఏ ప్రాతి పదికన పరిగణించారు? 2019లో బరాజ్లు పూర్త యితే 2021లో వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద 2023 జూలైలో కాళేశ్వరం బరాజ్లను డ్యామ్ లుగా గుర్తించడం వెనక అంతర్యం ఏమిటి?’ అని రాష్ట్ర డ్యామ్ల భద్రత సంస్థ (ఎస్డీఎస్ఓ) మాజీ ఎస్ఈ మురళీకృష్ణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది.కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం అమెరికాలో ఉన్న మురళీకృష్ణను వర్చువల్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.చట్టంలో ఉన్నందునే పరిగణించాం..‘డ్యామ్ల రక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మీరు అఫిడవిట్లో పేర్కొన్నదంతా వాస్తవమే నా? మీ బాధ్యతలేంటి?’ అని కమిషన్ మురళీకృష్ణ ను ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ 2021 డిసెంబర్ 30న నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ను నోటిఫై చేశారని పేర్కొన్నారు. 15 మీటర్ల ఎత్తు కలిగి, నీటిని నిల్వ చేసే జలాశయాలతోపాటు 10 మీటర్లకు మించి ఎత్తున్న చెక్ డ్యామ్లను కూడా డ్యామ్లుగా పరిగణించాలని చట్టంలో ఉందని మురళీకృష్ణ తెలియజేశారు. దీనిపై కమిషన్ స్పంది స్తూ ‘నీటిని మళ్లించడానికే బరాజ్లు కడతారు.. మరి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను డ్యామ్లుగా ఎలా పరిగణించారు? అని మళ్లీ ప్రశ్నించింది. చట్ట ప్రకారం స్పెసిఫైడ్ డ్యామ్లుగా బరాజ్లను నోటి ఫై చేశారని మురళీకృష్ణ వివరించారు. డ్యామ్ల రక్ష ణ చట్టం అమలు కోసం క్షేత్రస్థాయిలో అధికారుల తో చర్చించామని.. ఆయా డ్యామ్లను సమగ్రంగా పరిశీలించి నోటిఫై చేయించామని తెలిపారు.బరా జ్లు ఎప్పుడు పూర్తయ్యాయని కమిషన్ ప్రశ్నించ గా 2023లో స్పెసిఫైడ్ డ్యామ్లుగా నోటిపై చేశామ న్నారు. 2021లో చట్టం వస్తే 2019లోనే బరాజ్ పూ ర్తవడం వాస్తవమా? కాదా? అని కమిషన్ అడగ్గా వాస్తవమేనని చెప్పారు. పదేపదే విజ్ఞప్తుల అనంత రం స్పెసిఫైడ్ డ్యామ్ల జాబితాలో బరాజ్లను చేర్చారని బదులిచ్చారు. 2019లో మేడిగడ్డలో వర దలు వచ్చాయని, తొలుత సుందిళ్ల, అన్నారంలో బుంగలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత మేడిగడ్డ దెబ్బ తిందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయి తే బరాజ్ల అధికారులు ఈ విషయాన్ని నివేదించలేదని మురళీకృష్ణ వెల్లడించారు.రెండో వారంలో మళ్లీ విచారణనాలుగో విడత క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన జస్టిస్ చంద్రఘోష్.. మంగళవారం సాయంత్రం కోల్కతా తిరిగి వెళ్లనున్నారు. అనంతరం రెండో వారంలో తిరిగి హైదరాబాద్ వచ్చి ఐదో దఫా విచా రణలో ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలను ప్రశ్నించ నున్నారు. ఆ తర్వాత ఐఏఎస్లను విచారించే అవకాశాలున్నాయి. -
కశ్మీర్ ప్రజలు ఏమంటున్నారంటే...?
‘జమ్మూ–కశ్మీర్’ విభిన్న జాతులు, మతాలు, భాషలు, నైసర్గిక స్వరూపాలు కలిగిన ప్రాంతాల సమాహారం. ఏదో ఒక కారణంగా కశ్మీర్ రోజూ వార్తల్లో ఉంటోంది. పార్టీలు, నాయకులు, మేధావులు, జాతీ యవాదులు ఏదో ఒక సంద ర్భంలో కశ్మీరు గురించి మాట్లా డుకుంటూనే ఉంటారు. దేశమంతా కశ్మీరు గురించి చర్చిస్తున్న విషయాల్నే కశ్మీరీలు మాట్లాడుకుంటు న్నారా? అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు కశ్మీరీల మనసుల్లో ఏముంది? అని అన్వేషించడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పర్య టించింది. కశ్మీరు లోయ నుంచి జమ్మూ మైదాన ప్రాంతాల వరకు... ఎందరో సామాన్య కశ్మీరీలతో మాట్లాడి, వారి మనసులో ఏముందో పసిగట్టే ప్రయత్నం చేసింది.1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కశ్మీరులో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ఒక్కటే ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వేచ్ఛగా, న్యాయంగా జరిగిన ఎన్నిక అని కశ్మీరీలు అంటారు. అంతకు ముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నిక లన్నీ ఢిల్లీ పాలకులకు అనుకూలంగా జరిగిన ఎన్నికలేనని వారు భావిస్తున్నారు. జమ్మూ– కశ్మీరులో ఏ మూలకు వెళ్లి ఎవ్వరితో మాట్లాడినా... చాలా సమస్యలపై వారికి ఏకాభిప్రాయం లేనప్ప టికీ, ఉమ్మడి అభిప్రాయం ఉన్నది ఒక విషయంలోనే: ఆ రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికలు రావాలని బలంగా కోరుకుంటున్నారు.2019 ఆగస్టు 5న ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూ–కశ్మీర్కు ఉన్న స్వయంప్రతిపత్తి హోదా తొలగిపోయింది. రాష్ట్రాన్ని కశ్మీర్, లద్దాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగలేదు. 2023 డిసెంబరు 11న సుప్రీంకోర్టు, పూర్వ జమ్మూ– కశ్మీర్కి లభిస్తున్న స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, ఈ సెప్టెంబర్ 30 నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వ హించాలని ఆదేశించింది. ‘‘ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదే శాలతో ఎన్నికలు జరిగినా... మహా అయితే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం లాంటిది ఏర్పడవచ్చు. అక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అలాంటి ప్రభుత్వం మాకొద్దు’’ అని శ్రీనాగ్లో ఒక వ్యాపారి చెప్పాడు. ఇంచుమించు ఇదే అభిప్రాయం చాలా చోట్ల వినపడింది.రాష్ట్ర హోదాపాలన విషయంలో ఢిల్లీ మోడల్ని, సామాన్య స్థానికులతో పాటు గతంలో బీజేపీకి ఓటేసిన వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి బలమైన మద్దతుదా రులుగా ఉన్న గుజ్జర్ సామాజిక వర్గం బీజేపీకి ఇప్పుడు దూరం జరిగింది. స్థానిక బీజేపీ నాయకులు కూడా జమ్మూ–కశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరు ద్ధరించాలని, ఢిల్లీ ప్రభుత్వం లాంటిది వద్దని చెప్తు న్నారు. కశ్మీర్ విషయంలో తమది చరిత్రాత్మక నిర్ణయ మని బీజేపీ దేశమంతా ప్రచారం చేసుకుంటోంది. కానీ, కశ్మీరులో స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అందుకే, లోక్సభ ఎన్నికల్లో కశ్మీర్లో బీజేపీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్ని కల్లో బీజేపీ పరి స్థితిపై కొంత అనిశ్చితి నెలకొంది.కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో కొన్ని లోపాలు, వైఫ ల్యాలు ఉంటాయి. కానీ, అది మిలిటరీ సాయంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఎల్జీ పాలన కంటే ఏ విధంగా చూసినా మెరుగ్గానే ఉంటుందని ప్రజలు భావి స్తున్నారు. ‘‘ఎల్జీకి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగి పోయాయి. ఎన్నికలు లేకుండా వచ్చిన ఎల్జీ, అతని బ్యూరోక్రాట్ల బృందం నుంచి ప్రజాస్వామిక పరిపాల నను ఆశించలేం అని జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య అంతరం పెరిగి పోయింది. మీడియాలో చూపించే వంతెనలు, అండర్ పాస్లను పక్కన పెడితే, స్థానిక ప్రాంతాలను కలిపే రోడ్లు అధ్వాన్నంగా తయార య్యాయి. కొత్త రోడ్లు వేయడం, రోడ్లను రిపేర్ చేయడం పూర్తిగా ఆపేశారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న దాని కన్నా 2019కి కంటే ముందే బాగుండేదని అనేక ఉదాహరణలు చెబు తున్నారు.జమ్మూ, శ్రీనగర్లు గవర్నమెంట్ ప్రకటనల్లో మాత్రమే పేరుకు స్మార్ట్ సిటీలనీ, తగిన మౌలిక వస తులు లేక తమ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయనీ స్థానిక వ్యాపారులు చెబుతు న్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారనీ, బయట నుంచి వచ్చిన వాళ్లే మద్యం వ్యాపారం చేస్తు న్నారనీ, ముఖ్యమైన స్థానాలన్నింటీలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులే ఉంటున్నారనీ, ఇది తమకు న్యాయం చేయడం లేదనీ ప్రజలు ఏకాభిప్రా యంతో ఆరోపిస్తున్నారు. ‘‘ఐఐఎం, ఐఐటీల్లో కూడా ముఖ్యమైన పదవుల్లో బయటి వాళ్లనే ఎందుకు నియ మిస్తున్నారు? ఎందుకు అంత భయం?’’ అని అడ్వ కేట్గా పనిచేస్తున్న షేక్ షకీల్ ప్రశ్నించారు.‘‘మాకు ఉద్యోగాలు లేవు, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. మేం ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహుల కింద నేరం మోపు తున్నారు. గత 5 ఏళ్లుగా మేం ఎన్నుకోని ప్రభుత్వంలో ఉన్నాం’’ అనేది కశ్మీరీ యువత అభిప్రాయం. చలికాలంలో జమ్మూ, వేసవికాలంలో శ్రీనగర్ నుంచి జరిగే దర్బార్ పాలనకు 2019లో ఎన్డీయే ప్రభుత్వం చెక్ పెట్టింది. దీనికి అనవసర ఖర్చు అవు తోందనీ, ఇది కూడా చరిత్రాత్మక నిర్ణయ మనీ బీజేపీ ప్రచారం చేసుకుంది. కానీ, 5 ఏళ్ల తర్వాత చూస్తే దర్బార్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకోవడం గమనార్హం. ‘‘దర్బార్ ఉన్నప్పుడు అధికారులు, వాళ్ల కుటుంబాలు ఇక్కడే బస చేసేవి. వారు జమ్మూలో ఐదారు నెలలు పెట్టే ఖర్చే మాకు ఆదాయం అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ దారులన్నీ మూసుకు పోయాయ’’ని జమ్మూ వ్యాపారి వికాస్ శర్మ చెప్పాడు. జనం కోరు తున్నట్టు దర్బార్ను పునరుద్ధరిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందనీ, అందుకే తాము అడిగినా నాయకత్వం పట్టించు కోవడం లేదని స్థానిక బీజేపీ నాయకులు చెబు తున్నారు.35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జమ్మూ–కశ్మీరులో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నికలను బహిష్కరించిన ఈ ప్రాంతంలో, ప్రభుత్వాన్ని ఎన్ను కోవడానికి తపిస్తున్న ప్రజల గాఢమైన కోరికకు ఈ ఓటింగ్ శాతం అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని పునరిద్ధరించాలనీ, ‘దిగుమతి’ సర్కారు కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం రావా లనీ కోరుకుంటున్న కశ్మీరీల కల నెరవేరుతుందా, లేదా అనేది ఇంకో నెలన్నరలో తేలనుంది.– జి. మురళీకృష్ణ, వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థలో పరిశోధకులు -
వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిపై టీడీపీ నేతల హత్యాయత్నం
అజిత్సింగ్నగర్ (విజయవాడసెంట్రల్): వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ అలియాస్ కొండపల్లి బుజ్జిపై సోమవారం విజయవాడలో టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్దతుగా పనిచేశాడనే అక్కసుతో ఆయనపై హత్యాయత్నం చేశారు. విజయవాడ నగరం నడిబొడ్డున నార్త్జోన్ ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్యాయత్నం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫార్మా డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్న మురళీకృష్ణ అలియాస్ బుజ్జి అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ సెక్టార్–1లో నివసిస్తున్నారు. రోజూలానే సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో బ్యాడ్మింటన్ ఆడుకుని ఇంటికి వస్తుండగా సెక్టార్–2 ఆకాష్ అపార్ట్మెంట్స్ వద్దకు వచ్చేసరికి నలుగురు వ్యక్తులు రెండు బైకులపై వచ్చి ఆయన్ని అడ్డగించి ఒక్కసారిగా దాడిచేశారు. మోహంమీద, శరీరంపైన పిడుగుద్దులతో విరుచుకుపడ్డారు. పక్కనున్న రాయితో కొట్టి హత్యచేసేందుకు ప్రయత్నించారు.చుట్టుపక్కలవారు కేకలు వేయడంతో అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగాగాయపడిన బుజ్జిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. హత్యాయత్నం చేసింది టీడీపీకి చెందిన కాకొల్లు మహేంద్ర, గొట్టుముక్కల వెంకటేశ్వరరాజు, బెజ్జం జయపాల్, షేక్ గౌస్బాషాగా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ స్పందించాలి: వెలంపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు పోతిన వెంకటమహేష్, తోలేటి శ్రీకాంత్ పరామర్శించారు. అనంతరం వెలంపల్లి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ టీడీపీ సంకెళ్లలోఉందని విమర్శించారు. నార్త్జోన్ ఏసీపీ కార్యాలయం సమీపంలోనే దారుణం జరిగిందన్నారు. దాడులను అరికట్టాలని ఇటీవల సీపీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని చెప్పారు. ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నాడని, సెంట్రల్ నియోజకవర్గంలో 35 మందిపై దాడులు జరిగాయన్నారు. బొండా ఉమా మర్యాదగా ఈ దాడులు ఆపాలని సూచించారు. పోలీసు వ్యవస్థ ఈ దాడులను అరికట్టకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. ఈ దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
డ్యాన్సర్పై వేధింపులు.. పబ్ యజమానిపై కేసు
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్లోని లిస్బన్ పబ్లో మరోసారి వివాదం రాజుకుంది. పబ్లోని డ్యాన్సర్పై యజమాని మురళీ కృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గురువారం కేసు నమోదైంది. ఈ మేరకు ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ డ్యాన్సర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల లిస్బన్ పబ్ తరుచూ వార్తల్లో నిలుస్తోంది. పబ్లోకి వచ్చే యువకుల దగ్గర డబ్బులు తీసుకొని వారికి అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు తనిఖీ చేసి యువతను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. (లిస్బన్ పబ్పై పోలీసుల దాడి.. ) -
పేదల ప్రాణాలు పట్టవా?
కర్నూలు సీక్యాంప్: కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామంలో మూడు రోజులుగా ప్రజలు అతిసార వ్యాధి బారిన పడి అల్లాడిపోతున్నా అధికారులు, పాలకులు కన్నెత్తి చూడటం లేదని, వారికి పేదల ప్రాణాలు పట్టవా అంటూ వైఎస్ఆర్సీపీ కోడుమూరు సమన్వయకర్త పరిగెల మురళీకృష్ణ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గ్రామానికి చేరుకుని గ్రామ చావిడిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను పరామర్శించారు. ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటికెళ్లి అస్వస్థతకు గురైన వారు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా గ్రామంలో అతిసార విజృంభిస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామం వైపు చూడలేదని విమర్శించారు. గ్రామానికి మంచినీరు సరఫరా చేసే ట్యాంక్ను శుభ్రం చేయకపోవడంతోనే అతిసార ప్రబలిందన్నారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతోనే ఉసేన్బీ అనే మహిళ అతిసార బారిన పడి మృతి చెందిందన్నారు. ఎమ్మెల్యేతోపాటు టీడీపీ కోడుమూరు ఇన్చార్జి, అధికార పార్టీ నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారని విమర్శించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ కర్నూలు మండల అధ్యక్షుడు పసుపల నాగరాజు, బాషా, రాజు, రవి తదితరులు ఉన్నారు. -
వైఎస్సార్సీపీలోకి బైరెడ్డి కరుణాకర్రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గార్గేయపురం సింగిల్ విండో మాజీ చైర్మన్ బైరెడ్డి కరుణాకరరెడ్డి వైఎస్సార్సీపీలో చేరినట్లు పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురం సమీపంలో పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు వివరించారు. పార్టీలో చేరిన వారిలో ఆయనతోపాటు పల్లె రమణారెడ్డి, పోతుల సీతారామిరెడ్డి, బైరెడ్డి నాగేశ్వరరెడ్డి ఉన్నారు. -
మా గురించి ఎమ్మెల్యే అనిత ఎలా చెబుతారు?
-
మా గురించి ఎమ్మెల్యే అనిత ఎలా చెబుతారు?
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలపై రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అసెంబ్లీలో తమ గురించి ఎమ్మెల్యే అనిత ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదన్నారు. రిషితేశ్వరి చనిపోయాక తాము సంతృప్తిగా ఉన్నామనడం సమంజసం కాదన్నారు. తన కుమార్తె మరణం తర్వాత ఎమ్మెల్యే అనిత ఏ రోజు తమని కలవలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని మురళీకృష్ణ తెలిపారు. కూతురు చనిపోయాక తాము పుట్టెడు బాధలో ఉంటే...తామంతా సంతోషంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే అనిత సభలో చెప్పడం సమంజసం కాదన్నారు. ఆమె సభలో అలా ఎందుకు చెప్పిందో అర్థం కావడం లేదని వాపోయారు. అసెంబ్లీ సమావేశాల్లో తమలాంటి పేదళ్లను లాగొద్దని రిషితేశ్వరి తండ్రి అన్నారు. రిషితేశ్వరి మృతి తరువాత ఏ రోజు తమను అనిత పరామర్శించలేదన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైనవారికి ఇంకా శిక్ష పడలేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలని కోరినప్పటికీ ఇప్పటివరకూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయలేదన్నారు. కాగా మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మహిళలకు రక్షణ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మహిళలపై చోటుచేసుకున్న దాడులు, ఆ దాడుల్లో నిందితులకు టీడీపీ నేతలు అండగా నిలిచిన వైనాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన దాడి, ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి, ఆ ఆత్మహత్యకు కారణమైన వర్సిటీ ప్రొఫెసర్ బాబురావుకు టీడీపీ అండ, సీఎం చంద్రబాబు సభకు దళిత సర్పంచ్ను హాజరుకానివ్వకుండా అడ్డుకున్న వైనంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై టీడీపీ వంగలపూడి అనిత మాట్లాడుతూ టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ ఉందని సమర్థించుకున్నారు. రిషితేశ్వరి ఘటనలో చంద్రబాబు సర్కారు న్యాయం చేసిందని బాధితురాలి తల్లిదండ్రులే చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. పైపెచ్చు రిషితేశ్వరి తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగిందంటూ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ చేశారంటూ చెప్పడం కొసమెరుపు. అయితే ఆ న్యాయం ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని మాత్రం అనిత ప్రస్తావించకపోవడం గమనార్హం. రిషితేశ్వరి చనిపోయిన బాధను వాళ్ల తల్లిదండ్రులే మరిచిపోతుంటే ప్రతిపక్షం పదే పదే గుర్తు చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. అయితే రిషితేశ్వరి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఎమ్మెల్యే అనిత ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న విద్యార్థులకు వత్తాసు పలికిన ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న విషయాన్ని మాత్రం ఆమె ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలను రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా నాగార్జున యూనివర్సిటీలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనల ఫలితంగా తీవ్ర అవమాన భారంతో 2014 జూన్ 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
ఇద్దరు ఉద్యోగులకు ఏడాది జైలు
సాక్షి, హైదరాబాద్: నకిలీ పదోన్నతుల ఉత్తర్వులు తయారు చేసి మోసానికి పాల్పడిన పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు పల్లె రాజశేఖర్రెడ్డి, డి.మురళీకృష్ణలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. రూ.3 వేల చొప్పున జరిమానా చెల్లించాలని, లేదంటే మరో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. పంచాయతీ రాజ్ కార్యాలయంలోని బీ విభాగం సూపరింటెండెంట్ పల్లె రాజశేఖర్రెడ్డి, సీని యర్ అసిస్టెంట్ డి.మురళీకృష్ణ.. నకిలీ పదోన్నతి ఉత్తర్వులు తయారు చేస్తున్నా రని 1999లో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఎస్.చెల్లప్ప ఫిర్యాదు చేయడంతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనుమతులతోనే విక్రయాలు చేయాలి
హిందూపురం రూరల్ : రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తదితర వాటిని విక్రయం చేసే దుకాణదారులు అనుమతులు తీసుకుని వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు మురళీకృష్ణ పేర్కొన్నారు. గురువారం హిందూపురంలోని బృందావనం ట్రేడర్స్, నందినీ హైబ్రిడ్ సీడ్స్ ఏజెన్సీ, రైతు మిత్ర తదితర దుకాణాల్లో ఆయన తనిఖీలు చేశారు. దుకాణదారుల యజమానులతో ప్రిన్సిపల్ సర్టిఫికెట్, సోర్స్ సర్టిఫికెట్ తదితర అనుమతులు తీసుకున్న తర్వాత విత్తనాలు, ఎరువులు అమ్మకాలు చేపట్టాలన్నారు. రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో వ్యాట్, ట్రేడింగ్ నెంబర్, పరిమితి మించి పోయే కాలం తదితర వాటిని తప్పనిసరిగా బిల్లులో నమోదు చేయాలని ఆదేశించారు. రూ.11,18,375 విలువ చేసే విత్తనాలు, రూ. 6 లక్షల విలువ చేసే పురుగుల మందు, రూ.27,88 716 ఎరువులను దుకాణంలో విక్రయించకుండా తాత్కాలికంగా అనుమతులు రద్దు చేశారు. వీటì అమ్మకాలు చేపట్టాలంటే ప్రిన్సిపల్ ధ్రువ పత్రాలు తీసుకుని చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి రామారావు, స్థానిక ఏఓ శ్రీలత తదితరులు ఉన్నారు. -
పత్రికా విలేఖరిపై కేసు నమోదు
ఖమ్మం క్రైం: వార్తలు రాస్తానని బెదిరించి ఓ వ్యక్తి నుంచి బలవంతంగా డబ్బులు గుంజుకున్న విలేకరిపై టూటౌన్ పోలీసులు గురువారం సాయంత్రం కేసు నమోదు చేశారు. సీఐ మడత రమేష్ తెలిపిన ప్రకారం.. నగరంలో ఒక దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న మురళీకృష్ణ, నెహ్రూనగర్కు చెందిన గోనా గోపాల్రావు అనే వ్యక్తిపై వార్త రాశాడు. గోపాల్ రావుకు ఆ విలేకరి ఫోన్ చేసి, ‘‘లక్షన్నర రూపాయలు ఇవ్వకపోతే మళ్లీ వార్త రాస్తా’’నని బెదిరించాడు. తాను ఓ మెస్ వద్ద ఉన్నానని, అక్కడికి రావాలని చెప్పాడు. దీంతో గోపాల్రావు, తన స్నేహితుడైన నరేష్తో కలిసి అక్కడకు వెళ్లాడు. ఆయన జేబులోగల 60వేల రూపాయలను మురళీకృష్ణ లాక్కుని, శుక్రవారంలోగా మరో 90వేల రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. బాధితుడు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుతో మురళీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
'మెరిట్ ఆధారంగా ప్రమోషన్లు వద్దు'
హైదరాబాద్ : మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలనుకోవడం సరికాదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. ప్రమోషన్లను సీనియారిటీ ఆధారంగా పాత పద్ధతిలోనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉద్యోగులలో తీవ్రమైన వ్యతిరేఖత ఉందని మురళీకృష్ణ పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రమోషన్ల వివాదం అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. -
'తెలంగాణ ఒత్తిడికి కమల్ నాథన్ కమిటీ తలొగ్గింది'
హైదరాబాద్: ఉద్యోగుల విభజనపై కమల్నాథన్ కమిటీ సమర్పించిన జాబితాలో అవకతవకలున్నాయని ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. శుక్రవారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులు కమిటీ జాబితాపై చర్చించడానికి సీఎస్ ను కలిశారు. తెలంగాణ ఉద్యోగుల ఒత్తిడికి కమల్నాథన్ కమిటీ తలొగ్గినట్టుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన పలువురు సీనియర్ అధికారులను తెలంగాణకు కెటాయించారని మురళీకృష్ణ ఆరోపించారు. ఆ కమిటీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నారు. ఇద్దరు డిప్యూటీ సెక్రటరీలు, ఇద్దరు అదనపు సెక్రటరీలు, ఓ అసిస్టెంట్ సెక్రటరీని తెలంగాణకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని విమర్శించారు. దీనిపై కోర్టుకు వెళతామని మురళీకృష్ణ పేర్కొన్నారు. -
పదిరోజుల్లో సానుకూల నిర్ణయం వస్తుంది
పర్చూరు, న్యూస్లైన్: సమైక్యాంధ్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పదిరోజుల్లో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా పర్చూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే కేంద్ర మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతలైన సుష్మా స్వరాజ్, ఎల్కే అద్వానీ, టీడీపీ ఎంపీలతో సీమాంధ్ర ఎంప్లాయీస్ ప్రతినిధి బృందం చర్చలు జరిపిందన్నారు. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు 300 మంది సెక్రటేరియట్ ఉద్యోగులతో న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. బీజేపీ చిన్నరాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ సీమాంధ్ర అభివృద్ధికి స్పష్టమైన హామీ కోరతామని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు చెప్పారన్నారు. ఆమోదయోగ్యమైన ప్రకటన వెలువడేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.