Namratha
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్.. టాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas 2024) పండగని ప్రతిఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు కూడా రాత్రి నుంచే సెలబ్రేషన్స్ షురూ చేశారు. క్రిస్మస్ టోపీలు పెట్టుకుని, కేకులు కట్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వీళ్లలో నమ్రత, నివేదా థామస్, కృతిశెట్టి (Krithi Shetty), కావ్య కల్యాణ్ రామ్, ప్రగ్యా జైస్వాల్, ఈషా రెబ్బా, మౌనీ రాయ్, రమ్య పాండియన్, ఆకాంక్ష సింగ్, మంచు విష్ణు (Manchu Vishnu) ఉన్నారు. ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by POOJA BEDI (@poojabediofficial) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Rithu Manthra (@rithumanthra_) View this post on Instagram A post shared by Samyuktha Shan (@samyuktha_shan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) View this post on Instagram A post shared by Nussrat Jahan (@nusratchirps) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) -
మహేశ్ కొడుకు మొదలుపెట్టేశాడు.. లండన్లో నాటకం
సూపర్ స్టార్ మహేశ్ బాబు కొడుకు మొదలుపెట్టేశాడు. తండ్రి అడుగు జాడల్లో నడించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే నమ్రత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గర్వపడుతున్నానని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరోయిన్ రకుల్ భర్త.. ఉద్యోగుల్ని మోసం చేస్తూ!)గౌతమ్ చిన్న వయసులో మహేశ్ 'వన్ నేనొక్కడినే' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు. ఆ తర్వాత పూర్తిగా చదువుపై కాన్సట్రేట్ చేశాడు. రీసెంట్గా ప్లస్ టూ పూర్తి చేశాడు. అలానే ఈ మధ్యే వర్కౌట్స్ కూడా మొదలుపెట్టినట్లు నమ్రతనే ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు లండన్లో ఓ నాటకంలో స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు నమ్రతనే చెప్పుకొచ్చింది. కొడుకు విషయంలో చాలా గర్వపడుతున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చింది.ఇదంతా చూస్తుంటే మహేశ్ వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు 17 ఏళ్లే. కాబట్టి మరో మూడు నాలుగేళ్ల తర్వాత లాంచ్ చేస్తారేమో. ఇదిలా ఉండగా మహేశ్ ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు. ఇందులో భాగంగానే జుత్తు బాగా పెంచుతున్నాడు. నమ్రత పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోస్లో మహేశ్ని మీరు చూడొచ్చు.(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్బాబు గురించి ఇవి మీకు తెలిసే ఛాన్స్ లేదు!
'పోకిరి'తో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసి.. 'భరత్ అనే నేను' మూవీతో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించి.. 'సర్కారు వారి పాట'తో ఓపెనింగ్స్లో సరికొత్త చరిత్ర సృష్టించి.. తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడు. పెను తుపాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడు. అతడే ప్రిన్స్ మహేశ్ బాబు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలే ఈ స్టోరీ. తెలియకుండానే సినిమాల్లోకి మహేశ్.. 1975 ఆగస్టు 9న మద్రాసులో జన్మించాడు. ఇతడు పుట్టే నాటికే తండ్రి కృష్ణ 100 సినిమాలకు పైగా పూర్తి చేసి, ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఆరేళ్ల వయసులో మహేశ్ తన అన్నయ్య అయిన రమేశ్తో కలిసి విజయవాడ వెళ్లారు. అప్పట్లో దాసరి దర్శకత్వంలో 'నీడ' సినిమా రమేశ్ చేస్తున్నారు. అందులో ఓ కీలక పాత్రని మహేశ్కి తెలియకుండానే ఆయనపై తీశారు దాసరి. అలా బాల నటుడిగా మహేశ్ తెరంగేట్రం ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది. తర్వాత నాన్న కృష్ణతో 'పోరాటం' సినిమాలో మహేశ్ నటించి, మెప్పించారు. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' కొత్త పోస్టర్.. ఫ్యాన్స్ డిసప్పాయింట్!?) చదువుకు బ్రేక్ స్కూల్ హాలీడేస్ రాగానే షూటింగ్స్లో మహేశ్ పాల్గొనేవాడు. అలా బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం సినిమాలు చేశాడు. తర్వాత మహేశ్ స్కూల్కు వెళ్లడం తగ్గించాడు. సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అనే భయంతో ఇకపై సినిమాలు వద్దని, బుద్ధిగా చదువుకోవాలని ప్రిన్స్కు కృష్ణ చెప్పడంతో మళ్లీ చదువుపై ఫోకస్ పెట్టాడు. పదో తరగతిలో అనుకునన్ని మార్కులు రాకపోవటంతో తనకెంతో ఇష్టమైన లయోలా కాలేజీలో ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ రాలేదు. కనీసం డిగ్రీలో అయినా అక్కడ సీటు సంపాదించాలని ఇంటర్లో కష్టపడి చదివి ఆపై మంచి మార్కులు సాధించి అనుకున్నట్లే లయోలా డిగ్రీ కాలేజీలో బీకామ్ సీటు సాధించాడు. అక్కడ చదువుతున్న టైంలో మళ్లీ సినిమాలవైపు మనసు లాగింది. ఇంకేముంది ఇదే విషయాన్ని తన తండ్రితో చెప్పడం. దానికి కృష్ణ ఓకే అనడం జరిగిపోయాయి. అప్పుడు దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్.. 'రాజకుమారుడు' సినిమాతో మహేశ్ను హీరోగా పరిచయం చేశారు. వాటికి మాత్రం నో తెలుగులో ఇప్పటివరకూ ఒక్క రీమేక్ సినిమాలో నటించని హీరో మహేశ్. బాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా 'తెలుగు' చిత్రాల్లోనే నటిస్తానని వాటిని తిరస్కరిస్తూ వచ్చారు. మహేశ్లో నిర్మాత కూడా ఉన్నాడు. అడివి శేష్ తో 'మేజర్' సినిమా తీసి, హిట్ కొట్టాడు. మహేశ్కు చాలా ఇష్టమైన దర్శకుడు మణిరత్నం. గతంలో ఓసారి ఇదే చెప్పారు. ఆయనతో ఒక సినిమా చేయాలనే కోరిక ఉందని అన్నాడు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా ఆశపడుతున్నారు. (ఇదీ చదవండి: మహేశ్ - నమ్రత లవ్ మ్యారేజ్.. మొదట ప్రపోజ్ చేసింది ఎవరంటే..!) తండ్రిని మించినోడు కొన్ని విషయాల్లో తండ్రి సూపర్ స్టార్ కృష్ణను అనుసరించిన మహేశ్, మరికొన్ని చోట్ల తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు. కృష్ణ కెరీర్లో 350కి పైగా సినిమాల్లో నటించినా ఉత్తమ నటునిగా ఒక్క నంది అవార్డు రాలేదు. మహేశ్ మాత్రం కేవలం 27 సినిమాలకే 8 నంది అవార్డులు అందుకున్నాడు. 'రాజకుమారుడు'తో తొలిసారి ఉత్తమ నటునిగా నందిని అందుకున్న మహేశ్.. నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్ చిత్రాల ద్వారా కూడా నంది అవార్డుకు ఎంపికయ్యారు. కృష్ణ నట జీవితంలో మొత్తం 350పైగా చిత్రాల్లో కేవలం రెండు జూబ్లీస్ ఉన్నాయి. అవి పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు. ఈ రెండు చిత్రాలు కూడా కృష్ణ సొంత చిత్రాలు కావడం విశేషం. మహేశ్ కెరీర్లో నాలుగు చిత్రాలు డైరెక్ట్గా నాలుగు ఆటలతో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అవి మురారి, ఒక్కడు, అతడు, పోకిరి సినిమాలు. ఈ నాలుగు చిత్రాలు హైదరాబాద్ లోని సుదర్శన్ 35MMలో సిల్వర్ జూబ్లీ జరుపుకొని ఓ చెరిగిపోని రికార్డును మహేశ్ సొంతం చేశాయి. ఆ తరువాత కూడా మహేశ్కు దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారువారిపాట వంటి సూపర్ హిట్స్ దక్కాయి. తొలిసారిగా కొన్న ఫోన్ మహేశ్కు ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ అంటే చాలా ఇష్టమట. కానీ సోషల్ మీడియాకు ఆయన దూరంగానే ఉంటారు. తొలిసారిగా ఆయన ఎంతో ఇష్టంగా నోకియా క్లాసికల్ మోడల్ (కీ ప్యాడ్) కొన్నారు. ఇప్పటికీ ఆయన తరచూ ఫోన్లను మారుస్తూ ఉంటారు. ముఖ్యంగా తన తండ్రి కృష్ణతో మాత్రమే సెల్ఫీ దిగేందుకు ప్రిన్స్ ఇష్టపడతారు. స్వతహాగా దాతృత్వం చాటుకోవడంలో మహేశ్ 'శ్రీమంతుడు'. తండ్రిపై ప్రేమతో కృష్ణ సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తెలంగాణలో కూడా సిద్ధాపురం గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకున్నారు. ఆ రెండు గ్రామాల్ని ఆయన భారీగా అభివృద్ధి చేశారు. అలాంటి మహేశ్బాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ 'హ్యాపీబర్త్డే ప్రిన్స్ మహేశ్'..! (ఇదీ చదవండి: సౌత్ నుంచి ఒకేఒక్కడు.. ఏ హీరో టచ్ చేయలేని రికార్డ్ మహేష్ సొంతం) -
తొలి సినిమాతో హిట్.. ఆ తర్వాత అవుట్..!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా స్టార్డమ్ సంపాదించడం అంతా ఈజీ కాదు. అలాగే వచ్చిన పేరును నిలబెట్టుకోవడం మరింత సవాలుతో కూడుకున్నది. అలా కొందరు సూపర్ హిట్ మూవీస్లో నటించినా ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. కొందరు హీరోయిన్లు పెళ్లిబంధంతో జీవితంలో సెటిలైతే.. మరికొందరు అసలుకే కనుమరుగైపోయారు. అలా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి.. ఇలా కనిపించకుండా హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. నువ్వే కావాలి హీరోయిన్ రిచా హీరోయిన్ రిచా పల్లాడ్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ నువ్వే కావాలి హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రిచా జంటగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రేమకథాచిత్రం వచ్చి దాదాపుగా 22 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు తెలుగులో ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు పోషిస్తున్న రిచా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ రిచా నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. నువ్వు నేను హీరోయిన్ అనిత బుల్లితెర సెలబ్రిటీ, 'నువ్వు నేను' హీరోయిన్ అనిత.. ఉదయ్ కిరణ్తో కలసి నటించింది. శ్రీరామ్', 'నేనున్నాను' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న అనితా టాలీవుడ్కు గుడ్బై చెప్పేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో ''తాళ్, కుచ్ తో హై, యే దిల్, కృష్ణా కాటేజ్, రాగిణి ఎంఎంఎస్, హీరో'' లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె ఆ తర్వాత యే హై మొహబ్బతే, నాగిన్ సీరియల్స్తో బుల్లితెర బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. 2013లో రోహిత్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న అనిత.. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చిత్రం మూవీ హీరోయిన్ రీమా సేన్ ఉదయ్కిరణ్, రీమా సేన్ 'చిత్రం' మూవీలో జంటగా నటించారు. ఈ సినిమా అప్పట్లోనే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే రీమాసేన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బావనచ్చాడు, మనసంతా నువ్వే, సీమ సింహం, అంజి బంగారం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమె కెరీర్ లో ది బెస్ట్ సినిమా ఏది అంటే యుగానికొక్కడు అని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాలకు దూరమైన తరువాత ఆమె 2012లో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన శివకరణ్ సింగ్ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు బద్రిలో నటించిన రేణు దేశాయ్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్, అమీషా పటేల్ జంటగా నటించిన ‘బద్రి’. ఆ తర్వాత రేణు దేశాయ్ ప్రేమలో పడి పవన్ కల్యాణ్ను వివాహం చేసుకుంది. కొంతకాలం ఇద్దరు కలిసి ఉన్నారు. వీరికి ఓ బాబు, పాప జన్మించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో పవన్, రేణు విడిపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే రేణు దేశాయ్.. ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. వంశీ మూవీ హీరోయిన్ నమ్రత వంశీ మూవీ సమయంలో మహేశ్ బాబుతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అయితే పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు వచ్చినా ఆమె నటించలేదు. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. అదే విధంగా స్టూడెంట్ నంబర్- 1లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన గజాలా ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనే కనిపించింది. అలాగే ఇడియట్ సినిమాలో రవితేజ సరసన కనిపించిన రక్షిత కొద్ది సినిమాలు మాత్రమే చేసింది. 6 టీన్స్ మూవీలో నటించిన రుతిక, సంతోషం మూవీలో చేసిన గ్రేసీ సింగ్, మన్మథుడు మూవీలో నటించిన అన్షు, టక్కరి దొంగ నటించిన లిసా రే, బన్నీ మూవీలో అల్లు అర్జున్తో జోడిగా కనిపించిన గౌరీ ముంజల్, దిల్ మూవీలో చేసిన నేహా, ఆర్య మూవీలో అను మెహతా, ఒకటి రెండు సినిమాలతోనే హిట్ సాధించినా ఆ తర్వాత కనుమరుగైపోయారు. -
స్పెయిన్లో సెలబ్రేషన్
ఫారిన్ టూర్కు వెళ్లారు మహేశ్బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూ΄÷ందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ ముగిసింది. ముఖ్యంగా హాస్పిటల్ బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాతి షెడ్యూల్ త్వరలో ఆరంభం కానుంది. ఈ గ్యాప్లో ఫ్యామిలీతో కలిసి మహేశ్ స్పెయిన్ వెళ్లారని సమాచారం. ఫిబ్రవరి 10 (శుక్రవారం) మహేశ్, నమ్రతల పెళ్లి రోజు. మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసమే స్పెయిన్కు వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. -
పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నటి నమ్రత
Namratha Inked Puneeth Rajkumar Name: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ మరణించి దాదాపు 6 నెలల కావోస్తోంది. అయినా ఇప్పటికీ ఆయన మరణాన్ని తలుచుకుని కన్నడిగులు కుమిలిపోతున్నారు. గతేడాది అక్టోబర్ 29న పునీశాండల్ వుడ్ సీని ప్రముఖులే కాదు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలకు చెందిన సినీ సెలబ్రెటీలు నివాళులు అర్పించారు. ఇక కన్నడ ప్రజలు, ఫ్యాన్స్ అయితే పునీత్ లేడనే వార్త విని గుండెలు విలపించేలా రోధించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మరికొందరి గుండెలు ఆగిపోయాయి. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. అంతలా ప్రతి ఒక్కరిని శోక సంద్రంలో ముంచిన పునీత్ రాజ్కుమార్ హీరోగానే కాదు ఓ మనిషిగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు. 45 స్కూళ్లు కట్టించి, 26 అనాథశ్రమాలు, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపించి, 19 గోశాలలకు సాయం చేస్తూ.. చనిపోయినా రెండు కళ్లూ దానం చేశారు. ఇవన్ని చేసిన ఏనాడు పబ్లిసిటి చేసుకోలేదు. ఆయన చేస్తున్న సాయం ఏంటో ఆయన మరణం తర్వాతే ప్రపంచానికి తెలిసింది. దీంతో యావత్ దేశం ఆయనకు సెల్యూట్ కొట్టింది. ఆయనకు సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఆయనంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఇండస్ట్రీలో సైతం ఉన్నారడానికి ఈ తాజ సంఘటనే ఉదాహరణ. చదవండి: రానాను పక్కన పెట్టిన శేఖర్ కమ్ముల? ఆ హీరోతో లీడర్-2 పునీత్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఓ నటి ఏకంగా ఆయన పేరునుఏ టాటూగా వేసుకుంది. కన్నడ టీవీ నటి, నాగిని 2 ఫేం నమ్రత గౌడ పునీత్ రాజ్కుమార్ను వీరాభిమాని. దీంతో ఆయన పేరును చేతిపై పచ్చబొట్టుగా వేయించుకుంది. ఆయన జయంతి సందర్భంగా వేయించుకున్న ఈ పోస్ట్ను రీసెంట్గా నమ్రత షేర్ చేస్తూ ‘ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా నమ్రత పునీత్ మిలనా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది. 2007లో వచ్చిన ఈ సినిమాలో నమ్రత ప్రముఖ నటుడు సిహి కహీ చంద్రుని కుమార్తెగా ఓ చిన్న రోల్ పోషించింది. నాగిని(కన్నడ) సీరియల్తో గుర్తింపు పొందిన ఆమె ప్రస్తుతం పలు సీరియల్స్తో పాటు సినిమాల్లో సహానటి పాత్రలు చేస్తోంది. View this post on Instagram A post shared by namratha (@namratha__gowdaofficial) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సృష్టి కేసు: వెలుగులోకి కీలక అంశాలు
సాక్షి, విజయవాడ: యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చుస్తున్నాయి. పిల్లల అక్రమ విక్రయం, రవాణా ఆరోపణల కేసులో ప్రధాన నిందితురాలు ఆసుపత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బెజవాడ పోలీసులు జరిపిన లోతైన విచారణతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. 2018లోనే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సృష్టి ఆసుపత్రి లైసెన్స్ను రద్దు చేసింది. అయినప్పటికి డాక్టర్ నమ్రతా వేరే వారి లైసెన్స్తో సృష్టి ఆసుపత్రిని గుట్టుచప్పుడుగా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: పేగుబంధంతో పైసలాట!) తెలంగాణలోని ఓ ఎన్ఆర్ఐకి టెస్ట్ ట్యూబ్ బేబీని ఇస్తామని చెప్పి మోసం చేయడంతో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవీంద్ర రెడ్డి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు సృష్టి ఆసుపత్రిలో 37 మంది పిల్లలు జన్మించారు. అయితే జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పరిశీలన చేయకుండా, రెగ్యులర్ మానిటరింగ్ లేకుండానే రెన్యూవల్ చేసినట్లు పోలీసులు చెప్పారు. 2015లో సృష్టి అక్రమాలపై అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు స్పత్రిపై విచారణ జరిపి మెడికల్ కౌన్సిల్ రిపోర్టు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని ఈ నేపథ్యంలో మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ‘సృష్టి’ తీగలాగితే.. ‘పద్మశ్రీ’ డొంక వెలుగులోకి... ) -
డాక్టర్ నమ్రత మరో అక్రమ ‘కోణం’
సాక్షి, తిరుపతి: శిశువులను విక్రయిస్తూ పట్టుబడిన విశాఖపట్నం సృష్టి ఆస్పత్రి అధినేత డాక్టర్ పి.నమ్రత అక్రమాలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. శిశువులతో వ్యాపారమే కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో చేతులు కలిపి భూలావాదేవీల్లోనూ అక్రమాలకు పాల్పడి ప్రజల నుంచి భారీ ఎత్తున నగదు దోచుకున్నట్లు వెలుగుచూసింది. తిరుపతి పద్మావతీపురానికి చెందిన రిటైర్డ్ టీచర్ మల్లికార్జున్, వెంకటనరసమ్మ దంపతుల దగ్గర రెండు ఎకరాల భూమిని విక్రయిస్తానంటూ సుమారు రూ.27 లక్షలు కాజేసి మోసం చేసిందని బాధితులు సోమవారం ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి గోడు వెళ్లబుచ్చారు. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్కు చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ చలపతి ద్వారా తమకు డాక్టర్ నమ్రత పరిచయమైందన్నారు. 2008లో చిక్బళ్లాపూర్ ప్రాంతంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రూ.58లక్షలు విలువజేసే రెండు ఎకరాల భూమిని విక్రయిస్తానని చెప్పి అడ్వాన్స్ చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవాలని నమ్మబలికిందని, 2008 జనవరిలో వడ్డీకి అప్పు తెచ్చి రూ.27లక్షలు డాక్టర్ నమ్రతకు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్కు సమయం ఉండటంతో తమ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా 2010లో మళ్లీ తమను సంప్రదించి నిర్ణయించిన ధరకంటే అదనంగా రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండు చేసిందని పేర్కొన్నారు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి సదరు భూమి వివరాలపై ఆరా తీయగా తమకు అగ్రిమెంట్ చేయించిన భూమిని 2008 మే నెలలో వేరేవారికి విక్రయించినట్లు తెలిసిందన్నారు. (పేగుబంధంతో పైసలాట!) ఈ విషయమై నిలదీయగా బెదిరింపులకు దిగిందని చెప్పారు. అప్పటి నుంచి 2014 వరకు పెద్ద మనుషుల పంచాయితీలతో కాలం గడిపిందని, 2015లో తాము హైదరాబాద్, విజయవాడ, చిక్బళ్లాపూర్లోని పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేశామని తెలిపారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులతో కుమ్మక్కై కేసులను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ మానసిక క్షోభకు గురిచేసిందన్నా రు. ప్రభుత్వం, అధికారులు కలుగజేసుకుని న్యాయం చేయాలని కోరారు. -
నమ్రత కస్టడీ పొడిగింపు
సాక్షి, విశాఖపట్నం: పిల్లల అక్రమ విక్రయం, రవాణా ఆరోపణలపై యూనివర్షల్ సృష్టి హాస్పటల్ ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతను నగర పోలీసులు మరో రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రంతో నమ్రత తొలిదశ పోలీస్ కస్టడీ ముగిసింది. అయితే విచారణలో సరిగ్గా సహకరించకపోవడంతో మరోసారి డాక్డర్ నమ్రతని విచారించాలని పోలీసులు కస్టడీ పొడిగింపుని కోరారు. మరో మూడు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని జిల్లా కోర్డులో పోలీసులు మెమో దాఖలు చేశారు. అయితే రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో నేటి నుంచి మరో రెండురోజులపాటు మహారాణిపేట పోలీసులు విచారించనున్నారు. (పేగుబంధంతో పైసలాట!) ఎంవీపీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కూడా కస్టడీ కోరే అవకాశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సరోగసీ పేరుతో పిల్లల అక్రమ రవాణా, తప్పుడు డాక్యుమెంట్లు తయారీ, ఇతర డాక్టర్ల సహాకారం, ఇతర బ్రాంచ్లలో అక్రమాలపై డాక్టర్ నమ్రతని పోలీసులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఆమె అక్రమాలపై ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇప్పటికే స్పందించంది. నమ్రత వైద్యపట్టా రద్దు చేస్తూ.. అక్రమాలపై ప్రత్యేక విచారణకి ఆదేశాలు జారీచేసింది. అయితే గతంలోనూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైద్యపట్టా రద్దు చేసినా డాక్టర్ నమ్రత ప్రాక్టీస్ ఆపకపోవడం గమనార్హం. (సుమోటోగా విశాఖ ‘సృష్టి’ కేసు) -
పేగుబంధంతో పైసలాట!
అక్రమార్జనకు రాజమార్గంగా వైద్య వృత్తిని మార్చేసింది కిరాతక డాక్టర్ నమ్రత. పేగుబంధాలను తెంచేసి లక్షలాది రూపాయల సంపాదనే లక్ష్యంగా పసికందులను విక్రయించేసింది. పోలీసులు తవ్వుతున్న కొద్దీ నమ్రత దురాగతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మరిన్ని అక్రమాలు బయటపడతాయని భావిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం : సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సరోగషీ ముసుగులో పసికందుల అక్రమ రవాణా, విక్రయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే డాక్టర్ నమ్రతను మహారాణిపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. గురువారం ఆమెను కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చిన్నారి అక్రమ విక్రయం కేసు జూలై 30న నమోదయింది. దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సీతమ్మధారలో గల పద్మజ ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి డాక్టర్ నమ్రత దారుణాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. మరోవైపు గడిచిన మూడేళ్లలో సృష్టి ఆస్పత్రిలో 63 మంది మహిళలకు సరోగషీ ద్వారా ప్రసవాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్ మీనా వెల్లడించారు. ఏజెంట్ సాయంతో వలవేసి... విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరం పంచాయతీకి చెందిన చందక వెంకటలక్ష్మి చోడవరం మండల కేంద్రంలోని పెద్దబజారులో గల డాక్టర్ జగ్గారావు ఆస్పత్రికి ఈ ఏడాది జనవరిలో పరీక్షల కోసం వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సృష్టి ఆస్పత్రి డాక్టర్ నమ్రతకు ఏజెంట్గా వ్యవహరిస్తున్న నేమాల నూకరత్నం మాటలు కలిపి వెంకటలక్ష్మిని పరిచయం చేసుకుంది. తనతో వస్తే విశాఖపట్నంలో గల సృష్టి ఆస్పత్రిలో ఉచితంగా డెలివరీ చేయిస్తానని, ఆపరేషన్ అవసరమైనా ఉచితంగానే చేస్తారని నమ్మించింది. దీంతో బాధితురాలు ఆమె మాటలు నమ్మి ఈ ఏడాది జనవరి 30న ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో గల డాక్టర్ నమ్రత, రామకృష్ణ, డాక్టర్ తిరుమల, డాక్టర్ సరోజిని ఆమెను పరీక్షించి డెలివరీ కోసం సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రికి తరలించారు. అక్కడ జనవరి 31న డెలివరీ చేసిన వైద్యులు ఆడపిల్ల పుట్టిందని, అయితే చనిపోయిందని చెప్పి నమ్మించారు. బిడ్డ చనిపోయినందుకు సంతాపం ప్రకటించడం తప్ప చేసేదేమీలేదని వెంకటలక్ష్మిని ఆస్పత్రి నుంచి ఫిబ్రవరి 3న డిశ్చార్జి చేసేశారు. సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రి డాక్టర్ పద్మజ ఇక్కడే తన చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన వెంకటలక్ష్మి కేస్ షీట్ను తారుమారు చేసేసింది. బిడ్డ తల్లి సీహెచ్.వెంకటలక్ష్మి పేరును మార్చివేసి... బిడ్డను అమ్ముతామని ముందుగానే ఒప్పందం చేసుకున్న విజయనగరానికి చెందిన తల్లిదండ్రుల పేరిట కేస్ షీట్ను డాక్టర్ పద్మజ తయారు చేసింది. జనన ధ్రువీకరణ పత్రాలు నిమిత్తం జీవీఎంసీకి రిపోర్టులు కూడా పంపించింది. రూ.13 లక్షలకు ఒప్పందం చేసుకుని... చాలా కాలంగా తమకు పిల్లలు లేరని, ఆధునిక వైద్య పద్ధతుల్లో బిడ్డ పుట్టించాలని విజయనగరానికి చెందిన దంపతులు 2019 ఫిబ్రవరి, మార్చిలో సృష్టి ఆస్పత్రిలో డాక్టర్ పి.నమ్రత, డాక్టర్ తిరుమలను సంప్రదించారు. తమకు చాలా కాలం నుంచి పిల్లలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారికి సరోగషీ పద్ధతిలో పిల్లలు పుట్టే ప్రక్రియ ప్రారంభిస్తామని నమ్మించారు. అందుకు మోత్తంగా రూ.13 లక్షల ఖర్చు అవుతుందని వసూలు చేశారు. ప్రణాళికలో భాగంగా వెంకటలక్ష్మిని తీసుకొచ్చాక... ఈ ఏడాది జనవరి 30, 31వ తేదీల్లో ఆస్పత్రికి రావాలని ఆ దంపతులకు చెప్పారు. ఆ ప్రకారం వారు సృష్టి ఆస్పత్రికి రాగా... అక్కడి నుంచి మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లి సరోగషీ పద్ధతిలో ఆడపిల్ల పుట్టిందని చూపించారు. అనంతరం ఫిబ్రవరి 6న బిడ్డను డిశ్చార్జి చేసి అప్పగించారు. (‘సృష్టి’ తీగలాగితే.. వెలుగులోకి ‘పద్మశ్రీ’) బండారం బయటపడిందిలా... ఇటీవల సృష్టి ఆస్పత్రి ఆరాచకాలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు చూసిన బాధితురాలు వెంకటలక్ష్మి అనుమానంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు పుట్టిన బిడ్డను కూడా డాక్టర్లు అమ్మేశారని, తనకు న్యాయం చేయాలని జూలై 30న ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా బాధితురాలి రక్త నమూనాలు సేకరించి, సృష్టి ఆస్పత్రిలోని నమూనాలతో సరిపోల్చారు. వాటి ఆధారంగా బాధితురాలు వెంకటలక్షి్మని ఈ ఏడాది జనవరి 30న పద్మజ ఆస్పత్రికి డెలివరీ నిమిత్తం పంపినట్లు నిర్ధారించారు. రికార్డుల ప్రకారం 31న సిజేరియన్ చేసి ఆడబిడ్డను తీసినట్లు, అనంతరం మెడికవర్ ఆస్పత్రిలో చేర్చించి ఫిబ్రవరి 6న విజయనగరానికి చెందిన దంపతులకు విక్రయించేసినట్లు నిర్ధారించారు. ఈ మొత్తం వ్యవహరంలో నిందితులైన పద్మజ ఆస్పత్రి డాక్టర్ సీహెచ్.పద్మజ, ఏజెంట్గా వ్యవహరించిన నేమాల నూకరత్నంను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ తిరుమలతోపాటు రామకృష్ణ, కోడి వెంకటలక్షి్మ, డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. కస్టడీలో నమ్రత వెల్లడించే విషయాలు ఆధారంగా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. (వెలుగు చూస్తున్న ‘సృష్టి’ నిర్వాకాలు) -
జాలీ మూడ్.. హాలిడే మోడ్
మహేశ్ బాబు అండ్ ఫ్యామిలీ జాలీ మూడ్లో ఉన్నారు. ‘భరత్ అనే నేను’ సూపర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్కు ముందు ఫ్యామిలీతో కలిసి ఓ వారం రోజులు హాలిడే ట్రిప్ వెళ్లారు మహేశ్ బాబు. సినిమా రిలీజ్ టెన్షన్ నుంచి కాస్త రిలీఫ్ కోసం ఆ టూర్. ఇప్పుడు సినిమా సక్సెస్ ఇచ్చిన జాలీ మూడ్తో హాలిడే మోడ్లోకి వెళ్లారు మహేశ్. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో మరో టూర్ని ప్లాన్ చేశారు. ‘‘ప్యారిస్ వెళ్తున్నాం. అందరికీ హ్యాపీ హాలిడేస్’’ అని కొన్ని ఫొటోలను షేర్ చేశారు నమ్రత. అక్కణ్ణుంచి తిరిగి రాగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్లో మహేశ్ పాల్గొంటారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లొకేషన్స్ సెర్చ్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అందుకోసం కెమెరామెన్ మోహనన్తో కలిసి న్యూయార్క్ వెళ్లారు వంశీ. ‘‘కెమెరామెన్ కేయు మోహనన్తో కలిసి న్యూయార్క్లో మహేశ్బాబు సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాం. మోహనన్ దగ్గర పర్సనల్గా, ప్రొఫెషనల్గా చాలా నేర్చుకోవాలి’’ అన్నారు వంశీ. అశ్వనీదత్, ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేను కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
సితార అల్లరిని కంట్రోల్ చేయలేం
-
స్క్రీన్ టెస్ట్
► చిరంజీవి నటించి, కో–ప్రొడ్యూసర్గా చేసిన ఒక సినిమాకి ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్’ అనే జాతీయ అవార్డు వచ్చింది. ఆ సినిమా పేరేంటì ? ఎ) స్వయంకృషి బి) ఆపద్భాందవుడు సి) యద్ధభూమి డి) రుద్రవీణ ► మహేశ్ బాబు నటి నమ్రతను ఏ సినిమా టైమ్లో పెళ్లి చేసుకున్నారో గుర్తు తెచ్చుకోండి. ఎ) వంశీ బి) బాబి సి) అతడు డి) నాని ► నటి భానుప్రియ 150 సినిమాలకు పైగా చేశారు. ఒకే సంవత్సరంలో ఆమెవి 14 సినిమాలు రిలీజయ్యాయి. అది ఏసంవత్సరమో కనుక్కోండి. ఎ) 1985 బి) 1986 సి) 1983 డి) 1987 ► ఎస్.ఎస్. రాజమౌళి మొదట సినిమాకు సంబంధించిన ఏ శాఖలో శిష్యరికం చేశారో తెలుసా? ఎ) అసిస్టెంట్ డైరెక్టర్ బి) కెమెరా అసిస్టెంట్ సి) అసిస్టెంట్ ఎడిటర్ డి) అసిస్టెంట్ రైటర్ ► చదువుకున్న అమ్మాయిలు’ చిత్రానికి స్క్రీన్ప్లే రైటర్గా చేసి, ఆ తర్వాత తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుడయ్యారు. ఆయనెవరు? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) కె.విశ్వనాథ్ డి) ఎ.కోదండరామిరెడ్డి ► గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం 2012లో ఒక ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నారు. ఆ అవార్డు ఏమిటి? ఎ) పద్మశ్రీ బి) పద్మభూషణ్ సి) పద్మవిభూషణ్ డి) దాదాసాహెబ్ ఫాల్కే ► నటుడు కోట శ్రీనివాసరావు సినీరంగంలోకి రాకముందు ప్రభుత్వోద్యోగి. ఆయన ఏ శాఖలో పనిచేసే వారో తెలుసా? ఎ) బ్యాంకింగ్ రంగం బి) రోడ్లుభవనాలు సి) వాటర్ వర్క్స్ డి) ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ ► ఈ నలుగురిలో ఒక నటి అసలు పేరు సుజాత నిడదవోలు. ఈమె తెర పేరు కూడా కనుక్కుంటారా? ఎ) జయప్రద బి) జయసుధ సి) జయలలిత డి) జయచిత్ర ► ‘కళాశాలలో... కళాశాలలో కాదా మనసొక ప్రయోగశాల...’ పాటను రాసిందెవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) జొన్నవిత్తుల సి) అనంత శ్రీరాం డి) సీతారామ శాస్త్రి ► డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఏ హీరోయిన్కు తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ వాయిస్ ఇవ్వడం ద్వారా ఫేమస్ అయ్యింది? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) తమన్నా సి) సమంత డి) అదా శర్మ ► హీరో నాని ట్విట్టర్ ఐడీ ఏంటో తెలుసా? ఎ) మై నేమ్ ఈజ్ నాని బి) నాని ఈజ్ మై నేమ్ సి) నేమ్ ఈజ్ నాని డి) యువర్స్ నాని ► నాగార్జునకు నటి, నిర్మాత సుప్రియ మేనకోడలు.మరి సుప్రియకు అఖిల్ ఏమవుతాడు? ఎ) మరిది బి) కొడుకు సి) అల్లుడు డి) బావ ► సావిత్రి తన 31 సంవత్సరాల సినీ కెరీర్లో అన్ని భాషలలో కలిపి ఎన్ని సినిమాల్లో నటించారు? ఎ) 264 బి) 275 సి) 233 డి) 245 ► కొరటాల శివ డైరెక్షన్లో చేసిన ‘మిర్చి’లో ప్రభాస్ ‘కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరూ వాడలేరు..’ అని చెప్పిన డైలాగుని రాసిన దర్శకుడెవరు? ఎ) దశరథ్ బి) వంశీ పైడిపల్లి సి) కొరటాల శివ డి)బోయపాటి శ్రీను ► మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో కమలహాసన్ ఓ కెమెరామేన్తో కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయనెవరు? చిన్న క్లూ.. తర్వాత కాలంలో వారిద్దరూ చాలా సినిమాలకు వర్క్ చేశారు? ఎ) చోటా కె. నాయుడు బి) పి.సి. శ్రీరాం సి) వి.ఎస్.ఆర్ స్వామి డి) కె.వి.ఆనంద్ ► నటి కాజల్ కన్నడ భాషలో గాయనిగా కూడా చేశారు. ఆమె పాడిన పాటకు సంగీత దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) అనూప్ రూబెన్స్ సి) ఎస్.ఎస్ తమన్ డి) సాయి కార్తీక్ ► మగధీర’ సినిమాలోని బైక్ యాక్షన్ సీక్వెన్స్లో జరిగిన ప్రమాదంలో ఏ ఫైట్ మాస్టర్ తీవ్ర గాయాల పాలయ్యాడు? ఎ) విజయన్ బి) స్టంట్ శివ సి) విజయ్ డి) పీటర్ హెయిన్ ► విజయనిర్మల తను నటించి, మొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఏంటి? ఎ) రంగుల రాట్నం బి) మీనా సి) సాక్షి డి) పిన్ని ► పై ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టగలరా? ఎ) కృష్ణకుమారి బి) రమాప్రభ సి) శ్రీలక్ష్మి డి) షావుకారు జానకి ► నందమూరి తారక రామారావు నటించిన ఈ ఫోటో ఏ సినిమాలోనిది? ఎ) కృష్ణావతారం బి) కృష్ణ పాండవీయం సి) కృష్ణార్జున యుద్ధం డి) కృష్ణలీలలు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) ఎ 4) సి 5) సి 6) బి 7) ఎ 8) బి 9) ఎ 10) సి 11) సి 12) ఎ 13) ఎ) 14) సి 15) బి 16) సి 17) డి 18) బి 19) సి 20) ఎ -
నా జీవితానికి వెలుగు, నాకు బలం : మహేష్
సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల విషయంలో రకరకాల పుకార్లు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలం చాలా మంది సినీ ప్రముఖులు విడాకులు తీసుకుంటుండటంతో ఆ పుకార్లు మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆదర్శ దంపుతులుగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ మహేష్, నమ్రత. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, ఎంత మంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికే వీరిద్దరు ఒకరి మీద ఒకరు తమకున్న ప్రేమను రకరకాలుగా తెలియజేశారు. అదే బాటలో ఈ రోజు నమ్రత పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలతో పాటు తన ప్రేమను కూడా తెలియజేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. 'నా బలం, నా జీవితానికి వెలుగు. నా జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ తన ట్విట్టర్ పేజ్లో నమత్ర ఫోటోతో సహా ట్వీట్ చేశాడు. My strength and the light of my life - Happy Birthday to my dearest wife :) pic.twitter.com/OemBbGNKqK — Mahesh Babu (@urstrulyMahesh) 22 January 2017 -
గౌతమ్, సితారల రాఖీ పండుగ చూశారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు వారసులు గౌతమ్, సితారలు రాఖీ పండుగను ముద్దు ముద్దుగా సెలబ్రేట్ చేసుకున్నారు. చిన్నారుల రాఖీ వేడుకకు సంబంధించిన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నమ్రత దగ్గరుండి సితార చేత అన్నయ్య గౌతమ్కి రాఖీ కట్టించి, హారతి ఇప్పించి, స్వీట్ తినిపించారు. ఆ తర్వాత గౌతమ్.. చిట్టి చెల్లి సితారను ఆశీర్వదించేశాడు. పిల్లలకు చిన్నప్పటి నుంచే సంప్రదాయాలను నేర్పించడం, బంధాల విలువను తెలియజేయడం అభినందించదగిన విషయమని నమ్రతకు బోలెడన్ని ప్రశంసలందుతున్నాయి. గౌతమ్, సితారల ఫొటోలు చూసిన పలువురు 'బెస్ట్ రాఖీ మొమెంట్' అంటూ ముచ్చటపడుతున్నారు. ఈ ఫొటోతో అన్నాచెల్లెళ్లు సూపర్ స్టార్కు మించిన సెలబ్రిటీలు అయిపోయేలా ఉన్నారు. -
బుర్రిపాలెంలో పర్యటించనున్న శ్రీమంతుడి శ్రీమతి
ప్రిన్స్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామమైన గుంటూరు జిల్లా తెనాలి తాలుకా బుర్రిపాలెంను దత్తత తీసుకుని... అభివృద్ధి చేసేందుకు ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులోభాగంగా ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత గురువారం బుర్రిపాలెంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటనతో బుర్రిపాలెం బంగారమాయేనా ? ఇప్పటికైనా గ్రామానికి అభివృద్ధి దారులు తెరుచుకునేనా ? సూపర్స్టార్ మహేష్బాబు ఈ గ్రామాన్ని పూర్తిగా మార్చేయనున్నారా? ఈ ప్రశ్నలు బుర్రిపాలెం గ్రామస్తుల మెదళ్లలో మెదులుతున్న ఆశలు, ఆకాంక్షలు.తన తండ్రి కృష్ణ సొంత ఊరైనా బుర్రిపాలెం దత్తత తీసుకున్నట్లు ఏడాది కిందట ప్రకటించిన మహేష్ బాబు.. నమ్రత ద్వారా ఏ వరాలు జల్లు కురిస్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు బుర్రిపాలెం బుల్లోడు సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ తన ఊరిని వెండితెరకెక్కించి రాష్ట్ర ప్రజలకు పరిచయం చేశారు. ఆయన తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు ఆ ఊరిని దత్తత తీసుకుని మరోసారి ఆ గ్రామాన్ని వార్తల్లో నిలిపారు. 'సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం' అనే సందేశాన్ని చాటిన శ్రీమంతుడు సినిమాకు ముందే మహేష్ బాబుకు బుర్రిపాలెంను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అప్పట్లో ప్రకటించిన విషయం విదితమే. అప్పటి నుంచి బుర్రిపాలెం గ్రామం మహేష్ బాబుకు కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్తోపాటు సోదరి గల్లా పద్మావతి గురువారం గ్రామంలో పర్యటించనున్నారు. దీంతో గ్రామస్తుల్లో కొత్త ఆశలు చిగురింప చేసింది. నాటి నుంచి నేటి వరకు... సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ, తల్లి నాగరత్నమ్మ, తండ్రి వీరరాఘవయ్య. గ్రామానికి రాజకీయంగా... సామాజికంగా వీరు సేవలందించారు. నాగరత్నమ్మ గ్రామ సర్పంచ్గా పని చేశారు. గ్రామస్తులు విరాళంగా ఇచ్చిన స్థలంలో ఉన్నతపాఠశాల నిర్మాణానికి సొంత నిధులు అందించారు. అలాగే శ్రీకృష్ణ సాయి గీతమందిరాన్ని కూడా నిర్మించారు. ఆసుపత్రి కోసం సొంత స్థలం విరాళమిచ్చినా ప్రభుత్వం మాత్రం వినియోగించలేదు. జన్మస్థలంపై మమకారం కలిగిన కృష్ణ తన బుర్రిపాలెం అందాలను... అక్కడి రైతుల జీవన దృశ్యాలను తన సినిమాల్లో చిత్రీకరించారు. సాధ్యమైనప్పుడల్లా సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడకొచ్చి గ్రామస్తులతో గడుపుతుంటారు. -
ప్యారిస్ లో ప్రిన్స్
హైదరాబాద్ : అటు సినిమాలు, ఇటు యాడ్స్ అంటూ బిజీబిజీగా గడిపే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం తన భార్యాబిడ్డలతో ప్యారిస్ పర్యటనలో హ్యాపీగా ఉన్నాడు. కేవలం కెరీర్ కాకుండా కుటుంబం కూడా తనకు చాలా ముఖ్యమని ఎపుడూ చెప్పే ఈ టాలీవుడ్ ప్రిన్స్ పిల్లా పాపలతో దసరా సెలవులను ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను మహేష్ భార్య, నటి నమ్రతా శిరోద్కర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ తన పిల్లలతో ఎంజాయ్ చేస్తూ సమయం గడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గౌతమ్ కృష్ణ, సితార కూడా ఎంతో క్యూట్ గా ఈ టూర్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ఫొటోలు ఇపుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. నవ్వుతూ.. తుళ్లుతూ.. మహేష్ బాబు తన పిల్లలు ఇద్దరిని దగ్గరకు హత్తుకుని మురిసిపోతున్న వైనం ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. వరుస విజయాలతో మహేష్ బాబు ఈ మధ్య కాలంలో తన జోరు పెంచారు. శ్రీమంతుడు సినిమా సాధించిన ఘనవిజయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని గ్రామాలను దత్తతకు తీసుకుని అభిమానులను, ప్రజలను మరింత చేరువయ్యాడు. కెరియర్ లో ఎపుడూ తలమునకలై ఉండే ఈ హీరో ఇఫ్పుడు బ్రహ్మోత్సవం చిత్ర నిర్మాణంలో కొంత గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో ప్యారిస్ ట్రిప్ చెక్కేశాడు.