ONGC Gas Pipe line
-
80 శాతం నష్టపరిహారం చెల్లించేందుకు ఆదేశం: వైఎస్ జగన్
-
తూర్పు గోదావరిలో గ్యాస్ పైప్లైన్ లీక్..
-
తూర్పు గోదావరిలో గ్యాస్ పైప్లైన్ లీక్..
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాట్రేనికొన మండలం ఉప్పూడి వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీ కలకలం రేపుతోంది. పంటల పొలాల మధ్యగా వెలుతున్న పైప్లైన్ లీకైంది. భారీగా గ్యాస్ లీకవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్తగా సమీపంలోని ప్రజలకు ఖాళీ చేయిస్తున్నారు. గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ఘటన స్థలానికి పరికరాలను తరలించారు. -
కేశవదాసుపాలెంలో గ్యాస్ లీక్
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని మల్కిపురం మండలం కేశవదాసుపాలెం శివారులో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం రేగింది. గ్రామ శివారులో సోమవారం ఉదయం గ్యాస్ లీకైతున్నట్లు గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అదికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. -
నగరం ఘటనపై కేసు నమోదు
-
ఇక్కడి ప్రజలంటే ఎందుకంత నిర్లక్ష్యం ?
-
నగరం ప్రమాదమెలా జరిగింది ?
-
మృత్యు ఘడియలు
-
నగరం విషాదం జరిగిన తీరిదీ..
-
నగరం ప్రమాదంలో తప్పెవరిది?
-
పేదోళ్లమైనందుకేనా.. ఈ నిర్లక్ష్యం!
-
సీఎం గారు వచ్చారు.. వెళ్లారు!
-
'ఈ ఘటన దురదృష్టకరం'
-
'బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'
-
నిర్లక్ష్యమే కారణమైతే.. చర్యలు తప్పవు
-
నిండు జీవితాల్ని ఛిద్రం చేసిన విషాదం
-
క్షతగాత్రుల్లో 15మంది పరిస్థితి విషమం
-
పేలుడుపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
-
పేలుడు ఘటన దురదృష్టకరం: చంద్రబాబు
న్యూఢిల్లీ : గెయిల్ పైప్లైన్ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ పేలుడు ఘటనలో 14మంది చనిపోవటం బాధాకరమన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని ఘటనాస్థలానికి వెళుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామన్నారు. తనతో పాటు పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఘటనా స్థలానికి వస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. -
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: యనమల
న్యూఢిల్లీ : పైప్లైన్ పేలుడు ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నివేదిక కోరామని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. గ్యాస్ చాలా రోజుల నుంచి లీక్ అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారని యనమల పేర్కొన్నారు. గ్యాస్ పైప్లైన్ తుప్పుపట్టి పాడైందని చెబుతున్నా.... అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు... నగరంలోని జీసీఎస్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని వాహనాన్ని ధ్వంసం చేశారు. -
బ్లో అవుట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
ఢిల్లీ పర్యటను రద్దు చేసుకున్న చంద్రబాబు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేశారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైప్లైన్ పేలుడు ఘటన నేపథ్యంలో ఆయన తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్తో కలిసి ఆయన సంఘటనా స్థలానికి వెళ్లనున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న అమలాపురం ఎంపీ రవీంద్రబాబు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఢిల్లీ నుంచి సాయంత్రానికి అమలాపురం చేరుకుంటామని రవీంద్రబాబు తెలిపారు. My condolences to the families who lost their loved ones in East Godavari blast. Ordered an enquiry & action plan to avoid these in future. — N Chandrababu Naidu (@ncbn) June 27, 2014 -
క్షతగాత్రుల్లో 15మంది పరిస్థితి విషమం
కాకినాడ : గెయిల్ పేలుడు ఘటనలో మొత్తం 15మంది మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి పద్మావతి అధికారికంగా ప్రకటించారు. మరో 32మంది గాయపడ్డారని, వారిలో 15మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆమె శుక్రవారమిక్కడ తెలిపారు. క్షతగాత్రులకు అమలాపురం ఏరియా ఆస్పత్రి సహా స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పద్మావతి చెప్పారు. కాగా అధికారికంగా 15మంది మృతి చెందినట్లు చెబుతున్నా... 18మంది చనిపోయినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ మృతి చెందినవారిలో గోపిరెడ్డి దివ్యతేజ, మద్దాల బాలాజీగా గుర్తించారు. -
గుర్తు పట్టలేని స్ధితిలో మృతదేహాలు
-
తీవ్ర భయాందోళనలో నగర ప్రజలు
-
సంఘటనా ప్రాంతంవద్ద భయానక పరిస్ధితి
-
పేలుడుపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మోడీ ఆదేశించారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేబినెట్ కార్యదర్శి తదితరులతో కూడా మోడీ చర్చించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్ లైన్ పేలిన విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ పేలుడులో 18మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. My thoughts with the families of those who lost their lives in the GAIL Pipeline fire in AP. Prayers with the injured. — Narendra Modi (@narendramodi) June 27, 2014 గెయిల్ పేలుడు ఘటనపై ఇంకా కారణాలు తెలియరాలేదని గెయిల్ ఛైర్మన్ బీసీ త్రిపాఠి తెలిపారు. 18 అంగుళాల పైప్లైన్ వద్ద పేలుడు జరిగిందని ఆయన శుక్రవారమిక్కడ చెప్పారు. సంఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టినట్లు త్రిపాఠి పేర్కొన్నారు. I have spoken to the Petroleum Minister, Cabinet Secretary & GAIL Chairman and asked them to ensure immediate relief at the accident site. — Narendra Modi (@narendramodi) June 27, 2014 -
గ్యాస్ ఫైప్లైన్ పేలి 11 మంది సజీవదహనం
-
గెయిల్ ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి
న్యూఢిల్లీ : ఓఎన్జీసీ పైప్లైన్ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనపై ఆరా తీసిన ఆయన తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను ఆదేశించారు. మరోవైపు మంటలు అదుపులోకి వచ్చినట్లు టీపీడీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. పేలుడు ఘటనలో 13మంది సజీవ దహనం కాగా, మరో 15మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
పనిచేయని యాంటీ ఫైర్ పరికరాలు
యాంటీ ఫైర్ పరికరాలు పనిచేయకపోవడం వల్లే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పగిలి, భారీ అగ్నిప్రమాదం సంభవించిందంటున్నారు. దాదాపు వంద మీటర్ల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. మృతుల సంఖ్యను ప్రాథమికంగా 13 అని నిర్ధారించినా, అది కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలకు కూడా మంటలు వ్యాపించాయి. పొగలు దట్టంగా అలముకోవడంతో సహాయ చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిపుణులు చేరుకున్నారు. గెయిల్ గ్యాస్ పైపులైన్లు తరచు లీకవుతున్నా, పాతబడిపోయిన పైపులైన్లను మార్చేందుకు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. ప్రస్తుతం రిఫైనరీకి కాకుండా, గ్రీన్బెల్ట్ వద్ద ప్రమాదం సంభవించడంతో తీవ్రత కొంతవరకు తగ్గినట్లేనని చెబుతున్నారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను బయటకు తీశారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సాంకేతిక పరమైన చర్యలు చేపట్టడానికి అవకాశం లేకపోతోంది. పైప్లైను పగుళ్లను నివారించడానికి, మంటలను అదుపుచేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. నివాసప్రాంతాలకు సమీపంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా సంఘటన స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడు,18మంది సజీవదహనం
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జీసీఎస్ వద్ద శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎన్ఎఫ్సీల్, జీఎఫ్సీల్, తాటిపాకకు గ్యాస్ సరఫరా చేసే గ్యాస్ ట్రంక్ పైప్లైన్ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో సంభవించిన బ్లో అవుట్ స్థాయిలో కాకపోయినా.. ఈ ఘటనలో 18మంది సజీవ దహనమైనట్టు సమాచారం. 20 మందికి పైగా తీవ్ర గాయాలయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ పంపులైన్ పేలడంతో బ్లోఔట్ మాదిరిగా పెద్ద ఎత్తున శబ్దాలతో భారీగా మంటలు ఎగసిపడుతూ చుట్టుపక్కలకు విస్తరిస్తున్నాయి. అయితే మంటల తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పరిసార ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలికి సమీపాన నివసిస్తున్న స్థానికులు భయందోళనతో పరుగులు పెడుతున్నారు. సమాచారం అందుకున్న గెయిల్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.