peace deal
-
నెతన్యాహుపై హమాస్ సంచలన ఆరోపణలు
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన వైమానిక దాడుల్లో 29 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. గాజాలో ఉద్రిక్తతలు తగ్గించటంతో పాటు, కాల్పుల విరమణ ఒప్పందం ప్రయత్నాల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకన్ ఇజ్రాయెల్కు వెళ్లారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం.. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో దోహాలో రెండు రోజుల చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణపై కొంత సానుకూలంగా వ్యవహరించినట్లు తెలిపారు. మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త షరతులు విధించారని గాజా నుంచి పూర్తిగా బలగాల ఉపసంహరణను తిరస్కరించారని హమాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మధ్యవర్తుల ప్రయత్నాలను, ఒప్పందాన్ని అడ్డుకోవాలని ప్రధాని నెతన్యాహు చూస్తున్నారు. గాజాలో బంధీల జీవితాలకు పూర్తి బాధ్యత ఆయనదే’ అని హమాస్ ఆరోపించింది.ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. 2.3 మిలియన్ ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. భీకరమైన ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహార ఇబ్బందులు, పోలీయో వంటి వ్యాధలు ప్రబలుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. -
వేర్పాటువాదులతో శాంతి ఒప్పందం
న్యూఢిల్లీ: అస్సాంలోని కార్బీ అంగ్లాంగ్ ప్రాంతంలో హింసకు చరమగీతం పాడి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా అదే రాష్ట్రానికి చెందిన ఐదు వేర్పాటువాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై కేంద్రం, అస్సాం ప్రభుత్వం సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తాజా ఒప్పందంతో కార్బీ అంగ్లాంగ్లో ఇక శాశ్వతంగా శాంతి నెలకొంటుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంపై కార్బీ లోంగ్రీ నార్త్ చచార్ హిల్స్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్స్ డెమొక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ కార్బీ లోంగ్రీ, యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, కార్బీ పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ తదితర వేర్పాటువాద సంస్థలు సంతకాలు చేశాయి. ఆయా సంస్థలకు చెందిన 1,000 మంది వేర్పాటువాదుల తమ ఆయుధాలతో సహా ఇప్పటికే లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. హింసకు తావులేని సౌభాగ్యవంతమైన ఈశాన్య భారతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని, ఆ దిశగా కార్బీ అంగ్లాంగ్Š అగ్రీమెంట్ ఒక కీలకమైన ముందడుగు అని అమిత్ షా వివరించారు. -
ఈ శాంతి ఒప్పందం ఓ ఆశాకిరణం
ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఆగస్టు 13న కుదిరిన శాంతి ఒప్పందం మూడు కారణాల వల్ల అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకుంది. 1. యూదు ఇజ్రాయెల్, అరబ్ ముస్లింల మధ్య ఉన్న తీవ్రమైన వైషమ్యాలకు ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్, అరబ్ లీగ్ మధ్య దౌత్య సంబంధాలు నెలకొనడానికి ఇది ఒక దారి చూపగలదు. 2, ఈ శాంతి ఒప్పందం ముస్లిం ప్రపంచాన్ని విభజిస్తుంది. 3, పాలస్తీనియన్ల స్థానభ్రంశం, దాని కొనసాగింపుగా జరిగే ప్రమాదం ఉన్న రక్తపాతాన్ని నివారించగలుగుతుంది. ఈ ఒప్పందం ప్రకారం పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణకు కేంద్రబిందువైన వెస్ట్ బ్యాంకులోని చాలా భాగాలను తనలో కలుపుకునే ప్రయత్నాలను ఇజ్రాయెల్ ఆపేస్తుంది. అలాగే ఇజ్రాయెల్, యూఏఈ వాణిజ్యం, శాస్త్ర సాంకేతిక వైద్య పరిశోధనా రంగాల్లో సహకరించుకుంటాయి. జోర్డాన్, ఈజిప్టు తర్వాత ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్న మూడో అరబ్ దేశం యూఏఈ. పాలస్తీనాగా పిలుస్తున్న ప్రాంతం మధ్యధరా సముద్రం, జోర్డాన్ నది మధ్య నెలకొని 1922 వరకు అట్టోమాన్ సామ్రాజ్య పరిధిలో ఉండింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధ అనంతర కాలంలో నానాజాతి సమితి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దాని కార్యనిర్వహణ బ్రిటన్ పరమైంది. పాలస్తీనాలోని ప్రాంతాలు ధార్మికంగా యూదులకు, క్రైస్తవులకు, అరబ్బులకు కూడా ప్రాధాన్యత కలిగినవి. రెండో ప్రపంచ యుద్ధ అనంతరం నాజీ జర్మనీలో హోలోకాస్ట్ అనుభవించిన యూదులకు భూమిని కేటాయిస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని ప్రకారం పాలస్తీనా రెండుగా విభజించబడింది. ఈ విభజనకు ఇజ్రాయెల్ ఆమోదించినా, సమీప దేశాలు తిరస్కరిం చాయి. అనంతర రాజకీయ పరిణామాలు 1948లో ఘోర యుద్ధానికి దారితీశాయి. ఇజ్రాయెల్ ఒకవైపు; ఐదు అరబ్ దేశాలు జోర్డాన్, ఇరాక్, సిరియా, ఈజిప్ట్, లెబనాన్ మరోవైపు నిలిచి పోరాడాయి. ఇజ్రాయెల్, అరబ్ ప్రపంచం మధ్య దశాబ్దాల ఘర్షణకు తెరలేచింది. 1949లో యుద్ధాన్ని నిలుపుచేస్తూ కుదిరిన ఒప్పందాలు ఆయా ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని ఏర్పరచాయి. తనకు కేటాయించిన భూభాగంతో పాటు పాలస్తీనాకు కేటాయించిన భాగానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల మీద కూడా ఇజ్రాయెల్ తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకుంది. వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం జోర్డాన్ నియంత్రణలోకి వస్తే, గాజా స్ట్రిప్ ఈజిప్ట్ నియంత్రణలోకి వచ్చింది. 1967 నాటి ఆరు రోజుల యుద్ధంలో గాజా స్ట్రిప్, సినాయ్ ద్వీపకల్పంను ఈజిప్ట్ నుంచి; వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంను జోర్డాన్ నుంచి; గోలన్ హైట్స్ను సిరియా నుంచి ఇజ్రాయెల్ వశం చేసుకుంది. 1948లో తన స్వాతంత్య్రం ఇజ్రాయెల్ ప్రకటించుకున్న నాటి నుంచి హింసాత్మక ఘర్షణల కారణంగా లక్షలాది మంది పాలస్తీనియన్లు తమ ప్రాంతాల నుంచి తరలిపోవాల్సి వచ్చింది. యూదులు పవిత్రంగా తలచే ఎన్నో స్థలాలకు వెస్ట్ బ్యాంక్ కేంద్రం. అక్కడ ఐదు లక్షల మంది యూదులు స్థిరపడ్డారు. ఇందులో అత్యధికులు ఇజ్రాయెల్ సరిహద్దులో నివసిస్తున్నారు. వీటినే ఇజ్రాయెల్ కలుపుకోవాలని అనుకుంది. వెస్ట్ బ్యాంకు 30 లక్షల మంది పాలస్తీనియన్లకు నివాస స్థలం కూడా. నిజానికి దీనిమీద తన ఆధిపత్యాన్ని పూర్తిగా ఇజ్రాయెల్ నిలుపుకున్నప్పటికీ దాన్ని తన ప్రాంతంగా ప్రకటించుకోలేదు. అలా చేస్తే లక్షలాది పాలస్తీనియన్లు స్థానభ్రం శానికి గురికావాల్సి రావడమేగాక, ఐసిస్, ఇస్లామిక్ తీవ్రవాదం కారణంగా తీవ్ర రాజకీయ ఆర్థికపరమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న సరిహద్దు దేశాలు మహా విపత్తు బారిన పడతాయి. శాంతి ఒప్పందం ఈ ప్రమాదాన్ని తప్పించింది. అయితే ఈ ఒప్పందం మధ్యప్రాచ్యంలో కొత్త పరిణామాలకు దారితీయగలదు. ముస్లిం ప్రపంచం స్పష్టంగా చీలి పోతుంది. షియాల ప్రాబల్యం ఉన్న ఇరాన్, సున్నీల ప్రాబల్యం గల సౌదీ అరేబియా సారథ్యంలోని అరబ్ దేశాలు ఇప్పటికే సిరియా, యెమెన్, ఇరాక్, లెబనాన్లో తీవ్రమైన ముఖాముఖి పోరులో ఉన్నాయి. యెమెన్లో హైతీ, లెబనాన్లో హెజ్బుల్లా, గాజాలో హమాస్ లాంటి తిరుగుబాటుదారులు, ఇతర పాలస్తీనా గ్రూపులు అయిన ఇస్లామిక్ జిహాద్ లాంటి వాటికి ఇరాన్ సహకరిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. అందుకే ఇరాన్ మీద విధిం చిన ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన నిషేధ పొడిగింపునకు మద్దతునిస్తూ, బెహ్రాయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ సభ్యులుగా గల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఆగస్టు 10న సంయుక్త వినతిపత్రాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సమర్పించింది. కాబట్టి ఈ శాంతి ఒప్పందానికి ఇరాన్ తీవ్రంగా స్పందించడంతో పాటు, ఆయా తిరుగుబాటుదారు వర్గాలకు మరింత మద్దతు ఇచ్చే వీలుంది. దీనివల్ల సున్నీ ముస్లిం దేశాలు ఏకతాటిపైకి రావడం, ఫలితంగా తీవ్రమైన ఆయుధ పోటీ నెలకొనడం జరగవచ్చు. అమెరికా, ఇరాన్ ఘర్షణల్లో మధ్యప్రాచ్య దేశాలు అమెరికా వైపు నిలబడి ఇరాన్ను ఒంట రిని చేస్తాయి. అట్లా అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ దేశాల కొత్త ఐక్యత సాధ్యం అయ్యే వీలుంది. సహజంగానే దీనివల్ల అమెరికా, దాని మిత్ర దేశాలు భాగస్వాములు కాని దేశాల వైపు ఇరాన్ స్నేహహస్తాన్ని సాచే వీలుంది. అలా మధ్య ప్రాచ్యంలోకి చైనా ప్రవేశించడానికి వీలు ఏర్పడుతుంది. ఇప్పటికే చైనా, పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ వలన అరేబియా సముద్రంలో చైనాకు ప్రవేశం దొరికింది. ఇది మరింతగా విస్తృతమై భిన్న ధ్రువ ప్రపంచంలో సరికొత్త కూటమికి దారితీస్తుంది. ఈ ఘర్షణలో భాగస్వాములైన ఇజ్రాయెల్, పాలస్తీ నాతో సహా, అన్ని అరబ్ దేశాలతోనూ భారత్ విజయవంతంగా స్నేహ సంబంధాలను కొనసాగించగలిగింది. అయితే మౌలిక సదుపాయాల కల్పనలో ఇరాన్, చైనా భాగస్వామ్యం ఇండియాలో కొంత ఆందోళనకు కారణమైంది. చైనా సహకారం ఉన్న పాకిస్తాన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ను విచ్ఛిన్నం చేయడానికి చేసిన ప్రయత్నం ఇప్పటికే అరబ్ ప్రపంచంలో అనుమానాలు రేకెత్తించింది. అందుకే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా గట్టి వైఖరి తీసుకుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు దేశాల విధానానికి కట్టుబడి ఈ శాంతి ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. అయితే రానున్న రోజుల్లో మారిపోయే రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో చూపాల్సిన సంయమనం పరంగా భారత విదేశాంగ విధానానికి కొత్త సవాళ్లు ఎదురవుతాయి. వ్యాసకర్త:డా. గద్దె ఓం ప్రకాష్ , అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సిక్కిం, గ్యాంగ్టక్ ‘ మొబైల్: 94749 79304 -
ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందం
వాషింగ్టన్: నిత్యం రావణకాష్టంలా రగిలి పోయే మధ్యప్రాచ్యంలో దౌత్యపరంగా భారీ ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం ఫలించి గురువారం ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు శాంతి స్థాపన దిశగా అడుగులు వేశాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతకు చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్కు స్నేహహస్తం చాచిన మొట్టమొదటి గల్ఫ్ దేశంగా, అరబ్ ప్రపంచంలో మూడో దేశంగా యూఏఈ నిలిచింది. పాలస్తీనా ఆక్రమణపై ఇరు దేశాల మధ్య పాతికేళ్లుగా కొనసాగుతున్న వైరానికి ట్రంప్ చొరవతో తెరపడింది. ‘‘మాకు అత్యంత మిత్రదేశాలైన ఇజ్రాయెల్, యూఏఈల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది’’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ చారిత్రక దినం అంటూ ట్వీట్ చేశారు. అరబ్ ప్రపంచంతో కొత్త శకం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించకూడదన్న షరతు మీదే ఒప్పందం కుదుర్చుకున్నామని యూఏఈ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ ట్వీట్ చేశారు. -
తాలిబన్ అగ్రనేతకు ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. అఫ్గాన్లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరగంట పాటు సంభాషణ నడిచిందని తాలిబన్ తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరేందుకు అఫ్గానిస్తాన్లో హింసాత్మక ఘటనలు తగ్గడమే కారణమని, ఇదే పరిస్థితి కొనసాగాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్హౌస్ ప్రకటించింది. శాంతికి కట్టుబడి ఉంటే అఫ్గాన్కు సాయం అందించడంలో అమెరికా ముందుంటుందని ట్రంప్ చెప్పారు. ‘తాలిబన్ అగ్రనేతతో ఈ రోజు మాట్లాడాను. హింసకు తావులేదన్న అంశాన్ని ఇరువురూ అంగీకరించాం. ఏమవుతుందో చూద్దాం’ ట్రంప్ వ్యాఖ్యానించారు. ముల్లాతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. చర్చలపై నీలినీడలు: అఫ్గానిస్తాన్ బలగాలను రక్షించే ఉద్దేశంతో అమెరికా బుధవారం తాలిబన్పై వైమానిక దాడులకు దిగడంతో మార్చి 10వ తేదీన ఓస్లోలో ప్రభుత్వానికి, ఇతరులకు మధ్య చర్చలు జరిగే అంశం డోలాయమానంలో పడింది. బరాదర్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెల్మాండ్లో వైమానిక దాడులు జరగడం గమనార్హం. అమెరికా, తాలిబన్ల మధ్య గత శనివారం శాంతి ఒప్పందం కుదరగా, రానున్న 14 నెలల కాలంలో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. హెల్మాండ్లో మంగళవారం తాలిబన్లు 43 సార్లు దాడులకు ప్రయత్నించారని, వాటిని తిప్పికొట్టేందుకే తాము వైమానిక దాడులకు దిగామని అఫ్గానిస్తాన్లో అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ తెలిపారు. తాలిబన్లు ఇలాంటి దాడులను కట్టిపెట్టి శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. బుధవారం తాలిబన్ జరిపిన దాడుల్లో సుమారు 20 మంది అఫ్గాన్ సైనికులు మరణించారని మిలటరీ వర్గాలు తెలిపాయి. -
తాలిబన్లను విడుదల చేయం
కాబుల్: అమెరికా–తాలిబన్ల శాంతి ఒప్పందం అమలుకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. జైళ్లలో ఉన్న తాలిబన్లను తక్షణమే విడుదల చేయడం కుదిరే పని కాదని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తేల్చి చెప్పారు. మార్చి 10 నుంచి నార్వే రాజధాని ఓస్లోలో అఫ్గాన్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలతో అధికార పంపిణీపై సంప్రదింపులున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తాలిబన్లను విడుదల చేయలేమని ఘనీ స్పష్టం చేశారు. రెండు దశాబ్దాల యుద్ధానికి స్వస్తి పలుకుతూ శాంతి ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని ప్రకటించింది. అయితే ఈలోగా తాలిబన్లు ఎలాంటి దాడులకు పాల్పడకూడదని షరతు విధించింది. అలాంటప్పుడు అఫ్గాన్ అధికార యంత్రాంగంతో చర్చలు జరగకుండా తాము తాలిబన్లను జైళ్ల నుంచి ఎందుకు విడుదల చేయాలని అధ్యక్షుడు ఘనీ ప్రశ్నించారు. జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేసే నిర్ణయం పూర్తిగా తమ ప్రభుత్వం ఇష్టమేనని, తదుపరి చర్చలు మొదలవకుండా ఖైదీలను విడుదల చేసే ఉద్దేశం లేదని చెప్పారు. మరోవైపు అమెరికా శాంతి దూత జల్మే ఖలీల్జద్ తాలిబన్లను జైళ్ల నుంచి విడుదల చేస్తేనే వారిలో విశ్వాసం వస్తుందని అంటున్నారు. ఓస్లోలో చర్చలకు ముందే అఫ్గాన్ ప్రభుత్వం 5 వేల మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేస్తుందని ఈ ఒప్పందం సందర్భంగా అమెరికా హామీ ఇచ్చింది. ఇప్పుడు అధ్యక్షుడు ఎదురు తిరగడంతో ఈ ఒప్పందం అమలుపై సందేహాలు నెలకొన్నాయి. అఫ్గాన్ మహిళల్లో భయం భయం అమెరికా–తాలిబన్ల ఒప్పందం అఫ్గాన్ మహిళల్లో భయాన్ని నింపుతోంది. తాలిబన్లు అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్యలు తెస్తారోనని ఆందోళన చెందుతున్నారు. 2001 తర్వాత అమెరికా అఫ్గాన్ని ఆక్రమించడానికి ముందు తాలిబన్లు అయిదేళ్ల పాటు చేసిన అరాచకాలు అక్కడ మహిళల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అఫ్గాన్లో శాంతి నెలకొనాలంటే తమ జీవితాల్ని పణంగా పెట్టాలేమోనన్న అనుమానం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
ఆఫ్రికాలో శాంతి నెలకొనాలి
వాటికన్ సిటీ: అంతర్యుద్ధంతో సతమతమైపోతున్న ఆఫ్రికా దేశాల్లో శాంతి స్థాపన జరగాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. మధ్యప్రాచ్యం, వెనిజులా, లెబనాన్ ఇతర దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇకనైనా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పోప్ వాటికన్ నగరం నుంచి తన సందేశాన్నిచ్చారు. ఆఫ్రికాలో క్రైస్తవులపై తీవ్రవాద సంస్థలు జరుపుతున్న దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హింసతో రగిలిపోతున్న దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలతో సతమతమైపోతున్న దేశాల్లో, వ్యాధులు పడగవిప్పిన నిరుపేద దేశాల్లో ఈఏడాదైనా శాంతి, సుస్థిరతలు నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ‘మధ్యప్రాచ్యం సహా ఎన్నో దేశాల్లో యుద్ధ వాతావరణంలో చిన్నారులు భయంతో బతుకులీడుస్తున్నారు. వారందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను‘‘అని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. అంబరాన్నంటిన సంబరాలు క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటాయి. క్రిస్టియన్ నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ శాంతి సందేశాలను పంపించుకున్నారు. సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. తీవ్ర తుఫాన్తో అల్లాడిపోయిన ఫిలిప్పీన్స్లో వేలాది మంది వరద ముప్పులో చిక్కుకోవడంతో క్రిస్మస్ హడావుడి కనిపించలేదు. ఇక ఫ్రాన్స్లో పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా నాలుగు వారాలుగా జరుగుతున్న రవాణా సమ్మెతో రాకపోకలు నిలిచిపోయాయి. బంధువులు, స్నేహితులు తమవారిని చేరుకోకపోవడంతో క్రిస్మస్ సందడి కనిపించలేదు. -
సైనిక–రాజకీయ పద్ధతిలో శాంతి స్థాపన
న్యూఢిల్లీ: కశ్మీర్లో శాంతి స్థాపన కోసం మిలిటరీ కార్యకలాపాలు, రాజకీయ ప్రయత్నాలు సమన్వయంతో కొనసాగాలని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. పాక్ సైన్యం పట్ల మన సైనికులు మరింత దూకుడుగా వ్యవహరిస్తే సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి మెరుగవ్వాలంటే జమ్మూకశ్మీర్లోని మన సైన్యం చేతులు ముడుచుకుని కూర్చోకుండా, కొత్త ఎత్తుగడలు, వ్యూహాలను రచించాల్సి ఉందని పీటీఐ ఇంటర్వ్యూలో రావత్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం స్థానికుల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి రాజకీయంగా చేయగలిగినదంతా చేయాలని సూచించారు. -
కశ్మీర్పై చర్చలు ప్రారంభిస్తాం!
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో శాంతి స్థాపనలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆ రాష్ట్రంలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ డైరెక్టర్ దినేశ్వర్ శర్మకు అప్పగించింది. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోహోం శాఖ మంత్రి రాజ్నాథ్ వివరాలు వెల్లడిస్తూ..‘కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృఢ వైఖరి, నమ్మకంతో ఉంది. ఆ మార్గంలోనే ముందుకు సాగుతుంది. అందులో భాగంగా చర్చల ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించాం. అందుకే భారత ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా దినేశ్వర్ శర్మను నియమిస్తున్నాం. కశ్మీర్లోని అన్ని వర్గాల ప్రజలు, సంస్థలతో ఆయన చర్చలు కొనసాగిస్తారు’ అని తెలిపారు. ఇంతటి సున్నిత అంశంపై చర్చలు జరపగల సామర్థ్యం ఒక పోలీసు అధికారికి ఉంటుందా? అని ప్రశ్నించగా ‘అందులో తప్పేముంది. ఆయన రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి.అదే పెద్ద అనుకూల అంశం’ అని అన్నారు. 1979 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన దినేశ్వర్ శర్మ 2014 నుంచి 2016 వరకూ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు. కశ్మీర్పై చర్చల కోసం కేంద్రం చొరవను కశ్మీర్ సీఎం మెహబూబా స్వాగతించారు. -
శాంతి కపోతాలు
-
దక్షిణ సుడాన్లో శాంతి పవనాలు
జుబా: అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న ప్రపంచంలోనే అతిపిన్న దేశం దక్షణ సుడాన్లో శాంతి స్థాపనకు బీజం పడింది. తిరుగుబాటు దళాలకు, ప్రభుత్వానికి మధ్య బుధవారం శాంతి ఒప్పందం జరిగింది. దీంతో నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడినట్లయింది. రాజధాని నగరం జుబాలో బుధవారం దేశాధ్యక్షుడు సాల్వా కీర్, తిరుగుబాటు దళాల నాయకుడు రిక్ మచార్ ల ప్రతినిధులు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. నిజానికి గతవారమే ఈ ఒప్పందం జరగాల్సిఉండేది కానీ తిరుగుబాటుదారుల డిమాండ్లకు అధ్యక్షుడు సల్వా నో చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. కాగా, శాంతిఒప్పందానికి అంగీకరించకుంటే అంతర్జాతీయ సమాజం నుంచి బహిష్కరణ వేటు తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడంతో సాల్వా దిగివచ్చారు. శాంతి ఒప్పందం విజయవంతానికి దక్షిణ సుడాన్ పొరుగుదేశాలైన కెన్యా, ఉగాండా, ఇథియోపియా తదితర దేశాల అదినేతలు సహకరించారు. 2011లో దక్షిణ సుడాన్ స్వతంత్ర్యదేశంగా ఆవిర్భవించింది. అధ్యక్షుడు సాల్వా.. ఉపాధ్యక్షుడైన రిక్ మచార్ ను పదవి నుంచి తొలగించడంతో ప్రారంభమైన విబేధాలు తీవ్ర రూపందాల్చి అంతర్యుద్ధానికి దారితీసింది. నేటి శాంతి ఒప్పందంతో రిక్ తిరిగి ఉపాధ్యక్ష పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది.