potina mahesh
-
పవన్ కళ్యాణ్ రోడ్డు చెకింగ్.. పోతిన మహేష్ సెటైర్లే సెటైర్లు
-
కిలోమీటరు పరిధిలో 12 మద్యం షాపులు.. చంద్రబాబుపై పోతిన మహేష్ ఫైర్
-
కల్తీ మీ బుర్రలో ఉందా పవన్?
విజయవాడ, సాక్షి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘ఎక్స్’ వేదికగా పవన్కు చురకలు అంటించారు.నాడు రోడ్డుపై దొర్లినా.. నేడు తిరుమల మెట్లేక్కినా ఎవరికోసం, ఎందుకోసం? అని సూటిగా నిలదీశారు. ‘నాడు శపథాలు చేసినా - నేడు దీక్షలు చేసినా, కల్తీ.. లడ్డూలో లేదు - మీ బుర్రలో ఉందా?’ అని ఎద్దేవా చేశారు.నాడు రోడ్డుపై దొర్లినా - నేడు మెట్లిక్కినా నాడు శపథాలు చేసినా - నేడు దీక్షలు చేసినా ఎవరికోసం, ఎందుకోసం? కల్తీ లడ్డులో లేదు - మీ బుర్రలో ఉందా?#justasking— Pothina venkata mahesh (@pvmaheshbza) October 1, 2024చదవండి: బాబు లడ్డు కహానీ! (ఫొటోలు) -
బాబు, పవన్ పై పోతిన మహేష్ పంచులు
-
అందుకే ‘తిరుమల లడ్డూ’పై బాబు నీచ రాజకీయం: పోతిన మహేష్
సాక్షి, విజయవాడ: వందరోజుల్లో చేసింది చెప్పుకోలేక తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. పరిపాలన గాలికొదిలేసి, ఇస్తామన్న పథకాలు ఇవ్వకుండా తన చేతకానితనం బయటపడినప్పడు వైఎస్ జగన్పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘వంద రోజుల్లో అమలు చేస్తామన్న పథకాల గురించి ప్రజలు అడుగుతారని శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు విమర్శలు చేశాడు. జూలైలో రిపోర్టులో వస్తే సెప్టెంబర్లో బయటపెట్టడం ఏంటీ?. శాంపిల్స్ ఎప్పుడివి? ఎక్కడ సేకరించారు. రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు? ఇలాంటి ప్రశ్నలు భక్తుల్లో ఉన్నాయి. నాణ్యత లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. లడ్డూ ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు తగ్గకూడదని గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 550 దేశీ ఆవులతో గోశాల ఏర్పాటు చేసింది కూడా గత ప్రభుత్వమే..ఇది కనిపించడం లేదా?’’ అంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం‘‘శ్రీవైష్ణువులు తేడా జరిగితే చెప్పారా? ఎందుకు ఊరుకుంటారు?. లడ్డు సరుకులను ముందుగానే తనిఖి చేస్తారు.. సరిగ్గా లేకుంటే తిరిగి పంపిస్తారు. లడ్డూ తయారికి ముందే సరుకులు తనిఖి చేస్తారు. లడ్డు తయారీ తర్వాత తనిఖీ చేయడం సాధ్యం కాదు. ఏ కాలానికి వచ్చింది.. ఎప్పుడు వచ్చింది. ఏ ట్యాంక్లో వచ్చింది చెప్పకుండా కోట్లాది హిందూ భక్తుల మనోభావాలతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. వెంకన్న భక్తులు చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి జవాబు ఇస్తారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప రాజకీయంగా వాడుకోవాలని చూడడం సరైనది కాదు’’ అని పోతిన మహేష్ హితవు పలికారు. -
పవన్, చంద్రబాబుపై పోతిన మహేష్ కామెంట్స్
-
ఆధారాలతో సహా చర్చకు సిద్ధం.. స్పందించు పవన్: పోతిన మహేష్
సాక్షి, గుంటూరు: పార్కింగ్ కాంట్రాక్టర్లపై అమ్మవారు ఆధారపడి ఉన్నారా?.. చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలంటూ వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు రూ.4 కోట్లు అవినీతికి పాల్పడ్డారని.. పార్కింగ్, టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.కనకదుర్గ రోడ్డులో షాపుల అద్దెల పేరుతో మరికొంత కొట్టేయటానికి రెడీ అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దీనంతటికీ కారకుడు. దేవాదాయ శాఖ అధికారులను బెదిరించి జీవోలు జారీ చేయించుకుంటున్నారు. కాంట్రాక్ట్ పూర్తయితే మళ్లీ పది శాతం పెంచి సదరు కాంట్రాక్టర్కు కాంట్రాక్టు ఇవ్వాలి. రెండు కోట్లకు పైగా సొమ్ము కాంట్రాక్టర్ నుంచి ఎందుకు తీసుకోలేదు?. పైగా నాలుగు నెలల పాటు భక్తుల నుండి ఉచితంగా టోల్ ఫీజు వసూలు చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం మారగానే అమ్మవారి సాక్షిగా దోపిడీ ప్రారంభించారు’’ అని పోతిన మహేష్ ధ్వజమెత్తారు.‘‘ఒక కోటి రెండు లక్షలు భక్తుల నుంచి వసూలు చేసుకోమని జీవో ఇవ్వడం ఏంటి?. హైకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్ ఆలయానికి రావటం వలన కాంట్రాక్టర్కు నష్టం వచ్చిందని జీవోలో రాశారు. ఇదేం విచిత్రమైన జీవోలు?. దోచుకో, దాచుకో, తినుకో అనే పరిస్థితి వస్తుందని వైఎస్ జగన్ ముందే చెప్పారు. అమ్మవారి ఆలయంలో భారీగా దోపిడీ చేస్తున్నారు. దోపిడీ చేసుకోమని అధికారికంగా జీవో ఇవ్వడం కూటమి ప్రభుత్వంలోనే చెల్లింది. రూ. 3.06 కోట్లు అమ్మవారి ఆలయానికి నష్టం వచ్చింది. ఆ మేరకు సదరు కాంట్రాక్టర్కి లాభం చేకూరింది’’ అని పోతిన మహేష్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: నిర్లక్ష్యమే ముంచేసింది‘‘కనకదుర్గ నగర్లో షాపులు ఏర్పాటులోనూ అక్రమాలు చేశారు. బకాయిలు ఉన్నా, వ్యాపారాలు సజావుగా సాగుతున్నా 49 శాతం అద్దెలు తగ్గించారు. బుద్దా వెంకన్న ఒక్కో షాపుకు రూ.5 లక్షలు చొప్పున లంచాలు తీసుకున్నారు. మూడు నెలల్లో 4 కోట్లు వసూలు చేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన మనుషులకి ఘాట్ రోడ్డులో కోటికి పైగా విలువైన కాంట్రాక్టును నామినేషన్ మీద ఇచ్చారు. అన్నదాన సత్రంలో స్టీల్ టేబుల్స్ ఏర్పాటు కాంట్రాక్టులోనూ అవినీతి పాల్పడ్డారు. అమ్మవారి సొమ్ము కొట్టేయటంలో ఏఈ లక్ష్మణ్.. బుద్దాకు సహకరిస్తున్నారు. వీటన్నిటిపై ఏసీబితో విచారణ జరిపించాలి..ఆధారాలతో సహా చర్చకు ఏ వేదిక మీదనైనా నేను సిద్ధం.. చట్టపరంగా పోరాటం చేస్తా. ఇంజనీరింగ్ విభాగంలో కొందరు చేస్తున్న తప్పుడు పనులపై ఆధారాలు సేకరిస్తున్నాం. అమ్మవారి ఆలయంలో జరిగే అక్రమాలపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి’’ అని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. -
కక్ష సాధింపు ధోరణి తోనే పాలన చేస్తున్నారు
-
‘బాబూ.. నీ 40 ఏళ్ల రాజనాల విలనిజం ప్రజలకు అర్థమైంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. నువ్వు ఎన్ని కథలు చెప్పినా, ఎల్లో మీడియాలో ఎలివేషన్ ఇచ్చినా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. చంద్రబాబు మాటలు చూస్తుంటే ఆయనకు చాదస్తం ఎక్కువైంది అనుపిస్తుందని ఎద్దేవా చేశారు.కాగా, పోతిన మహేష్ ట్విట్టర్ వేదికగా..‘వరదొచ్చినా బురదొచ్చినా ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి వచ్చినా కారణం వైఎస్ జగన్ అనే చంద్రబాబు మాట్లాడేలా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక బాబుకు చాదస్తం ఎక్కువైంది అనిపిస్తోంది. కురుస్తున్న వర్షాలు తెలుసు, కట్టెలు తెంచుకుంటున్న కృష్ణా నది తెలుసు అయినా సరే విజయవాడ మునిగే వరకు అసలు ఏయే వాగులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియలేదు ప్రభుత్వానికి.వరదకు ముందు చేయాల్సిన పనులు చేయక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నీట మునిగాక చిర్రెత్తిన ప్రజలని శాంతి పరచడానికి ఆయన రోడ్ల మీద బోటుల్లో తిరుగుతున్నారు తప్ప అసలు ఆ బోట్లు రోడ్డు మీదకు రాకుండా ఆపలేకపోయినా తన చేతకానితనాన్ని తెలివిగా కప్పిపుచ్చుకుందాం అనుకున్నారు కూటమి నేతలు.ఎన్ని కథలు చెప్పినా, సొంత మీడియా వాడుకుని ఎలివేషన్స్ ఇచ్చినా ప్రజల కోపం తగ్గలేదు కాబట్టి గొల్లపూడి బోట్లు వైఎస్సార్సీపీ వాళ్ళవి అంటూ కొత్త కుట్ర ఎత్తుకున్నారు. 10 లక్షల క్యూసెక్కులపైగా వరద ప్రవాహాన్ని ఐదు బోట్లు అడ్డుకోగలవా?. ఎవ్వరైనా బోట్లకి పార్టీ రంగులేసుకుని ప్రకాశం బ్యారేజ్ గేట్లకి అడ్డంగా వదిలేయాలనుకుంటారా?. ఇలాంటి 40ఏళ్ల క్రితం రాజనాల సినిమా విలనిజం చేస్తే అర్ధం చేసుకునే తెలివి జనానికి లేదా?.అసలు మత్యకారులకు, బోట్ నిర్వాహకులకు ప్రభుత్వం సరైన సమాచారం ఇచ్చి వాళ్లని అప్రమత్తం చేస్తే ఈ రోజు బోట్లు కొట్టుకువచ్చే పరిస్థితి వచ్చేది కాదు కదా. బుడమేరు వాగును, దానికి వస్తున్న ఇన్ఫ్లోని ముందే అంచనా వేస్తే ఈ రోజు నాలుగు లక్షల మంది ప్రజల జీవితాలు ఛిద్రం కాకుండా ఉండేవి. అలాగే గొడుగు పట్టుకుని బుడమేరు కట్ట దగ్గర రీల్స్ చేసుకునే పరిస్థితి నిమ్మల రామానాయుడుకి రాకుండా ఉండేది. క్రైసిస్ మేనేజ్మెంట్లో నన్ను మించిన వారు లేరని మీ మీడియాలో ఊదర గొట్టే ముందు బుడమేరు వరదలకు కారణం మీరే అని ఎప్పుడు గ్రహిస్తారు?.ఏదో రకంగా వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టాలని వరదల్లో బురద ముంపులో మురికి రాజకీయం చేయాలని టీడీపీ పార్టీ నాయకులు తాపత్రయం పడుతున్నారు తప్ప అసలు ఈ ముంపుకి కారణం మాత్రం ప్రజలకు అర్ధం అయ్యింది. కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే వ్యక్తులను పోలీసులు తీసుకెళ్లి విచారణ పేరుతో వేధిస్తున్నారు. కోమటి రామ్మోహన్ తనకున్న బోట్లను నాలుగేళ్ల క్రితమే ఉషాద్రి అనే వ్యక్తికి విక్రయించారు. ఉషాద్రికి ఏ పార్టీతో సంబంధం లేకున్నా వైఎస్సార్సీపీ పార్టీ చెందినవారు అని చెప్పాలని పోలీసులు ఒత్తిడి తీసుకొస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి చట్టవిరుద్ధంగా నడుచుకుంటే సంబంధిత పోలీసు అధికారులు కోర్టు ముందు నిలబెడతామని న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని వైఎస్సార్సీపీ స్పష్టం చేస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. వరదొచ్చినా బురదొచ్చినా ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి వచ్చినా కారణం @ysjagan గారే అని చంద్రబాబు గారు @ncbn మాట్లాడటం చూస్తుంటే ఆయనకు చాదస్తం ఎక్కువైంది అనిపిస్తోంది.కురుస్తున్న వర్షాలు తెలుసు, కట్టెలు తెంచుకుంటున్న కృష్ణా నది తెలుసు అయినా సరే విజయవాడ మునిగేవరకు అసలు ఏ ఏ… pic.twitter.com/rKIkpAxDfY— Pothina venkata mahesh (@pvmaheshbza) September 9, 2024 -
బాబుని ఏకిపారేసిన పోతిన మహేష్
-
రాధాకృష్ణ పవర్ ప్లాంట్,చంద్రబాబు ఇల్లు కోసం ప్రజల ప్రాణాలతో చలగాటాలా..
-
చంద్రబాబు ఈ పాపం ఊరికే పోదు.. బుడమేరును దారి మళ్లించి బడుగుల జీవితాన్ని చిదిమేశారు
-
బాబుపై పోతిన మహేష్ ఫైర్
-
ఏపీలో కూటమి పాలనపై పోతిన సెటైర్లు
విజయవాడ, సాక్షి: ఉమ్మడి రాష్ట్రంలో గాని విభజిత ఆంధ్రప్రదేశ్ గాని ఎప్పుడైనా ఒక ఏడాదిలో ఒక ఎండాకాలం వచ్చేది, కానీ 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రెండో ఎండాకాలం వచ్చిందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ విమర్శలు చేశారు. ‘రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత 15 రోజులుగా 39 డిగ్రీలు 40 డిగ్రీలు ఎండలు కాస్తున్నాయి. కూటమి మహిమా? సూపర్ సిక్స్లో ఇది కూడా ఒక పథకం అంటారేమో అనిపిస్తుంది’ అని ‘ఎక్స్’ వేదికగా ఆయన సెటైర్లు వేశారు.‘‘ ఏపీలో రెండో ఎండాకాలం. కూటమి మహిమా?.. రాష్ట్రం రావణకాష్టంలా మండిపోతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఎటు చూసినా రాజకీయ హత్యలు దాడులు పగ ప్రతీకారంతో కూటమిపాలన సాగిస్తుంది. ప్రతిరోజు పేపర్ చదవాలన్న టీవీలలో, పేపర్లలో సోషల్ మీడియాలో వార్తలు చూడాలన్న ప్రజలకు భయం వేస్తుంది. కూటమి అధికారంలోకొచ్చింది రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడం కోసమేనని ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరిన విధంగా కూటమి ప్రభుత్వం ఎసెన్షియాలో మరణించిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం, గాయపడినవారికి మెరుగైన ఉచిత వైద్యం ఘటనపై లోతు అయిన దర్యాప్తు చేపట్టాలి’’ అని అన్నారు.పేలుళ్లతో కూటమిపాలన ప్రారంభమైందని పోతిన మహేష్ మండిపడ్డారు. ‘‘ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ బ్రాయిలర్ పేలిన ఘటనలో 3 గురు మృతి, 16 మందికి గాయాలు (07.07.2024), ఎసెన్షియ ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతి, 50 మందికి గాయాలు(21.08.2024), పరిటాల దొనకొండ క్వారీలో బాంబులు పేలి 3 గురు మృతి (16.7.2024)’ ఘటనలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగినట్లు తెలిపారు.1.పేలుళ్లతో ప్రారంభమైన కూటమిపాలన.A. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ బ్రాయిలర్ పేలిన ఘటనలో 3 గురు మృతి, 16 మందికి గాయాలు (07.07.2024)B. ఎసెన్షియ ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతి,50 మందికి గాయాలు(21.08.2024)C. పరిటాల దొనకొండ క్వారీలో బాంబులు పేలి 3 గురు మృతి…— Pothina venkata mahesh (@pvmaheshbza) August 22, 2024 -
పవన్ కళ్యాణ్ సైలెన్స్ వద్దు.. పోతిన మహేష్
-
చంద్రబాబు,లోకేష్ పై పోతిన మహేష్ ఫైర్
-
పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ వార్నింగ్
-
బాబు, పవన్ ను ఓ ఆటాడుకున్న పోతిన మహేష్
-
షర్మిల పై పోతిన మహేష్ ఫైర్
-
సామాజిక మోసంపైనే చంద్రబాబు మొదటి సంతకం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సీఎం చంద్రబాబు మరోసారి సామాజిక మోసానికి తెరతీస్తూ తన మొదటి సంతకం చేశారని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ పేర్కొన్నారు. కేవలం ఒకరికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, ఈ విషయంలో బీసీ, దళిత, మైనార్టీలకు అన్యాయం చేశారని చెప్పారు. ఈ మేరకు పోతిన మహేష్ శనివారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘చంద్రబాబు తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారు. 2014లో చంద్రబాబు ఇద్దరికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు.వారిలో ఒకరు కాపు, మరొకరు బీసీ సామాజికవర్గం వారు ఉన్నారు. వైఎస్ జగన్ 2019లో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ చంద్రబాబుకు మిన్నగా కాపు, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు. తద్వారా ఆయా సామాజికవర్గాల ఆత్మగౌరవాన్ని వైఎస్ జగన్ మరింత పెంచారు. వైఎస్ జగన్ను పదేపదే విమర్శించిన చంద్రబాబు... వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సామాజిక న్యాయానికి మించి అట్టడుగు వర్గాలకు పదవులు కేటాయించాల్సింది పోయి ఉన్న పదవులను తగ్గించారు.ఇది చంద్రబాబు నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తోంది. దీనిపై చంద్రబాబు ఆయా వర్గాలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గత పాలన అంతా దళితులు, బీసీలు, మైనారిటీలను అణగదొక్కడమే కనిపిస్తుంది. వైఎస్ జగన్ అమలు చేసిన సామాజిక న్యాయాన్ని ఇప్పటికైనా బీసీ, దళిత, మైనార్టీ, కాపు సామాజికవర్గాలు గ్రహించాలి. ఆయన ఆయా వర్గాలకు కేటాయించిన సీట్లను సైతం గుర్తించాలి.’ అని పోతిన అన్నారు. -
చంద్రబాబు కూటమిపై రెచ్చిపోయిన పోతిన మహేష్
-
నాగబాబుపై ట్విట్టర్ వేదికగా పోతిన మహేష్ విమర్శలు
-
పాలేరు పవన్..
-
Potina Mahesh: పవన్ అక్రమాస్తుల వివరాలు ఇవే..!
విజయవాడ: రాజకీయాల్లో పవన్కళ్యాణ్ పెద్ద చీడపురుగని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. జనసేన స్థాపించిన పదేళ్లలో ఆయన సుమారు రూ.15 వందల కోట్ల నుంచి రూ.రెండు వేల కోట్ల వరకు అక్రమంగా సంపాదించారని ఆయన వెల్లడించారు. 2014లో కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉంటూ కారు ఈఎంఐ కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పిన పవన్ ఇప్పుడు లగ్జరీ కార్లు, విలాసవంతమైన ఇల్లు, తిరగటానికి హెలికాప్టర్, అనేక ఆస్తులను తొమ్మిదేళ్లలో ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు.విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఇటీవల కాలంలో పవన్ ఏ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించకపోయినా.. రూ.వందల కోట్ల లాభాలు రాకపోయినా జనసేన పార్టీ పెట్టాకే పవన్కు రూ.వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీని నడపలేక తీసేశారుగానీ.. జనసేన పార్టీని మాత్రం ముందే చంద్రబాబుకి అమ్మేసి డబ్బులు తెచ్చుకున్న దుర్మార్గుడు పవన్.మాలాంటి వాళ్లందర్నీ రాజకీయంగా, ఆరి్థకంగా బలిపశువులు చేసి ఆయన మాత్రం అన్ని రకాలుగా బాగుపడ్డారు. కాపులను పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి, బీసీలను మార్పుకోసం పోరాడాలని సూచించి ఆయన మాత్రం చంద్రబాబుకు పాలేరు పాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను, నేను చంద్రబాబు సేవకుణ్ణి, చంద్రబాబు పాలేరుని అంటూ ప్యాకేజీ తీసుకుని మాలాంటి వాళ్లను పవన్ బలి పశువులని చేసి ఆయన మాత్రం బాగా ఆరి్థకంగా బలపడ్డారు.ఈ సమావేశంలో పవన్ ఆక్రమాస్తులు.. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన వాటి వివరాలను పోతిన మహేష్ వెల్లడించారు. అవి..మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కన పవన్ బినామి అయినా నర్రా శ్రీనివాస్ మిత్రుడు పోషడుపు వెంకటేశ్వరరావు పేరు మీద రూ.100 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆధార్ కార్డుపై అనేక అనుమానాలున్నాయి. పోషడుపు వెంకటేశ్వరరావు గుంటూరు అయితే చెల్లించిన బ్యాంకు చెల్లింపులు హైదరాబాద్లోని ఐసీఐసీఐ బ్యాంకువి. వీటిపై సమాధానం చెప్పాలి. రెండు రిజి్రస్టేషన్లకి పోషడుపు వెంకటేశ్వరరావు హాజరుకాగా.. మరొక రెండు రిజి్రస్టేషన్లకు నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ వి. నవీన్కుమార్ హాజరయ్యారు. డాక్యుమెంట్ నెంబర్లు : 704/2024, 2244/2024, 2818/2024, 3555/2024, 5002/2014.రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో పవన్ ఫామ్హౌస్ 14 ఎకరాల్లో ఉందని అఫిడవిట్లో చూపించారు. కానీ, అది 45–50 ఎకరాల్లో ఉంది. పాతది 14 ఎకరాలైతే.. 2019 ఎన్నికల తర్వాత పవన్ మరొక 30 ఎకరాలు కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరం ఏడున్నర కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. అది కూడా బినామీ పేర్ల మీద పెట్టారు.2019 ఎన్నికల్లో పవన్కు ఎన్ఆర్ఐలు, కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు రూ.125 కోట్ల విరాళాలిచ్చారు. వాటిని వసూలుచేసింది పీవీ రావు, ఆర్ఆర్ రామ్మోహన్, చింతల పార్థసారధి, ముత్తంశెట్టి కృష్ణారావు. అందులో 90శాతం నగదు రూపంలో, పది శాతం డీడీల రూపంలో ఇచ్చారు. ఆ డబ్బుల వివరాలు అడిగినందునే వాళ్ల మధ్య వివాదాలు తలెత్తాయి.పవన్ నిజస్వరూపం తెలియాలంటే 2018–2024 వరకు చిరంజీవి, ఆయన కుమారుడు రామ్చరణ్ తప్ప పవన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టాలి.పవన్ హైదరాబాదులో కొనుగోలు చేసిన 4,200 గజాల విలువ రూ.50 కోట్లుగా చూపించారు. దానిని 2021–2024 మధ్యే కొనుగోలు చేశారు. నిజానికి.. దాని విలువ సుమారు 125 కోట్లుగా ఉంది. మిగిలిన రూ.75 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. సినిమాలు లేకుండా ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి.పవన్ బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్ల కింద రూ.28 కోట్లు ఉన్నాయని చూపించారు. కానీ, బయట వ్యక్తుల దగ్గర రూ.46 కోట్ల అప్పులను కూడా చూపించారు. బ్యాంకులో రూ.28 కోట్లు ఉండగా ఎక్కువ వడ్డీకి ఎవరైనా బయట నుంచి అప్పు తెచ్చుకుంటారా?సినీ పరిశ్రమలోను, బయట పవన్ బినామీలున్నారు. వారిలో ప్రధానంగా నర్రా శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. వీరితోపాటు అమెరికాలోని పవన్ పిన్ని కొడుకు అనిల్, అలాగే, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, తంగేళ్ల సుమన్ వీరంతా కూడా ఆయన బినామీలే.ఇక పవన్ కొనుగోలు చేసిన ఆస్తులు కాకుండా అనేక ఆస్తులు అగ్రిమెంట్ మీద స్వా«దీనం చేసుకున్నారు. వాటినింకా రిజి్రస్టేషన్ చేసుకోలేదు. ఎన్నికల తర్వాత కొన్ని సినిమా అడ్వాన్సుల కింద తీసుకున్నట్లు చూపించి ఆపై రిజిస్ట్రేషన్ చేయించుకోనున్నారు. అలాగే, హైదరాబాద్లో ఆంధ్రజ్యోతి కార్యాలయం వెనుక నాలుగు నెలలు కిందటి వరకు జనసేన కార్యాలయంగా ఉన్న స్థలం సొంత కార్యాలయంగా మారిపోయింది.టీ టైమ్ తంగెళ్ల శ్రీనివాస్కు 2,500 టీ దుకాణాలు ఉన్నాయి. పవన్ తన బ్లాక్మనీని వైట్మనీగా మార్చుకునేందుకు ఈ దుకాణాలను మార్గంగా ఎంచుకున్నారు.పవన్ తన పిల్లల పేర్లు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దుచేశానని చెప్పారుగానీ ఎప్పుడు ఏ బ్యాంకులో ఎంత మొత్తానివి రద్దుచేసి ఏ ఆస్తి కొన్నారో చెప్పాలి.జనసేన కార్యాలయాల కోసం కొనుగోలు చేస్తున్న స్థలాలన్నీ కూడా పవన్ పేరు మీద ఎందుకు పెట్టాలి? పార్టీ పేరు మీద ఎందుకు రిజి్రస్టేషన్ చేయించడంలేదు?ప్యాకేజ్ ద్వారా తీసుకున్న డబ్బుల్ని ఫ్లోరిడాలో పెట్టుబడులు పెట్టేందుకే పవన్ విరాళాల ముసుగులో అమెరికా వెళ్తున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి బెంగళూరులో కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలు చేయడానికి పవన్ యత్నిస్తున్నారు. హాసిని ప్రొడక్షన్స్ ద్వారా ఈ డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు.పవన్తో తీసిన సినిమాలు ఫ్లాప్ అయినా, డబ్బులు రాకపోయినా నిర్మాత విశ్వప్రసాద్ పవన్తో ఏడు సినిమాలు తీస్తానని చెప్తున్నారు. ఈ చిదంబర రహస్యం ఏంటి?పవన్ ప్రధాన బినామి టీజీ విశ్వప్రసాద్పై సీబీఐ విచారణ చేయాలి. ఈడీ, సీఐడీలు కేసులు నమోదు చేయాలి. రేణుదేశాయ్కు ప్రతినెలా రూ.10 లక్షలు టీజీ విశ్వప్రసాద్ తీసుకెళ్లి ఇస్తున్నారు.ప్యాకేజీకి అదనంగా పవన్కళ్యాణ్ సీట్లు అమ్ముకున్న మాట ముమ్మాటికి నిజం. జనసేన టికెట్లను తెలుగుదేశం వాళ్లకు ఇచ్చినందుకు ఒక్కో టికెట్కు రూ.10 కోట్లు పవన్ వసూలుచేశారు. -
చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు
-
పవన్.. నువ్వు తీసిన సినిమాలెన్నీ.. నీ ఆస్తులెంత?: పోతిన మహేష్
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని పవన్.. జనసేన పెట్టారని కామెంట్స్ చేశారు.కాగా, పోతిన మహేష్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఓ ప్యాకేజీ స్టార్. పాలేరు కంటే హీనంగా చంద్రబాబు కోసం పవన్ పనిచేస్తున్నారు. చంద్రబాబు డబ్బు తీసుకుని పవన్ పార్టీ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. తన ఆస్తులు కూడబెట్టుకునేందుకే జనసేన పార్టీ పెట్టారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక సాధారణ అపార్ట్మెంట్లో ఉంటున్నా అని 2014 పవన్ చెప్పాడు. ఒకప్పుడు కార్ ఈఎంఐ కట్టలేనని చెప్పాడు పవన్. ఇప్పుడు 2024 నాటికి 1500 నుండి 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. తిరగటానికి సొంతంగా హెలిక్యాప్టర్, భూములు ఎలా వచ్చాయో పవన్ చెప్పాలి. నమ్ముకున్న నాలాంటి వాళ్ళని అమ్ముకుని పవన్ ఆస్తులు సంపాదించాడు. మార్పు కోసం పని చెయ్యాలి అని చెప్తూ పవన్ చంద్రబాబుకు పాలేరులాగా పని చేశారు.ప్రజారాజ్యం పార్టీని నడపలేక చిరంజీవి ఏతేస్తే.. పవన్ పార్టీ పెట్టడానికి డబ్బులు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ 420. గత ఎన్నికల్లో ప్రజలు ముందే గ్రహించి తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనీవ్వను అంటు బాబుకే ఊడిగం చేస్తూ కొత్త పల్లవి ఎత్తాడు. తీసుకుంటున్న సీట్లు ఎన్ని? మార్పు సాధ్యం ఎలా?పార్టీ పెట్టింది పవన్ ఆస్తులు సంపాదించటానికి.. మాలాంటి వాళ్ళని తాకట్టు పెట్టి లగ్జరీ కార్లు కొన్నాడు. మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కనే 100 కోట్ల ల్యాండ్ కొన్నాడు. బినామీ నర్రా శ్రీనివాస్ మిత్రుడు పోసడపు వెంకటేశ్వరరావు పేరుతో కొంత భూమిని రిజిస్ట్రేషన్ చెప్పించారు. పవన్ కళ్యాణ్ డ్రైవర్ నవీన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా రిజిస్ట్రేషన్కు వచ్చాడు.డాక్యుమెంట్స్లో సరైన సైట్ ఫోటో కూడా పెట్టలేదు. డాక్టర్ బాబు బాలాజీ ప్రకాష్తో ఈ వ్యవహారం మొత్తం కుడా నడిపారు. ఈ భూమి పవన్ కళ్యాణ్ కోసమే కొన్నారు. విచారిస్తే నిజాలు తెలుస్తాయి. ఈ ల్యాండ్ కొనటానికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. సినిమాలు కూడా తీయలేదు. ఈ అంశంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాను.డాక్యుమెంట్స్ అడ్రస్, చెల్లింపులు వేరు వేరు చోట్ల నుండి జరిగాయి. 100 శాతం ఈ ఆస్తి బినామీ పేరుతో పవన్ కొన్నాడు. రంగారెడ్డిలో 45 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది ఇంకా పెంచుతున్నారు. ఎన్నికల ఆఫిడవిట్లో 14 ఎకరాలు అని పెట్టాడు పవన్. ఎన్నారైలు, కాపు సామాజిక వర్గం ఇచ్చిన డబ్బులు పవన్ వాడుకున్నాడు.పవన్ రక్త సంబంధీకుల ఆస్తుల వివరాలు వెల్లడించాలి. చిరంజీవి, రామ్ చరణ్ తప్ప అందరి ఆస్తుల వివరాలు చెప్పాలి. పవన్ కుటుంబ సభ్యులే ఆయనకు బినామీలు. 28 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. 48 కోట్లు అప్పులు ఉన్నాయి అని ఎన్నికల అఫిడవిట్లో తెలిపాడు. హైదరాబాద్లో ఒకప్పుడు జనసేన ఆఫీసు అద్దె భవనం, ఇప్పుడు సొంత భవనం. ఇంకా రిజిస్ట్రేషన్ అవలేదు. వీటికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. చంద్రబాబు నుండి తీసుకున్న డబ్బు కాదా?.పీపుల్స్ మీడియాలో పవన్కు వాట ఉంది. రేణు దేశాయ్కి ప్రతీ నెల 10 లక్షలు ఎందుకు ఇస్తున్నాడు. పవన్కు మరో ఆఫర్ వచ్చింది. అసెంబ్లీ , పార్లమెంట్ సీట్లు అమ్ముకుంటే 150 కోట్లు వచ్చాయి. చంద్రబాబు చెప్పిన వారికి సీట్లు ఇస్తే ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చారు. ఎంపీ బాలశౌరికి 30 కోట్లు తీసుకుని సీటు ఇచ్చారు. క్యాష్ ఇచ్చే వరకు బాలశౌరికి టికెట్ ప్రకటించలేదు. వీటన్నింటిపై పవన్ స్పష్టత ఇవ్వాలి. పవన్ తీసిన సినిమాలు ఎన్ని వచ్చిన ఆదాయం ఎంత?.రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్న పవన్ సామాన్య మధ్య తరగతికి చెందిన వాడు ఎలా అవుతాడు?. చెవిలో పువ్వులు పెడుతున్నాడు. పవన్ ఒక చీడ పురుగు. నాడు చిరంజీవి మోసం చేసి ఇంటికి వెళ్లాడు. నేడు పవన్ మళ్లీ వచ్చాడు. మోసం చేసి ఆస్తులు కూడబెట్టుకోవడమే వీరిద్దరి పని’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
-
పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ
-
పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ రాశారు. తాను ఆడిగిన ఆరు ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పాలని కోరారు. ప్రతి పది రోజులకు పవన్ ఫోన్ నెంబర్ ఎందుకు మర్చుతారో చెప్పాలని అడిగారు. ప్రత్యేక హెలికాప్టర్ ఖర్చుల లెక్కల సంగతి ఏంటని ప్రశ్నించారు. పులివెందులలో భారతి, కుప్పంలో భువనేశ్వరీ, మంగళగిరిలో బ్రాహ్మణి ప్రచారం.. మరి పీఠాపురంలో ఎవరు అంటూ సెటైర్లు వేశారు.ఎన్నారైలు ఇచ్చిన విరాళలు గోప్యంగా ఉంచి, చిరంజీవి ఇస్తే మాత్రం ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ ఒక్కరోజు అయినా ఒక్క అభిమానికి అయినా ఒక్క పూట భోజనం పెట్టారా? అని అడిగారు. మెగా ఫ్యామిలీకి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదని ఆరోపించారు. కాపు నేతల ఛానల్ను తొక్కుతూ వేరే ఛానల్పై అభిమానం ఎందుకని ప్రశ్నించారు. -
‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
సాక్షి, తాడేపల్లి: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.‘‘చెప్పింది చేసి చూపించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్. హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న వ్యక్తి సీఎం జగన్. సీఎం జగన్.. అక్కా చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చారు. ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేశారు. పేద ప్రజల నమ్మకం సీఎం జగన్. పేదల పట్ల సీఎం జగన్కు ప్రేమ ఉంది. కూటమి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. పారిశ్రామికవేత్తలకు దోచిపెట్డడానికే బాబుకు అధికారం కావాలి...14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ మేలూ చేయని వ్యక్తి చంద్రబాబు. చేసిన పనులు చెప్పుకుని ఓటెయ్యమని అడుగుతున్న నేత జగన్. ఓటమి భయంతో చంద్రబాబుకు ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారు. అందుకే జగన్పై దాడి చేయమంటున్నారు. సీఎం జగన్.. ప్రభుత్వ స్కూళ్లను సమూల మార్పులు చేసి, పేదలకు ఇంగ్లీషు మీడియం చదివిస్తున్నారు. చంద్రబాబు, పవన్ ఒకరిపై ఒకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తారో ఎందుకు చెప్పటం లేదు?. సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నందునే ఆయన ఫోటో ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది....నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనలపై చర్చకు మేము సిద్ధం. దీనిపై చర్చించేందుకు టీడీపీ కూటమికి ధైర్యం ఉందా?. అంబేద్కర్ భావాజాలాన్ని వాస్తవరూపంలోకి తెచ్చిన నేత సీఎం జగన్. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు. కాపులకు మేలు చేసినదే వైఎస్ జగన్. కాపులను పసుపు సైన్యంగా మార్చే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్రబాబు మీద అంతటి విశ్వాసం చూపడానికి పవన్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారు?...చంద్రబాబు గురించి భజన చేయటం, బాకా ఊదటం తప్ప ఇంకేం చేశారు?. పవన్ కళ్యాణ్ కాపులను ఎదగనీయటం లేదు. కాపుల ఆత్మగౌరవం దెబ్బ తింటోంది. ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు దాడి చేయిస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు? హరిరామజోగయ్య రాసిన లేఖలకు ఎందుకు సమాధానం చెప్పలేదు?. పవన్ కళ్యాణ్ జీవితంలో ఏదీ పర్మినెంట్గా ఉండదు. అన్నీ తాత్కాలిక వ్యవహారాలే...2019 తర్వాత జనసేన నుంచి కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు?. వారందరినీ చంద్రబాబు ఆదేశాలతో బయటకు పంపారా?. లేక చంద్రబాబు బ్రోకర్ నాదెండ్ల మనోహర్ వలన బయటకు వెళ్లారో పవన్ సమాధానం చెప్పాలి. పవన్కు ఎప్పుడూ సేవలు చేసిన అంజిబాబు ఎందుకు బయటకు వెళ్లాడో చెప్పాలి?’’ అని పోతిన మహేష్ ధ్వజమెత్తారు. -
పవన్ కళ్యాణ్ అఫిడవిట్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు
-
పవన్ ఆస్తులు మాయ.. పెళ్లాల లెక్కలూ మాయే..
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత ఆస్తులు మాయ అని, ఆయన పెళ్లాల లెక్కలూ మాయే అని వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల అఫిడవిట్లో ఆదాయం, ఆస్తులపై మాయ చేస్తున్నట్లు పెళ్లాలు, గొళ్లేల విషయంలోనూ మాయచేస్తున్నావే అని దెప్పిపొడిచారు. పవన్ ఏ భార్యతో ఎంతకాలం ఉన్నారు, ఒక భార్యతో సంసారం చేస్తూ మరొకరితో పిల్లలను కన్న విషయం, ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు, వీటన్నింటిపై స్పష్టత ఇస్తే బాగుంటుందని అన్నారు. మహేశ్ బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఎన్నికల అఫిడవిట్లో అడుగుకో అబద్ధం చెప్పాడని, అందులో వివరాలపై విచారణ చేయించాలని అన్నారు.‘ఐదేళ్ల ఆయన సంపాదన రూ.114.76 కోట్లు అని చెప్పారు. అందులో రూ.73 కోట్లు పన్నులు, పార్టీ డొనేషన్ రూ.20 కోట్లు అని చెప్పారు. ఇవన్నీ పోను ఇంకా రూ.90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నాడు’ అని నిలదీశారు. ‘పవన్ ప్రకటించిన ఆస్తులన్నీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్నవే. రూ.90 కోట్ల ఆస్తులు 2018 – 2024 మధ్యలో కొన్నారు. ఇది రిజిస్టర్ విలువే. వాటి మార్కెట్ విలువ రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఉంటుంది.ఇదే సమయంలో ఆయన చేసిన సినిమాలు నాలుగే. వాటిలో యావరేజ్గా ఆడినవి రెండు. మిగతావి డిజాస్టర్ అయ్యాయి. అయినా రూ.90 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా లేక జనసేన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెడితే వచ్చాయా? కరోనా సమయంలో 2021లో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే.. అప్పుడు కూడా ఆయన రూ.33 కోట్ల ఆస్తులు కొన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు పసుపు కరోనా ఏమైనా కాటేసిందా’ అని ధ్వజమెత్తారు.ఈ మధ్య ముగ్గురు నలుగురు పెళ్లాలు అంటేనే పవన్ గింజుకుంటున్నారని, మరి వలంటీర్లను ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అంటే వారికి కోపం రాదా అని ప్రశ్నించారు. ‘అన్న చిరంజీవిని పదే పదే అవమానిస్తున్నది పవనే. కానిస్టేబుల్ కొడుకునంటారు గానీ, చిరంజీవి సినిమా భిక్ష పెట్టడం వల్లే పవర్ స్టార్ అయ్యానని ఎక్కడా చెప్పరు. తల్లిని అవమానించిన లోకేశ్, చంద్రబాబుతో జట్టు కట్టిన పవన్ ఈరోజు తల్లిని కూడా అవమానించారు’ అని అన్నారు.ఓటమి భయంతో ఇష్టానుసారం పేలుతున్న పవన్ఓటమి భయంతోనే పవన్ సీఎం జగన్పై ఇష్టానుసారం పేలుతున్నారన్నారు. కాపుల్ని, కార్యకర్తలను కూడా కించపరుస్తున్నారని చెప్పారు. పోటీ చేసిన రెండుచోట్లా ప్రజలు కాళ్ళు, కీళ్ళు విరగ్గొట్టినా పవన్కు బుద్ధి రాలేదన్నారు. తనని ఒక్కడినైనా గెలిపించాలని, ప్లీజ్ అంటూ అడుక్కునే పవన్ ఒక పార్టీకి అధ్యక్షుడేనా అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్ని నమ్ముకున్నారని, ప్రజలు కూడా సీఎం జగన్ని నమ్మారని తెలిపారు. అందుకే సీఎం జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్నందునే సీఎం జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.కూటమి కాదది.. కుమ్మక్కు రాజకీయంటీడీపీ, జనసేన, బీజేపీలది కూటమి కాదని, కుమ్మక్కు రాజకీయమని మహేశ్ ధ్వజమెత్తారు. పోటీ చేసేదంతా చంద్రబాబు మనుషులేనని, పార్టీలే మారతాయని చెప్పారు. జనసేన, బీజేపీ అభ్యర్థులు చంద్రబాబు గుంపులో నుంచి వచ్చిన వారేనన్నారు. ఈ గుంపును హైనాలు, గుంటనక్కలు, తోడేళ్లు అనక ఇంకేమనాలని ప్రశ్నించారు. వాళ్లు ప్రజల కోసం కూటమి కట్టలేదని, ప్రజల ఆస్తులను దోచుకునేందుకు, పేదల నోట్లో మట్టికొట్టేందుకు, భూములు కొట్టేసి రూ.లక్షల కోట్లు సంపాదించేందుకేనని అన్నారు.జనసేన అధ్యక్షుడు పవనే సీఎం అభ్యర్థి అని చాలా కాలం సోషల్ మీడియాలో రాగం తీశారని, తీరా చూస్తే 24 సీట్లల్లో పోటీ చేస్తున్నానని చెప్పారని, ఆ తర్వాత 21 సీట్లతో సరిపెట్టారని, వీటిలోనూ నిజమైన జనసేన కార్యకర్తలకు దక్కింది 11 సీట్లేనని చెప్పారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఇలాగే ఉంటాయని అన్నారు. -
పవన్ కళ్యాణ్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు
-
జనసేన కాదు పసుపుసేన...రెచ్చిపోయిన పోతిన మహేష్
-
ప్యాకేజీ పవన్... నాదెండ్లకు రూ.10 కోట్ల కారు
-
ఎలక్టోరల్ బాండ్లలో పవన్కు ఎంత ముట్టింది?
-
సీఎం జగన్ దాడిపై పోతిన మహేష్ రియాక్షన్...
-
వైఎస్సార్సీపీలో చేరిన పోతిన మహేష్
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు (ఫొటోలు)
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి పోతిన మహేష్
సాక్షి, పల్నాడు: ఏపీలో ఎన్నికల వేళ వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్సీపీలో చేరారు. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. అయితే, పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్రమైన ఆరోపణలు చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
విజయవాడ వెస్ట్ సీటుపై పోతిన మహేశ్ ఆశలు
-
‘ఆ స్థాయి మహేష్కు లేదు’
సాక్షి, విజయవాడ: మంత్రి వెలంపల్లి శ్రీనివాస్పై జనసేన నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, వైఎస్సార్సీపీ నేత కొనకళ్ల విద్యాధరరావు అన్నారు. దేవాలయాలు పునర్నిర్మాణం చేయలేదన్న మహేష్ వ్యాఖ్యల్లో అర్థం లేదని తోసిపుచ్చారు. టీడీపీ ప్రభుత్వం పుష్కరాలను అడ్డు పెట్టుకుని అనేక దోపిడీలకు పాల్పడిందని విమర్శించారు. టీడీపీ హయాంలో దేవాలయాలు కూల్చివేస్తుంటే బాబుతో దోస్తీ చేసిన పవన్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పులను ఈ ప్రభుత్వం సరిచేస్తోందని హితవు పలికారు. పైలా సోమినాయుడు, కొనకళ్ల విద్యాధరరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జిల్లాలోని దేవాలయాలకు ఏడాది కాలంలో రూ.15 కోట్లు ఇచ్చిన ఘనత వెలంపల్లికే దక్కుతుంది. అవగాన లేకుండా పోతిన మహేష్ మాట్లాడడం తగదు. శివస్వామిని విమర్శించే స్థాయి మహేష్ కు లేదు. కరోనా సమయంలో ప్రజలందరికీ కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేసిన వ్యక్తి వెలంపల్లి. వైఎస్సార్సీపీ నేతల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని అసత్య ప్రేలాపనలు చేస్తున్నారు. గత టీడీపీ హయాంలో కూల్చివేసిన ఆలయాలను తిరిగి పునర్నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆధారాలుంటే విమర్శలు చేయాలి తప్ప అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు’అని వారు పేర్కొన్నారు. -
కరుణించవమ్మా మహాలక్ష్మి..
సాక్షి, విజయవాడ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీ అయినా సరే.. చిట్టినగర్ జంక్షన్లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అవి అసెంబ్లీ ఎన్నికలైనా..కార్పొరేషన్ ఎన్నికలైనా సరే చిట్టినగర్కు చేరుకుని పూజలు చేస్తే విజయం సాధిస్తారని నమ్మకం. గతంలో ఒకరిద్దరు మాత్రమే అమ్మవారికి దర్శించుకునే వారు. అయితే ఈ దఫా వారి సంఖ్య ఎక్కువైంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఈ ఆనవాయితీ పాటించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరపున పోటీలో ఉన్న వెలంపల్లి శ్రీనివాస్తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాడ విజయ్కుమార్ మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నామినేషన్ వేశారు. జనసేన అభ్యర్థి పోతిన మహేష్ కూడా చిట్టినగర్ జంక్షన్ నుంచి సోమవారం ర్యాలీ ప్రారంభిస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన చిట్టినగర్ జంక్షన్ నుంచే రాజకీయం ప్రారంభంకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. -
బీజేపీ భూస్థాపితం కాకతప్పదు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ గాంధీనగర్ : రాజ్యసభలో ప్రత్యేకహోదా బిల్లును అడ్డుకున్న బీజేపీని భూస్థాపితం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటమహేష్ పిలుపునిచ్చారు. లెనిన్సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా బిల్లును అడ్డుకున్న బీజేపీ భరతం పట్టాలన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్తో చేతులు కలిపిన బీజేపీ ప్రత్యేక హోదాకోసం పెట్టిన ప్రైవేటు బిల్లుకు ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రైవేటు బిల్లును ఓటింగ్కు రాకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతివ్వని పార్టీలు రానున్న ఎన్నికల్లో మట్టికరచిపోతాయన్నారు. ప్రైవేటు బిల్లు విషయంలో రాజకీయ పార్టీలు అనుసరించిన తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కామరాజు హరీష్, గ్రంథి మహేష్, బత్తుల వెంకటేష్, అప్పలరెడ్డి, గిరీష్, రజాక్, చందు, నూకరాజు, చిన్నా పాల్గొన్నారు. 23విఐసి162– దిష్టిబొమ్మ దహనం చేసు్తన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు