pre-release event
-
మ్యాడ్ లాంటి సినిమాలు ఆరోగ్యానికి మంచిది- నాగచైతన్య
‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ట్రైలర్ బాగుంది. నేను ‘మ్యాడ్’ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటుంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. డల్గా ఉన్నప్పుడు ‘మ్యాడ్’ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం’’ అని హీరో అక్కినేని నాగచైతన్య చెప్పారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాలు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేలా చేస్తాయి. ఫ్రెండ్షిప్ని స్ట్రాంగ్ చేస్తాయి. కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాయి. కామెడీ చేయడం అనేది చాలా కష్టం. నార్నే నితిన్, రామ్, సంగీత్లలో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఇంత నవ్వించగలిగారు. నాగవంశీ, నా ప్రయాణం ‘ప్రేమమ్’ సినిమాతో మొదలైంది. దర్శకులకు, నటులకు ఎంతో ధైర్యాన్నిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు వంశీ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘మ్యాడ్ 2’ మాత్రమే కాదు.. ‘మ్యాడ్ 100’ కూడా రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
మీ ఫ్యామిలీలోకి ఆహ్వానించినందుకు థ్యాంక్స్: డేవిడ్ వార్నర్
‘‘నమస్కారం... ‘రాబిన్ హుడ్’లో నటించే చాన్స్ రావడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. మీ ఫ్యామిలీలోకి నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్స్. ఈ సినిమాలోని నా కోస్టార్స్ చాలా కష్టపడ్డారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ‘రాబిన్ హుడ్’ పెద్ద సక్సెస్ కావాలి’’ అని ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నారు. నితిన్ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటించారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రీ రీలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ సినిమాలో అతిథి పాత్ర చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ వేడుకకు అతిథిగా హాజరై, ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ– ‘‘రాబిన్ హుడ్’ విజయంపై కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒక సినిమాకు రియల్ హీరోలు నిర్మాతలే. ఇండియాలో మైత్రీ టాప్ ప్రొడక్షన్ హౌస్ అని ‘పుష్ప’ సినిమాతో నిరూపితమైంది. ‘రాబిన్ హుడ్’ని మైత్రీ వాళ్లు కాబట్టే ఇంత భారీగా తీశారు. నాపై ఉన్న ప్రేమను వెంకీ ఈ సినిమా రూపంలో చూపించాడు. డేవిడ్ వార్నర్గారి వల్ల ఈ సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ప్రపంచ క్రికెట్లో ఆయన పెద్ద లెజెండ్ క్రికెటర్. కానీ తెలుగువారికి వార్నర్గారు.. డేవిడ్ భాయ్... వార్నర్ మామానే’’ అన్నారు.‘‘రాబిన్ హుడ్’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ ట్రైలర్ చూడగానే ఈ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్బస్టర్ అని వెంకీతో చెప్పాను’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘నితిన్ , డేవిడ్ వార్నర్గార్లు, చాలా బిజీగా ఉండి కూడా ఈ సినిమా చేసిన శ్రీలీల, ‘అదిదా సర్ప్రైజ్’ పాట చేసిన కేతికా, ఇతర టీమ్కి థ్యాంక్స్’’ అని తెలిపారు వై. రవిశంకర్. ‘‘భీష్మ’ తర్వాత నితిన్ అన్న, నేను ‘రాబిన్ హుడ్’తో వస్తున్నాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం నితిన్ అన్న, బాగా తీయడానికి కారణం నవీన్ , రవిగార్లు. ఈ సినిమాకు బజ్ రావడానికి ఒక కారణం కేతికా ‘అదిదా సర్ప్రైజ్’ సాంగ్.. రెండోది డేవిడ్ వార్నర్గారు ఇండియన్ సినిమాకు రావడం’’ అని చెప్పారు వెంకీ కుడుముల.‘‘రాబిన్ హుడ్’తో హీరోగా కమర్షియల్ స్పేస్లో నితిన్ మరో లెవల్కి వెళ్తాడు. ఇలాంటి మరిన్ని సినిమాలు చేసి, వెంకీ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ లిస్ట్లోని పెద్ద హిట్స్ మూవీలో ‘రాబిన్ హుడ్’ ఉండాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు రాజేంద్రప్రసాద్. ‘‘ఆల్మోస్ట్ ఏడాది తర్వాత నేను హీరోయిన్గా వస్తున్న ‘రాబిన్ హుడ్’ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శ్రీలీల. ఈ వేడుకలో ‘పుష్ప’ సినిమాలోని ఫుట్ స్టెప్, ‘రాబిన్ హుడ్’లోని ‘అదిదా సర్ప్రైజ్’ పాట హుక్ స్టెప్స్ ట్రై చేసి, అలరించారు డేవిడ్ వార్నర్. -
కొత్త కిరణ్ని చూస్తారు
‘‘సినిమా ఇండస్ట్రీపై ఓ నమ్మకంతో ఇక్కడికి వచ్చి... కష్టాలు పడలేక ఎంతో మంది తిరిగి వెళ్లిపోవడం చూశాను. మీరు ధైర్యంగా ఉండండి... తప్పకుండా నాలా మీరు కూడా సంతోషంగా ఉండే రోజు వస్తుంది. సినిమా మీద ప్యాషన్తో పల్లెల నుంచి హైదరాబాద్కి వచ్చేవారిలో ఓ పదిమందికి ఏటా సాయం చేస్తాను... అది వసతి అయినా సరే లేకుంటే భోజనం కానీ, అవకాశాలు కానీ... నా చేతనైన సాయం వారికి చేస్తాను’’ అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమాలో 40 నుంచి 50 మంది కొత్తవాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నాను. ఇకపైనా చాన్స్ ఇస్తాను’’ అన్నారు. విశ్వ కరుణ్ మాట్లాడుతూ– ‘‘దిల్ రుబా’లో కొత్త కిరణ్ని చూస్తారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఎంతోమంది మా ‘దిల్ రూబా’ని రిలీజ్ చేస్తామని అడిగినా మూవీపై నమ్మకంతో సొంతంగా మేమే విడుదల చేస్తున్నాం’’ అని రవి తెలిపారు. ‘‘ఈ మూవీతో కిరణ్గారికి, మా టీమ్కి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు రాకేశ్ రెడ్డి. -
మహిళ గొప్పతనం చాటేలా...
‘‘నేనెక్కడున్నా’ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ మూవీలో అందరూ గొప్పగా నటించారు. మా నాన్న మిథున్ చక్రవర్తిగారిలా నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అని మిమో చక్రవర్తి అన్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, సాషా చెత్రి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘నేనెక్కడున్నా’(Nenekkadunna). మాధవ్ కోదాడ దర్శకత్వంలో కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యామ్ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాథ్ రెడ్డితోపాటు పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘మిథున్ చక్రవర్తిలా మిమో చక్రవర్తి కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘పత్రికా రంగంలోని వ్యక్తికి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఆ సమస్యలను వారు ఎదుర్కోవడం అవసరమా? అనే ప్రశ్నకు జవాబు ఈ సినిమా’’ అని గోపీనాథ్ రెడ్డి చె΄్పారు. ‘‘మహిళల గొప్పతనం చాటి చెప్పేలా జర్నలిజం నేపథ్యంలో ఈ సినిమా చేశాం’’ అని చె΄్పారు మాధవ్ కోదాడ. -
బాపు ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించింది – నాగ్ అశ్విన్
‘‘బాపు’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రంపై క్యూరియాసిటీ కలిగించింది. సినిమా టాక్ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ సెకండ్ డే నుంచి హౌస్ఫుల్ చేస్తారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. బ్రహ్మాజీ లీడ్ రోల్లో దయా దర్శకత్వం వహించిన చిత్రం ‘బాపు’. ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రాజు, సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ రేపు విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, చందు మొండేటి, బుచ్చిబాబు సాన, హీరో సత్యదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీ ట్రైలర్లో రా ఎమోషన్ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఉండదు. మంచి సినిమా ఏదైనా పెద్ద చిత్రమే’’ అని చందు మొండేటి చె΄్పారు. ‘‘ఈ సినిమాని దయాగారు చాలా బాగా తీశారు’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని బ్రహ్మాజీ తెలిపారు. ‘‘కిస్మత్’ తర్వాత ‘బాపు’ నా రెండో సినిమా’’ అన్నారు భానుప్రసాద్ రెడ్డి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి’’ అని పేర్కొన్నారు దయా. -
చిన్న సినిమా బాగుంటేనే మనం బాగుంటాం – కిరణ్ తిరుమల శెట్టి
‘‘ఇండస్ట్రీలో మనమంతా బతికేది చిన్న చిత్రాల వల్లే. అవి బాగుంటేనే మనం బాగుంటాం. మా ‘డ్రింకర్ సాయి’ నచ్చితే పది మందికి చెప్పండి.. నచ్చకుంటే వంద మందికి చెప్పండి’’ అని డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి అన్నారు. ధర్మ, ఐశ్వర్యా శర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఇస్మాయిల్ మాట్లాడుతూ– ‘‘డ్రింకర్ సాయి’లో అన్ని భావోద్వేగాలున్నాయి’’ అన్నారు. ‘‘ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ని. ఆయన్ని కలవగా.. ‘డ్రింకర్ సాయి’ సక్సెస్ కావాలని కోరడం సంతోషాన్నిచ్చింది’’ అని ధర్మ తెలిపారు. -
కథ చాలా కొత్తగా ఉంది: బాబీ కొల్లి
‘‘నేను, మోహన్ కలిసి రైటర్స్గా పని చేశాం. తను ఈ సినిమాని వినోదంతో పాటు సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తీశాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని డైరెక్టర్ బాబీ కొల్లి అన్నారు. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్లో, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ బాబీ కొల్లి, కల్యాణ్ కృష్ణ అతిథులుగా హాజరయ్యారు. ‘‘ఈ సినిమా కంటెంట్ని బలంగా నమ్మాను. ఆ కథే నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘నా కెరీర్లో చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది’’ అని అనన్య నాగళ్ల పేర్కొన్నారు. ‘‘నటుడిగా ఈ చిత్రం నాకు చాలా కీలకం’’ అన్నారు రవితేజ మహాదాస్యం. ‘‘ఈ మూవీతో కచ్చితంగా హిట్ సాధిస్తాం’’ అని వెన్నపూస రమణారెడ్డి చెప్పారు. -
‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మీకంటే నేనెక్కువగా బాధపడుతున్నాను: ఎన్టీఆర్
‘‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా బాధగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. ‘దేవర’ సినిమా గురించి చె΄్పాలని, ఈ సినిమా కోసం మేం పడ్డ కష్టాన్ని వివరించాలని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. కానీ భద్రతా పరమైన కారణాల వల్ల ఈవెంట్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్లీ చెబుతున్నాను. మీతో పాటు నేనూ బాధపడుతున్నాను. మీ కంటే నా బాధ చాలా పెద్దది... ఎక్కువ కూడా’’ అని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర’. ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఇది.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్స్ గా నటించారు. కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’ ఈ నెల 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో చిత్రయూనిట్ నిర్వహించాలనుకున్న ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ భద్రతా కారణాల వల్ల రద్దు అయింది. ఈ నేపథ్యంలో అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఆదివారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మీరు నాపై కురిపించే ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను.ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు ‘దేవర’ సినిమా నిర్మాతలను, ఈవెంట్ నిర్వాహకులను బ్లేమ్ చేయడం తప్పని నా భావన. కానీ ఈ రోజు మనం కలవకపోయినా సెప్టెంబరు 27న మనందరం కలవబోతున్నాం. ‘దేవర’ చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. నేను మీకు ఎప్పుడూ చెప్పినట్లే... మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే నా బాధ్యత. దాంతో వచ్చే ఆనందాన్ని నా మాటల్లో చెప్పలేను. ఈ సెప్టెంబరు 27న అదే జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైన సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి. అందరూ ఆనందించండి.మీ ఆశీర్వాదం ఈ ‘దేవర’కు చాలా అవసరం. నాకూ చాలా అవసరం. దయచేసి మీ అశీర్వాదాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను. ఇంకొక్కమాట.. మీరందరూ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్లాలని ఇంకొక్కసారి మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను’’ అని అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే...‘దేవర’ సినిమా రిలీజ్ ట్రైలర్ను ఆదివారం ఉదయం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో ఉన్న డైలాగ్స్లో ‘దేవర అడిగినాడంటే సెప్పినాడని’ అనే డైలాగ్ ఒకటి. -
హీరో నాని 'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్
‘‘నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ మంచి దర్శకులతో పనిచేశాను. వాళ్లందరి దగ్గరి నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటూ వచ్చి డైరెక్టర్ అయ్యాను. నాకు నటనకంటే కూడా డైరెక్షన్ అంటే ఎక్కువ ఇష్టం’’ అని ధనుష్ అన్నారు. ఆయన హీరోగా నటì ంచి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. ప్రకాశ్ రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ నిర్మించిన ‘రాయన్’ ధనుష్ కెరీర్లో 50వ సినిమా.ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రిలీజ్ అవుతోంది. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ–‘‘నేను ముఖ్యంగా రెండు విషయాలకు కృతజ్ఞతలు చె΄్పాలనుకుంటున్నాను. ఒకటి.. నా మొదటి సినిమా నుంచి 49వ సినిమా వరకూ నేను పని చేసిన దర్శకులందరికీ కృతజ్ఞతలు. రెండోది.. నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు. ఈ వేడుకలో నా గత చిత్రాలకు సంబంధించిన ఏవీ వేసినప్పుడు నాకు చాలా తప్పులు కనిపించాయి. ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక గొప్పగా చెప్పుకునే సినిమా ఇవ్వాలనే ‘రాయన్’ చేశాను. తెలుగులో ఎన్టీఆర్తో మల్టీస్టారర్ చేయాలనుంది. నాకు తెలుగు వంటకాల్లో ఆవకాయ పప్పన్నం అంటే ఇష్టం’’ అన్నారు. ‘‘ధనుష్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలోనే ఫైనెస్ట్ హీరో అండ్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. క్రిస్మస్కి ‘గేమ్ చేంజర్’ సినిమాతో కలుద్దాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘రాయన్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు డి. సురేష్బాబు. నిర్మాతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. -
ఈరోజు మాట్లాడుతున్నారంటే కారణం మీరే సార్
-
పండుగకు నా సామిరంగను ఆదరించండి..!
-
ఎనర్జిటిక్ స్పీచ్ మాట్లాడిన శ్రద్ధ శ్రీనాథ్..!
-
ప్రతి ఒక్కరి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంది
-
వైజాగ్.. భలే హుషారు
విశాఖపట్నం: వైజాగ్ వస్తే చాలా హుషారుగా ఉంటుందని హీరో వెంకటేష్ అన్నారు. సైంధవ్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలను ఆదివారం బీచ్రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మొదటి సినిమా నుంచి వైజాగ్ ప్రేక్షకులు తనను ఆదరిస్తూ వస్తున్నారన్నారు. చాలా సినిమాలు వైజాగ్లో షూటింగ్ చేశామన్నారు. తన 75వ సినిమా సైంధవ్ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించారు. సైంధవ్ సినిమాకు హీరో సారా పాప అని చెప్పారు. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ తనకు వైజాగ్ బాగా కలిసి వచ్చిందన్నారు. సైంధవ్ సినిమాను స్టీల్ప్లాంట్ కాలనీలో 40 రోజులు షుటింగ్ చేశామన్నారు. హిట్, హిట్–2 సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసి మంచి విజయం సాధించామన్నారు. వెంకీమామను ప్రేక్షకులను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో చూపించామన్నారు. వెంకీమామ 75 సినిమా తనకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, నటీనటులు పాల్గొన్నారు. -
టీజర్.. ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి
‘‘మార్క్ ఆంటోనీ’ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈ చిత్రంతో విశాల్ మరో స్థాయికి వెళ్లాలి’’ అని హీరో నితిన్ అన్నారు. విశాల్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఎస్జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్ కీలక ΄ాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ‘మార్క్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హీరో నితిన్. విశాల్ మాట్లాడుతూ–‘‘నా మొదటి చిత్రం ‘చెల్లమే’ (ప్రేమ చదరంగం) విడుదలై సెప్టెంబర్ 10కి 19 ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు టికెట్ కొని నా సినిమాలు చూస్తున్నారు. ఆ డబ్బుతో నేను, నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలనుకోను. ఆ డబ్బు అందరికీ ఉపయోగపడాలనుకుంటాను. ‘మార్క్ ఆంటోనీ’ని తెలుగులో వేణుగారు రిలీజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇది తండ్రీ కొడుకుల కథ’’ అన్నారు అధిక్. ‘‘నా లైఫ్లో తమిళ సినిమా చేస్తాననుకోలేదు. నాకు రెండో అవకాశం ఇచ్చాడు అధిక్’’ అన్నారు నటుడు సునీల్. -
'King Of Kotha' Pre Release Event: దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
త్రిష అందానికి కార్తీ ఫిదా..
-
ఐశ్వర్య రాయ్ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతుందో చుడండి..
-
దిల్ రాజు మాటలకు ఐశ్వర్య రాయ్ ఎలా నవ్వుతుందో చుడండి..
-
'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నవ్వులతో నవరాగాలు ఒలికిస్తున్న నివేదా థామస్ (ఫోటోలు)
-
‘భళా తందనాన’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మా కోసం చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు: రాజమౌళి
సాక్షి, బెంగళూరు: ‘‘ఆర్ఆర్ఆర్’ స్వాతంత్య్ర పోరాట యోధుల సినిమా కాబట్టి నేను ఈ వేడుకకు వచ్చాను. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్య్రం తెచ్చారు. వారి గురించి, ఆ పోరాటం గురించి అందరికీ తెలియాలి’’ అన్నారు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటించగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నాటకలోని చిక్బళ్లాపూర్లో జరిగింది. శనివారం జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నాటక ముఖ్యమంత్రి సీఎం బసవరాజ బొమ్మై మాట్లాడుతూ – ‘‘దేశం గర్వించదగ్గ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించారు రాజమౌళి. దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లో చూడాలి. కన్నడలోనూ ఈ సినిమా రావడం గర్వంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విజయవంతమై చరిత్రలో నిలిచిపోవాలి. ఈ సమయంలో పునీత్ రాజ్కుమార్ను మరవడం సాధ్యం కాదు. విజేతలు మరణించాక కూడా జీవిస్తారనే వివేకానందుడి మాటలు పునీత్ జీవితంలో నెరవేరాయి. పునీత్కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును త్వరలో ఆయన కుటుంబ సభ్యులకు అందిస్తాం’’ అన్నారు. ‘‘ఆర్ఆర్ఆర్ అంటే రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్ ఒక్కటే’’ అని మరో అతిథి, కర్నాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ అన్నారు. ‘‘కొంచెం సంతోషం, కొంత బాధగా ఉంది. మా తమ్ముడు పునీత్ మరణంతో నాలుగు నెలలుగా సినీ పరిశ్రమ, కన్నడనాడు దుఃఖంలో ఉంది. రామ్చరణ్, తారక్ (ఎన్టీఆర్)లో పునీత్ను చూస్తున్నాను. దక్షిణాది నుంచి అంతర్జాతీయ స్థాయికి ఒక దర్శకుడు (రాజమౌళి) ఎదగడం గర్వంగా ఉంది’’ అన్నారు మరో అతిథి, కన్నడ హీరో శివరాజ్కుమార్. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘పునీత్ అందరి మనసుల్లో ఉన్నారనడానికి ఇటీవల విడుదలైన ఆయన ‘జేమ్స్’ సినిమా విజయమే నిదర్శనం. ‘ఆర్ఆర్ ఆర్’ తెలుగు సినిమాకి గర్వకారణం కాబట్టి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్రెడ్డిగారికి, మంత్రి పేర్ని నాని, కొడాలి నానీగార్లకు, తెలంగాణ సీఎం కేసీఆర్గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్గారికి, ఎంపీ సంతోష్కుమార్గారికి, ప్రకాశ్రాజ్కి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిగారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనతో మాట్లాడి టికెట్ రేట్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మమ్మల్ని నెగ్గించేందుకు చిరంజీవిగారు చాలామందితో ఎన్నో మాటలు పడ్డారు. ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు ఇష్టం ఉండదు. కానీ నేను మాత్రం ఆయన్ను ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. నేను అడిగిన వెంటనే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నా రాముడు (రామ్చరణ్), నా భీముడు (ఎన్టీఆర్) శరీరంలోని ప్రతి అణువును పెట్టారు’’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ – ‘‘ఏపీ, తెలంగాణ తర్వాత కర్నాటక పెద్ద మార్కెట్. ప్రతి ఒక్కరూ థియేటర్లోనే సినిమా చూడాలి’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ప్రాంతీయ సినిమాల అడ్డంకులను చెరిపివేసి తన సినిమాల ద్వారా భారతదేశ ఐక్యతను చాటుదామనుకుంటున్న ఓ గొప్ప దర్శకుడి కల ‘ఆర్ఆర్ఆర్’. ఇది ఒక భారతదేశ సినిమా అని గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘రామ్చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి... ముగ్గురూ అత్యుత్తమ ప్రదర్శనను ఈ సినిమాలో కనబరిచారు’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి . ‘‘ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిగారికి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిగార్లకు ధన్యవాదాలు. తెలంగాణ సీఎం కేసీఆర్గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు చిత్రనిర్మాత దానయ్య. సినిమాను కర్ణాటకలో విడుదల చేస్తున్న వెంకట నారాయణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్’ అనే అక్షరానికి ఎంతో పవర్ ఉంది. ఏపీలో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీ ఆర్, కర్నాటకలో రాజ్కుమార్, హిందీలో రాజ్కపూర్.... ఇలా ‘ఆర్’కు ఎంతో పవర్ ఉంది. అలాంటిది ఇప్పుడు మూడు ‘ఆర్’లు కలసి వస్తున్నారు’’ అన్నారు. -
‘స్టాండప్ రాహుల్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
డీజే టిల్లు మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
అతిథి.. నిరాశపరచదు
‘‘అతిథి దేవోభవ’ సినిమా చాలా బాగుంది. ఏ ఒక్కరినీ నిరాశపరచదు. ఈ చిత్రం నచ్చితే ఓ పది మందికి చెప్పండి.. నచ్చకపోతే ఇరవై మందికి చెప్పండి’’ అని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అన్నారు. ఆది సాయికుమార్, సువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవోభవ’. రాం సత్యనారాయణ రెడ్డి సమర్పణలో రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘వందేమాతరం’ నుంచి సాయి కుమార్తో ప్రయాణం చేస్తున్నాను. వాళ్లబ్బాయి ఆదికి ‘అతిథి దేవోభవ’తో పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘ఆది కష్టపడే తత్వానికి ఇంకా పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు జీవితారాజశేఖర్. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఆది భావోద్వేగాలు బాగా పండించాడనిపిస్తోంది’’ అన్నారు హీరో కార్తికేయ. ‘‘మంచి సినిమా తీశాం.. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘మా సినిమా ఫస్ట్ హాఫ్ వినోదంగా, సెకండాఫ్ కొత్తగా ఉంటుంది’’ అన్నారు పొలిమేర నాగేశ్వర్. -
‘శ్యామ్ సింగరాయ్’ ప్రీ-రిలీజ్ వేడుక ఫోటోలు
-
శర్వానంద్ నాకు మరో రామ్చరణ్ లాగా: చిరు
‘‘ఒక యాక్టర్ కొడుకు యాక్టర్, డాక్టర్ కొడుకు డాక్టర్, రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడు కావాలనుకుంటారు. కానీ ఓ రైతు కొడుకు రైతు అవ్వాలని అనుకోడు. రైతు కొడుకు కూడా గర్వంగా నేను రైతే అవుతాను అనే రోజులు మళ్లీ రావాలి. ఆ రోజు వస్తుందనే ఆశాభావం ఉంది’’ అని చిరంజీవి అన్నారు. వ్యవసాయ జీవితం నేపథ్యంలో శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా కిశోర్ బి. దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీకారం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ–‘‘శర్వానంద్ నాకు మరో రామ్చరణ్ లాగా. తను చిన్నప్పుడు నాతో కలసి థమ్స్అప్ యాడ్ చేశాడు. ‘శంకర్దాదా ఎంబీబీఎస్’లో అతిథి పాత్ర చేశాడు. ఆ రకంగా తన నటనకి శ్రీకారం చుట్టింది నేనే. చూస్తుండగానే సినిమా సినిమాకి పరిణతి సాధిస్తూ సినిమాలు చేస్తున్నాడు. మన చదువుతోటి వ్యవసాయానికి అధునాతన టెక్నాలజీని జోడిస్తే వ్యవసాయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లొచ్చు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ–‘‘నేను చిన్నప్పటి నుంచి చిరంజీవిగారి ఫ్యాన్. ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్ వేడుక ఇంత పెద్ద ఎత్తున ఖమ్మంలో జరగడానికి ప్రధాన కారణం చిరంజీవి. ‘ఆచార్య’ షూటింగ్ కొంతైనా ఖమ్మంలో చేయాలని ఆయన్ని కోరడంతో ఇల్లందులోని మైన్స్ వద్ద షూటింగ్ చేస్తున్నారు’’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘బాస్ (చిరంజీవి) ముందు మాట్లాడాలంటే టెన్షన్గా ఉంది. ‘శర్వా... నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీ తలరాతను తిరగరాస్తాడు’ అని చిరంజీవిగారు చెప్పిన మాటను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సంకల్పమే నన్ను స్టార్ని చేసి నా స్టార్ని మార్చింది. వారసత్వం ద్వారా చాలామందికి ఆస్తులు వస్తాయి. కానీ చిరంజీవిగారి క్యారెక్టర్, ఆ వారసత్వం నా స్నేహితుడు రామ్చరణ్ తేజ్కి వచ్చింది.. అది ఇంకెవ్వరికీ దక్కదు’’ అన్నారు. దర్శకుడు కిశోర్ మాట్లాడుతూ – ‘‘శర్వానంద్గారిని ఒక హీరోలా కాదు.. నా అన్నలా భావిస్తున్నాను’’ అన్నారు. గోపీ ఆచంట మాట్లాడుతూ –‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ఈ వేడుకలో మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, పాటల రచయితలు పెంచల్ దాస్, కేకే, భరద్వాజ, నిర్మాత చెరుకూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవికి శర్వా పాధాభివందనం -
మా స్నేహం అలానే ఉంది
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మెయిల్’. ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో స్వప్నా సినిమాస్ పతాకంపై స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు. ఈ నెల 12న ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నేను, అశ్వినీదత్ గారు సినిమా పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు అవుతోంది. మాతో పాటు వచ్చిన వాళ్లలో ఇంకా సినిమాలు తీస్తున్నది మేం మాత్రమే. ఇది మా గొప్పతనం అనటం కంటే మా పిల్లలు మా నుండి వస్తున్న దాన్ని అందుకోవటం వల్లే మాకు ఉత్సాహం వచ్చింది. మేమిద్దరం కలిసి ఏడు సినిమాలు చేశాం. సినిమాలు వచ్చాయి.. పోయాయి. మా స్నేహం మాత్రం అలానే ఉంది. స్వప్నను పిలిచి ఆహా కోసం వెబ్ సిరీస్ చేయమన్నాను. ఉదయ్తో చేస్తున్న ప్రాజెక్ట్ రష్ చూపించింది. నాకు నచ్చింది.. త్వరలోనే ఆహాలో వస్తుంది’’ అన్నారు. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాకు పరిశ్రమలో ఎవరు ఆత్యంత ఆప్తులు అంటే ముగ్గురు పేర్లు చెప్తాను. చిరంజీవిగారు, అల్లు అరవింద్, కె.రాఘవేంద్రరావు. అరవింద్ గారు పిలిచి వెబ్ సిరీస్ చేయమన్నారని మా అమ్మాయి స్వప్న చెప్పింది. అప్పుడు నేను నీకిది గోల్డెన్ చాన్స్ అని చెప్పాను’’ అన్నారు. స్వప్నాదత్ మాట్లాడుతూ– ‘‘పార్టనర్షిప్ గురించి నాన్నతో మాట్లాడితే ‘నేను, అరవింద్ ముప్ఫై ఏళ్లుగా సినిమాలు చేశాం. హిట్స్ తీశాం, ఫ్లాపులు తీశాం. ఏ రోజూ ఒక్క మాట అనుకోలేదు. అదీ నిజమైన పార్టనర్షిప్ అంటే’ అన్నారు. మా హృదయానికి దగ్గరైన కథ ఇది. ఎంతో హాయిగా ఇంట్లోనే అందరూ కూర్చుని చూసే సినిమా’’ అన్నారు. ఉదయ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథను నేను ఇండిపెండెంట్గా చేద్దామనుకుంటున్న సమయంలో స్వప్నగారు కథ విని ఓకే చేశారు. మాపై ఎలాంటి ప్రెషర్ లేకుండా చిత్రీకరణకు సపోర్ట్ చేశారు’’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఎంతో పెద్ద లెగసీ ఉన్న అరవింద్గారు, అశ్వనీదత్గారితో సినిమా చేయటం ఆనందంగా ఉంది. వరల్డ్ సినిమా స్టైల్లో ఉదయ్ ‘మెయిల్’ను తెరకెక్కించారు’’ అన్నారు. -
'హిట్' మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
‘చూసీ చూడంగానే` ప్రీ రిలీజ్ వేడుక
-
‘మత్తు వదలరా’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘ఇద్దరి లోకం ఒకటే’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘వెంకీ మామ’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘యాక్షన్’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘విజిల్’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘ఎవరు’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రీ రిలీజ్ వేడుక
-
హిప్పీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
నాది యావరేజ్ బ్రెయిన్
‘‘సీత’ సినిమా ఎలా వచ్చిందని బెంగళూరులో అడగ్గానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. మామూలుగా సినిమా చాలా బాగా వచ్చింది.. సూపర్గా వచ్చిందని చెబుతారు. కానీ నేను అబద్ధం చెప్పలేను.. నిజమూ చెప్పలేను.. ఎందుకంటే నిజంగా నాకు జడ్జిమెంట్ లేదు. సినిమా తీశా.. ఎక్కడ తప్పులున్నాయో అని వెతుకుతున్నా’’ అని దర్శకుడు తేజ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరో కథానాయిక. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో తేజ మాట్లాడుతూ– ‘‘సీత’ చిత్రం 90 శాతం బాగుంది. ఇప్పటికి కూడా సినిమా సూపరా? బాగుందా? ఏంటో మీరే చూసి చెప్పాలి. నేను సినిమా తీసేసి పరుచూరి బ్రదర్స్కి చూపించా. వాళ్లు చెప్పిన కరెక్షన్స్తో మళ్లీ షూట్ చేసి అంతా సరి చేశా. ఎందుకంటే నాది అంత ఇంటెలిజెంట్ బ్రెయిన్ కాదు యావరేజ్ బ్రెయిన్. నా కళ్లజోడు చూసి మేధావి అనుకుంటారు. కళ్లజోడు పెట్టుకున్నవాళ్లంతా మేధావులు కాదు.. కొంతమందే మేధావులుంటారు. సాయి శ్రీనివాస్, కాజల్, సోనూసూద్, అనూప్.. వీళ్లందరికీ నేను గ్రేడింగ్ ఇవ్వగలనేమో కానీ, నా గ్రేడింగ్ మాత్రం మీరే (ప్రేక్షకులు)ఇవ్వగలరు. నన్ను తిట్టినా, పొగిడినా దాన్ని సినిమాలో పెట్టేస్తా. ఎందుకంటే నాకు సినిమా తప్ప ఇంకొకటి రాదు. హిట్లు తీసినా, ఫ్లాపులు తీసినా ఇక్కడే. ప్రేక్షకులే మాకు దేవుళ్లు.. మీరంతా బాగుండాలి’’ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ, ఆదరణ పొందడానికి నేను జీవితాంతం ఇలాగే కష్టపడుతూ ఉంటా. సినిమానే నాకు ప్రాణం. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. తేజగారిలాంటి పాసొనేట్ ఫిల్మ్ మేకర్ను నేను లైఫ్లో కలవలేదు. ఇలాంటి డైరెక్టర్లను అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పని చేస్తానని అనుకోలేదు. పురుషుల కంటే మహిళలకు మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో ‘సీత’ సినిమా చేశాం’’ అన్నారు. ‘‘ఫస్ట్ టైమ్ నేను నెర్వస్ ఫీలవుతున్నా. ‘సీత’ సినిమాతో చాలా నేర్చుకున్నా. తేజగారు లేకపోతే నేను ఈ స్టేజ్పై ఉండేదాన్ని కాదు. ఆయన స్కూల్లోనే నేను అంతా నేర్చుకున్నా. ‘సీత’ సినిమాతో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు కాజల్ అగర్వాల్. ‘‘నా ఫేవరెట్ లాంగ్వేజ్ ఏంటి? అని అడిగితే వెంటనే తెలుగు అని చెప్పా. నేను హిందీవాడినే అయినా నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది తెలుగు భాషే. టాలీవుడ్ నా ఫేవరెట్ ఇండస్ట్రీ’’ అని నటుడు సోనూ సూద్ అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మన్నారా చోప్రా పాల్గొన్నారు. -
‘కాంచన 3’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ హైలైట్స్
-
‘2.ఓ’ ప్రీ రిలీజ్ వేడుక
-
జ్ఞానోదయం అయింది!
సినిమాకి రీక్యాప్లా అసలేం జరిగిందంటే... ‘బాహుబలి–2’ ప్రీ–రిలీజ్ వేడుక గత నెల 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అన్ని కళ్లూ ఆ వేడుకను చూడాలనుకున్నాయి. అదే జరిగింది. అలాగే అన్ని నోళ్లూ ఆ రోజు కీరవాణి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్నా యి. ‘‘నేను ఎక్కువగా బ్రెయిన్లెస్ దర్శకులతో పని చేశా. వేటూరి, సిరివెన్నెల తర్వాత తెలుగు సినిమా సాహిత్యం అంపశయ్య పై ఉంది’’ అని ఆ రోజు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉన్నట్లే, ఆ అభిప్రాయాలను విమర్శించే హక్కు కూడా అందరికీ ఉంటుంది. ‘కీరవాణిగారూ.. ఎందుకయ్యా మీకు ఇవన్నీ..’ అంటూ దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. ఇతర ప్రముఖులెవరైనా కీరవాణికి సలహాలిచ్చారేమో. అందుకే సోమవారం ట్విట్టర్లో కీరవాణి ఈ విధంగా స్పందించారేమో! ► మీ సలహా తప్పకుండా పాటిస్తా తమ్మారెడ్డి భరద్వాజ్గారూ... థ్యాంక్స్.. ఒక ట్వీట్లో ‘మోస్ట్లీ’ అనే పదం వాడాను. అది చాలామందిని బాధపెట్టింది. కానీ, టీబీ (తమ్మారెడ్డి భరద్వాజ్) వంటి పెద్దవారు మంచి సలహా ఇచ్చారు. టీబీ సలహాకు సంబంధించిన కొన్ని ట్వీట్స్ను తొలగించాను. ►మనం ఎప్పటికీ విద్యార్థులమే.. తప్పులు చేస్తుంటాం. అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వారే మన తప్పులను సరిదిద్దగలరు. ► గౌరవనీయులైన దర్శకులందరూ మేథావులని సడన్గా నాకు జ్ఞానోదయం కలిగింది. ఎవరైనా తెలివితక్కువవారు ఉన్నారంటే.. అది నేనేనేమో! ► నేను తప్ప అందరూ సృజనాత్మకత కలిగినవారే. ఎంత ఎదిగినా అందరూ ఒదిగి ఉంటున్నవారే. ► నాకు ఎవరో ఒక నిఘంటువు పంపారు. అందులో పొగరుకి ‘ఎమ్.ఎమ్.కె’ (అంటే ఎం.ఎం. కీరవాణి) అని అర్థం ఉందట. ఆ పుస్తకం మొత్తం చదువుతాను. ► ప్రపంచంలో ఉన్న దర్శకులందరూ గొప్పవారు. వారితో పనిచేసేందుకు నేను తహతహలాడుతున్నాను. కానీ, నేను ఓల్డ్ బ్రెయిన్లెస్ కంపోజర్ని కాబట్టి, అవకాశాలు తక్కువ వస్తాయనుకుంటున్నా. ► కేవలం ఐదు నిమిషాల్లోనే బుర్ర లేని నా మతిని తమ్మారెడ్డి భరద్వాజ్ వాష్ చేశారు. ► ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు. ► తమ్మారెడ్డి భరద్వాజ్గారికి మళ్లీ థ్యాంక్స్. త్యాగయ్యగారికి ధన్యవాదాలు. ► నాకు పాటల రచయితలందరూ ఇష్టమే. ఎంతో కష్టపడి వాళ్లు రాస్తున్న పాటలంటే ఇష్టమే. వాళ్లను ఎలా మరచిపోయాను? (నేను వృద్ధుణ్ణి అయిపోతున్నా). ► వేటూరిగారికి 100 మార్కులు, సిరివెన్నెల సీతారామశాస్త్రికి 90, మా నాన్నగారికి 35, నాకు 10 మార్కులేనని నా అభిప్రాయం. మిగతా వారందరూ 11 మార్కుల నుంచి 89 మార్కుల మధ్యలో ఉంటారు.. ► ఇటీవల సాయిగారు టీవీ ప్రోగ్రామ్ చూశారు. ఆ ప్రోగ్రామ్లో టాలీవుడ్లో కంపోజర్స్ కొరత ఉందని అన్నారు. ఆ మాటలను నేను వ్యతిరేకించాను. ఆయన్ను ఎడ్యుకేట్ చేశాను. ► నిజానికి రైటర్స్ కొరత అధికంగా ఉంది. వాళ్లకు తక్కువ పారితోషికం ఇస్తున్నారు. ► తన 30 ఏళ్ళ అనుభవంలో మా నాన్నగారు నాకు 20 పాటలకంటే తక్కువగా రాశారు. ఎందుకంటే ఆయన అవుట్సైడర్ కదా. నేను బంధు ప్రీతిని సపోర్ట్ చేస్తాను. చంద్రబోస్గారు నాకు బావ. ఆయన నాకోసం చాలా పాటలు రాశారు. (వ్యంగ్య ధోరణిలో) ► నెపోటిజమ్ను (బంధు ప్రీతిని) నేను నమ్ముతాను. వసుధైక కుటుంబాన్ని ప్రోత్సహిస్తాను. ఒకవేళ అది తప్పయితే నాలాంటి బుర్రలేనివారిని బాగుచేయండి. ► రాజమౌళి నా మీద కోపంగా ఉన్నాడు. ‘బాహుబలి–2’ వర్క్ని కంప్లీట్ చేయమని రాజమౌళి తొందరపెడుతున్నాడు. ఎందుకంటే ఆర్కా మీడియా ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకుంటోంది. మళ్లీ కలుద్దాం మిత్రులారా. ► అనంత శ్రీరామ్ పాటలు రాయడం మానేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాటలు రాస్తున్నారు. దాంతో ప్రతిభ ఉన్న రచయితలకు అవకాశాలు తగ్గుతున్నాయి. ► నిజమే... తెలుగు లిరిక్స్ అంపశయ్యపై లేవు. కానీ అనంత శ్రీరామ్ మాత్రం సంక్షోభంలో ఉన్నాడు. ► నీతి వాక్యాలు, దేశభక్తి పాటలే రాయమని మాత్రమే దర్శకులు తనను అడుగుతున్నారని అనంత శ్రీరామ్ చెప్పాడు. ► డ్యూయెట్లు, ఐటమ్ సాంగ్స్ హీరోలు, హీరోయిన్లు, సింగర్స్.. వీళ్లంతా రాసేస్తున్నారని అనంత శ్రీరామ్ అన్నాడు.