reopening
-
పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే తేదీన నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు తెలిసింది. దీంతో గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి.కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్తో కూడిన విద్యా కానుక కిట్లు అందజేసింది. ఇలా వరుసగా నాలుగేళ్లు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే, ఈ విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం కానుంది. పుస్తకాలు మండల కేంద్రాలకు చేరినా నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు సగం మాత్రమే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ కిట్లో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతులకు నోట్బుక్స్ ఉన్నాయి. మొదటి సెమిస్టర్కు 3.12 కోట్ల పుస్తకాలు ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. కాగా, మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు దాదాపు మండల స్టాక్ పాయింట్లకు చేరాయి. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడూ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది. అలాగే, 3–10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు.పదో తరగతి సాంఘికశా్రస్తాన్ని సీబీఎస్ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ సబ్జెక్టులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచి్చంది. ఈ బోధనకు అనుగుణంగా మొత్తం 4.30 లక్షల పుస్తకాలు సైతం ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యావిధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఇక చదువుల సీజన్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హడావుడి ముగియ డంపై విద్యా రంగంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు రీ ఓపెనింగ్ అవుతున్నాయి. స్కూళ్లల్లో మౌలిక సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ఇక ఇంట ర్ బోర్డ్ ప్రవేశాల మొదలు, ఉన్నత విద్యా మండలి కార్యక్రమాలు, యూనివర్శిటీల ప్రక్షాళన వరకు అన్ని అంశాలపై దృష్టి పెట్టబోతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతీ అంశంపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. 7 నుంచి బదిలీలు, పదోన్నతులు ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు దీన్ని చేపట్టాలని భావించినా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. గత ఏడాది కొంతమంది టీచర్లను బదిలీ చేశారు. కానీ ఇప్పటి వరకూ రిలీవ్ చేయలేదు. దాదాపు 50 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మరోవైపు 10 వేల మంది టీచర్ల వరకూ పదోన్నతులు పొందాల్సి ఉంది. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ నుంచి హెచ్ఎం వరకూ ప్రమోషన్లు ఇవ్వడానికి సీనియారిటీ జాబితా కూడా రూపొందించారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఊపందుకుంటున్న అడ్మిషన్లు ఇంటర్ అడ్మిషన్లకు అనుగుణంగా ఇంటర్ కాలేజీలకు బోర్డ్ అనుబంధ గుర్తింపు ఇప్పటికే చాలావరకు పూర్తి చేసింది. ఇంకా 600 ప్రైవేటు కాలేజీలకు ఇవ్వాల్సి ఉంది. ఈ నెలాఖరు కల్లా అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ప్రవేశాలు ఊపందుకున్నాయి. గత ఏడాది 80 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ఈ సంవత్సరం మరికొంత మంది చేరే వీలుంది. టెన్త్ ఉత్తీర్ణులకు అవసరమైన డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియను జూన్ నుంచి మొదలు పెట్టే వీలుంది. డిగ్రీ ప్రవేశాలను వేగంగా చేపడుతున్నారు. తొలి దశ సీట్ల కేటాయింపు ఈ నెల 6వ తేదీన జరుగుతుంది. డిగ్రీలో ఏటా 2.20 లక్షల మంది చేరుతున్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కూ చురుకుగా ఏర్పాట్లు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించారు. ఈ నెలాఖరు నుంచి ఆన్లైన్ దర ఖాస్తు లు ప్రక్రియ మొదలుపెడతారు. రాష్ట్రంలో 1.06 లక్ష ల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 80 వేల వర కూ కనీ్వనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియ జూ లై నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అవసరమై న అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.వీసీల నియామకాలపై దృష్టిరాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల్లో కొత్త వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున వచి్చన దరఖాస్తుల పరిశీలనకు ప్రభు త్వం సెర్చ్ కమిటీలను కూడా నియమించింది. మే నెలాఖరుతో వీసీల పదవీ కాలం ముగిసింది. వీరి స్థానంలో ఐఏఎస్లను ఇన్ఛార్జిలుగా నియమించారు. ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండటంతో వీసీల నియామకం ఇంత కాలం చేపట్టలేదు. సెర్చ్ కమిటీ భేటీ అయిన, ఒక్కో వర్శిటీ కి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఇందులో ఒకరిని వీసీగా నియమిస్తారు. ఈ ప్రక్రియ మరో పది రోజుల్లో జరగొచ్చని అధికారులు చెబుతున్నారు. -
ఏయూలో చారిత్రక కళావేదిక పునఃప్రారంభం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్ర యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన చారిత్రక ఆరుబయలు రంగస్థల వేదిక–ఎస్కిన్ స్క్వేర్ను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా శుక్రవారం పునఃప్రారంభించారు. దాదాపు రూ.కోటి వ్యయంతో నాడు–నేడు పథకం స్ఫూర్తితో ఆధునీకరించిన యాంఫీ థియేటర్ను నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఏయూ ప్రాంగణంలో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన కులగోత్రాలు చిత్రం షూటింగ్ జరిగిందన్నారు. త్వరలో తన సినిమా షూటింగ్ను కూడా ఇదే ప్రాంగణంలో చేస్తానని చెప్పారు. ఎందరో కళాకారులకు ప్రాణం పోసిన ఏయూ రంగస్థల వేదికను మళ్లీ తన చేతుల మీదుగా పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కళావేదిక చరిత్ర వింటుంటే అల్లూరి సీతారామరాజు గుర్తుకు వచ్చారన్నారు. తనపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపించిన ఏయూ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏయూ హిందీ విభాగం గౌరవ ఆచార్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆ రోజుల్లో సొంత ఇంటిని కొనుక్కోకుండా తన సంపాదనలో లక్ష రూపాయలు గుడివాడ కాలేజీకి, రూ.25 వేలు ఏయూకు విరాళంగా అందించారని గుర్తు చేశారు. ఈరోజు ఆయన వారసులు ఏయూ రంగస్థల వేదికను పునఃప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సూచించిన విధంగా ఆర్ట్స్ కోర్సులకు పూర్వవైభవం తీసుకువస్తున్నామన్నారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నటన తదితరాలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన నాడు–నేడు పథకం నిధులతో విశ్వవిద్యాలయంలో చేసిన అభివృద్ధిని వివరించారు. రెండున్నర దశాబ్దాలుగా నిరుపయోగంగా మారిన ఈ ప్రాంగణాన్ని సీఎం జగన్ సహకారంతో సుందరంగా తీర్చిదిద్దామన్నారు. దీనిని నామమాత్రపు అద్దెతో కళాకారులకు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు అక్కినేని అఖిల్, నాగార్జున సోదరి సుశీల, ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజి్రస్టార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్, ప్రిన్సిపాల్స్, డీన్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నేపథ్య గాయకుడు ధనుంజయ్ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. -
ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు.. జూన్ 17 వరకు ఒంటి పూటే..
సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో రాగి జావ, 11.30 నుంచి 12 గంటల వరకు జగనన్న గోరుముద్ద అందించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: విద్యాశాఖలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం -
సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం
హైదరాబాద్లోని కాచిగూడ తారకరామ థియేటర్ పున:ప్రారంభానికి సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులు జరుపుకొంటున్న ఈ థియేటర్ కొత్త హంగులతో ముస్తాబైంది. ఏషియన్ తారకరామ పేరుతో డిసెంబర్ 14న ఈ థియేటర్ గ్రాండ్గా రీఓపెన్ కానుంది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై థియేటర్ పున:ప్రారంభించనున్నారు. కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటులు నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో ప్రముఖ సినీ నిర్మాత నారాయణ్ కె దాస్ నారంగ్ ఈ థియేటర్కు మరమ్మతులు చేపట్టారు. తాజాగా అవి పూర్తయ్యాయి. నారంగ్ దాస్ తనయుడు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీతో థియేటర్ను రెనొవేట్ చేయించారు. 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్తో పాటు, సీటింగ్లోనూ మార్పులు చేశారు. 975 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచేలా ఉండేందుకు 590కి తగ్గించారు. రెక్లైనర్, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. పునః ప్రారంభం తర్వాత డిసెంబరు 16 నుంచి హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ థియేటర్ పున:ప్రారంభానికి ఎంతో మద్దతునిచ్చిన నందమూరి మోహనకృష్ణకు సునీల్ నారంగ. భరత్ నారంగ్, సురేశ్ బాబు సదానంద గౌడ్లు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్కు వర్మ గట్టి కౌంటర్ పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసినట్టేనా? యామీ గౌతమ్ ఏమన్నదంటే.. -
నీలాచల్కు విస్తరణ స్పీడ్
న్యూఢిల్లీ: ఇటీవల సొంతం చేసుకున్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్)ను పునఃప్రారంభించనున్నట్లు మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా సామర్థ్య విస్తరణను సైతం చేపట్టనున్నట్లు తెలియజేసింది. రానున్న కొన్నేళ్లలో వార్షికంగా 4.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) లాంగ్ ప్రొడక్టుల తయారీకి కంపెనీని సిద్ధం చేయనున్నట్లు పేర్కొంది. 2030 కల్లా 10 మిలియన్ టన్నులకు స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేర్చనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వేగంగా, సమర్థంగా ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించింది. అనుబంధ సంస్థ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్ఎల్పీ) ద్వారా ఎన్ఐఎన్ఎల్ను కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రైవేటైజేషన్ పూర్తి: ఆర్థిక శాఖ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్) ప్రైవేటైజేషన్ పూర్తయినట్లు ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. కంపెనీ యాజమాన్య నిర్వహణను టాటా గ్రూప్నకు సంపూర్ణంగా బదలాయించినట్లు పేర్కొంది. వెరసి ప్రస్తుత ప్రభుత్వం రెండో కంపెనీని విజయవంతంగా ప్రైవేటైజ్ చేసినట్లు తెలియజేసింది. ప్రైవేటైజేషన్ జాబితాలోని తొలి సంస్థ విమానయాన రంగ దిగ్గజం ఎయిరిండియాను సైతం టాటా గ్రూప్ చేజిక్కించుకున్న విషయం విదితమే. ఎన్ఐఎన్ఎల్ కొనుగోలుకి ఈ ఏడాది జనవరిలో టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్ఎల్పీ) వేసిన రూ. 12,100 కోట్ల విలువైన బిడ్ గెలుపొందింది. కాగా.. కంపెనీలో ప్రమోటర్లు, భాగస్వామ్య సంస్థలకుగల మొత్తం 93.71 శాతం వాటాను టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్కు పూర్తిగా బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. నిరవధిక నష్టాల నేపథ్యంలో ఒడిశాలోని కళింగనగర్లోగల 1.1 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంటును ఎన్ఐఎన్ఎల్ 2020 మార్చిలో మూసివేసింది. -
AP: స్కూళ్ల ప్రారంభానికి ముందే ‘పుస్తకం’ సిద్ధం
సాక్షి, అమరావతి: గణగణ గంటలు మోగడమే ఆలస్యం.. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందచేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పాఠశాలల పునఃప్రారంభానికి నెల రోజుల ముందే విద్యార్ధులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలను సిద్ధంగా ఉంచడం గమనార్హం. స్కూళ్లు తెరిచిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి 3.38 కోట్ల పుస్తకాలను జగనన్న విద్యాకానుకతో సహా అందించనున్నారు. గత సర్కారు హయాంలో నవంబర్ – డిసెంబర్ వరకు కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో అందించలేని దుస్థితి నెలకొనగా ఇప్పుడు స్కూళ్లు ప్రారంభం కావడమే ఆలస్యం అనే రీతిలో చర్యలు చేపట్టడం విద్యారంగంపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నెలలోనే అమ్మ ఒడి పథకం కింద లబ్ధి చేకూర్చనుంది. ప్రభుత్వ పాఠశాలలకు పెరిగిన ఆదరణ అధికారంలోకి రాగానే విద్యారంగ సంస్కరణలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా స్కూళ్లలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల బాట పట్టారు. స్కూళ్లు తెరిచిన వెంటనే జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్ధులకు 3 జతల యూనిఫారం, బెల్టు, బూట్లు, సాక్సులు, బ్యాగుతో పాటు ఇంగ్లీషు డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్కుబుక్స్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారం లేకుండా సెమిస్టర్లవారీగా 1 నుంచి 10వ తరగతి వరకు 330 రకాల టైటిళ్ల పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, కన్నడ, తమిళం, ఒరియా మాధ్యమాలతో కూడిన ఈ పుస్తకాలను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు అందచేస్తారు. గతంలో ఏడాది మొత్తానికి ఒకే ఒక పాఠ్య పుస్తకాన్ని ఇవ్వడం వల్ల పరిమాణం పెరిగి విద్యార్ధులు అధిక బరువులు మోయలేక అల్లాడేవారు. పైగా కొద్ది రోజులకే చిరిగిపోయేవి. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 6వ తరగతినుంచి సెమిస్టర్ విధానానికి శ్రీకారం చుట్టింది. సెమిస్టర్ల వారీగా పుస్తకాలను అందించడం వల్ల మోత బరువు నుంచి విముక్తి లభించింది. ఈసారి మొదటి సెమిస్టర్ కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 3,38,70,052 పాఠ్య పుస్తకాలను అందించనున్నారు. గుత్తాధిపత్యానికి తెర జూలై 4వతేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో విద్యాశాఖ ఇప్పటికే ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి మండల కేంద్రాలకు సరఫరా చేపట్టింది. నెల రోజుల ముందే మండల కేంద్రాలకు 60 శాతానికి పైగా పుస్తకాలు చేరుకున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మిగతావి కూడా చేరనున్నాయి. గతంలో నేతలు, ప్రింటర్ల ఇష్టారాజ్యంగా ముద్రణ వ్యవహారాలు నడిచేవి. మే ఆఖరు వరకు కూడా పుస్తకాల ముద్రణ టెండర్లే ఖరారయ్యేవి కావు. ఇప్పుడు వాయువేగంతో అన్నీ పూర్తి చేసి స్కూళ్లు తెరవటానికి ముందే పుస్తకాలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. గతంలో నలుగురైదుగురి గుత్తాధిపత్యంతో ముద్రణ జరగడం వల్ల చాలా జాప్యం జరిగేది. ఈసారి టెండర్లకు ముందుకు వచ్చిన 20 మంది ప్రింటర్లకు కూడా ముద్రణకు అవకాశమిచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకూ ప్రభుత్వం నుంచే... ఈ విద్యాసంవత్సరం ప్రైవేట్ స్కూళ్లకు కూడా ప్రభుత్వమే పాఠ్యపుస్తకాల ముద్రణ చేపట్టి పంపిణీ చేస్తోంది. గతంలో ప్రైవేట్ పాఠశాలలకు ప్రైవేట్ ప్రింటర్లు సరఫరా చేయడం వల్ల తల్లిదండ్రులపై మోయలేని భారం పడేది. ప్రభుత్వ ధర కన్నా నాలుగైదు రెట్లు అధిక ధరలకు పుస్తకాలను విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఈ అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం ఈదఫా ఆ పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా తానే ప్రైవేట్కు అప్పగించి స్కూళ్లకు నేరుగా పంపిణీ చేస్తోంది. మారుపేర్లతో మాయచేస్తూ.. 2007 వరకు ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లకు అందించే విధానం ఉండగా ఆ తరువాత ప్రైవేట్కే విడిచిపెట్టారు. ఫలితంగా ప్రింటర్లు తక్కువ ముద్రణ చూపిస్తూ ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొడుతూ వస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన కంటెంట్ను వేరే పబ్లిషర్లకు అందించి మారుపేర్లతో ముద్రణ చేపడుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ పాఠ్యపుస్తకాల సెట్ ప్రభుత్వ ధర రూ.280గా మాత్రమే ఉండగా స్కూళ్లలో ప్రైవేట్ ముద్రణ పేరుతో రూ.2 వేల వరకు గుంజేవారు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు అందించనున్నందున తల్లిదండ్రులపై అధిక భారం తప్పనుంది. ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పుస్తకాలకు సంబంధించి విద్యాశాఖ ముందుగానే ఇండెంట్లు తీసుకుంది. మొత్తం 13,635 ప్రైవేట్ స్కూళ్లలో 24 లక్షల మంది విద్యార్ధులుండగా 12,721 స్కూళ్లు 18.02 లక్షల మందికి పుస్తకాల కోసం ఇండెంట్లు ఇచ్చాయి. వీరికి కావాల్సిన 1.36 కోట్ల పాఠ్యపుస్తకాలను కూడా ప్రభుత్వమే ముద్రణ చేపట్టి ఆయా స్కూళ్లకు అందించేలా ఏర్పాట్లు చేసింది. ద్విభాషా పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్ధులకు సౌకర్యంగా ఉండేందుకు పాఠ్యపుస్తకాలను బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో మిర్రర్ ఇమేజ్తో ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఒకపక్క తెలుగు, దానికి ఎదురు పేజీలో ఇంగ్లీషులో పాఠ్యాంశాలు ఉండటంతో విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే 6, 7 తరగతుల విద్యార్ధులకు ఈ సిలబస్తో పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి విద్యార్ధులకు కూడా సీబీఎస్ఈ సిలబస్ పుస్తకాలు అందిస్తారు. రానున్న రెండేళ్లలో 10వ తరగతి వరకు అన్ని తరగతుల్లోనూ సీబీఎస్సీ సిలబస్ అమల్లోకి రానుంది. ప్రభుత్వ స్కూళ్లకు పాఠ్యపుస్తకాల పంపిణీ ఇలా.. జిల్లా ఇండెంట్ ఇప్పటివరకు ఇచ్చినవి శ్రీకాకుళం 2039753 748657 విజయనగరం 1691284 681190 విశాఖపట్నం 2745643 1267638 ప.గోదావరి 3670404 1626840 తూ.గోదావరి 2563960 1159599 కృష్ణా 2495376 1123140 గుంటూరు 3057027 1500467 ప్రకాశం 2471675 1269181 నెల్లూరు 2065629 821382 కడప 2001972 931523 కర్నూలు 3415546 1612591 అనంతపురం 2946820 1391097 చిత్తూరు 2704963 1266852 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 33870052 15400157 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– నోట్: ఇవి కాకుండా ప్రస్తుతం 70 లక్షల పుస్తకాలను ప్రింటింగ్ ప్రెస్ల నుంచి గోడౌన్లకు తరలిస్తున్నారు. మొత్తం పుస్తకాల తరలింపు రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. ద్విభాషా పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు పాఠ్యపుస్తకాలను బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో మిర్రర్ ఇమేజ్తో ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఒకపక్క తెలుగు, దానికి ఎదురు పేజీలో ఇంగ్లిష్లో పాఠ్యాంశాలు ఉండటంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే 6, 7 తరగతుల విద్యార్థులకు ఈ సిలబస్తో పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతికి కూడా సీబీఎస్ఈ సిలబస్ పుస్తకాలు అందిస్తారు. రానున్న రెండేళ్లలో 10వ తరగతి వరకు అన్ని తరగతుల్లోనూ సీబీఎస్సీ సిలబస్ అమల్లోకి రానుంది. -
Omicron Outbreak: ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లేదు!
భువనేశ్వర్: ఓ వైపు కరోనా భీభత్సం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి వెరసి విద్యాసంస్థలు తెరవాలనే నిర్ణయానికి గండి పండింది. ఒడిశా రాష్ట్రంలో ప్రాధమిక పాఠశాలలను తెరవాలనే నిర్ణయం మరోమారు వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 1 నుంచి 5 తరగతులకు చెందిన పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నట్లు ఒడిసా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా అధికారులు వివిధ పాఠశాలలను సందర్శించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఎస్ఆర్ దాష్ తెలిపారు. ఐతే 6 నుంచి 10 తరగతుల పిల్లలు మాత్రం యథాతథంగా ఫిజికల్ క్లాసులకు హాజరుకావాలని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్కు కట్టుబడి షెడ్యూల్ ప్రకారం ఆఫ్లైన్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ బులెటన్ ప్రకారం గడచిన రెండు నెలల్లో కన్నా నిన్న ఒక్క రోజే 424 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు ఆదివారం తెల్పింది. కొత్తగా కరోనా సోకిన పేషంట్లలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు దాదాపు 67 మంది ఉన్నట్లు బులెటన్ తెల్పుతోంది. చదవండి: Covid Live Updates: కోటికి పైగా కోవిడ్ కేసులు నమోదైన ఆరో దేశంగా రికార్డు..! -
Telangana: తొలిరోజున విద్యార్థుల హాజరు నామమాత్రమే..!
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైనా.. తొలిరోజున విద్యార్థుల హాజరు నామమాత్రంగా నమోదైంది. బుధవారం చాలావరకు ప్రభుత్వ, ప్రైవేటు బడులన్నీ బోసిపోయి కనిపించాయి. విద్యార్థులను బడులకు రప్పించేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రయత్నించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులు కూడా రంగంలోకి దిగారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. కానీ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి కనిపించింది. ఇంకొన్ని రోజులు వేచిచూద్దామని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు వెసులుబాటు ఇవ్వడంతో.. పాఠశాలలతో పాటు విద్యార్థులు కూడా ఆన్లైన్నే ఆప్షన్గా ఎంచుకున్నారు. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల హాజరు తక్కువగా నమోదైంది. బుధవారమే మొదటి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని, కొద్దిరోజుల్లోనే పుంజుకుంటుందని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. సగటున 22 శాతం మించలేదు గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు మినహా అన్ని విద్యాసంస్థలను పునః ప్రారంభించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తొలిరోజున ప్రభుత్వ స్కూళ్లలో 27.45 శాతం, ప్రైవేటు బడుల్లో 18.35 శాతం విద్యార్థుల హాజరునమోదైంది. మొత్తంగా సగటు హాజరుశాతం 22కు మించలేదని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 405 ఇంటర్ కాలేజీల్లో ఫస్టియర్ విద్యార్థులు 97,520 మందికిగాను 16,907 మంది.. సెకండియర్లో 84,038 మందికిగాను 12,687 మంది హాజరయ్యారు. సగటున 15 శాతమే హాజరు నమోదైంది. భయం భయంగానే.. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఎక్కువ మంది బడికి వచ్చారు. గ్రామాల్లో తల్లిదండ్రుల నుంచి పెద్దగా అభ్యంతరాలు కన్పించలేదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే సీజనల్ జ్వరాలు, ఇతర అనారోగ్యం ఉన్నవారిని బడులకు రాకుండా చూశారు. వ్యవసాయ పనులకు వెళ్లే విద్యార్థుల్లో చాలా వరకు పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపలేదు. పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. తల్లిదండ్రులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని, క్రమంగా హాజరు పుంజుకుంటుందని అధికారులు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు స్కూళ్లలో హాజరు కాస్త మెరుగ్గా ఉంది. కానీ సమీపంలోని పట్టణాలు, వేరే ఊర్లలో చదువుతున్న విద్యార్థులు మాత్రం వెళ్లలేదు. పాఠశాలల వాహనాలు గ్రామాలకు వచ్చినా తల్లిదండ్రులు పిల్లలను పంపలేదు. పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లలో హాజరుశాతం తక్కువగా కనిపించింది. ఏడాదిన్నరగా బడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో చాలామంది తల్లిదండ్రులు సొంతూర్లకు వెళ్లారు. వారు ఇప్పటికిప్పుడు పట్టణాలకు వచ్చే పరిస్థితి లేదు. దానికితోడు ఆన్లైన్ బోధన ఉండటంతో.. దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చాలా వరకు ఆన్లైన్ బోధనకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. చిన్నగదుల్లో ప్రత్యక్ష బోధన వల్ల సమస్యలు రావొచ్చనే ఆలోచనతో ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంతకాలం పరిస్థితిని గమనించాకే స్కూళ్లకు పంపాలని భావిస్తున్నారు. బుధవారం స్కూళ్లు, విద్యార్థుల పరిస్థితి ఇదీ.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో మొత్తం విద్యార్థులు: 52,22,174 తొలిరోజు హాజరైన విద్యార్థుల సంఖ్య: 11,37,095 (21.77 శాతం) ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు: 19,66,234 హాజరైన విద్యార్థులు: 5,39,674 (27.45 శాతం) ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు: 32,55,940 హాజరైన విద్యార్థులు: 5,97,421 (18.35 శాతం) బడికి రెడీ.. సైకిలే రిపేర్.. ఖమ్మం జిల్లా కేంద్రంలో పాఠశాలకు వెళ్లేందుకు బయలుదేరిన విద్యార్థి ఇతను. సైకిల్ మొరాయించడంతో మధ్యలో ఆగి మరమ్మతు చేయించుకున్నాడు. చిన్న పిల్లలు రాలే.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం ఇది. బుధవారం ఈ కేంద్రాన్ని తెరిచినా.. పిల్లలెవరూ రాక టీచర్ ఖాళీగా కూర్చున్నారు. బడికి కొందరు.. చెత్త ఏరుతున్న మరికొందరు ప్రత్యక్ష బోధన ప్రారంభం కావడంతో.. కొందరు పిల్లలు బడిబాట పట్టినా, మరికొందరు పనులకు వెళ్లారు. భువనగిరి పట్టణంలో కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా.. ఆ ప్రాంతంలోనే మరికొందరు పిల్లలు చెత్త పేపర్లు సేకరిస్తున్న దృశ్యమిది. తొలిరోజే.. తృటిలో తప్పిన ప్రమాదం నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని తిమ్మాపూర్ అంగన్వాడీ కేంద్రంలో తొలిరోజు అపశ్రుతి చోటు చేసుకుంది. ఇక్కడి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న పాత గదుల్లో కొన్నేళ్లుగా అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. బుధవారం ఈ కేంద్రానికి వచ్చిన గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ హెల్పర్ మౌనిక సరుకులు అందజేస్తుండగా.. భవనంపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా అందరూ బయటికి పరుగెత్తారు. భవనం పాక్షికంగా దెబ్బతింది. ఇద్దరు విద్యార్థులు.. పది మంది లెక్చరర్లు మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 350 మంది విద్యార్థులు ఉండగా.. బుధవారం ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు కాలేజీలోని పది మంది లెక్చరర్లు విధులకు వచ్చారు. మంగళ హారతులిచ్చి.. మెదక్ జిల్లా కుర్తివాడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు వీరు. విద్యార్థులను శుభ సూచకంతో స్వాగతించాలని ఇలా చేసినట్టు వారు చెప్పారు. బురదలో నడుచుకుంటూ.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని బాలుర ఉన్నత పాఠశాల వద్ద బురదలో నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులు. పాఠశాలకు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో ఇటీవలి వర్షాలకు నీళ్లు నిలిచి బురదగా మారింది. డప్పులతో విద్యార్థులకు స్వాగతం చాలా రోజుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థులకు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలుకుతున్న దృశ్యమిది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ పాఠశాలలో అక్కడి సర్పంచ్ నర్సాగౌడ్, ఉపాధ్యాయులు ఇలా స్వాగతం పలికారు. గదులు లేక.. వరండాలో చదువులు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వరండాలో కూర్చుని చదువుకుంటున్న విద్యార్థులు వీరు. మొత్తంగా 142 మంది విద్యార్థులు ఉండగా.. మూడే తరగతి గదులు ఉన్నాయి. దీనితో 7, 8వ తరగతుల విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. బడి కూలిపోయేలా ఉంది సార్.. మంత్రి కేటీఆర్కు జనగామ ఉపాధ్యాయుల ట్వీట్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు! జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో సిద్దిపేట రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. 160 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో తరగతి గదుల పైకప్పు దెబ్బతింది. ఇటీవలి వర్షాలతో గోడలు తడిసి, గదుల్లోకి నీరు వస్తోంది. ఉపాధ్యాయులు దీనిపై మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘‘జనగామలో బాలికల ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులతోపాటు వరండా పైకప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. బడి కోసం కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన రెండేళ్లుగా పెండింగ్లో ఉంది. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. పాఠశాల తరలింపు, కొత్త భవన నిర్మాణానికి సంబంధించి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. బడిలో విద్యాశాఖ కమిషనర్.. బీబీనగర్, భూదాన్ పోచంపల్లి: పాఠశాలలు పునః ప్రారంభం అవుతుండటంతో విద్యా శాఖ కమిషనర్ దేవసేన.. బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి స్కూళ్లను సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాయరావుపేట, జామీలపేట, పడమటి సోమవారం గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను, భూదాన్ పోచంపల్లి పట్టణంలోని మోడల్ స్కూల్ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులకు సూచించారు. -
తెలంగాణలో తెరచుకున్న బడులు
-
చదువుతో పాటు ప్రాణాలూ ముఖ్యమే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో.. వారు కరోనా బారినపడకుండా సురక్షితంగా ప్రాణాలతో ఉండడం అంతకంటే ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రత్యక్ష తరగతులకు హాజరైన విద్యార్థి కరోనా బారినపడి మృతి చెందితే ఆ విద్యార్థి తల్లిదండ్రుల బాధ, క్షోభ వర్ణనాతీతమని పేర్కొంది. విద్యా సంవత్సరం కోల్పోయినా పరవాలేదు.. పిల్లలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటారని వ్యాఖ్యానించింది. పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు యూనిసెఫ్ సూచించినా.. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని అభిప్రాయపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), విపత్తు నిర్వహణ సంస్థ (డిజాస్టర్ మేనేజ్మెంట్)లు ఇదేవిధంగా చెబుతున్నాయంది. కరోనా మూడో దశ ప్రభావం ముఖ్యంగా పిల్లలపై ఉంటుందనే డాక్టర్ల హెచ్చరికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు, సంక్షేమ హాస్టళ్లను ప్రారంభాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలంటూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేయరాదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. హడావుడిగా ప్రారంభిస్తున్నారు.. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలంటూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన అధ్యాపకులు ఎం.బాలక్రిష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా అకస్మాత్తుగా, హడావుడిగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలనే ఆదేశాలిచ్చారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించిన తర్వాతే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ప్రభుత్వం సమన్వయం చేయాలి ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. ‘విద్యా సంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతారన్న అభిప్రాయం ఒకవైపు, తెరిస్తే వారి ప్రాణాలను ఎలా కాపాడతారన్న సందేహం మరోవైపు ఉన్నాయి. ఈ రెండింటినీ ప్రభుత్వం సమన్వయం చేయాలి’ అని అభిప్రాయపడింది. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వానికి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేసింది. తాము కోరిన సమాచారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యా శాఖ కార్యదర్శి, పాఠశాల విద్య, ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులతో పాటు నీలోఫర్కు చెందిన నిపుణుల కమిటీలను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. ఏ పాఠశాలపైనా చర్యలు తీసుకోవద్దు ‘గురుకులాలు తెరవొద్దు. ఇతర పాఠశాలల్లో చదువుకునే ఏ విద్యార్థినీ ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయరాదు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభిం చాలంటూ ఇటీవల ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రత్యక్ష తరగతులు నిర్వహించని ఏ పాఠశాల మీదా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థులకు జరిమానా విధించడం లాంటి వాటితో పాటు ఏ రకమైన చర్యలూ తీసుకోరాదు. పాఠశాలలో విద్యార్థి కరోనా బారిన పడితే పాఠశాల యాజమాన్యానికి ఎటువంటి బాధ్యత ఉండదని, ఇందుకు అంగీకరిస్తూ పత్రం సమర్పించాలని విద్యా ర్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం చట్ట విరుద్ధం, అనైతికం. పాఠశాలల యాజమా న్యాలు కేవలం ఆన్లైన్ లేదా కేవలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చు. లేదా రెండింటినీ నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంది.’ వారం రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించాలి ‘ఈ ఆదేశాలు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తి స్తాయి. పాఠశాలలో ప్రత్యక్ష తరగతుల నిర్వ హణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై వారం రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శ కాలు రూపొందించాలి. వీటిని ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి..’ అని కోర్టు ఆదేశించింది. ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి? ‘రాష్ట్రంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి ? గురుకులాలు, వసతిగృహాల్లో విద్యా ర్థులు వైరస్ బారినపడకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పాఠశాలల ప్రారంభానికి సంసిద్ధతపై ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల నుంచి నివేదికలు ఏమైనా తీసుకున్నారా? పిల్లలు కరోనాబారిన పడితే చికిత్స అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలు అందుబాటులో ఉంచారు?’ తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. నీలోఫర్ వైద్యులతో కూడిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అన్నీ పరిగణనలోకి తీసుకుని... ‘కరోనా మూడో దశ సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇప్పటికీ ఇవ్వలేదు. 18 ఏళ్లు నిండని వారికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. చిన్నారులు కరోనా బారిన పడినా, వారికి లక్షణాలు కనిపించే అవకాశం ఉండదని పరిశో« దకులు చెబుతున్నారు. పాఠశాల పిల్లలు టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్తో సన్నిహితంగా మెలిగే అవ కాశం ఉంది. అయితే సిబ్బంది అందరికీ ఇంకా వ్యాక్సిన్ ఇవ్వలేదు. వీరి ద్వారా కరోనా విద్యా ర్థులకు వ్యాపించే అవకాశం ఉంది. వారిద్వారా వారి కుటుంబసభ్యులకు రావొచ్చు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న చిన్నారులు సైతం కరోనా బారినపడే అవకాశం ఉంది. విద్యార్థులు భౌతిక దూరం పాటించడం, పాఠశాలలో ఉన్నంత సేపు మాస్కు ధరించడం చాలా కష్టం. అదే సమయంలో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు, కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని కోరుకోవడానికి సహేతుకమైన కారణాలు ఉండొచ్చు. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేనివారు ప్రత్యక్ష తరగతులు కోరుకోవడం సహజమే. అలాగే మధ్యాహ్న భోజన పథకం ఆశించేవారు, ఇతర ఆర్థికపరమైన కారణాలున్నవారు కూడా ఈ విధం గా కోరుకోవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అందరి హక్కులు, ప్రయోజనాలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ఉత్తర్వులు జారీ చేస్తున్నాం..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘వ్యాక్సిన్ ఆఫర్’.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ !
దేశవ్యాప్తంగా తమ సినియా థియేటర్లు, మల్టీప్లెక్సులు జులై 30 నుంచి తెరుచుకుంటాయని మల్టీప్టెక్స్ చైన్ పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్స్కి వచ్చే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘జాబ్ ఆఫర్’ను ప్రకటించింది. బొమ్మపడింది దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో క్రమంగా సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీగా తెరుచుకునేందుకు ఉత్సాహంగా ఉండగా కోవిడ నిబంధనల కారణంగా మల్టీప్లెక్స్లు కొంచెం తటపటాయిస్తున్నాయి. అయితే వందశాతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఆధీనంలో ఉన్న మల్టీప్లెక్సులు జులై 30 నుంచి ఓపెన్ చేశామని పీవీఆర్ ప్రకటించింది. అందరికీ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను వంద శాతం తప్పక పాటిస్తామని పీవీఆర్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్సులలో పని చేసే సిబ్బంది అందరికీ కో\విడ్ వ్యాక్సిన్ అందించామని తెలిపింది. ప్రేక్షకులు ఎటువంటి సందేహాలు లేకుండా సినిమాలను ఎంజాయ్ చేయవచ్చని చెప్పండి వ్యాక్సిన్ ఆఫర్ మల్టీప్లెక్సుల ఓపెనింగ్ సందర్భంగా వ్యాక్సిన్ ఆఫర్ని ప్రకటిచింది పీవీఆర్ సినిమాస్. వ్యాక్సిన్ తీసుకుని పీవీఆర్ సినిమాస్కి వచ్చిన వారికి ఎంపిక చేసిన కంటెంట్ (సినిమా)పై ఒక టికెట్ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు ఫుడ్ అండ్ బేవరేజెస్ సెక్షన్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్ మల్టీప్లెక్సులు ఓపెన్ చేసిన ఒక వారం పాటు అమల్లో ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఎంపిక చేసిన కంటెంట్ ఏమిటనే దానిపై కచ్చితమైన వివరణ ఇవ్వలేదు. ఆయా మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించే సినిమాలు, ఇతర కంటెంట్ను బట్టి ఇది మారే అవకాశం ఉంది. -
స్కూళ్ల ప్రారంభంపై ఐసీఎంఆర్ కీలక సూచనలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా విలయం,లాక్డౌన్ ఆంక్షలతో స్కూలు విద్య బాగా దెబ్బతింది. తాజాగా స్కూళ్ల ప్రారంభంపై ఐసీఎంఆర్ సెక్రటరీ డాక్టర్ బలరామ్ భార్గవ కీలక సూచనలు చేశారు. ముందు ప్రాథమిక పాఠశాలలను తెరిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ను తట్టుకునే సామర్థ్యం చిన్నారులకు ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే టీచర్లందరికి వ్యాక్సినేషన్ పూర్తయితే స్కూళ్లు తెరవొచ్చని ఆయన పేర్కొన్నారు. సెకండరీ పాఠశాలలకంటే ముందు ప్రాధమిక పాఠశాలలను పునఃప్రారంభిస్తే మంచిదనే సంకేతాలను ప్రభుత్వం మంగళవారం అందించింది. అయితే దీనికంటే ముందు పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, పాఠశాలలోని ఇతర సిబ్బందికి టీకాలు వేయడం అవసరమని ఐసీఎంఆర్ డీజీ భార్గవ అన్నారు. కాగా దేశంలో 2-18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకా అందించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకా రెండు,మూడు దశల ట్రయల్స్ డేటా త్వరలోనే వెల్లడికానుందని, దీంతో సెప్టెంబర్ నాటికి టీకా లభించనుందనే అంచనాలను ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల చెప్పారు. డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదంతో పిల్లలకు ఈ టీకా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
‘దుమ్ము’ దులపండి..!
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చి రెండో వారం నుంచి మూతబడ్డ విద్యా సంస్థలు... వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. సుదీర్ఘకాలం మూతబడి ఉండటంతో చెట్లు, పొదలు పెరిగాయి. తరగతి గదులు, బెంచీలు దుమ్ముపట్టాయి. అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో స్వచ్ఛత కార్యక్రమాన్ని స్థానిక సంస్థలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల/ కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ వినతికి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలన్నీ కలిపి 30 వేల వరకు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు పది నెలలకు పైగా మూతబడి ఉన్నాయి. ఆన్లైన్ బోధన సాగుతున్న క్రమంలో విద్యా సంస్థలను తెరిచి ఉపాధ్యాయుల హాజరుకు అనుమతిచ్చినప్పటికీ పారిశుధ్యంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బోధన సిబ్బంది కూర్చునే హాల్, రెస్ట్రూమ్ వరకు శుభ్రం చేశారు. విద్యార్థుల తరగతి గదులు, ప్లేగ్రౌండ్ శానిటైజేషన్ను పట్టించుకోలేదు. చదవండి: పాతపంట.. కొత్త సంబురం 20లోగా క్లీన్ చేయాలి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యా సంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాలు ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలి. ఈమేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లు... సంబంధిత పం చాయతీ, మున్సిపాలిటీలకు లేఖలు సమర్పిస్తే వెంటనే సిబ్బంది వచ్చి విద్యా సంస్థల ప్రాంగణాలను శుభ్రం చేయాలి. బుష్ కటింగ్, పిచ్చిమొక్కల తొలగింపుతో పాటు నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థను పరిశీలిం చి ఆమేరకు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీ(డీఎల్ఈఎంసీ)లో సభ్యులుగా ఉన్న జిల్లా పంచాయ తీ అధికారి, మున్సిపల్ కమిషనర్లకు శానిటైజేషన్ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించింది. -
సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్స్ రీఓపెన్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తొలుత 9వ తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు క్లాస్రూం విద్యాబోధన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. 9, 10వ తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులకు సంబంధించిన తరగతుల నిర్వహణకు పలు షరతులతో అనుమతించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాఠశాలలు, కళాశాలలను పునః ప్రారంభించే అంశంపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై సైతం ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏడు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలు... కోవిడ్–19 మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలను పునఃప్రారంభించలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడిచిపోయినా, ఇంకా ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. 3వ తరగతి, ఆపై విద్యార్థులకు ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా వ్యాప్తి సైతం అదుపులోకి వచ్చిందని రోజువారీ కేసుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళతో సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు ఇప్పటికే 9వ తరగతి, ఆపై విద్యార్థుల కోసం తరగతి గది బోధనలను ప్రారంభించాయి. రాష్ట్రంలో సైతం ఈ నెల 18 నుంచి 9వ తరగతి, ఆపై విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించడమే మంచిదని రాష్ట్ర విద్యా శాఖ... ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు పాఠశాలలు, కళాశాలలను పునఃప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నామని ప్రభుత్వా నికి తెలిపింది. సోమవారం నిర్వహించనున్న సమీక్షలో సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని విద్యాశాఖ అధికారులు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. రోజూ తరగతులు నిర్వహించాలా? లేక రోజు విడిచి రోజు నిర్వహించాలా? షిఫ్టుల వారీగా విభజించాలా? అన్న అంశంపై ఈ సమావేశంలో లోతుగా చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తరగతి గదులను పునఃప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇస్తే... ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన బోధన ప్రణాళికలను రూపొందించి ప్రకటించాలని రాష్ట్ర విద్యా శాఖ భావిస్తోంది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మరి కొంతకాలం పాటు ఆన్లైన్ క్లాసులను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 9వ తరగతి, ఆపై విద్యార్థులకు క్లాసులు ప్రారంభించిన తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులను అంచనా వేయాలని, రాష్ట్రంలో పెద్దగా కరోనా పాజిటివ్ కేసులు పెరగకపోతే క్రమంగా మిగతా తరగతుల విద్యార్థులకు సైతం క్లాస్రూం బోధనను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూపై కలెక్టర్లకు దిశానిర్దేశం రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 31న సమీక్ష నిర్వహించారు. రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన పలు అంశాలపై ఈ సమావేశంలో సీఎం జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే సమావేశంలో ఈ అంశాలను మళ్లీ కూలంకషంగా చర్చించనున్నారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనళ్ల ఏర్పాటు, పార్ట్–బీలో పెట్టిన భూముల పరిష్కారం తదితర అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై చర్చించనున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించనున్నారు. ప్రాధాన్యతా క్రమంలో పౌరులకు టీకా వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిని సమీక్షించి తదుపరి విడత కార్యక్రమాల తేదీలను ప్రకటించే అవకాశముంది. హరితహారం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. -
స్కూళ్లు తెరుద్దామా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో తరగతులను ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలనే అం శంపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఓ నిర్ణయానికి రానుంది. ఏ తరగతి నుంచి క్లాసులు నిర్వహించాలి? ఏ విధంగా నిర్వ హించాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి? తదితర అంశాలపై ఈ నెల 11న సీఎం కేసీఆర్ మం త్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్లో నిర్వహించనున్న సమావేశంలో నిర్ణయం తీసుకో నున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య, ఆరో గ్యం, విద్య, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల అంశాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రెవెన్యూ సమస్యలపై కార్యాచరణ సీఎం కేసీఆర్ గత నెల 31న సీనియర్ అధికారులు, కొందరు కలెక్టర్లతో సమా వేశమై రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 11న జరిగే భేటీలో రెవెన్యూకు సంబంధించిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్–బీలో చేర్చిన భూ వివాదాలకు పరిష్కారం తదితర విషయాలపై సమావేశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. వ్యాక్సిన్పై కార్యాచరణ.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలతోపాటు టీకాను ప్రజలకు అందించేందుకు సిద్ధం చేయనున్న కార్యాచరణపై సీఎం ఈ భేటీలో చర్చిస్తారు. అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా, ప్రాధాన్యతా క్రమంలో టీకాను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తారు. పల్లె, పట్టణ ప్రగతిపై.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ సమీక్షిస్తారు. గ్రామాలు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా వాటి వినియోగం ఎలా ఉంది తదితర అంశాలపై చర్చిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పరోగతిని సమీక్షిస్తారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలును సమీక్షిస్తారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని శనివారం నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా స్వల్ప అనారోగ్యం కారణంగా ఈ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేసినట్లు సమాచారం. -
మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు
సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా నేడు(సోమవారం) పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేష్ పేర్కొన్నారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాఠశాలలు, కళాశాలలకు వస్తున్నారన్నారు. ఈ మేరకు సోమవారం సాక్షి టీవీతో మంత్రి మాట్లాడారు. మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చాలా పాఠశాలలు ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు జగనన్న విద్య కానుక ఇచ్చామని, అన్ని వసతులు వారికి అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కోవిడ్ పట్ల అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ఏపీలో నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు కోవిడ్ నేపథ్యంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలు 70 శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలని అదేశించాం. ఇది న్యాయమైన నిర్ణయం. దాదాపు అయిదారు నెలలు స్కూల్స్ నడవలేదు. అలాంటప్పుడు పూర్తి ఫీజు ఎలా వసూలు చేస్తారు?. వాళ్ళకి టీచర్లు, సిబ్బంది జీతాలు ఉంటాయి కాబట్టి అన్ని ఆలోచించి 70 శాతం ఫీజు నిర్ణయించాం. ఏ ఒక్కరూ అంతకు మించి వసూలు చేయవద్దు. అలా చేస్తున్నట్లు పిర్యాదు వస్తే చర్యలు తప్పవు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో నిబంధనల మేరకు వసతులు తప్పనిసరిగా ఉండాలి. ఆయా సంస్థల్లో వసతులపై ఆకస్మిక తనికీలు చేస్తున్నాం’. అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. చదవండి: ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది: ఏపీ జేఎంసీ -
నవంబర్ 2 నుంచి కళాశాలలు పునఃప్రారంభం
సాక్షి, విజయవాడ: కళాశాలలు నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులకి మాత్రమే ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థికి నెలలో పది రోజులు తరగతులు నిర్వహిస్తామన్నారు. మూడవ వంతు విద్యార్థులనే అనుమతిస్తామని వెల్లడించారు. ఆన్లైన్ క్లాసులు కొనసాగుతాయన్నారు. (చదవండి: ప్రైవేటు పాఠశాలలకు గట్టి షాక్..) ‘‘రెండు సెమిస్టర్లగా అకడమిక్ క్యాలెండర్ రూపొందించాం. మార్చి నెలకి మొదటి సెమిస్టర్.. ఆగస్ట్ నాటికి రెండవ సెమిస్టర్ పూర్తి చేస్తాం. అకడమిక్ క్యాలెండర్ని 180 రోజులుగా రూపొందించాం. ఈసెట్ అడ్మిషన్లు నవంబర్ 11 లోపు పూర్తి చేస్తాం. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు, ఇంజనీరింగ్ అడ్మిషన్లని నవంబర్ నెలాఖరుకి పూర్తి చేసి డిసెంబర్ ఒకటి తరగతులు ప్రారంభిస్తాం. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహిస్తాం. కళాశాలకి వచ్చే ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. కళాశాలకి వచ్చే విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని’’ ఆయన పేర్కొన్నారు. (చదవండి: గ్రూప్–1 మెయిన్స్కు 9,678 మంది) -
2 నుంచి స్కూల్స్.. షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. కోవిడ్ వ్యాపించకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తరగతుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ను గురువారం విడుదల చేశారు. దీని ప్రకారం.. నవంబర్ 2 నుంచి 9, 10, 11/ఇంటర్ మొదటి సంవత్సరం, 12/ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు.. హాఫ్డే మాత్రమే నిర్వహిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో తరగతులు ఉంటాయి. నవంబర్ 23 నుంచి 6, 7, 8 తరగతులకు బోధన మొదలవుతుంది. డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులను ప్రారంభిస్తారు. 1 నుంచి 8వ తరగతి వరకు కూడా రోజు విడిచి రోజు, హాఫ్డే మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. చదవండి: రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స -
విజయవాడలో బాపు మ్యూజియం పునఃప్రారంభం
-
ఏపీలో నవంబర్ 2వరకు స్కూళ్ల ప్రారంభం వాయిదా
-
హెరిటేజ్ సిటీ హోదా రావాలి
గన్ఫౌండ్రీ: హైదరాబాద్ నగరాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పునరుద్ధరించిన ఎంజే మార్కెట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఎంతో ఉందని, కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నగర పౌరులపై ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నో సుందర చారిత్రక కట్టడాలకు హైదరాబాద్ నగరం నిలయమని, వారసత్వ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎంజే మార్కెట్పై 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఏర్పాటు చేశామని, ఈ జెండా ఈ ప్రాంతానికి కొత్త శోభను తెస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ చదువుకునే రోజుల్లో ఎంజే మార్కెట్ పరిసరాల్లోని మయూరా హోటల్ ప్రాంతంలో చాలా ఏళ్లు ఉన్నారని, తాను కూడా చదువుకునే రోజుల్లో ఫేమస్ ఐస్క్రీమ్ కోసం ఎంజే మార్కెట్కు వస్తుండేవాడినని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో ఎంజే మార్కెట్కు పూర్వ వైభవం కల్పించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే రూ.1,000 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పున రుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. రెండేళ్లలోనే ఎంజే మార్కెట్ను పునరుద్ధరించిన మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్కుమార్ను అభినందించారు. ఎంజేమార్కెట్పై రూపొందించిన సావనీర్ను ఆవిష్కరించారు. దీంతోపాటు ఎంజే మార్కెట్కు పున ర్వైభవం కల్పించడంలో విశిష్ట సేవలందించిన 16 మందికి మెమెంటోలను అందించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, కేకే, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా జాతీయ పతాకం ఎంజే మార్కెట్పై 100 అడుగుల భారీ ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ పతాకం ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యాటకులను ఆకర్షించేందుకు మార్కెట్ చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు లోపల పలు నూతన నిర్మాణాలను చేపట్టారు. -
సురక్షిత బడిబాట
ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు అసాధారణమైనవి. ప్రభుత్వాలు అన్ని రంగాల్లో పెను సవాళ్లు ఎదుర్కొనవలసి వస్తోంది. ప్రజారోగ్య, సామాజిక, ఆర్థిక రంగాల సమస్యలతోపాటు పాఠశాల విద్యను మళ్లీ పట్టాలెక్కించడం కూడా సమస్యే. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి తెరిపినపడటానికి చేసే ప్రయత్నాలను పరిహసిస్తూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ వైరస్ నియంత్రణలోకొచ్చాక తిరిగి ప్రారంభం కావాల్సిన కార్యకలాపాల్లో చదువులు అన్నిటి కన్నా ముఖ్యమైనవి. దాన్ని దృష్టిలో పెట్టుకునే పాఠశాలలు తిరిగి తెరవడంపైనా... ఈ విషయంలో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ నెల 15న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఎవరు ఏ తేదీకి బడులు తెరవడానికి సంసిద్ధంగా ఉన్నారో చెప్పాలని సూచించింది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో ఎటూ చెప్పలేకపోయాయం టేనే వర్తమానంలో వైరస్ తీవ్రత ఎంత వుందో అర్థమవుతుంది. ఒక్క అస్సాం మాత్రం ఈ నెలా ఖరున పాఠశాలలు తిరిగి తెరిస్తే బాగుంటుందని చెప్పగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, నాగాలాండ్, రాజస్తాన్, అరుణచల్ ప్రదేశ్, ఒడిశా, లదాఖ్లు సెప్టెంబర్ నెలలో ప్రారంభించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ, హరియాణ, బిహార్, చండీగఢ్ ఆగస్టులో పాఠశాలలు తెరిస్తే బాగుంటుందని సూచించాయి. తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ తదితర 21 ప్రభుత్వాలు నిర్దిష్టంగా చెప్పలేకపోయాయి. పాఠశాలలన్నీ నాలుగు నెలలుగా నిరవధికంగా మూతబడి వుండటం వల్ల దేశవ్యాప్తంగా 25 కోట్లమంది పిల్లలు చదువులకు దూరమయ్యారు. కొన్ని రాష్ట్రాలు ఏదో ఒక మేర దూరవిద్య విధానాన్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. కానీ దాని ద్వారా లబ్ధి పొందుతున్న పిల్లల శాతం తక్కువే. ఇంటర్నెట్ సదుపాయం అంతంతమాత్రంగా వుండటం, అలాంటి సదుపాయం వున్నా ఖరీదైన ఉపకరణాలను కొనుక్కునే స్తోమత చాలామంది పిల్లలకు లేకపోవడం పర్యవసానంగా ఆన్లైన్ చదువులు నామమాత్రంగానే సాగుతున్నాయి. ఒక తరం చదువులకు దూరమైతే పిల్లలకు మాత్రమే కాదు... సమాజానికి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. దాన్నుంచి కోలుకోవడం కష్టమవుతుంది. అలాగని వైరస్ మహమ్మారి శాంతించకుండా చదువులు మొదలుపెడితే పర్యవసానాలు తీవ్రంగా వుండే ప్రమాదముంటుంది. ఇప్పుడున్న స్థితిలో పిల్లలు ముప్పు బారిన పడకుండా చూడటం అతి ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వాల సిలబస్లు చాలావరకూ బోధనకు పరిమితమై ఉంటాయి. తరగతి గదిలోని పిల్లలకు టీచర్ వచ్చి బోధించడం, పాఠ్యాంశాలపై అవగాహన కలి గించడం, వారి సందేహాలు తీర్చడం వగైరాలు అందులోవుంటాయి. ఐబీ, ఐజీసీఎస్ఈ వంటివి ఇందుకు భిన్నం. అందులో పిల్లలు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం, చర్చించుకోవడం ఒక భాగం. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి తమకిచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి లేదా ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. టీచర్ల సాయం తీసుకుంటారు. ఇక ఆటపాటలు సరేసరి. ఇప్పు డున్న పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమవుతాయా? విద్యార్థుల మధ్య ఆరేసి అడుగుల దూరం వుండేలా చూడటం, వారు చెట్టపట్టాలు వేసుకోకుండా చూడటం తప్పనిసరి. పిల్లలు భౌతికదూరం పాటిం చేలా చూడటం, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా? వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా విశా లమైన తరగతి గదుల నిర్మాణం ఎలా? తరగతి గదికి వచ్చాక కాదు... బస్సులోనో, మరో వాహనం లోనో బడికి వస్తున్నప్పుడూ, తిరిగి ఇళ్లకు వెళ్తున్నప్పుడు వారితో పాటింపజేయాల్సినవేమిటి? అనారోగ్యం బారిన పడిన పిల్లలు బడికి రాకుండా తల్లిదండ్రులు ఏదోమేరకు జాగ్రత్తలు తీసుకుంటా రనుకున్నా, ఆ పిల్లలు బడికి వచ్చాక సమస్య బయటపడిన పక్షంలో ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? వారిని మళ్లీ సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడం, ఆ పిల్లలకు సకాలంలో వైద్యం అందేలా చూడటం ముఖ్యం గనుక అందుకు అదనపు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఈ ఏర్పాట్ల కోసం ఎన్నో వ్యయప్రయాసలు తప్పవు. అవసరమైన మానవ వనరులు అందుబాటులోకి తీసుకు రావాల్సివుంటుంది. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం వుంటోంది. ఆ సదుపాయాన్ని కొనసాగించడంలో పాటించాల్సిన జాగ్రత్తలేమిటో చూసుకోవాలి. అలాగే కొత్తగా కేసులు బయటపడినచోట పాఠశాలలు మూతబడక తప్పదు. అప్పుడు ఇతర పాఠ శాల విద్యార్థులతోపాటు వారు కూడా చదువుల్లో ముందుండటానికి ఏం చేయాలో ఆలోచించాలి. ఈ కష్టకాలంలో పిల్లల్లో సహజంగానే భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. తమ ఇంట్లోనో, తమ పొరుగునో సమస్యల్లో చిక్కుకున్నవారి గురించి విని భయాందోళనలతో వుంటారు. దానికి తోడు మునుపటిలా కదలికలుండవు గనుక ఒక రకమైన అసౌకర్యానికి గురవుతారు. తోటి పిల్లల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఇవన్నీ మరింతగా పెరుగుతాయి. కనుక సిలబస్ పూర్తి చేయాలన్న తొందరలో టీచర్లు ఒత్తిళ్లు తీసుకురాకూడదు. అసలు బోధనావిధానమే సంపూర్ణంగా మార్చు కోవాల్సి ఉంటుంది. బడులు తెరవడం అంటే వీటన్నిటి విషయంలో సర్వసన్నద్ధంగా వుండటం. చాలా రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రభుత్వాలు బడుల్ని నిరాదరిస్తూ వస్తున్నాయి. మెజారిటీ పాఠశాలల్లో మిగిలిన సదుపాయాల మాట అటుంచి సురక్షితమైన తాగునీరు లభ్యత కూడా లేదు. ఈ కరోనా కష్టకాలంలో కూడా అవే పరిస్థితులు కొనసాగితే విద్యార్థులను ముప్పు బారిన పడేసినట్టే. ఇప్పుడే ర్పడిన ఈ అసాధారణ పరిస్థితులకు అనుగుణంగా పాత విధానాలన్నీ సవరించుకోవడం, ప్రభావ వంతంగా బోధించి పిల్లలు విద్యాపరంగా వెనకబడకుండా చూడటం, అవసరమైన సదుపాయాలు అందుబాటులో వుంచడం పాఠశాలల ముందున్న పెను సవాలు. ఆ సవాలును ఎదుర్కొనగలిగే సత్తా ఉన్నప్పుడే పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దడం సాధ్యం. -
తిరిగి తెరుచుకోనున్న ఐకియా స్టోర్
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మూతపడిన ఐకియా స్టోర్ సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనుంది. భౌతిక దూరం పాటించడంతో పాటు సందర్శకుల సంఖ్యను పరిమితం చేయడం ద్వారా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్టోర్ మేనేజర్ అరెలీ రెయిమన్ వెల్లడించారు. తమ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడం, ఫేస్ మాస్క్లు తప్పనిసరి చేయడం, శానిటైజర్ యంత్రాల వంటి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సంస్థ ఉద్యోగులు, కస్టమర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. -
అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు
-
సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్ పాలసీ
‘‘సినిమా, టీవీ షూటింగ్లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు తగు చర్యలు చేపట్టబోతున్నాం’’ అని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినిమా, టీవీ షూటింగ్ అనుమతులు, థియేటర్ల రీ ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ, టీవీ రంగాలకు చెందిన వివిధ అసోసియేషన్ల ప్రతినిధులతో తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్బాబు గురువారం సమావేశం నిర్వహించారు. సినిమా థియేటర్లకు ప్రత్యేక విద్యుత్ టారిఫ్, ఫ్లెక్సీ టికెటింగ్ ధరలు, ఆన్లైన్ టికెటింగ్ విధానం, కళాకారులకు పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డులు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. ‘‘సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం రూపొందిస్తున్న బెస్ట్ పాలసీలో ఈ అంశాలను పొందుపరచడం జరుగుతుంది. సమావేశంలో చర్చించిన అంశాలు, నిర్ణయాలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపించడం జరగుతుంది’’ అని తలసాని చెప్పారు. సినీ రంగానికి చెందిన ప్రతినిధులు షూటింగ్ ప్రదేశాలలో, థియేటర్లలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చే ఆర్టిస్టులకు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాసులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా రాత్రి వేళలో కర్ఫ్యూ అమలు చేస్తున్న కారణంగా షూటింగ్ ముగిసిన అనంతరం ఆర్టిస్టులు, ఇతర సిబ్బంది తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొనగా, పోలీసు శాఖకు దరఖాస్తు చేస్తే ఈ పాస్లు మంజూరు చేయనున్నట్లు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా వివరించారు. ఈ సమావేశంలో నటుడు అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, ఎన్. శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సి. కళ్యాణ్, కేఎస్ రామారావు, సురేష్ బాబు, మా అధ్యక్షులు నరేష్, అసోసియేషన్ ప్రతినిధులు దామోదర్ ప్రసాద్, సుప్రియ, టీవీ చానళ్ల ప్రతినిధులు బాపినీడు, పి. కిరణ్, ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు విజయేందర్ రెడ్డి, సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళీ మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లను పునరుద్ధరిస్తాం
వాషింగ్టన్: కోవిడ్ ధాటికి విలవిలలాడుతున్న అగ్రరాజ్యంలో తిరిగి మార్కెట్లు ప్రారంభించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు దశల ప్రణాళికను ప్రకటించారు. దేశంలో నిరుద్యోగ భృతి కోసం మరో 52 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని కార్మిక శాఖ చెబుతున్న నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ ఉధృతికి మార్చిలో దేశవ్యాప్తంగా 2.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ 5.9 శాతం కుంచించుకుపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో అతి పెద్దదైన తమ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడానికి ట్రంప్ ప్రభుత్వం మార్కెట్లను తెరవాలని అనుకుంటోంది. ఇన్నాళ్లూ మార్కెట్ల పునరుద్ధరణపై అధ్యక్షుడిదే తుది నిర్ణయం అని వాదించిన ట్రంప్ ఇప్పుడు ఆయా రాష్ట్రాల గవర్నర్లే దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ మాటమార్చారు. రాష్ట్ర గవర్నర్లకు ఫెడరల్ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఇందుకోసం మూడు దశల ప్రణాళికను ప్రకటించారు. -
నా జీవితంలో అతి పెద్ద నిర్ణయం
కంటికి కనిపించని శత్రువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడానికి ఆంక్షల్ని ఎత్తి వేయడం పెను సవాల్గా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ నిర్ణయమే తన జీవితంలో అతి పెద్దదన్న ట్రంప్ దానిని ఎప్పుడు తీసుకుంటారో వెల్లడించలేదు. కోవిడ్ –19 దెబ్బతో అగ్రరాజ్యం సంక్షోభంలో పడిపోయింది. దేశంలోని 33 కోట్ల మందిలో 95 శాతానికి పైగా ఇళ్లకే పరిమితమయ్యారు. కొద్ది వారాల్లోనే 1.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వైట్ హౌస్లో శుక్రవారం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజల్ని ఇల్లు కదలవద్దన్న ఆంక్షల్ని ఎత్తి వేయడమే తాను జీవితంలో తీసుకోబోయే అతి పెద్ద నిర్ణయమని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టాలంటే ప్రజలందరూ మళ్లీ పనుల్లోకి రావాలని, దానికి తగిన సమయం కోసం చూస్తున్నామని అన్నారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి ఆ దేవుడిపైనే భారం వేశారు. అయితే కచ్చితంగా ఆ నిర్ణయం నేను నా జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం అవుతుంది’అని ట్రంప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఏపీలో మార్కెట్ యార్డులు పునః ప్రారంభం
-
ఇప్పుడు బడికెట్ల పోవాలె?
సాక్షి, కరీంనగర్ : దసరా సెలవులు... తర్వాత ఆర్టీసీ సమ్మెతో మరో వారం రోజులు పొడిగింపు ముగియడంతో ఎట్టకేలకు సోమవా రం విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నా యి. 23 రోజుల సెలవులు ముగియడంతో ఇక పాఠశాలలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈమేరకు విద్యాశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. అయితే ఆర్టీసీ సమ్మె కొనసాగుతుం డడంతో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు, దూర ప్రాంత పాఠశాలలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బుతకమ్మ, దసరా పండుగ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముందుగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. 14న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యాశాఖ మరోసారి పాఠశాలలకు ఈనెల 14 నుంచి ఈనెల19 వరకు మళ్లీ పొడగించింది. దీంతో ఏకంగా విద్యాసంస్థలు 23 రోజులపాటు మూతపడడంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. 40 శాతమే సిలబస్ పూర్తి... ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు కేవలం 40 శాతం వరకే సిలబస్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి 50 శాతంపైగా సిలబస్ పూర్తికావాల్సి ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు నవంబర్ మొదటి వారం నుంచే స్టడీ అవర్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్లో పేర్కొన్నారు. పాఠశాలలకు పదేపదే సెలవులు రావడం, ఏకంగా దసరా సెలవులతోపాటు ఆర్టీసీ సమ్మె కారణంతో 23 రోజులు సెలవులు ఉండడంతో విద్యాప్రణాళిక అస్తవ్యస్తంగా మారింది. జనవరి చివరి మాసం ఫిబ్రవరి మొదటి వారంలోగా అన్ని తరగతులకు సిలబస్ పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పాఠశాల విద్యావ్యవస్థ గాడిన పడుతుందో లేదోనని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రూట్లలోనే బస్సులు.. ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలోని ప్రధాన రూట్లలోనే బస్సులు నడుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ – 1, 2 డిపోలతోపాటు, హుజూరాబాద్, డిపోల నుంచి హైదరాబాద్, గోదావరిఖని, సిరిసిల్ల, వేములవాడ, మంచిర్యాల లాంటి ప్రధాన రూట్లలోనే బస్సులు నడిపిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రూట్లకే అధికారులు బస్సులను పంపిస్తున్నారు. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు 16 రోజులుగా ఆర్టీసీ బస్సు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 40 శాతం గ్రామాలకు వెళ్లేవి.. జిల్లాలోని మూడు డిపోల పరిధిలో 700 బస్సులు ఉన్నాయి. వీటిల్లో 30 బస్సుల వరకు గ్రామీణ ప్రాంతాల్లో నడిపించేవారు. అన్ని గ్రామాల్లో పాఠశాలల వేళలకు బస్సులను నడుపుతుండడంతో చాలా మంది ఉపాధ్యాయులు జిల్లా కేంద్రం నుంచే అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా హైస్కూల్ కోసం మండల కేంద్రాల్లోని పాఠశాలలకు వెళ్తున్నారు. నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతుండడంతో బస్సుపాసులున్న విద్యార్థులతోపాటు, ప్రభుత్వ, ప్రయివేటు ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లేవారు మరో 800 మంది ఉంటారు. వీరికి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రత్యేక బస్సులు నడపకుంటే ఇబ్బందే.. దసరా సెలవులు 23 రోజులు ఇవ్వడంతో ఇప్పటికే విద్యార్థులు చదువుపరంగా చాలా నష్టపోయారు. జిల్లాలోని చాలా గ్రామాల నుంచి పాఠశాల, ఇంటర్, డిగ్రీ, ఇతర చదువులకు జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు. నేటినుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు బస్సులు నడిపించకుంటే మరింత నష్టం జరిగే అవకాశం ఉందని విద్యార్థులు, తల్లిండ్రులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకుని పల్లెలకు బస్సులు నడిపించాలని కోరుతున్నారు. -
మోగిన బడిగంట
జనగామ: నూతన విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. బుధవారం బడిగంట మోగడంతో పుస్తకాల బ్యాగులు వీపున వేసుకుని హడావిడిగా స్కూళ్లకు బయలు దేరారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. సెలవుల్లో తాము చేసిన అల్లరిని స్నేహితులతో పంచుకుంటూ తొలిరోజు పాఠశాలలో అడుగుపెట్టారు. ఉపాధ్యాయులకు గుడ్ మార్నింగ్ చెబుతూ సరదాగా గడిపారు. పలువురు విద్యార్థులు కొత్తగా కొనుగోలు చేసిన సైకిళ్లపై పాఠశాలకు చేరుకోగా.. మరికొందరు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల వద్ద విద్యార్థులు శ్రమదానం చేపట్టి పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదులను శుభ్రం చేసుకున్నారు. తరగతి గదుల్లోకి వస్తున్న స్నేహితులను విష్ చేస్తూ తొలిరోజు సరలదాగా గడిపారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో ప్రభుత్వ ప్రైమరీ, ప్రాథమికోన్నత, ఉన్నత, ట్రైబల్, సాంఘిక, బీసీ సంక్షేమ, ఎయిడెడ్ పాఠశాలలు 571 ఉన్నాయి. వీటిలో ప్రైమరీ 349, ప్రాథమికోన్నత 71, ఉన్నత పాఠశాలలు 151 ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి 54 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అనేక సమస్యలతో నూతన విద్యా సంవత్సరం స్వాగతం పలికింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో తాగునీరు, వంటగదుల నిర్మాణం, టాయిలెట్స్ సమస్య విద్యార్థులను వెంటాడుతోంది. అయితే జిల్లాలోని ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ ఉన్నప్పటికీ నిర్వహణ లేక సగం స్కూళ్లలో వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయుల ఇంటిబాట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ఆదేశాల మేరకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కలిగిస్తూ.. ప్రైవేటు కాదని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరుతున్నారు. కాగా జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు ప్రైవేటు స్కూళ్లకు పంపించబోమని పలువురు తల్లిదండ్రులు సర్కారు స్కూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రేపటి నుంచి బడిబాట ఈ నెల14 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రైవేటుకు వెళ్లే విద్యార్థులతో పాటు బడిబయట ఉన్న వారిని గుర్తిస్తారు. మన ఊరు–మనబడిబాట ద్వారా స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటికి వెళ్లడం జరుగుంది. ఇంటింటికీ ప్రణాళిక రూపొందించుకుని, పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పిల్లల ప్రవేశాలు, ఆధార్ కార్డుల సేకరణపై దృష్టి సారించనున్నారు. బడిమధ్యలో మానేసిన పిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి అవగాహన కలిగిస్తారు. బాలికలను కేజీవీబీలో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
సుభాష్నగర్(నిజామాబాద్అర్బన్): జిల్లాలో బడి గంటలు మోగాయి. తొలిరోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు తరలి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 1608 పాఠశాలలు తెరుచుకున్నాయి. అందులో 454 ప్రైవేటు పాఠశాలలు కాగా, 766 ప్రైమరీ, 136 అప్పర్ ప్రైమరీ, 252 హైస్కూల్ ఉన్నాయి. ఇవే కాకుండా కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, బీసీ, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో గత నాలుగైదు రోజులుగా పుస్తకాలు, బట్టలు, బ్యాగులు, స్టీల్, ఇతరాత్ర దుకాణాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. కొత్త దుస్తులు, బ్యాగులు, లంచ్ బాక్సులతో న్యూలుక్లో విద్యార్థులు పాఠశాలలకు ఉత్సాహంగా వెళ్లారు. పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు.. జిల్లాలోని 766 ప్రైమరీ, 136 అప్పర్ ప్రైమరీ, 252 హైస్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. ఆ పుస్తకాలు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు చేరుకున్నాయి. ఒకటి నుంచి పదోతరగతి 6,90,600 పుస్తకాలు అవసరమని ప్రతిపాదనలు పంపించగా, 6,89,350 పుస్తకాలను ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేసింది. అందులో 27 మండలాల్లోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు 6,67,695 పుస్తకాలను తరలించారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించి 1250 పుస్తకాలు రావాల్సి ఉంది. మొదటిరోజు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. -
బడికి వేళాయే..!
భువనగిరి : వేసవి సెలవుల్లో ఆటాపాటలతో హాయిగా గడుపుతున్న విద్యార్థులు బడికి వెళ్లే సమయం రానే వచ్చింది. నేటి నుంచి బడిగంట మోగనుంది. 2019–2020 విద్యా సంవత్సరం బుధవారం నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున విద్యార్థుల సందడితో పండుగ వాతావరణం నెలకొనాలని రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం విద్యా క్యాలెండర్ను 12రోజులు ముందుకు జరి పింది. కానీ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వేసవి సెలవులను జూన్ 11వ తేదీ వరకు పొడిగించింది. దీంతో జూన్ 1వ తేదీన పునః ప్రారంభం కావాల్సిన పాఠశాలలు జూన్ 12న ప్రారంభమవుతున్నాయి. అలాగే 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగాల్సిన బడిబాటను కూడా 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలిరోజున పాఠ్య పుస్తకాల పంపిణీ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తొలిరోజున పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, మోడల్, కేజీబీవీలకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు చేరాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 3,39,962 పుస్తకాలు అవసరం ఉండగా 3,12,950 పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరా యి. మరో 27,012 పుస్తకాలు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయించడానికి వీలులేదు. ప్రైవేట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు విక్రయించడానికి భువనగిరిలో దత్తసాయి, చౌటుప్పల్లో ధనలక్ష్మి, బుక్స్టోర్లకు విద్యాశాఖ అధికారుల అనుమతి ఇచ్చారు. 14 నుంచి బడిబాట.. ఈనెల 14 నుంచి 19వ తేదీవరకు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు ఏటా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. సుమారు ఆరు రోజులపాటు కొనసాగే బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు శాతం పెరిగే అవకాశం ఉంటుంది. తగ్గని ఉష్ణోగ్రతలు.. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. గరిష్టంగా 40 నుంచి 42 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. జూన్ 1వ తేదీన ప్రారంభించాల్సిన పాఠశాలలను అధిక ఉష్ణోగ్రతల కారణంగా సెలవులను 11వ తేదీ వరకు పొడిగించారు. అయినప్పటికీ ఉష్ణోగ్రతలు అదే విధంగా కొనసాగుతుండడంతో పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తొలిరోజు పాఠ్యపుస్తకాల పంపిణీ పాఠశాలలు ప్రారంభం రోజున పాఠ్య పుస్తకాల పంపిణీ జరుగుతుంది. 14 నుంచి 19వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషిచేయాలి. యూనిఫాం కూడా ఇప్పటికే మండలాలకు చేరింది. – రోహిణి, డీఈఓ -
అమ్మ ఒడి నుంచి అక్షరాల గుడికి
ఇప్పటి వరకు ఆకాశాన ఇంద్రధనస్సులోని ఏడు రంగులూ వారివే.. ఈత సరదాలు, వేసవి ఎండలు అన్నీ వారివే.. వేసవి సెలవుల్లో వారికి ప్రతి ఘడియా మధురమే.. అందుకే సెలవుల అమృత జ్ఞాపకాలన్నింటినీ చిరునవ్వుల్లో దాచుకుని.. నేడు అనురాగపు అమ్మ ఒడి నుంచి చదువులమ్మ గుడిలోకి అడుగుపెడుతున్నారు విద్యార్థులు.. మరో వైపు రాజన్న బాటలో అడుగులు వేస్తున్న ప్రభుత్వం సరస్వతీ నిలయాలకు వసతుల తోరణాలు కట్టి విద్యార్థులను మనసారా ఆహ్వానిస్తోంది. నో బ్యాగ్ డే, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు వంటి నిర్ణయాలతో సర్కారు బడిని ఉన్నతంగా తీర్చిదిద్ది.. రేపటి పౌరుల బంగారు భవిష్యత్కు బంగారు బాటలు పరిచింది. సాక్షి, గుంటూరు : నూతనంగా ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ప్రభుత్వ బడుల బలోపేతానికి మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో వేలకు వేలు ఫీజులు కట్టలేని నిరుపేద విద్యార్థులకు ఒత్తిడి లేని, నాణ్యమైన విద్య అందించాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. శనివారం నో బ్యాగ్ డే, ఆనంద పాఠ్యాంశాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, డిజిటిల్ తరగతులు, పుస్తకాలు, సైకిళ్ల పంపిణీ వంటి వాటిని దీటుగా అమలు చేసి ప్రభుత్వ బడులపై నమ్మకం కలిగించేలా అడుగులు ముందుకు వేస్తోంది. ఒత్తిడి నుంచి ఉపశమనం.. ర్యాంకులతో కుస్తీలు పడుతూ విద్యార్థులు మానసికంగా ఒత్తిడికిలోనై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఒత్తిడి నుంచి పిల్లలకు ఉపశమనం కలిగించటంతోపాటు వారిపై శారీరిక భారాన్ని కాస్త తగ్గించటంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి శనివారం బ్యాగ్ లేకుండా స్కూల్కు వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తోంది. సులువుగా అర్థమయ్యేలా బోధించేందుకు డిజిటల్ తరగతి గదులు, వర్చువల్ తరగతి గదులు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు మారారు. పిల్లలందరికీ పౌష్టికాహారం.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడం కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం పూర్తిగా కుంటుపడింది. దీంతో సీఎం జగన్ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించే విధంగా విద్యా శాఖపై చేసిన తొలి సమీక్షలోనే ఆదేశాలు జారీ చేశారు. పౌష్టికాహారం రాజీ పడకుండా సరఫరా చేయాలని, సమీకృత వంటశాలను ఏర్పాటు చేసి వేడిగా, శుచిగా, శుభ్రంగా అందజేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆరోగ్య రక్ష కార్డులు మంజూరు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, డాక్టర్లు, నెలకోసారి పాఠశాలలకు వెళ్లి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారికి రిఫరల్ ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. ‘ప్రైవేట్’ కన్నా మిన్న.. ఫీజు ఎక్కువ ఉంటే స్కూలు మంచిదని, ఎక్కువ సమయం తరగతులు నిర్వహిస్తే ఆ స్కూల్ నంబరు వన్ అనే రీతిలో ప్రైవేటు స్కూళ్ల యజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా ఆదే అభిప్రాయంతో ఉండటంతో వారు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కార్పొరేట్ స్కూలు మెట్లు ఎక్కేందుకు ఆరాటపడుతున్నారు. ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సాగుతుండగా ఇరుకు గదులు, ఆపార్టుమెంట్లలో ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. బూట్లు కూడా.. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం బూట్లు ఉచితంగా విద్యార్థులకు సరఫరా చేయనుంది. పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి పుస్తకాలు బడిలో ఉండాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 8, 9 తగతుల బాలికలకు ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లను అందిస్తోంది. 2017లో కేవలం ఎనిమిదో తరగతి విద్యార్థినులకు మాత్రమే సైకిళ్లు అందించగా.. గత ఏడాది నుంచి 9 వతరగతి బాలికలకు కూడా పంపిణీ చేస్తున్నారు. పాఠశాలలు బాలికల నివాస ప్రాంతాలకు దూరంగా ఉంటున్నందున కొందరు మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజన్న బడిబాట.... ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలను పెంచేందుకు కొత్త ప్రభుత్వం ‘రాజన్న బడి బాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐదు రోజులుపాటు ప్రతి ఇంటికీ ఉపాధ్యాయులు వెళ్లి పిల్లల వివరాలను తెలుసుకొని బడిలో చేర్పించే కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వం నిర్ణయాల వల్ల పాఠశాలలు ఎలా ఉండబోతున్నాయో, పిల్లలు ఎటువంటి లబ్ధి పొందనున్నారో వివరించనున్నారు. -
బడికి వేళయింది..
కరీంనగర్ఎడ్యుకేషన్: విద్యార్థులు వేసవి సెలవులకు టాటా చెప్పి ఇక బడిబాట పట్టే వేళయింది. ఎప్పటిలాగే ఈ ఏడాదీ ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. పర్యవేక్షణాధికారుల లేమి, మౌలిక వసతులు, మరుగుదొడ్లు, తరగతి గదులు లేక, తాగునీరు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. బుధవారం నుంచి జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 16 మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలు లేరు. దీంతో ప్రధానోపాధ్యాయులకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఏర్పడ్డ మరో నాలుగు మండలాలు కరీంనగర్రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, ఇల్లందకుంటకు ఎంఈఓ పోస్టులు మంజూరు కాలేదు. జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు సైతం ఇన్చార్జి కావడం గమనార్హం. జగిత్యాల డీఈవో బాధ్యతలతోపాటు కరీంనగర్ డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పర్యవేక్షణ.. మధ్యాహ్న భోజన పథకం అమలు.. ఉపాధ్యాయులకు వేతనాలు.. సెలవుల మంజూరు.. మెడికల్ రీయింబర్స్మెంట్ మంజూరు.. వారి పనితీరు బేరీజు బాధ్యత ఎంఈవోలదే. ఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో.. పీఎస్, యూపీఎస్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కరీంనగర్, హుజూరాబాద్ ఉప విద్యాధికారులతోపాటు జిల్లా పరిషత్ డెప్యూటీ ఈఓ, ఆర్ఎంఎస్ఏ డిప్యూటీ ఈఓలంతా ఇన్చార్జీలే. ఉన్నత పాఠశాలల్లో 131 మంది సబ్జెక్టు టీచర్లు కొరత ఉంది. జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 650, కేజీబీవీలు 12, ఆదర్శ పాఠశాలలు 11 ఉన్నాయి. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1,40,377 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులు భర్తీ కావడంతో ఏటా విద్యావాలంటీటర్లను నియమించాల్సి వస్తోంది. ఈయేడు 218 మంది విద్యావాలంటీర్లు అవసరమని జిల్లా విద్యాశాఖ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపినా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. టీఆర్టీ ద్వారా నియమాకమైన ఉపాధ్యాయులపై ఇంతవరకు స్పష్టత లేదు. ఇటు విద్యావాలంటీర్లను పాత వారిని కొనసాగిస్తారో లేదో స్పష్టమైన ఉత్తర్వులు లేవు. పాఠ్యపుస్తకాలు ఓకే... జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేసేందుకు ఇప్పటికే ఎమ్మార్సీ కేంద్రాలకు 3,35,580 పుస్తకాలను జిల్లా కేంద్రం నుంచి ఎంఈవోలకు చేరవేశారు. పాఠశాలల పునఃప్రారంభం రోజు బుధవారమే పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏకరూప దుస్తుల పంపిణీపై నీలినీడలు.. విద్యార్థులకు రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు పంపిణీకి ప్రభుత్వం స్కూల్ మెనేజ్మెంట్ కమిటీల ద్వారా కావాల్సిన బట్టను కొనుగోలు చేసి ఇది వరకే మహిళా ఏజెన్సీలకు అప్పగించింది. పాఠశాల పునః ప్రారంభం రోజు అందించాల్సి ఉండగా.. అందడం గగనంగా మారింది. చెట్ల కిందే చదువులు .. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేక.. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో.. హాలులో.. చెట్ల కిందే చదువులు కొనసాగుతున్నాయి. 327 తరగతి గదులకు మేజర్ మరమ్మతులు, 359 గదులు కూల్చివేయాలని సర్వాశిక్షాభియాన్ ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా నేటికీ ఫలితం లేదు. జిల్లాలో 206 అదనపు తరగతుల గదుల నిర్మాణాల అవసరమన్న ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లేదు. జిల్లాలో విద్యాశాఖ వివరాల ప్రకారం బడుల్లో బాలుర మరుగుదొడ్లు 117, బాలికల మరుగుదొడ్లు 87 నిరుపయోగంగా ఉండగా.. బాలురకు 20, బాలికలకు 87 మరుగుదొడ్లు అవసరమని ప్రతిపాదనలు పంపి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దీంతో బహిర్భూమి కోసం విద్యార్థినులు ఇళ్లకు వెళ్తున్నారు. 72 స్కూళ్లలో ప్రహరీ నిర్మాణం లేదు. మధ్యాహ్న భోజనం వండేదెలా..? జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. 1,40,377 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. 3723 మంది వంట మనుషులు, హెల్పర్లు ఉన్నారు. పథకంలో భాగంగా ప్రతీ ఏజెన్సీకి ఓ కిచెన్షెడ్(వంటగది) నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత విద్యాసంవత్సరం తొలి విడతగా 522 షెడ్లు మంజూరు చేసింది. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.2.50 లక్షలు కేటాయించింది. ఇప్పటి వరకు 380 షెడ్ల నిర్మాణం పూర్తయింది. రెండో విడతలో.. 919 వంటషెడ్లు మంజూరైనవి, 369 వంట గదుల నిర్మాణం జరుగుతున్నాయి. 175 వంట గదుల ప్రతిపాదనలు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు అందజేశారు. మిగతా వంటగదుల నిర్మాణాలు నిర్మాణ దశలో పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి. -
బడికి పోదాం..
ఆదిలాబాద్టౌన్/ఆదిలాబాద్కల్చరల్: బడికి వేళయింది.. బుధవారం నుంచి బడిగంట మోగనుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఆడిపాడిన విద్యార్థులు ఇక ఆటాపాటలకు టాటా చెప్పి బడిబాట పట్టనున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. ప్రహరీలు, తాగునీరు.. మొండి గోడలు, అసంపూర్తి గదులు ఆహ్వానిస్తున్నాయి. ఉపాధ్యాయుల ఖాళీలు, శిథిల భవనాలు, చెట్ల కింద చదువులు కొనసాగేలా ఉన్నాయి. మరుగుదొడ్డి ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటి నుంచి దుర్గం ధం వ్యాపిస్తోంది. ఉపాధ్యాయ పోస్టులు ఇంకా భర్తీ కాకపోవడంతో విద్యావాలంటీర్లతోనే విద్యాబోధన కొనసాగనుంది. జిల్లాలో దాదాపు 400 పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉంది. 241 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. విద్యాశాఖాధికారులు సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యబోధన అందించి వారి భవిష్యత్కు బాటలు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అందరూ ఇన్చార్జీలే.. జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఆయా మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులే మండల విద్యాధికారులుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాఠశాలపై పర్యవేక్షణ కొరవడి అస్తవ్యస్తంగా తయారవుతుంది. ప్రధానోపాధ్యాయులకు రెండు బాధ్యతలు ఉండడంతో అటు ఎంఈఓ విధులకు.. ఇటు పాఠశాలకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారు. కొత్తగా ఏర్పడిన మావల, సిరికొండ, భీంపూర్, ఆదిలాబాద్అర్బన్, గాదిగూడ మండలాలకు ఇంకా ఎంఈఓలను నియమించలేదు. పాత మండలాల ఎంఈఓలే ఇన్చార్జీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు భర్తీ చేస్తేగానీ ప్రాథమిక విద్యావ్యవస్థ గాడిలో పడేలా కనిపించడం లేదు. ఉపాధ్యాయుల ఖాళీలు.. జిల్లాలో మొత్తం 1,420 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,288 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. 970 ప్రాథమిక పాఠశాలలు, 122 ప్రాథమికోన్నత పాఠశాలలు, 195 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,28,354 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా హక్కుచట్టం ప్రకారం ప్రతీ తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. దాదాపు 500లకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలున్నాయి. ఉపాధ్యాయుల నియామకం కోసం టీఆర్టీ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేసినా నియామకాలు చేపట్టకపోవడంతో వీవీలతోనే విద్యాబోధన కొనసాగుతోంది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదని తెలుస్తుంది. దాదాపు 50 పాఠశాలల వరకు జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, 20 వరకు ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సమీపంలోని పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసి విద్యబోధన చేయిస్తున్నారు. వీరు పాఠశాలకు సెలవు పెడితే విద్యార్థులకు కూడా సెలవే అన్న విధంగా పాఠశాలలు కొనసాగుతున్నాయి. తాగునీటి సమస్య.. జిల్లాలో దాదాపు 430 పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులు కొంతమంది ఇంటి నుంచే నీటిని తీసుకొస్తుండగా, ఇంకొందరు ఇంటికి వెళ్తున్నారు. సమీపంలోని బోరుబావుల వద్ద నీరు తాగుతున్నారు. నీటి సమస్యతో మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండకపోవడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడటం లేదు. మహిళ ఉపాధ్యాయుల సైతం మరుగుదొడ్లు లేనిచోట అవస్థలు పడుతున్నారు. అందని కంప్యూటర్ విద్య.. విద్యార్థులకు గత కొన్నేళ్లుగా కంప్యూటర్ విద్య అందకుండా పోయింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య బోధించాలనే ఉద్దేశంతో అప్పట్లో ఎడ్కం సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించారు. ఐదు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ ఒప్పందం ఉండగా, వారి గడువు ముగియడంతో ఇన్స్ట్రక్టర్లను తొలగించారు. ప్రస్తుతం పాఠశాలల్లో కంప్యూటర్లు మూలన పడ్డాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అందకుండా పోయింది. విద్యార్థులతోనే సిబ్బంది పనులు.. బోధనేతర సిబ్బందిలో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక స్వీపర్, ఒక అటెండర్, రాత్రి కాపలదారి ఉండాలి. ఉన్నత పాఠశాలల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఉండాలి. కొన్ని పాఠశాలల్లో మాత్రమే జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. స్వీపర్లు లేకపోవడంతో విద్యార్థులే పాఠశాలలను శుభ్రపర్చుకుంటున్నారు. స్కావెంజర్ ఉన్నచోట పాఠశాలలను శుభ్రపర్చుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మొదటి గంట కొట్టడం నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు విద్యార్థులే పనులు కొనసాగిస్తున్నారు. ఇబ్బందులు లేకుండా చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పటికీ అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరాయి. ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు కూడా విద్యార్థులకు అందిస్తాం. బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించేందుకు ఈ నెల 14 నుంచి బడిబాట చేపడుతున్నాం. ఇటీవల విడుదలైన పదో ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. ఈ విద్యాసంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపడతాం. – ఎ.రవీందర్రెడ్డి, డీఈఓ -
బడికి వేళాయె!
పాలమూరు: బడిగంటలు మోగాయి.. వేసవి సెలవుల్లో అమ్మమ్మ, నానమ్మ ఊర్లకు వెళ్లి సరదాగా గడిపిన విద్యార్థులు నేటినుంచి పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు ఈనెల 1వ తేదీనే తెరుచుకోవాల్సిన పాఠశాలలు ఎండలు మండుతుండడంతో ప్రభుత్వం 12వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేటినుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ పాఠశాలలను మొదటిరోజు అట్టహాసంగా ప్రారంభించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయగా ఉపాధ్యాయులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా గ్రామాలు, పట్టణాల్లో తమదైన శైలిలో ప్రచారాలు చేసి నేడు ఆర్భాటంగా పాఠశాలలను ప్రారంభించనున్నారు. ముందేచేరిన పుస్తకాలు పాఠశాలల ప్రారంభం రోజునే తరగతులు కూడా ప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకు తగ్గట్టు ముందుగానే అవసరమైన పాఠ్యపుస్తకాలను అందజేశారు. నేటినుంచి పాఠశాలలు తెరుచుకోనున్నడంతో పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు, స్కూల్ యూనిఫాం ఇతర వస్తువులను కొనుగోలు చేస్తూ తల్లిదండ్రులు బిజీగా కనిపించారు. జిల్లా కేంద్రంలో ఉన్న బుక్సెంటర్లు, షూ సెంటర్లు, బట్టల దుకాణాల్లో సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 2601 ప్రాథమిక పాఠశాలలు, 567 ప్రాథమిక కొన్నత పాఠశాలలు, 575 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా 1750 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా దాదాపు 10లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో చదువుకుంటున్నారు. ఇదిలాఉండగా మహబూబ్నగర్ జిల్లాలో 212 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 1,167 ప్రాథమికొన్నత ప్రాథమిక పాఠశాలలు, 383 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నూతనంగా వచ్చిన పాఠశాలలు కాకుండా 150 ప్రాథమిక పాఠశాలలు, 213 ఉన్నత పాఠశాలలుండగా 85,511 మంది విద్యార్థులు చదువుతున్నారు. సామాన్యులకు ఆర్థికభారం జూన్ మాసం వచ్చిందంటే సామాన్యులకు ఆర్థిక, అప్పుల భారం పెరుగుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల సంగతి చెప్పనక్కరలేదు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు రూ.12వేల నుంచి రూ.18వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.22వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు ప్యాకేజీ కింద రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దాంతోపాటు సాధారణ స్కూల్ ఫీజులే కాకుండా డోనేషన్లు, అడ్మిషన్ ఫీజులు, స్పెషల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ల్యాబ్ ఫీజులు, రికార్డులు, బస్సు ఫీజులు, టైలు, బెల్టులు, ఐడెంటీ కార్డులు, పుస్తకాలు, వంటివి బయట కొనుగోలు చేయకుండా నిబంధనలు ఏర్పాటు చేసి వారి పాఠశాలల్లోనే కొనాల్సిన పరిస్థితి తీసుకొస్తారు. దీంతో విద్యార్థులు ఎక్కడ కూడా చెప్పలేక యాజమాన్యాలు చెప్పనదానికి తల ఊపాల్సి వస్తోంది. దానికితోడు పెరిగిన ధరలు కూడా తల్లిదండ్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారికి పెన్సిల్ దగ్గరి నుంచి స్కూల్ ఫీజుల వరకు వేలల్లో ఖర్చు అవుతుంది. ఒక మధ్యతరగతి కుటుంబం ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కష్టంగా మారుతోంది. -
ఎనిమిదేళ్లకు బడి తీశారు..!
కార్పొరేట్ హంగులకు ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం మూతపడిన ఓ పాఠశాల ఉపాధ్యాయుల కృషితో మళ్లీ ఈ ఏడాది పునఃప్రారంభం కాబోతోంది. పిల్లలు లేక తలుపులు మూతపడి బోసిపోయిన పాఠశాల మళ్లీ విద్యార్థులతో కళకళలాడనుంది. సాక్షి,ప్రకాశం : సంతమాగులూరు పరిధిలోని రామిరెడ్డిపాలెం గ్రామంలో 20 సంవత్సరాల కిందట ప్రభుత్వం ఓ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో 28 విద్యార్థులతో కొనసాగిన పాఠశాల... ప్రైవేట్ స్కూళ్ల దెబ్బకు ఏడాది ఏడాది పిల్లల సంఖ్య తగ్గిపోతుండటంతో 2013 లో పాఠశాలను మూసివేశారు. అప్పటి నుంచి బోసిపోయిన పాఠశాల ఈ ఏడాది మళ్లీ తీస్తుండటంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది 17 మంది విద్యార్థులు ఇటీవల చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా చేరారని ఎంఈవో కోటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదరించండి ప్రైవేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఖర్చు చేస్తున్న వారు ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రోత్సహించాలని ఎంఈవో అన్నారు. రెండు నెలల నుంచి ఈ పాఠశాలను మళ్లీ తెరవాలనే ఉద్దేశంతో ఉదయం సాయంత్రం తేడా లేకుండా ఉపాధ్యాయులందరూ రామిరెడ్డిపాలెంలోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ తిరిగి పాఠశాలను తెరవాలని మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. 17 మందితో మళ్లీ ప్రారంభం రామిరెడ్డిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది. తల్లిదండ్రులు కేవలం మంచి విద్యాబోధన ప్రైవేట్ పాఠశాలల్లో ఉందని అటు వైపు వెళ్లిన వారంతా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటంతో తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలవైపే చొరవ చూపుతున్నారు. దీంతో ఈ సంవత్సరం 17 మంది విద్యార్థులు బడిలో చేరారు. 12వ తేదీ నుంచి ఈ పాఠశాలను తెరుస్తున్నామని ఒక ఉపాధ్యాయుడుతోపాటు వాలంటరీని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎంఈవో తెలిపారు. ఫలించిన ఉపాధ్యాయుల కృషి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలను ఎలాగైనా తెరిపించాలనే లక్ష్యంతో రామిరెడ్డిపాలెం గ్రామంలో రెండు నెలల నుంచి ఉపాధ్యాయులు, ఎంఈవో కలిసి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తామని హామీ ఇవ్వటంతో ఉపాధ్యాయుల కృషి ఫలించింది. -
చెన్నూరుకు తీపికబురు
సాక్షి, ఖాజీపేట : నాడు రైతులకు, కార్మికులకు కడుపునిండా అన్నం పెట్టి బతుకు బండిని నడిపిన చక్కెర ఫ్యాక్టరీ చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా 1995, 2009లో మూతపడింది. కార్మికుల ఆకలి చావులకు చంద్రబాబు కారణం అయ్యారు. నేడు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే మూతపడిన ఫ్యాక్టరీల పునరుద్ధరణకు తీర్మానం చేయడంతో కార్మికులు, రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వైఎస్ఆర్ హాయాంలో ఫ్యాక్టరీ అభివృద్ధికి నిధులుఇచ్చారు. నేడు సీఎం జగన్ పూర్వవైభవం తీసుకురానున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరుకు సాగు చేసే రైతులు, కార్మిక, కూలీల జీవితాల్లో తీపి నింపేందుకు 1971లో చక్కెర ఫ్యాక్టరీని ప్రారంభించారు. 1974లో పూర్తి చేశారు. దీనికోసం ప్రభుత్వం నుంచి 60.15 ఎకరాలు, రైతుల భూమి 30.71 ఎకరాలతో కలిపి 5 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు.ఇందులో 9వేలమంది రైతులు వాటాదారులుగా ఉన్నారు. ప్రతి రైతు 1971లో రూ 2,200 పెట్టుబడిగా పెట్టారు. ఫ్యాక్టరీలో రైతుల వాటా 54.11 శాతం ఉంది.1975లో క్రషింగ్ పనులు మొదలయ్యాయి. 1995లో తొలిసారి ఫ్యాక్టరీ మూతపడింది. దీనిని పునురుద్ధరించాల్సిన అప్పటి సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వహించారు. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2004లో ఫ్యాక్టరీని తెరిపించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఐదేళ్లకు రూ.19కోట్ల నిధులను ఇప్పించారు. 2010లో ఫ్యాక్టరీ నిర్వహణకు రూ.5కోట్ల 50 లక్షలు బ్యాంకుల నుంచి అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇప్పించని కారణంగా మళ్లీ మూతపడింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్లపాటు పట్టించుకోలేదు. దీంతో వైఎస్సార్ హయాంలో అభివృద్ధిపథంలో నడిచిన చక్కెర ఫ్యాక్టరీ మూతపడింది.తిరిగి వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంతో రైతులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఏప్రిల్లో తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం
గర్వాల్ హిమాలయాల్లో ఉన్న పవిత్ర బద్రీనాథ్ ఆలయం ఐదు నెలల తర్వాత మళ్లీ ఏప్రిల్ 26న తెరుచుకోనుంది. శీతాకాలం, మంచు కారణంగా ఈ ఆలయాన్ని ప్రతియేటా ఐదు నెలల పాటు మూసేస్తారు. ఏప్రిల్ 26 ఉదయం 5.15 గంటలకు భక్తుల కోసం ఆలయ గేట్లు తెరుస్తారని పండిట్ ఆచార్య కృష్ణప్రసాద్ ఉనియాల్ తెలిపారు. వసంత పంచమి సందర్భంగా పూజారులు, తేహ్రి రాజకుటుంబ సభ్యులు, డిమ్రి వర్గ ప్రతినిధులు, బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్.. అంతా కలిసి ఆలయాన్ని మళ్లీ తెరిచే పవిత్ర ముహూర్తాన్ని నిర్ణయించారు. గత సంవత్సరం నవంబర్ 27న శీతాకాలం సందర్బంగా ఆలయాన్ని మూసేశారు.