revealed
-
జేకేలో అమరులైన కెప్టెన్, జవాన్లు వీరే
జమ్ముకశ్మీర్లో మరోసారి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఉదంతం చోటుచేసుకుంది. దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో భారత ఆర్మీకి చెందిన ఒక కెప్టెన్, నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దట్టమైన అడవుల మధ్య సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.ఉగ్రవాదులు సైనికులపై దాడికి తలపడగా నలుగురు వీర జవాన్లు అమరులయ్యారు. ఈ అమరుల పేర్లను సైన్యం విడుదల చేసింది. భారత ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందారు. థాపా రెండవ తరం ఆర్మీ అధికారి. అతని తండ్రి కల్నల్ భువనేష్ థాపా ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. సోదరి నేపాలీ గాయని. థాపా సిలిగురిలో నివసిస్తున్నారు. ఆయన 2019లో భారత సైన్యంలో చేరారు. ఆయనతో పాటు జవాను నాయక్ డి రాజేష్, కానిస్టేబుళ్లు, బిజేంద్ర, అజయ్ అమరులైనవారిలో ఉన్నారు.దోడాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు ఆర్మీ అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా అంతకంతకూ పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్తో మాట్లాడి తాజాగా జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఆర్మీ చీఫ్కు రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం. -
రెండు హృదయాల కల
‘రూహి’ చిత్రం తర్వాత రాజ్కుమార్ రావు, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. ‘నో డ్రీమ్ ఈజ్ ఎవర్ చేజ్డ్ ఎలోన్!’ అనేది క్యాప్షన్. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్కు శరణ్శర్మ దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్ నిర్మించారు. ‘‘ఒకే కల కోసం రెండు హృదయాలు ఎదురు చుస్తున్నాయి’’ అంటూ ఈ మూవీని ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నట్లుగా జాన్వీ కపూర్ అండ్ టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
AP: రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో వ్యవసాయం, తయారీ, రియల్ ఎస్టేట్ తదితర అన్ని రంగాల్లో కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి. తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.3,74,369 కోట్లు పెరిగింది. అలాగే రాష్ఠ్ర తలసరి ఆదాయం గత నాలుగేళ్లలో 65,487 రూపాయలు పెరిగింది. ఆర్బీఐ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు ఈ వివరాలు వెల్లడించాయి. ప్రస్తుత ధరల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థపై రాష్ట్రాల వారీగా గణాంకాలను ఆర్బీఐ ఈ నివేదికలో వెల్లడించింది. గత నాలుగేళ్లుగా వ్యవసాయం, తయారీ రంగం, రియల్ ఎస్టేట్ తదితర రంగాల ఆర్థిక కార్యకలాపాల ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తికి విలువ జోడించినట్లు ఆర్బీఐ పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.7,90,810 కోట్లు ఉండగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.11,65,179 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ముఖ్యంగా 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కార్యకలాపాల విలువ భారీగా పెరుగుతున్నట్లు పేర్కొంది. 2018–19లో ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ ఆర్థిక కార్యకలాపాల నికర విలువ రూ.2,61,448 కోట్లు ఉందని, ఈ విలువ ప్రతి ఏటా పెరుగుతూ 2022–23లో రూ.4,16,441 కోట్లకు చేరిందని వివరించింది. అలాగే తయారీ రంగం ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.67,393 కోట్లు ఉండగా 2022–23కి రూ.89,180 కోట్లకు పెరిగింది. నిర్మాణ రంగం ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.56,106 కోట్లు ఉండగా 2022–23 నాటికి రూ.76,694 కోట్లకు పెరిగింది. రియల్ ఎస్టేట్, యాజమాన్యం, నివాసం, వృత్తిపరమైన సేవల ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.58,147 కోట్లు ఉండగా 2022–23కి రూ.82,775 కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా గత నాలుగేళ్లుగా పెరుగుతూనే ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షలు దాటింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 ఉండగా 2022–23కి రూ. 2,19,518 రూపాయలకు పెరిగిందని ఆర్బీఐ పేర్కొంది. -
పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర
సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు కుట్ర బయటపడింది. చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసినట్లు తేలింది. టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు అనుచరుల వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఎదుట చల్లా బాబు అనుచరులు నరీన్కుమార్, దూవల అమర్నాథ్, పెద్దన్న సుబ్రహ్మణ్యం నేరం ఒప్పుకున్నారు ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్కో స్కెచ్ వేసింది. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు స్పష్టంగా చెప్పారు. చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్ -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల మోసం
-
అంబానీకి ఆ వృత్తిపై మక్కువ!
ఆసియాలోనే అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏప్రిల్ 19, 1957న యెమెన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడైన ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ దంపతులకు జన్మించారు. ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ నికర సంపద విలువ 84.1 బిలియన్ డాలర్లు. అంటే రూ.69 లక్షల కోట్లకుపైగానే. ముఖేష్ అంబానీ 1981లో తమ కుటుంబ వ్యాపారంలోకి వచ్చి విస్తరించారు. 1985లో నీతాను వివాహమాడారు. వీరి ముగ్గరు పిల్లలు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ. ముఖేష్ అంబానీతోపాటు భార్య నీతా, వారి పిల్లలు కూడా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించేందుకు శ్రమిస్తున్నారు. వ్యాపారంలోకి రాక ముందు తాను ఏం అవ్వాలనుకున్నారో ముఖేష్ అంబానీ ఒకసారి బయటపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో చేరమని తన తండ్రి అడగకముందు తాను ఉపాధ్యాయుడిని కావాలనుకున్నానని వెల్లడించారు. వివాహం తర్వాత భార్య నీతా అంబానీ కూడా దీన్ని ప్రోత్సహించినట్లు చెప్పారు. ఎందుకంటే వివాహానికి ముందు ఆమె కూడా టీచరే. అది వీలు పడకపోయినప్పటికీ తమ సంతృప్తి కోసం విద్యా రంగ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్.. -
గ్రూప్–1 టాపర్ ఎవరో చెబితే ప్రభుత్వం కూలుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్–1 మొదటి ర్యాంకు ఎవరిదో చెబితే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్లకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా గ్రూప్–1 టాపర్లు ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ భోరోసా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ సిబ్బంది, ఈ కేసులో నిందితులైన రాజశేఖర్రెడ్డి, దాసరి కిషోర్లకు గ్రూప్–1 ప్రిలిమ్స్లో 150 మార్కులకుగాను 120 మార్కులు సాధించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు తెలిసిన వారే టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉన్నారని, అందువల్ల ఆ కమిషన్ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏ నిరుద్యోగ బిడ్డల త్యాగం వల్ల తెలంగాణ వచి్చందో, ఆ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు అమ్ముకుంటోందని ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ‘టెన్త్’లో అలా.. టీఎస్పీఎస్సీలో ఇలా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ‘సిట్’విచారణ నత్తనడకన సాగుతోందని... నిందితులను బాధితులుగా చూపే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు 48 గంటల్లోనే పాత్రదారులు, సూత్రదారులను అరెస్ట్ చేశారని... కానీ టీఎస్పీఎస్సీ కేసులో సూత్రదారులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నందునే ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఈ కేసుపై స్పందించకుండా ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారంటే తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమంత్రి గద్దె దిగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్కు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, తాము పేపర్ లీక్కు సంబందించి ఆధారాలతో వస్తామని ఆయన సవాల్ చేశారు. 18న నిరసన దీక్ష... టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిరుద్యోగులకు న్యాయం చేసేలా ప్రతిపక్ష పారీ్టలంతా ఏకతాటిపైకి రావాలని ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. అలాగే కొత్త కమిషన్ వేశాకే పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్తో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అన్ని పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలతో ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రవీణ్కుమార్ తెలిపారు. సీఎంకు 25 ప్రశ్నలు రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వాడుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం బీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంకుగా చూడటమే తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2016లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని... కానీ గతంలో దళిత, బహుజనులకు ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 25 ప్రశ్నలతో సీఎంకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
నక్షత్రాల అవిర్భావం గుట్టు విప్పిన భారత టెలిస్కోప్!
న్యూఢిల్లీ: బిగ్బ్యాంగ్ తర్వాత 20 కోట్ల ఏళ్లకు ఏర్పడ్డ తొలి నక్షత్రాల రహస్యాలను భారత టెలిస్కోప్ బహిర్గతం చేసింది. బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ)లో డిజైన్ చేసి, నిర్మించిన సరస్–3 రేడియో టెలిస్కోప్తో నక్షత్రాల గుట్టును బయట పెట్టారు. 2020 మార్చిలో కర్ణాటకలోని దండిగనహళ్లి చెరువు వద్ద, కొంతకాలం శరావతి బ్యాంక్ వాటర్స్ వద్ద ఈ టెలిస్కోప్ను ఏర్పాటు చేశారు. విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకొనేందుకు ఆర్ఆర్ఐతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ టెల్ అవివ్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. సరస్–3 టెలిస్కోప్ డేటాను ఇటవలే విశ్లేషించారు. బిగ్బ్యాంగ్ అనంతరం తొలుత ఏర్పడిన నక్షత్ర మండలాల్లోని 3 కంటే తక్కువ శాతం వాయువులు నక్షత్రాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని ఆర్ఆర్ఐ ప్రతినిధి సౌరభ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన సరస్–3 రేడియో టెలిస్కోప్ కాస్మిక్ డాన్ ఆస్ట్రోఫిజిక్స్పై అవగాహన మరింత పెంచుకొనేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. బిగ్బ్యాంగ్ అనంతర కాలాన్ని కాస్మిక్ డాన్గా వ్యవహరిస్తారు. అప్పటి గెలాక్సీల్లో అత్యధిక సాంద్రత కలిగిన కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉండేవి. -
కూతురి పేరును రివీల్ చేసిన ఆలియా-రణ్బీర్.. ఫోటో వైరల్
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియా భట్--రణ్బీర్ కపూర్ ఇటీవలె పేరెంట్స్గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్గా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా తాజాగా తన కూతురి పేరును రివీల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ను షేర్ చేసింది. ఇంతకీ ఆ పేరు ఎవరు పెట్టారు? దానివెనకున్న అర్థాలేంటో కూడా వివరించింది ఆలియా. కూతుర్ని ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసిన ఆలియా తన బుజ్జాయికి రాహా అని పేరు పెట్టినట్లు చెప్పింది. ఈ పేరును రణ్బీర్ కపూర్ తల్లి, నీతూకపూర్ సూచించిందట. అయితే మా కూతురు రాహ పేరుకు ఎన్నో అర్థాలు ఉన్నాయని అనేక భాషల్లో అనేక అర్థాలు ఉన్నాయని వివరించింది.రాహా అంటే దైవ మార్గమని, స్వాహిలి భాషలో ఆనందమని, సంస్కృతంలో వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం, అరబిక్లో శాంతి, సంతోషం, స్వేచ్ఛ అని అనేక అర్థాలున్నట్లు తెలిపింది. ఇక రాహా రాకతో లైఫ్ ఇప్పుడే కొత్తగా ప్రారంభమైందని పేర్కొంది. ప్రస్తుతం ఆలియా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆలియా-రణ్బీర్క జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఆలియా-రణ్బీర్ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఎల్బీ నగర్ ఘటన: చిన్నారి వర్షితది ఆత్మహత్యే
నాగోలు: అనేక ప్రశ్నలు.. ఎన్నో అనుమానాల బాలిక వర్షిత మృతి కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరో తరగతి విద్యార్థిని వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి తెలిపారు. బాలిక మృతి పట్ల వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఆయన చెప్పారు. బాలికను తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ దుర్గేష్ను విచారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏసీపీ కథనం ప్రకారం వివరాలు.. మన్సురాబాద్లోని మధురానగర్లో కాలనీ రోడ్డు నంబర్– 5లో ఉంటున్న సత్యనారాణరెడ్డి, ప్రభావతి దంపతుల కూతురు వర్షిత. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన బాలిక చిప్స్ కొనుకుంటానంటూ దుకాణానికి వెళ్లింది. మన్సూరాబాద్ చౌరస్తాకు వచ్చి ఆటో ఎక్కింది. అక్కడ నుండి ఎల్బీనగర్ చౌరస్తా మీదగా చంద్రపూరి కాలనీ రోడ్డునెం. 2/బీ కు వెళ్లి ఆటో అతని రూ. 50 ఇచ్చి అక్కడ దిగింది. ఆటోలో వెళ్లే క్రమంలో తన తండ్రికి ఫోన్ చేయాలని డ్రైవర్కు నంబర్ చెప్పింది. ఫోన్ బిజీగా రావడంతో ఆటో డ్రైవర్ వర్షితను అపార్ట్మెంట్ వద్ద దించేశాడు. అక్కడ ఉన్న వాచ్మన్ వెంకటమ్మ వర్షిత బిల్డింగ్పైకి వెళ్తుండగా.. ఎవరు కావాలని అడిగింది. మా నాన్న కోసం వచ్చానంటూ చెప్పి బిల్డింగ్పైకి వెళ్లింది. వాచ్మన్ తన కుమారుడైన రాజున బిల్డిండ్పైకి పంపగా ఎవరూ కనిపించలేదు.. ఇంతలోనే వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి కావాలనే నాలుగో అంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాలిక వర్షితపై లైంగిక దాడి జరిగిందా? అనే కోణంలో వైద్య పరీక్షలు చేయగా.. అలాంటిదేమీ లేదని వెల్లడైందన్నారు. చదువులో ముందుండే వర్షిత.. అందరితోనూ కలుపుగోలుగా మసలుకునేదని కాలనీవాసులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబంలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో సున్నిత మనస్కురాలైన వర్షిత కొంత ప్రభావితమై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సమాచారం. (చదవండి: మిస్టరీగా చిన్నారి మృతి.. ఆటోడ్రైవర్ ఫోన్ కాల్ కీలకం!) -
ట్రంప్ నిర్వాకాలను బయటపెట్టే పుస్తకం
'Can't you just shoot them?': అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా విచిత్రమైన నిర్ణయాలతో వివాదస్పదమైన నాయకుడిగా ముద్ర వేయించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దూకుడుగా వ్యవహరించిన మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో మే 2020లో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడుని మిన్నియా పాలిస్ పోలీసు సిబ్బంది చేతుల్లో హత్యకు గురైన నాటి సంగతి తెరపైకి వచ్చింది. నాటి నల్లజాతీయుడి హత్యనంతరం నిరసనలు వెల్లువెత్తడంతో ట్రంప్ నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాడు. పైగా వారిపై కాల్పులు జరపమని మిలటరికీ ఆదేశాలు జారీ చేశాడని అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్సర్ తాను రాసిన పుస్తకంలో తెలిపాడు. నాటి ఘటనలో సైన్యానికి అన్ని పవర్లు ఇచ్చేలా అత్యంత అరుదుగా ఉపయోగించే 200 ఏళ్ల నాటి తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయడానికి యత్నించాడని కూడా రాశారు. అంతేగాక తాను వ్యతిరేకించినందుకుగానూ ట్రంప్ తనని పదవి నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. ఈ మేరకు నాటి రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్సర్ తాను రాసిన ‘ఎ సేక్రేడ్ ఓత్’ అనే పుస్తకంలో ట్రంప్తో నాటి జ్ఞాపకాలను వివరించాడు. జనరల్ క్యాబినెట్ సభ్యులచే సమీక్షించబడిన ఈ పుస్తకం మే 10న విడుదల కానుంది. (చదవండి: దాదాపు 2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలను రష్యాకి తరలింపు) -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో సంచలన విషయాలు..!
-
MAHINDRA XUV700: అదిరిపోయే ఫీచర్లు.. ఆకట్టుకునే ఇంటిలిజెన్స్..
Mahindra XUV 700 Car Unvieled Highlights: విదేశీ కార్లు అందించే ప్రీమియం ఫీచర్లతో దేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి రీలీజ్ చేయనుంది. ఎంతో కాలంగా ఆటోమోబైల్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోన్న ఎక్స్యూవీ 700కి సంబంధించిన ఫీచర్లను మహీంద్రా వెల్లడించింది. కొత్త లోగోతో మహీంద్రా న్యూ లోగోతో రిలీజ్ అవుతున్న మొదటి వెహికల్ ఎక్స్యూవీ700. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. సాటిలేని ఫీచర్లు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా డ్రైవర్ లెస్ కారు తెస్తామంటూ టెస్లా అంటోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఇండియా వరకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ను అధికంగా ఉపయోగిస్తు్న ఆకారుగా మహీందద్రా ఎక్స్యూవీ 700ని పేర్కొనవచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ని పొందు పరిచారు. దీనిలో ఫార్వర్డ్ కొల్యూజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేక్స్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, అడాప్టిక్ క్రూజ్ కంట్రోల్, ‘డ్రైవర్ డ్రౌజీనెస్ మానిటర్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నేషన్, హై బీమ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోంటైన్మెంట్లో ఇంటీరియర్లో అడ్రినాక్స్ఎక్స్ ఓఎస్ ఇంటిలిజెన్స్ ఆధారిత 10.25 ఇంచ్ డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉంది. మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్లలో మాత్రమే ఈ తరహా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్, పానోరోమిక్ సన్రూఫ్, , స్టోరేజ్తో కూడిన డ్రైవర్ ఆర్మ్రెస్ట్ , డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, సోనీ 3డీ సరౌండ్ సౌండ్ సిస్టం, 12 స్పీకర్లు, వాయిస్-ఎనేబుల్డ్ కమాండ్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇతర కీ ఫీచర్లు - జిప్, జాప్, జూమ్, కస్టమ్ అనే మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. - డ్రైవర్తో పాటు పక్కన ఉండే ప్యాసింజర్ కోసం ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లను అమర్చారు. - 99 శాతం బ్యాక్టీరియా, 95 శాతం వైరస్లను ఫిల్టర్ ఔట్ చేయగల వ్యవస్థను అమర్చారు. - ఎక్స్యూవీ 700లో 7 సీట్, 5 సీట్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయి. - హై ఎండ్ మోడల్లో 360 డిగ్రి కెమెరా, సోని 3డీ సౌండ్ సిస్టమ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ ఫీచర్లు ఉన్నాయి. You've heard about it You've talked about it, You've seen it in disguise. It’s the most awaited SUV It is the XUV700 driven by AdrenoX. Watch its debut using this link https://t.co/2yS6hOBboX on 14th August at 4 pm and experience a rush like never before. pic.twitter.com/9bcB8nHJIm — MahindraXUV700 (@MahindraXUV700) August 13, 2021 -
పీకల్లోతు ప్రేమలో ఇరా ఖాన్
ముంబై : బాలీవుడ్ హీరో ఆమిర్ఖాన్ కూతురు ఇరా ఖాన్ లవ్ ఎఫైర్తో గత కొంతకాలంగా తరుచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి ఆమిర్ ఫిట్నెస్ కోచ్ నుపూర్ షిఖరేతో ఇరా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. తాజాగా ప్రామిస్డే సందర్భంగా తన బాయ్ఫ్రెండ్ నుపూర్తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మై వాలెంటైన్ అని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అఫీషియల్గా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇరాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇరా పోస్ట్పై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఎమోజీల రూపంలో ఆమెకు విషెస్ చెబుతున్నారు. ఇక గతేడాది దీపావళి సందర్భంగా మొదటిసారి తన ప్రియుడిని ఫ్యాన్స్కు పరిచయం చేసిన ఇరా..కొన్నాళ్లు ఆమిర్ ఫాంహౌజ్లోనే ఉన్నారని, ఈ క్రమంలో అక్కడే పలు పండుగలను కూడా సెలబ్రెట్ చేసుకున్నట్లు సమాచారం. (నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: ఇరా ఖాన్) View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) గతంలో ఇరా మిషాల్ అనే వ్యక్తితో ఇరా ఖాన్ ప్రేమాయాణం నడిపిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరా, మిషాల్లు 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. కాగా నూపూర్ షిఖరే గత కొన్నేళ్లుగా ఆమిర్కు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్లో ఇరా ఫిట్నెస్పై శ్రద్ద పెట్టడంతో నుపూర్ ఆమెకు కూడా కోచ్గా మారాడు.ఈ క్రమంలో నుపూర్ వ్యక్తిత్వం నచ్చడంతో ఇరా అతడితో ప్రేమలో పడినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్లో ఇరా తన బాయ్ఫ్రెండ్ నుపూర్ పచ్చబొట్టును వేయించుకుంది. మొదటిసారి టాటూ వేయించుకున్నానంటూ తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది. (లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె) View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
తాగినోడి నోట నిజం...!
బూర్గంపాడు : ‘తాగినోడి నోట నిజం.. తన్నుకుని వస్తాదయ్యా..’ – అన్నాడో కవి.. ఏనాడో! ఇది నిజమేనని నిరూపితమైంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుందా..? చదవండి మరి... సారపాక పంచాయతీలోని శ్రీరాంపురం కాలనీకి చెందిన శ్యామల కృష్ణమూర్తి(35) అవివాహితుడు. అతనికి తల్లిదండ్రులు కూడా లేరు. అతను బోర్ మిషన్ వెంబడి కూలీ పనులకు వెళ్తుండేవాడు. ఎక్కడ బోరు పనులు ఉంటే అక్కడే నెలలతరబడి ఉండేవాడు. పనులు పూర్తయిన తరువాత ఇంటికి వచ్చేవాడు. అదే గ్రామానికి చెందిన కొర్సా రమేష్ అలియాస్ రామయ్యకు మూడువేల రూపాయలను కృష్ణమూర్తి అప్పుగా ఇచ్చాడు. డబ్బు ఇవ్వాలని ఎంత అడిగినా రమేష్ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు నెలల కిందట (డిసెంబర్లో) డబ్బులు ఇవ్వాలని కృష్ణమూర్తి నిలదీశాడు. అప్పుడు రమేష్ మద్యం మత్తులో ఉన్నాడు. డబ్బులు ఇస్తానంటూ కృష్ణమూర్తిని శ్రీరాంపురం సమీపంలోగల అటవీప్రాంతానికి తీసుకెళ్లి చంపేశాడు. బోరు పనులకు కృష్ణమూర్తి వెళ్లుంటాడని గ్రామస్తులు, బంధువులు అనుకున్నారు. రమేష్కు వెట్టి ముత్తయ్య అనే వ్యక్తి కూడా అప్పు ఇచ్చాడు. తన అప్పు తీర్చాలంటూ రమేష్ను అతడు వారం కిందట గట్టిగా అడిగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రమేష్.. ‘‘అరే.. నన్ను డబ్బులు అడిగితే, కృష్ణమూర్తికి పట్టిన గతే నీకూ పడుతుంది’’ అని బెదిరించాడు. ముత్తయ్యకు అర్థమవలేదు. కృష్ణమూర్తికి ఏదో హాని జరిగిందని మాత్రం గ్రహించాడు. ఈ విషయాన్ని పోలీసులతో చెప్పాడు. రమేష్ను ఎస్ఐ సంతోష్ అదుపులోకి తీసుకుని విచారించారు. కృష్ణమూర్తిని తానే చంపినట్టుగా రమేష్ చెప్పాడు. చంపి పడేసిన ప్రదేశానికి తీసుకెళ్లి చూపించాడు. కృష్ణమూర్తి మృతదేహం పూర్తిగా కుళ్లి పోయింది. కేవలం పుర్రె, ఎముకలు మాత్రమే మిగిలాయి. ఆ స్థలాన్ని పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. కృష్ణమూర్తి సోదరుడు గంగయ్య ఫిర్యాదుతో కేసును ఎస్ఐ సంతోష్ దర్యాప్తు చేస్తున్నారు. -
అనైతిక సంబంధం భర్తకు తెలిసిందనే హత్య
బనశంకరి: కురబరహళ్లి జేసీ నగర్లో గురువారం జరిగిన నరసింహమూర్తి హత్యోదంతం మిస్టరీ వీడింది. తన అనైతిక సంబంధం భర్తకు తెలియడం, దీనిని నిత్యం ప్రశ్నిస్తుండటంతోనే ప్రియుడితో కలిసి నరసింహమూర్తిని అంతమొందించినట్లు భార్య అనిత వెల్లడించిందని పోలీసులు తెలిపారు. వివరాలు... మాగడి ప్రాంతానికి చెందిన అనితకు ఏడేళ్ల క్రితం నరసింహమూర్తి అనే వ్యక్తితో వివాహమైంది. దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. అనితకు ఆరునెలల క్రితం టీ.నరసీపుర నివాసి రోషన్తో ఫేస్బుక్లో పరిచయమైంది. రోషన్ కంతూరు చక్కెర ప్యాక్టరీలో ఏసీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.ఫేస్బుక్ స్నేహం ఇద్దరిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. పసిగట్టిన భర్త నరసింహమూర్తి అనితను వేధించేవాడు. దీంతో భర్తను హత్య చేసి రోషన్ను వివాహం చేసుకోవాలని అనిత కుట్ర పన్నింది. ఇందుకు రోషన్ కూడా అంగీకరించాడు. గురువారం రాత్రి నరసింహమూర్తి భోజనం చేసిన తర్వాత అనిత రోషన్కు ఫోన్ చేసింది. దీంతో రోషన్ తన కంపెనీలోనే పని చేస్తున్న సోమరాజుతో కలిసి అనితా ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ముగ్గురూ కలిసి నరసింహమూర్తిని తాళ్లతో బంధించి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి మంచం కిందికి తోసేశారు. రక్తపుమరకలను శుభ్రం చేశారు. వేకువజామున 4.30 సమయంలో మృతదేహాన్ని తరలించడానికి యత్నించగా కిందిఅంతస్తులో ఉన్న ఇంటి యజమాని నిద్రలేచారు. ఇరుగుపొరుగు వారు వాకింగ్ వెళ్లడంతో దీనితో మృతదేహాన్ని తరలించడం సాద్యం కాలేదు. 6 గంటలకు రోషన్, సోమరాజు ఇంటి నుంచి పారిపోయారు. ఉదయం 8 గంటల సమయంలో అనిత తన అత్త హనుమమ్మ, ఇతరులకు ఫోన్ చేసి భర్త కనబడలేదని తెలిపింది. అనుమానం వచ్చిన హనుమమ్మ మంచం కింద ఉన్న మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించింది. మహాలక్ష్మీలేఔట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనితా, ఆమె పాత ప్రియుడు ప్రవీణ్పై అనుమానం ఉందని హనుమమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు ప్రవీణ్ పాత్రలేదని విచారణలో తేలింది. అనితను మరింత లోతుగా విచారణ చేయగా రోషన్, మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ముగ్గురినీ అరెస్ట్ చేశారు. -
ఈ స్మార్ట్ఫోన్ వివరాలు లీక్: లాంచింగ్కు ముందే
సాక్షి, ముంబై: ప్రముఖ చైనా మొబైల్ మేకర్ వన్ ప్లస్ అతి త్వరలో లాంచ్ చేయనున్న ఫ్లాగ్షిప్ ఫోన్ వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. నవంబరు 16న న్యూయార్క్లో అధికారికరంగా మార్కెట్లో విడుదల కానున్న వన్ప్లస్ 5టి స్మార్ట్ఫోన్కు సంబంధించిన స్పెసికేషన్స్, డిజైన్ తదితర వివరాలు బయటికి వచ్చాయి. ఫుల్హెచ్డీ రిజల్యూషన్ భారీ స్క్రీన్, డ్యుయల్ కెమెరా సెటప్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ , ఫేస్ అన్లాకింగ్ సాఫ్ట్వేర్తో ఫీచర్తో దీన్ని లాంచ్ చేయనుందని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది. దాదాపు వన్ప్లస్ 5 స్మార్ట్ఫోన్ తరహాలోనే ఉన్నప్పటికీ తాజా డివైజ్ను 6జీబీ/64జీబీ స్టోరేజ్ , 8 జీబీ/128 స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేయనుందట. ఇండియాలో వన్ప్లస్ 5టి లభ్యత ఇప్పటి వరకు అందిన సమాచారం వన్ప్లస్ 5టి నవంబర్ 21న ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది. నవంబర్ 28నుంచి అమెజాన్ ఇండియా ద్వారా విక్రయానికి లభించనుంది. మరోవైపు వైర్లెస్ చార్జర్తో ఈ డివైస్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వన్ ప్లస సీఈవో ఇప్పటికే వెల్లడించారు. వన్ప్లస్ 5టి ఫీచర్లు 6అంగుళాల ఆప్లిక్ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2160 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 6జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 3,300 ఎంఏహెచ్ -
సిమి ఉగ్రవాదుల పోస్టుమార్టం నివేదిక వెల్లడి
-
రాజౌరీ సెక్టార్లో బయట పడిన మిలిటరి హైడవుట్
-
నోట్7 పేలుళ్ల కారణాలేమిటో తేల్చుతాం..
గెలాక్సీ నోట్7 ఫోన్ బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఓ వైపు ఉత్పత్తిని, మరోవైపు అమ్మకాలను రెండింటినీ శాశ్వతంగా నిలిపివేసిన శాంసంగ్, ఈ ఘటనలకు కారణమేమిటో త్వరలోనే తేల్చుతుందట. తమ ఫోన్లను వాడొద్దంటూ కఠిన హెచ్చరికలు కూడా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన 'నోట్ 7' ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు, ఫోన్ మాట్లాడినప్పుడు పేలుతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దాదాపు 25 లక్షలకుపైగా ఫోన్లను కంపెనీ రీకాల్ చేసింది. రీకాల్ చేసిన ఫోన్లను రీప్లేస్మెంట్తో కొత్త ఫోన్లను విడుదలచేసింది. రీప్లేస్ చేసిన మోడల్స్ నుంచి కూడా పొగలు రావడంతో కంపెనీ మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. తమ ఫోన్లు వెనక్కి పంపించేయడంటూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ పేలుళ్లకు అసలు కారణమేమిటో కనుగొనడానికి కంపెనీ ముప్పు తిప్పులు పడుతుందట. ఈ కారణంతోనే ఇన్నిరోజులు కారణమేమిటో కూడా వెల్లడించడానికి శాంసంగ్ తీవ్ర సతమతమైందని తెలుస్తోంది. కానీ చివరగా ఈ పేలుళ్లకు అసలు కారణమేమిటో త్వరలోనే తేల్చుతామని శాంసంగ్ ప్రకటించింది. దీనిపై విచారణ కొనసాగుతుందని, వచ్చే వారాల్లో తమ ముందుకు పేలుళ్ల కారణాలు విడుదలచేస్తామని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. మొదటిసారి పేలుళ్లు సంభవించినప్పుడే కంపెనీకి చెందిన ఇంజనీర్లు కారణాలేమిటో కనుగొనడంలో తీవ్రంగా విఫలమైనట్టు పలు రిపోర్టులు వెల్లడించాయి. వివిధ టెస్టులు నిర్వహించినప్పటికీ ఏ కారణంతో ఇవి పేలుతున్నాయో మూల కారణాన్ని కనుగొనలేకపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. -
పూరీ మెచ్చిన వెరీ వెరీ స్పెషల్ బైక్
-
పూరీ మెచ్చిన వెరీ వెరీ స్పెషల్ హెల్మెట్ లెస్ బైక్
లగ్జూరియస్ అండ్ రాయల్ కార్లకు పెట్టింది పేరైన ప్రఖ్యాత కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ ఇపుడు బైక్ లవర్స్ కోసం సరికొత్త కాన్సెప్ట్ బైక్ లాంచ్ చేసింది. 'బీఎండబ్ల్యూ మోటోరాడ్ విజన్ నెక్స్ట్ 100' పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ తన స్పెషల్ క్వాలిటీస్ తో పలువుర్ని ఆకట్టుకుంటోంది. కంపెనీ స్థాపించి వందేళ్లైన సందర్భంగా రూపొందించిన ఈ బైక్ ను హెల్మెట్ లేకుండా నడిపేయొచ్చట. అంతేకాదు ఇది దాదాపు డ్రైవర్ లెస్ కార్ తో సమానమైనదని అంటున్నారు తయారీదారులు. ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో నడిచే ఈ హెల్మెట్ లెస్ బైక్ ఇతర ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఈ స్పెషల్ మోటోరాడ్ బైక్ హెల్మెట్ గానీ, ప్రొటెక్టివ్ గేర్ అవసరంగానీ లేకుండానే రాబోయే ప్రమాదాన్ని ఊహించి దాని కనుగుణంగా మార్పులు చేసుకుంటుందనీ, జీరో ఎమిషన్స్, బాక్సర్ ఇంజీన్, కార్బన్ ఫైబర్ తో తయారు చేసిన సీట్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అండ్ నెవర్ క్రాష్ అని సగర్వంగా చెబుతోంది కంపెనీ. స్పెషల్ గా అందిస్తున్న ది విజర్ (అగమెంటెడ్ రియల్టీ హెడ్ సెట్) అనే గ్లాసెస్ కూడా మరో స్పెషాల్టీ. ఎందుకటే ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే చుట్టు పక్కల ప్రాంతాలపై స్పష్టత ఉండటంతో పాటు రోడ్ కండీషన్ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటుంది. స్పీడ్, నావిగేషన్ రియర్ మిర్ర్రర్స్ ను ఇది చూపిస్తుంది. అయితే ఈ ఫీడ్ బ్యాక్ అందించడమనేది బైక్ నడిపే వారి అడ్జస్ట్ మెంట్ ను బట్టి ఆధారపడి ఉంటుందట. మరోవైపు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ బైక్ కు సంబంధించిన యూ ట్యూబ్ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. లేటెస్ట్ గ్యాడ్జెట్స్ అంటే ప్రాణం పెట్టే పూరి మనసును ఈ బీఎండబ్ల్యూ మోటోరాడ్ గెలుచుకోవడం విశేషమే మరి. BMW reveals the HELMET FREE motorcycle https://t.co/ZgbOp5Mj06 pic.twitter.com/vZCgYK3PXi — PURI JAGAN (@purijagan) October 13, 2016 -
మోదీ టీం శాలరీలు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పరిపాలనలో సాయంగా నిలుస్తున్న టాప్ అధికారుల జీతాలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఆర్టీఐ కింద బయటపెట్టింది. అత్యధికంగా ప్రధానమంత్రి కార్యదర్శి భాస్కర్ ఖుబ్లే రూ. 2లక్షల వేతనాన్ని అందుకుంటున్నారు. చాలా మంది జాయింట్ సెక్రటరీలు రూ.1.7లక్షల జీతం అందుకుంటుండగా.. అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా రూ.1,62,500లను అందుకుంటున్నారు. వరుసగా ప్రిన్సిపల్ సెక్రటరీ న్రిపేంద్ర మిశ్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. జాయింట్ సెక్రటరీల్లో అత్యధికంగా తరుణ్ బజాజ్ రూ.1,77,750లు నెలవారీ జీతంగా తీసుకుంటున్నారు. అత్యల్పంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రూ.17వేలను వేతనాన్ని అందుకుంటున్నారు. ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాల వివరాలను పీఎంవో జూన్ 1నుంచి తన వెబ్ సైట్లో ప్రజలకు అందుబాలు ఉంచింది. ఆర్టీఐ ద్వారా ప్రజలు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్న సమాచారాన్ని ప్రభుత్వమే వాలంటరీగా విడుదల చేస్తోంది. మన్మోహన్ సర్కారు కూడా పీఎంవో ఉద్యోగుల జీతభత్యాలను ప్రకటించిన విషయం తెలిసిందే. -
న్యూ కలర్ డిజైన్తో ఐఫోన్ 7 ప్లస్..!
యాపిల్ కొత్త ఐఫోన్7 కోసం వేచిచూసే యూజర్లకు శుభవార్త. ఈ ఏడాది యాపిల్ మార్కెట్లోకి తీసుకొచ్చే డివైజ్లు రెండు కావంట. ముచ్చటగా మూడు ఐఫోన్7లతో యాపిల్ తన ఫ్యాన్స్ను అలరించబోతుందట. యాపిల్ ఈ ఏడాది లాంచ్ చేయబోయే డివైజ్లు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 7 ప్రో లని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే మూడో ఫోన్, ఐఫోన్ 7 ప్లస్ ఎలా ఉండబోతుందా తెలుసా..? డ్యూయల్ రేర్ కెమెరా అమరికతో, కొత్త బ్లూ కలర్ డిజైన్లో యూజర్లను ఈ ఫోన్ అలరించనుందని రిపోర్టులు తెలుపుతున్నాయి. ప్రముఖ యూట్యూబర్ లెవిస్ హిల్సెంటీగర్ ఈ ఐఫోన్ 7 ప్లస్కు సంబంధించిన వీడియోను తన చానెల్ అన్బాక్స్ థెరపీలో పోస్ట్ చేశారు. కాగా ఈవారం మొదట్లోనే చైనాలో యాపిల్ ఐఫోన్ల లాంచ్ పార్టనర్, చైనీస్ టెలికాం దిగ్గజం చైనా యూనికామ్ కూడా బ్లూ కలర్ ఐఫోన్ 7 వేరియంట్ గురించి టీజ్ చేసింది. యాపిల్ నుంచి రాబోతున్న కొత్త డివైజ్ గురించి రిపోర్టులు ఒక్కోటి ఒక్కో మాదిరిగా వెల్లడిస్తున్నాయి. దీంతో యాపిల్ ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే ఐఫోన్లు ఎన్ని అన్నది సందేహంగా మారింది. మరోవైపు ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా న్యూ రీ-డిజైన్డ్ ఐఫోన్ 7ను 2017లోనే యాపిల్ ప్రవేశపెడుతుందని కంపెనీ అనలిస్టు క్రియేటివ్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ టిమ్ బజరిన్ చెప్పారు. చిన్న చిన్న మార్పులతో ఐఫోన్ 6ఎస్ఈ పేరుతో ఈ ఏడాది కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వస్తుందని ఓ జర్మన్ వెబ్సైట్ కూడా పేర్కొంది. అంతకుముందటి రిపోర్టులు కూడా ఐఫోన్ 7 ప్రో డివైజే డ్యూయర్ రేర్ కెమెరాతో రాబోతుందని వెల్లడించాయి. దీంతో ఈ ఫోన్ పై సందేహాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే ఎల్జీ, హియోమి వంటి స్మార్ట్ఫోన్ తయారీదారులు తమ ఫోన్లను డ్యూయల్ కెమెరాతో మార్కెట్లోకి తీసుకొచ్చాయి. -
24మంది భార్యలు.. 200మంది పిల్లలు!
బీజింగ్ః బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండి, జీవితకాలాన్ని వీలైనంత పెంచుకునేందుకు ప్రతివారూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వారు చేసిన ప్రయత్నాలు , వారి సాధన ఒక్కోసారి తగిన ఫలితాలను కూడ ఇస్తుంటుంది. కానీ అరవై ఏళ్ళ ఆయుర్దాయం ఉండటమే కష్టంగా మారిన తరుణంలో ఓ వ్యక్తి వందేళ్ళు బతికితే ఎంతో గొప్పగా ఫీలవుతాం. నిజంగా గ్రేట్ అని సంబర పడిపోతాం. కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తి 256 సంవత్సరాలు బతికాడంటే నమ్ముతారా? ఎప్పుడూ ఎవ్వరూ జీవించనంతకాలం ఆయన బతికినట్లు ఇటీవల ఓ పత్రికా కథనం ద్వారా ఆధారాలు దొరికాయి. చైనాకు చెందిన లీ చింగ్ యన్ 1933 మే 6న మరణించాడు. అయితే అప్పటికి ఆయన వయసు 256 ఏళ్ళని, అన్నేళ్ళు జీవించడం చరిత్రలోనే మొదటిసారి అని ఓ పత్రిక తన వ్యాసంలో పేర్కొంది. ఆ సుదీర్ఘ వయస్కుడి వివరాలు ఏ ఒక్కరో శోధించినవి కాదని, ఆయన అన్నేళ్ళు బతికాడనేందుకు ఎన్నో సాక్ష్యాధారాలను సేకరించి మరీ నిర్థారించింది. లీని ఆయన 150వ పుట్టినరోజు సందర్భంగా 1827 లో అభినందిచినట్లు ఓ డాక్యుమెంటేషన్ లో చెంగ్డూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వు చుంగ్ రాశారని, చైనా ప్రభుత్వ రికార్డుల్లోనూ లీ చింగ్ 150వ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపినట్టు ఉందని, అనంతరం ఆయన 200 పుట్టినరోజు సందర్భంగా 1877లోనూ లీని అభినందిస్తూ ఎన్నో వ్యాసాలు, పత్రాలు వెలువడ్డాయని తెలుస్తోంది. ఆయనకు పొరుగునే ఉన్న ఓ వ్యక్తి... తమ చిన్ననాటినుంచే ఆయన్ను వృద్ధుడుగా చూసినట్లు తెలిపినట్లు సదరు పత్రిక వెల్లడించింది. సిచుయాన్ ప్రాంతంలో జన్మించిన లీ చింగ్ పదేళ్ళ వయసునుంచే ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ అనేక ప్రాంతాల్లో తిరిగాడట. ఆ సమయంలో దాదాపు నలభై ఏళ్ళ పాటు అడవుల్లో దొరికే మూలికలు, గోజీపండ్లు వంటి ఆహారాన్నే భుజించాడట. ఆయుర్వేద వైద్యుడిగా అనేకచోట్ల కాలం గడిపిన ఆయన.. 71 ఏళ్ళ వయసులో 1749 లో చైనీస్ సైన్యం లో యుద్ధ కళల శిక్షకుడిగా, సలహాదారుడుగా చేరాడు. తర్వాత కనీసం వంద సంవత్సరాల పాటు ఆయన మంచి ఆహారంతోపాటు, ఔషధాలు, రైస్ వైన్ తీసుకున్నాడు. తన కమ్యూనిటీలో ప్రత్యేక సభ్యుడుగా ఉండే లీ.. 23 సార్లు వివాహం చేసుకోవడంతోపాటు, సుమారు 200 మంది పిల్లలకు తండ్రి అయ్యాడట. కుటుంబంలో 11 తరాలను చూసిన ఆయన... 1933లో మరణించాడు. ఆయన్ను ఎవరైనా తన సుదీర్ఘ జీవితకాలం గురించి సీక్రెట్ ఏమిటి అని అడిగితే మాత్రం... నిశ్శబ్దమైన మనసుతో ఉండి, తాబేలులా కూర్చొని, పావురంలా హుషారుగా పరిగెడుతూ, కుక్కలా నిద్రపోవడమే కారణమని చెప్పేవాడట. ఆయన పుస్తకంలో (జీవితం) ఒక పేజీ చదివినా... ఈ కాలంవారికి ఎంతో స్ఫూర్తిదాయకం అయ్యే అవకాశం ఉంది. -
22 వేలమంది ఉగ్రవాదుల జాడ తెలిసింది
లండన్: ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా వేలమంది ఉగ్రవాదుల వివరాలను బ్రిటన్కు చెందిన ఓ మీడియా బయటపెట్టింది. దాదాపు 22 వేలమందికి పైగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వ్యక్తిగత వివరాలను, వారి కుటుంబ సమాచారాన్ని వెల్లడించింది. ఇలా బయటపెట్టిన వివరాల్లో బ్రిటన్తో సహా 51 దేశాలకు చెందినవారు ఉన్నారు. దాదాపు అన్ని దేశాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరికలు జరుగుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల నుంచి బలహీనంగా ఉన్న దేశాలనుంచి ఈ సంస్థలో చేరుతున్నారు. అయితే, అలా చేరుతున్నవారి వివరాలు ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేస్తే తప్ప తెలియడం లేదు. అలాంటిది బ్రిటన్కు చెందిన స్కై న్యూస్ అనే సంస్థ మాత్రం దానికి సంబంధించిన వివరాలను బయటపెట్టింది. బ్రిటన్, ఉత్తర యూరప్, మధ్యాసియా, ఉత్తర ఆఫ్రికా, అమెరికా, కెనడాలకు చెందినవారు ఇందులో ఉన్నారు. వారి పేర్లు, చిరునామాలు, టెలిఫోన్ నెంబర్లు, కుటుంబ సమాచారం అందులో ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఫోన్లలో కొన్ని పనిచేస్తున్నాయని కూడా మీడియా సంస్థ తెలిపింది. కొంతమంది ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలో చేరిన తర్వాత తమ కుటుంబాలను విధ్వంసం సృష్టించేందుకు వాడుకుంటున్నాయని వివరించింది. -
రేపట్నుంచి ‘గ్రేటర్’లో కేటీఆర్ రోడ్ షోలు
♦ ఈ నెల 28 వరకు వందకుపైగా డివిజన్లలో ప్రచారం ♦ ఒకటి లేదా రెండు భారీ సభలకు సీఎం ♦ విలేకరుల సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు ఈ నెల 23 (శనివారం) నుంచి 28 వరకు వందకుపైగా డివిజన్లలో రోడ్షోల ద్వారా ప్రచారం చేపడతారని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి వెల్లడించారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డిలతో కలసి గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ రోడ్షోలలో కనీసం 5 వేల నుంచి 10 వేల మంది వరకు పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కేటీఆర్ సవాల్కు అనుగుణంగా వందకుపైగా డివిజన్లలో విజయం సాధించి గ్రేటర్ పీఠంపై టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉందని..ఒకటి లేదా రెండు భారీ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కేసీఆర్కే సాధ్యమవుతుందన్నారు. నీటి కొరత, విద్యుత్ కోతల వంటి సమస్యలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్లో సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని మహేందర్రెడ్డి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ సిద్ధాంతాలను గాలికి వదిలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిచ్చిందని... బీజేపీ తన విధానాలను వీడి లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని మహేందర్రెడ్డి జోస్యం చెప్పారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని హైదరాబాద్లో స్థానికులుగానే చూస్తామన్న సీఎం ప్రకటన వారిలో భరోసా నింపిందని.. ఆయా వర్గాల మద్దతు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై కేటీఆర్ విసిరిన సవాలుకు విపక్షాలు జవాబు చెప్పడం లేదని ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారన్నారు. 23, 24 తేదీల్లో కేటీఆర్ రోడ్ షో షెడ్యూలు మంత్రి కేటీఆర్ శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రాయదుర్గం (గచ్చిబౌలి)లోని వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు రోడ్షోకు శ్రీకారం చుడతారు. కొండాపూర్, మియాపూర్, హైదర్నగర్ అమరావతి దేవాలయం నుంచి ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్, జగద్గిరిగుట్ట బస్టాప్ చౌరస్తా, గాజుల రామారం, ఆర్ఆర్ నగర్లలో ప్రచారం నిర్వహిస్తారు. 24వ తేదీన అయ్యప్ప సొసైటీ వద్ద ప్రచారం ప్రారంభించి వివేకానంద నగర్ చౌరస్తా, అల్లాపూర్, మూసాపేట, ఫతేనగర్, కేపీహెచ్బీ కాలనీ, బాలాజీ నగర్, వేంకటేశ్వరస్వామి దేవాలయం పరిసరాలు, కూకట్పల్లి, హస్మత్పేట, అంబేడ్కర్ చౌరస్తా, బాలానగర్, బోయిన్పల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్, ఐడీపీఎల్ కాలనీ చౌరస్తాలలో ప్రచారం నిర్వహిస్తారు. -
సంపన్న దేశాల్లో నార్వే నిజంగానే ముందుందా?
ప్రపంచ అత్యంత సంపన్న దేశాల్లో నార్వే అగ్రభాగాన నిలిచింది. వరుసగా ఏడోసారి నార్వే తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. 2015 సూచీల ప్రకారం ఆర్థిక వ్యవస్థ, విద్య, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్యం పనితీరు ప్రమాణంగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 142 దేశాల్లో నార్వే అత్యధిక స్థానంలో ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన అన్ని విషయాల్లో ముందున్న స్విట్జర్లాండ్.. విద్యావ్యవస్థలో బలహీనంగా ఉండటంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హెల్త్ కేర్ లో 16వ ర్యాంకులో ఉన్న డెన్మార్క్..మూడో స్థానం... యూఎస్ పదకొండో స్థానాన్ని దక్కించుకోగా.. యూకె 2014-15 తో పోలిస్తే రెండు స్థానాలు కిందికి పడిపోయింది. అయితే వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక సంబంధాల అంశాల్లో బలహీన పడటంతో సింగపూర్ కూడ 17వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సామాజిక పెట్టుబడి, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్య వ్యవస్థలు బలంగా కలిగిన నార్వే ర్యాంకింగ్ విషయంలో 2009 నుంచి విజయ పథంలో దూసుకుపోతోంది. అయితే 2013 తో పోలిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది పడిపోయిందని చెప్పాలి. నిరుద్యోగ సమస్యే అందుకు ప్రధాన కారణమౌతున్నట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి. లెగటమ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి నాథన్ గామ్ స్టర్ అందించిన ఉత్పత్తి సూచికల ఆధారంగా... నార్వే ఎక్కువ కాలంపాటు ముందు వరుసలో నిలవడానికి కారణం.. అక్కడ నిరుద్యోగులు... వైకల్యం, లేదా ఎర్లీ రిటైర్మెంట్ పెన్షనర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగం విషయంలో నార్వేలో 20-24 ఏళ్ళ మధ్య వయస్కులు మాత్రమే అధ్యయనాల్లో పాలుపంచుకున్నారు. దీంతో నార్వే అధికార నిరుద్యోగ స్థాయికంటే తక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యయనకారులు భావిస్తున్నారు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత పొరుగు దేశాలతో పోలిస్తే నార్వేలో అధికార నిరుద్యోగ స్థాయి కృత్రిమంగా తక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. నిజానికి అధిక శాతం దేశాల్లో నిజమైన నిరుద్యోగ స్థాయిని వెల్లడించడంలేదని లండన్ మార్కెట్ ఆర్థిక వేత్త నిమా సమందజి అంటున్నారు. 2008 నుంచి ఉపాధి రేటును అధ్యయనం చేసిన ఆయన... ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడంలో ముఖ్యంగా నిరుద్యోగ స్థాయి ఆధారంగా సూచికలు నిర్థారిస్తామని, అదే నార్వేలోని నిజమైన గణాంకాలు అందుబాటులో ఉన్నట్లయితే ఆ దేశం వెనుకబడి ఉండేదని చెప్తున్నారు. చెప్పాలంటే వ్యాపారం ప్రారంభించడానికి బ్రిటన్ అత్యుత్తమ దేశం అని, వ్యవస్థాపకత విషయంలో బ్రిటన్ ఉత్తమ స్కోర్ సాధించిందని ఆయన చెప్తున్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిటన్ ప్రభుత్వం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను అమలు చేస్తోందని, దీంతో గణాంకాల ప్రకారం 28లో ఉండాల్సిన ఆర్థిక వ్యవస్థ 19 కి పడిపోయిందని చెప్తున్నారు. అయితే ఉపాధి విషయంలో మాత్రం అత్యధిక పెరుగుదల కనిపించిందని చెప్తున్నారు. అలాగే చైనా సంపన్నదేశాల వరుసలో 52వ స్థానంలో ఉన్నప్పటికీ... ఆర్థిక వ్యవస్థ విషయంలో ముందుంటుంది. అయితే వ్యక్తిగత స్వేచ్ఛలో 120 స్థానంలో ఉండటం వల్లనే ర్యాంకింగ్ లో వెనుకబడుతోందంటున్నారు. సౌదీ అరేబియాలో కూడ అదే పరిస్థితి కొనసాగుతోందని అధ్యయనకారులు చెప్తున్నారు. ఇటువంటి కొన్ని ప్రత్యేక అంశాలపై దృష్టి సారిస్తే.. దేశాలు ఎలా విజయవంతం అవుతున్నాయో తెలుస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. -
వరంగల్లో మహిళ దారుణ హత్య
-
వన్, ఎవడు సినిమాలలో థియేటర్లు ఫుల్