Satyameva Jayate
-
ట్రంప్ టెర్రర్.. డేంజర్ లో డాలర్ డ్రీమ్స్
-
Satyameva Jayate: డ్రగ్ నెట్ వర్క్ మూలాలు ఏ దేశాల నుండంటే..! కంట్రోల్ చేసే మార్గాలు
-
Satyameva Jayate: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఏం జరిగింది?
-
ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్లకూ చట్టాలు
-
Satyameva Jayate: లగచర్లలో ఏం జరిగింది ?.. భూ సేకరణా? భూ అక్రమణా?
-
Satyameva Jayate: ఏది నిజం.. ఎవరిది శాడిజం..? మార్ఫింగ్ ఫొటోలు పెడుతున్న సోషల్ సైకోలు..
-
రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా కూల్చివేతల ఎఫెక్ట్ పడిందా ?
-
మహిళలపై జరుగుతున్న నేరాల్లో సినిమా, టీవీషోల ప్రభావం..? మార్పు ఎక్కడ మొదలవ్వాలి ?
-
కళ్ళు మూసి తెరిచేలోగా మీకు తెలియకుండానే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ..!
-
రూ 75 నాణెం విడుదల చేయనున్న కేంద్రం
-
నన్నెవరూ ఆపలేరు.. ‘సత్యమేవ జయతే’ రోడ్డు షోలో రాహుల్..
తిరువనంతపురం: భయభ్రాంతులకు గురి చేసినా, ఎంపీ పదవి నుంచి తొలగించినా వయనాడ్ లోక్సభ స్థానం ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా తననెవరూ అడ్డుకోలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తేలి్చచెప్పారు. అనర్హత వేటు తర్వాత తొలిసారిగా కేరళలోని వయనాడ్ జిల్లాలో ఆయన మంగళవారం పర్యటించారు. కల్పెట్టాలో ‘సత్యమేవ జయతే’ పేరిట రోడ్డు షో నిర్వహించారు. తనను జైలులో పెట్టినప్పటికీ వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటానన్నారు. 'నాపైకి పోలీసులను పంపిస్తే, నా ఇంటిని లాక్కుంటే భయపడే ప్రసక్తే లేదు. అదానీ గురించి, ఆయనతో ప్రధాని మోదీకి సంబంధాల గురించి నా ప్రశ్నలను తట్టుకోలేకే లోక్సభ నుంచి పంపించారు' అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు రాహుల్పై బీజేపీ ప్రభుత్వం క్రూరంగా మాటల దాడికి పాల్పడిందని ఆయన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా ఆరోపించారు. అబద్ధాలు చెప్పేవారికి, దు్రష్పచారం చేసేవారికి నిజాలు చేదుగానే ఉంటాయని ఎద్దేవా చేశారు. చదవండి: 300 పైగా సీట్లతో బీజేపీ గెలుపు.. మోదీనే మూడోసారి ప్రధాని: అమిత్ షా -
సత్యమేవ జయతే 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో జాన్ అబ్రహాం నటించిన లేటెస్ట్ మూవీ 'సత్యమేవ జయతే 2'. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్య కోశ్లా కుమార్, రాజీవ్ పిళ్లై, అనుప్ సోని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 26న రిలీజైన థియేటర్లో రిలీజైన ఈ సినిమా నెలరోజుల్లోనే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో రేపటి (డిసెంబర్ 23) నుంచి స్ట్రీమింగ్ అవనుంది. ఒక్క భారత్లోనే కాకుండా 240కి పైగా దేశాల్లో సత్యమేవ జయతే 2 చిత్రం అందుబాటులోకి రానుంది. నిజానికి థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే ఉండి చూసేయండి. -
Kusu Kusu Song: మరోసారి కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్తో నోరా ఫతెహీ
నోరా ఫతేహీ.. ఈ పేరు వింటే చాలు అందరికీ గుర్తు వచ్చేది దిల్బర్ సాంగ్. ఆ పాటలో తన హావాభావాలతో యువతను ఎలా పిచ్చెక్కించిందో చూశాం. ఇప్పుడు మళ్లీ కుర్రకారు మదిని కొల్లగొట్టేందుకు కొత్త సాంగ్తో వచ్చేసిందీ డ్యాన్స్ క్వీన్. బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహమ్ అప్కమింగ్ మూవీ సత్యమేవ జయతే 2 లోని 'కుసు కుసు' సాంగ్ ఇవాళ విడుదలైంది. ఈ పాటలో నోరా తన అందం, కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్, సొగసైన బెల్లీ డ్యాన్స్తో ప్రేక్షకులను కట్టిపడేసింది. సత్యమేవ జయతే 2 లోని మేరీ జిందగీ హై తూ పాట తర్వాత నిర్మాతలు నోరా ఫతేహీ నటించిన కుసు కుసు సాంగ్ను రిలీజ్ చేశారు. జారా ఎస్ ఖాన్, దేవ్ నేగీలు పాడిన ఈ పాటకు తనిష్క్ బగ్చీ లిరిక్స్ రాశారు. 2018లో వచ్చిన సత్యమేవ జయతే భారీ సక్సెస్ తర్వాత జాన్ అబ్రహమ్తో సీక్వెల్ తీశారు. అన్యాయం, అధికార దుర్వినియోగంపై పోరాటమే సత్యమేవ జయతే 2 కథ. 'ఈసారి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ రెట్టింపు అవుతుంది' అని జాన్ అబ్రహమ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) మిలాప్ జవేరీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ పిల్లయ్, అనూప్ సోనీ, సాహిల్ వాయిద్ నటిస్తున్నారు. నవంబర్ 25న సత్యమేవ జయతే 2 సినిమా విడుదల కానుంది. -
సల్మాన్ ‘రాధే’కు పోటీయే లేదు.. ‘సత్యమేవ జయతే 2’ వాయిదా
సాధారణంగా ఈద్ పండుగ అంటే బాలీవుడ్లో పెద్ద సినిమాల సందడి మాములుగా ఉండేది కాదు. కానీ కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది బాలీవుడ్లో పెద్ద చిత్రాలేవీ రాలేదు. ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా ఓ సినిమాను విడుదల చేసే సల్మాన్ ఖాన్ సైతం గత ఏడాది ఖాళీగా ఉన్నాడు. ఇక ఈ సారి ఏదేమైనా ఈద్కి వచ్చేస్తానని ప్రకటించాడు సల్మాన్. అన్నట్లుగానే ఈద్ సందర్భంగా తన లేటెస్ట్ సినిమా ‘రాధే- యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ని మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలలో కూడా విడుదల చేయనున్నాడు. మరోవైపు జాన్ అబ్రహం ’సత్యమేవ జయతే 2' కూడా అదే రోజు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద జాన్ అబ్రహంకి, సల్మాన్కి మధ్య వార్ తప్పదని భావించారు అంతా. కానీ జాన్ అబ్రహం ఒక అడుగు వెనక్కి వేశాడు. తన సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. అందువల్ల మా సత్యమేవ జయతే సినిమాను వాయిదా వేస్తాం. తర్వాత రిలీజ్ డేట్ను ప్రకటిస్తాం’ అంటూ 'సత్యమేవ జయతే2' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. దీంతో ఒక్క ‘రాధే’ తప్ప, ఇతర సినిమాలేవి థియేటర్లలో విడుదల కావడంలేదు. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని పరిశ్రమలు కూడా తాజా సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో చిరంజీవి ‘ఆచార్య’తో పాటు నాగచైతన్య 'లవ్స్టోరీ', రానా దగ్గుబాటి 'విరాటపర్వం', విశ్వక్సేన్ 'పాగల్' సినివాలు కూడా వాయిదాపడ్డాయి. -
సల్మాన్ వర్సెస్ జాన్
సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్’ రంజాన్ సందర్భంగా మే 13న విడుదల కానున్న విషయం తెలిసిందే. అదే రోజు రావడానికి జాన్ అబ్రహామ్ రెడీ అయ్యారు. మూడేళ్ల క్రితం జాన్ అబ్రహామ్ హీరోగా మిలాప్ ఝవేరీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సత్యమేవ జయతే’. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్గా రూపొందిన ‘సత్యమేవ జయతే 2’ రంజాన్ రిలీజ్కి రెడీ అయింది. మే 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో జాన్ అబ్రహామ్ రెండు పాత్రలు చేశారు. సినిమాలో జాన్ వర్సెస్ జాన్ అయితే బాక్సాఫీస్ దగ్గర సల్మాన్ ఖాన్ వర్సెస్ జాన్ అనాలి. రంజాన్ సల్మాన్కి కలిసొచ్చే పండగ. ఈ సీజన్లో విడుదలైన సల్మాన్ సినిమాలు ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’, ‘కిక్’, ‘బజరంగీ భాయీజాన్’, ‘సుల్తాన్’ వంటివి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించాయి. ‘రాధే’ కూడా ఈ హిట్ లిస్ట్లో చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ‘సత్యమేవ జయతే 2’ని కూడా తక్కువ చేయడానికి లేదు. తొలి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్పై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు సినిమాలూ హిట్టవ్వాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక అభిమానులంటారా? తమ అభిమాన హీరో సినిమానే హిట్టవ్వాలని కోరుకోవడం సహజం. ఏది ఏమైనా ‘సల్మాన్ వర్సెస్ జాన్’ అనేది ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. -
అవినీతి అంతు చూడటానికి మళ్లీ వస్తున్న సత్యమేవ జయతే
సత్యమేవ జయతే 2 షూటింగ్కు అన్ని సిద్దమయ్యాయి. జాన్ అబ్రహమ్, దివ్య కోశ్లా కుమార్ కలిసి నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మంగళవారం లక్నోలో మంగళవారం మొదలయ్యింది. ఈ సినిమా నిర్మాణం పూర్తయ్యే సరికి వచ్చే ఏడాది జనవరి వరకు పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం లక్నోలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ముంబాయిలో జరగనుంది. ఈ సినిమాను మిలప్ జవేరీ డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మే 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాలను ప్రముఖ సినీ విమర్శకులు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అవినీతిని రూపుమాపే బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. SHOOT BEGINS TODAY... Filming of #SatyamevaJayate2 - starring #JohnAbraham and #DivyaKhoslaKumar - begins in #Lucknow today... Will continue till Jan 2021... Will also be shot at a #Mumbai studio early next year... Directed by #MilapZaveri... 12 May 2021 release. #Eid #Eid2021 pic.twitter.com/A86gqNtDFz — taran adarsh (@taran_adarsh) October 20, 2020 చదవండి: ఆ డాక్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటా: హృతిక్ -
ఈద్కి సత్యమేవజయతే 2
జాన్ అబ్రహాం హీరోగా మిలాప్ జావేరి దర్శకత్వంలో 2018లో విడుదలైన చిత్రం ‘సత్యమేవ జయతే’. తాజాగా ఈ చిత్రం సీక్వెల్ ‘సత్యమేవ జయతే 2’కు విడుదల తేదీని ప్రకటించి, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. నాగలి పట్టుకుని సీరియస్ లుక్లో కనిపిస్తున్నారు జాన్ అబ్రçహాం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్ కానుకగా మే 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో జాన్కు జోడీగా దివ్య కోస్లా కుమార్ కనిపిస్తారు. ‘మొదటి భాగంతో పోలిస్తే ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్స్ రెండింతలు ఎక్కువగా ఉంటాయి’ అన్నారు దర్శకుడు మిలాప్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
సీక్వెల్ షురూ
యాక్షన్ హీరో ఇమేజ్ ఉన్న బాలీవుడ్ టాప్ హీరోలలో జాన్ అబ్రహాం ఒకరు. పోలీసాఫీసర్గా జాన్ నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమా గత ఏడాది పంద్రాగస్టుకు విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి హిట్ సాధించింది. జాన్ కెరీర్కు మంచి మైలేజ్ ఇచ్చిన చిత్రం ఇది. మిలాప్ జవేరి దర్శకడు. తాజాగా ‘సత్యమేవ జయతే’ సీక్వెల్ను అనౌన్స్ చేశారు జాన్ అబ్రహాం. తొలి పార్ట్కు దర్శకత్వం వహించిన మిలాప్నే రెండో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నారు. దివ్య కౌశల కుమార్ ప్రధాన పాత్రధారి. ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబరు 2న విడుదల చేయనున్నట్లు జాన్ వెల్లడించారు. -
ఆ సినిమా మా మనోభావాలు దెబ్బతీసింది!
సాక్షి, హైదరాబాద్: జాన్ అబ్రహం, మనోజ్ బాజ్పేయ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ సినిమా ‘సత్యమేవ జయతే’పై నగరంలో కేసు నమోదైంది. తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని షియా వర్గం సోమవారం కేసు నమోదు చేసింది. ఆన్లైన్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్పై గతంలోనూ అభ్యంతరాలు వచ్చాయి. ముస్లింలు పవిత్రంగా భావించే మొహర్రం ఊరేగింపును మతమనోభావాలు దెబ్బతీసేవిధంగా చిత్రం ట్రైలర్లో చూపించారని, ఈ సనివేశాలను వెంటనే తొలగించి.. చిత్ర దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు గతంలో కోరాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో కేసు నమోదు కావడం గమనార్హం. మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సత్యమేవ జయతే’ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్ అబ్రహం సరసన అమృత ఖన్విల్కర్ నటించారు. ఆన్లైన్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు, పాటలకు మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
వివాదంలో ‘సత్యమేవ జయతే’
బాలీవుడ్ నటులు జాన్ అబ్రహం, మనోజ్ బాజ్పాయ్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సత్యమేవ జయతే. మిలాప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ వివాదాస్పదమయ్యింది. ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయంటు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పవిత్ర మొహరం సంతాప దినాల్లో హీరో (జాన్ అబ్రహం) ఓ వ్యక్తిని హత్య చేసినట్టుగా ట్రైలర్లో చూపించారు. ఈ సీన్స్ తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉన్నాయంటూ హైదరాబాద్, పాతబస్తీ డబీర్ పురాకు చెందిన అడ్వకేట్ జాఫర్ నదీం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రఫి యాక్ట్ 5బి ప్రకారం సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని.. చిత్ర దర్శక, నిర్మాతలతో పాటు ఆ సన్నివేశంలో నటించిన జాన్ అబ్రహంపై చర్యలు తీసుకోవాలని జాఫర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఆ పాట నన్ను స్టార్ని చేసింది!
సంభాషణం: సత్యమేవ జయతే కార్యక్రమం చూసినవాళ్లకి సోనా మహాపాత్ర గురించి చెప్పాల్సిన పని లేదు. ఎపిసోడ్ చివర్లో ఆమె పాడే ఒక్క పాట... వేలాదిమంది కళ్లు చెమర్చేలా చేస్తుంది. ఆ ప్రోగ్రామ్తో ఎంతోమందికి అభిమాన గాయనిగా మారిన సోనా మనసులోని మాటలు... మీరు క్లాసికల్ సింగరా? అవును. కానీ స్టేజీల మీద ప్రదర్శనలివ్వడానికే నా టాలెంట్ని పరిమితం చేయదలచుకోలేదు. ఆల్బమ్స్ చేశాను. సినిమాల్లో పాడాను. కాన్సర్ట్స్ ఇచ్చాను. అడ్వర్టయిజ్మెంట్లకి కూడా స్వరమిచ్చాను. పాటంటే ఎందుకంత ప్రేమ? తెలియదు. కటక్లోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పుడే సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. అయితే చదువులోనూ వెనకబడలేదు. బీటెక్ పూర్తి చేసి, ఎంబీయే కూడా చేశాను. ప్యారచూట్, మెడికర్ లాంటి ఉత్పత్తులకు బ్రాండ్ మేనేజర్గా పని చేశాను. అయితే ఏ దారిలో సాగినా నా గమ్యం సంగీతమే అనిపించి ఇటువైపు వచ్చేశాను. జింగిల్స్తో ప్రారంభించాను. తర్వాత సోనీ కంపెనీ సహకారంతో ‘సోనా’ అనే ఆల్బమ్ రిలీజ్ చేశాను. ఢిల్లీ బెల్లీ, ఐ హేట్ లవ్స్టోరీస్, తలాష్ వంటి సినిమాలకు పాడాను. కానీ మీరంటే ఏంటో ‘సత్యమేవ జయతే’తోనే తెలిసింది...? అవును. అసలా కార్యక్రమమే ఎంతో గొప్ప ఆలోచనతో చేస్తున్నది. సమాజంలో మార్పు తీసుకువచ్చే లక్ష్యంతో ఆమిర్ఖాన్ దాన్ని ప్రారంభించారు. ప్రతి ఎపిసోడ్ చివర్లో ఆ కాన్సెప్ట్తోనే ఓ పాట పెట్టాలనుకున్నారు. అది పాడే చాన్స్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ‘ముఝేకా బేచేగా రూపయా’ పాటయితే నన్ను స్టార్ని చేసేసింది. సింగర్గా మీకున్న బలం ఏమిటి? ఫీలై పాడటం. పాటలో లీనమవడం వల్లే సత్యమేవ జయతే పాటలతో కదిలించగలిగాను. నా ఇంకో బలం... నా భర్త రామ్. తను కంపోజర్. మాకు ముంబైలో ప్రొడక్షన్ హౌస్ ఉంది. తన ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది. -
సత్యమే
సత్యమే ఆమిర్ఖాన్ నిర్వహిస్తున్న సత్యమేవ జయతే కార్యక్రమంలో ‘చెత్త’ గురించి ప్రత్యేకంగా ఎపిసోడ్ చేసి చూపించారు. మన దేశంలో చెత్త నిర్వహణే ‘చెత్త’గా ఉందని చెప్పి అందరినీ ఆలోచింపజేశారు ఆమిర్. ఇంట్లోని చెత్తని ఎలా వేరుచేసి ఉపయోగించాలో పాఠ్యపుస్తకాల ద్వారా చిన్నతనంలో తెలుసుకోవడం ఎంతో అవసరమని వివరంగా బోధించారు. చెత్తతో బయోగ్యాస్ ఎలా తయారుచేయాలో, వెర్మీ కంపోస్ట్గా ఎలా ఉపయోగించుకోవాలో క్లాస్రూమ్లలో తెలియజేయడం వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరికీ దాని అవసరం గురించి, విధానం గురించి సులువుగా తెలుస్తుందని చెప్పాడు. ఈరోజు పర్యావరణానికి ముప్పు వస్తుందని చెప్పి ఉన్నట్టుండి చెత్త గురించి బోధనలు మొదలుపెడితే సాధారణ మహిళకు ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. పరిశుభ్రత ఇంటి నుంచే మొదలవ్వాలనీ, మన ఇంటి చెత్త ప్రపంచానికి ముప్పు కాకూడదనీ హితవుచెప్పి ముగించారు. ఈ ఎపిసోడ్కి వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. -
'ఏ రాజకీయ పార్టి తరపునా ప్రచారం చేయను'
-
రియల్ హీరోగా మారిన రీల్ హీరో