-
బాయ్ఫ్రెండ్ ఫోన్ చెక్ చేస్తానన్న జాన్వీ కపూర్
దివంగత నటి శ్రీదేవిలా పేరు తెచ్చుకోవాలని కష్టపడుతోంది ఆమె కూతురు జాన్వీ కపూర్. తెలుగులో దేవర సినిమా చేస్తున్న ఈ బ్యూటీ హిందీలో నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమా కోసం ఇదివరకే ప్రమోషన్లు మొదలుపెట్టేసింది. తాజాగా ఆమె తనకున్న ఓ చెడ్డ అలవాటును బయటపెట్టింది.అమ్మాయిల ఫోన్ చెక్ చేయొద్దుఓ షోలో ఒక అమ్మాయి.. అమ్మాయిలు.. ప్రియుడి ఫోన్ చెక్ చేయొచ్చా? అని అడిగింది. అందుకు జాన్వీ.. అలా చేయొద్దంటారు కానీ నేనైతే చెక్ చేస్తాను అని చెప్పింది. మరి బాయ్స్ తన ప్రేయసి ఫోన్ చెక్ చేయొచ్చా? అని అడగ్గా.. నో, అలా చెక్ చేయకూడదు అని చెప్పింది. అదేంటి? మేమెందుకు మీ ఫోన్ చూడొద్దు అని ఓ అబ్బాయి అడగ్గా.. మీకు మా మీద ఆమాత్రం విశ్వాసం లేదా? అని సరదాగా మాట్లాడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.లవ్ బర్డ్స్కాగా జాన్వీ కపూర్, శిఖర్ పహారియా భగ్న ప్రేమికులు. ఆ మధ్య ఓ ఈవెంట్లో అతడి పేరులోని అక్షరాలతో తయారుచేసిన నెక్లెస్ ధరించింది. తిరుపతికి సైతం ప్రియుడిని వెంటేసుకునే వెళ్తుంది. తనకు 16 ఏళ్ల వయసున్నప్పటి నుంచి శిఖర్ తనకు తోడుగా ఉన్నాడని, తాను కన్న కలలనే అతడి కలలుగా ఫీల్ అయ్యాడని.. అలాగే అతడి ఆశయాలను తన లక్ష్యాలుగా ఫీల్ అయ్యానని చెప్తూ ఉంటుందీ ముద్దుగుమ్మ. ఆ మధ్య జాన్వీ తండ్రి బోనీ కపూర్ సైతం శిఖర్ తమ కుటుంబంలో ఎప్పటికీ ఉండాలని వారి బంధాన్ని చెప్పకనే చెప్పాడు. janhvi😭😭😭 pic.twitter.com/WAGaZACTCb— sarah (@sidxjk) May 23, 2024 చదవండి: పిల్లలు వద్దని కండీషన్ పెట్టా.. ప్రెగ్నెన్సీ వస్తే రోజూ ఏడుస్తూ..: కవిత -
మెడలో బాయ్ఫ్రెండ్ నెక్లెస్.. దేవర భామ డేటింగ్ నిజమేనా!
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేని పేరు. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆ తర్వాత బుచ్చిబాబు- చెర్రీ కాంబోలో వస్తోన్న మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంలో మెరిసింది జాన్వీ. అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇటీవలే తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. అదే సమయంలో తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా వెంటే ఉన్నారు. అయితే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. అదే సమయంలో ఇటీవల ఆమె తండ్రి బోనీకపూర్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. శిఖర్ చాలా మంచివాడని ప్రశంసలు కురిపించారు. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ మైదాన్ సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లింది. అదే సమయంలో అక్కడున్న వారి పోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్ తన భాయ్ఫ్రెండ్ పేరు ఉన్న నెక్లెస్ను ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పేరుతో నెక్లెస్ జాన్వీ కపూర్ ధరించిన నెక్లెస్పై శిఖు అని రాసి ఉంది. ఈ పేరుతోనే జాన్వీ అతన్ని ముద్దుగా పిలుస్తుందట. అంతేకాదు మంగళవారం ఉదయం నటి శిఖర్ తల్లి స్మ్రుతి షిండేతో కలిసి బాంద్రా ప్రభాదేవిలోని సిద్ధివినాయక ఆలయానికి చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది. మార్చిలో జాన్వీ తన పుట్టినరోజు సందర్భంగా శిఖర్తో కలిసి తిరుపతి బాలాజీ ఆలయానికి నడిచి వెళ్లారు. మోకాళ్లపై ఆలయ మెట్లను కూడా ఎక్కారు. ఇవన్నీ చూస్తుంటే శిఖర్ పహారియాకు జాన్వీ కపూర్ కుటుంబం ఓకే చెప్పినట్లు అర్థమవుతోంది. ఇటీవల జాన్వీ తండ్రి బోనీ కపూర్ మాట్లాడుతూ.. తమ జీవితంలోకి ఇలాంటి యువకుడు ఉన్నందుకు తాము ఆశీర్వదంగా భావిస్తున్నామని తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య డేటింగ్ నిజమేనని తెలుస్తోంది. -
బాయ్ఫ్రెండ్తో ఆలయానికి జాన్వీ కపూర్..!
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న దేవర చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయింది. దేశంలోని ప్రధాన ఆలయాలను సందరిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన భామ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు జాన్వీని ఆశీర్వదించి ఆమెకు బాబా మహకాళ్ ఫోటోను బహుకరించారు. అయితే ఆలయానికి గులాబీ రంగు చీరలో వెళ్లిన జాన్వీ స్వామివారి హారతి పూజలో పాల్గొన్నారు. అయితే ఆలయానికి వెళ్లిన జాన్వీ పక్కనే.. తన ప్రియుడిగా భావిస్తున్న శిఖర్ పహారియా కూడా ఉన్నారు. దీంతో మరోసారి జాన్వీ కపూర్పై డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. అయితే వీరిద్దరు ఇప్పటివరకు తమ రిలేషన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే చాలా ఏళ్ల క్రితమే జాన్వీతో శిఖర్ రిలేషన్ షిప్లో ఉన్నాడని సమాచారం. -
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి తిరుమలలో జాన్వీ ప్రత్యేకపూజలు
దివంగత నటి, అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి పెళ్లికి ముందే ఇలా స్వామివారిని దర్శించుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంప్రదాయ దుస్తుల్లో తిరుమలకు విచ్చేసిన జాన్వీ ఆలయం ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ భక్తిశ్రద్దల్లో మునిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. జాన్వీ ప్రియుడు శిఖర్ కూడా పంచె కట్టులో దర్శనమిచ్చారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎయిర్పోర్టులో కూడా ఇద్దరూ జంటగా కనిపించారు. దీనికి తోడు నీతా అంబానీ కల్చరల్ ఈవెంట్కు శిఖర్ బోనీ కపూర్తో కలిసి వెళ్లాడు. దీంతో వీరి ప్రేమకు పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు బీటౌన్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. #WATCH | Andhra Pradesh: Actor Janhvi Kapoor visited Tirupati Balaji Temple, Tirumala. pic.twitter.com/nYxZq7NA2A — ANI (@ANI) April 3, 2023 -
మాజీ సీఎం మనువడితో జాన్వీ డేటింగ్? వీడియో వైరల్
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గ్లామరస్ బ్యూటీగా నిత్యం వార్తల్లో నిలిచే జాన్వీ ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియాతో ఆమె డేటింగ్ చేస్తుందంటూ బీటౌన్లో వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఈ రూమర్స్పై ఇప్పటివరకు స్పందించని ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి ప్రియుడితో కనిపించింది. బాయ్ఫ్రెండ్ శిఖర్ పహరియాతో కలిసి ముంబైలోని కలినా ఎయిర్పోర్టులో దర్శనమిచ్చింది. ఇద్దరూ వైట్డ్రెస్లో ట్విన్నింగ్ అవుట్ఫిట్లో కనిపించారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో పలు పార్టీలకు కలిసి హాజరైన జాన్వీ-శిఖర్లు ఇప్పటివరకు తమ రిలేషన్షిప్పై అధికారికంగా ప్రకటించలేదు. కాగా ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్కు పరిచయం కానుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
శ్రీదేవి కూతురి ఫొటోలపై దుమారం
ప్రఖ్యాత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ పెద్ద కూతురు జాహ్నవి కపూర్ తన సినిమా అరంగేట్రానికి సంబంధించిన సమాచారం కంటే బాయ్ఫ్రెండ్ (బాయ్ఫ్రెండ్స్?) వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. 19 ఏళ్ల జాహ్నవి పార్టీలు, పబ్లలో బాయ్ఫ్రెండ్స్తో కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయి కౌగిలింతలు, లిప్ లాక్ దృశ్యాలతో ఉన్న ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాహ్నవి లవ్లో పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమానికి జాహ్నవి తన లవర్ శిఖర్తో పాటు తల్లిదండ్రులతో కలసి ఒకే కారులో రావడం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. కూతురి ప్రేమకు శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే జాహ్నవి అక్షత్ రాజన్ అనే మరో కుర్రాడితో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడం దుమారం రేపుతోంది. అక్షత్ జాహ్నవిని ముద్దు పెట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అక్షత్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో జాహ్నవితో కలిసున్న ఫొటోలను ఈ మధ్య తరచూ పోస్ట్ చేస్తున్నాడు. ఈ ఫొటోలను చూసిన నెటిజెన్లు జాహ్నవి అక్షత్తో డేటింగ్ చేస్తుందా అని షాక్ తిన్నారు. ఇంతకీ జాహ్నవి డేటింగ్ చేస్తోంది శిఖర్తోనా లేక అక్షత్తోనా? అని అయోమయంలో పడ్డారు. జాహ్నవి లవర్ ఎవరన్నది ఆ అమ్మాయికే తెలియాలి..! -
కూతురి ప్రేమకు శ్రీదేవి ఓకే?
‘‘ఇలాంటివన్నీ చేస్తే కుదరదు. బుద్ధిగా కెరీర్ మీద దృష్టి పెట్టు. లవ్వు గివ్వు అంటూ తిరిగావో బాగుండదు’’ అని తన పెద్ద కుమార్తె జాహ్నవీ కపూర్కి నటి శ్రీదేవి వార్నింగ్ ఇచ్చారనే వార్త ఈ మధ్య హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మరి... ఈ వార్త అబద్ధమో లేక తల్లితండ్రులైన శ్రీదేవి, బోనీకపూర్లను జాహ్నవి ఒప్పించారామో తెలియదు కానీ.. మొత్తం మీద తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా (ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్కుమార్ షిండే మనవడు)ను పేరెంట్స్కి దగ్గర చేసినట్లు తెలుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆలియా భట్ నటించిన ‘డియర్ జిందగీ’ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్కు అమ్మానాన్న, లవర్ శిఖర్తో కలిసి ఒకే కారులో జాహ్నవి హాజరు కావడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఒక్కసారిగా కెమెరాలన్నీ వాళ్లపై ఫోకస్ అయ్యాయి. ఇప్పుడీ ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. దీంతో జాహ్నవి, శిఖర్ల ప్రేమకు బోనీ, శ్రీదేవి ఒప్పుకున్నట్లేననే చర్చ మొదలైంది. ఇప్పుడు బాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్. -
శ్రీదేవి ఒప్పేసుకున్నారా?
శ్రీదేవి, బోనీ కపూర్ దంపతుల పిల్లలు జాన్వి కపూర్, ఖుషీ కపూర్కు స్టార్ కిడ్స్గా బాలీవుడ్లో చాలామంచి పేరుంది. ఇప్పుడిప్పుడు యుక్తవయస్సుకు వస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ పోస్టుల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. అయితే, ఇటీవల శ్రీదేవి కూతురు జాన్వి వార్తల్లో నిలిచింది. జాన్వి తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరు లిప్ టు లిప్ కిస్ చేసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్కుమార్ షిండే మనవడు అయిన శిఖర్తో తన కూతురు డేటింగ్ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదని కథనాలు కూడా వచ్చాయి. తాజాగా షారుఖ్ ఖాన్, అలియా భట్ లు నటించిన 'డియర్ జిందగీ' స్క్రీనింగ్ కు శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులతో పాటు జాన్వి, శిఖర్ లు కలిసి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో శ్రీదేవి, బోనీ కపూర్లు జాన్వి, శిఖర్ ల రిలేషన్ షిప్ ను అంగీకరించారనే వార్తలు కూడా వస్తున్నాయి. -
బాయ్ఫ్రెండ్తో కూతురి డేటింగ్పై శ్రీదేవి..!
శ్రీదేవి, బోనీ కపూర్ దంపతుల పిల్లలు జాన్వి కపూర్, ఖుషీ కపూర్కు స్టార్ కిడ్స్గా బాలీవుడ్లో చాలామంచి పేరుంది. ఇప్పుడిప్పుడు యుక్తవయస్సుకు వస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ పోస్టుల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. అయితే, ఇటీవల శ్రీదేవి కూతురు జాన్వి వార్తల్లో నిలిచింది. జాన్వి తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరు లిప్ టు లిప్ కిస్ చేసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్కుమార్ షిండే మనవడు అయిన శిఖర్తో తన కూతురు డేటింగ్ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదట. జాన్వి, శిఖర్ ముద్దుపెట్టుకున్న ఫొటోలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న శ్రీదేవి.. కూతురికి కొన్ని కఠినమైన ఆంక్షలు విధించిందని ముంబై మిర్రర్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న జాన్వి అస్సలు యువకులతో స్నేహం చేయవద్దని, డేటింగ్ చేయడం సంగతి దేవుడెరుగు అస్సలు బాయ్ఫ్రెండ్స్ ఉన్నా నేను అంగీకరించబోనని కూతురికి గట్టిగా చెప్పినట్టు పేర్కొంది. ఒక్కప్పటి అందాల కథానాయికగా రాణించిన శ్రీదేవి సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో ప్రతిదానికి తల్లి సలహా ఆధారంగా నడుచుకుంది. ఇప్పుడు తన కూతురి విషయంలోనూ అదే సంప్రదాయం కొనసాగాలని ఆమె తాపత్రయపడుతున్నట్టు సన్నిహితులు చెప్తున్నారు. -
అధరం తాంబూలం!
సెలబ్రిటీలకు స్వేచ్ఛ ఉండదు. ఇంటి నుంచి కాలు బయట పెట్టిన క్షణం నుంచీ రహస్య కెమేరాలు వెంటాడతాయ్. అది గ్రహించే ప్రముఖులు కూడా అప్రమత్తంగా ఉంటారు. అయినా ఏదో చోట దొరికిపోతారు. ఈ మధ్య ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అలానే దొరికిపోయింది. ఈ టీనేజ్ బ్యూటీ ఇటీవల శిఖర్ పహారియా అనే కుర్రాడితో ముద్దుల మూడ్లో ఉన్నప్పుడు రహస్యంగా ఎవరో కెమెరాలో బంధించారు. తీసినవాళ్లు సోషల్ మీడియా ద్వారా జాన్వీ, శిఖర్ల ముద్దూ ముచ్చట తాలూకు ఫొటోను బయటపెట్టారు. ఇంతకీ ఈ శిఖర్ పహారియా ఎవరంటే.. కేంద్ర మాజీ మంత్రి సుశీల్కుమార్ షిండే మనవడు. ఓ ప్రైవేట్ పార్టీలో జాన్వీ, శిఖర్లు ఈ విధంగా పట్టుబడ్డారని టాక్. ప్రస్తుతం జాన్వీ న్యూయార్క్లో ఉంది. అక్కడ నటనలో శిక్షణ తీసుకుంటోంది. మరో రెండేళ్ల లోపు తను కథానాయికగా పరిచయమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం.