Advertisement
Sikh community
-
సిక్ చౌహానీలో సిక్కు కమ్యూనిటీతో సీపీ స్టీఫెన్ సమావేశం
-
AP: సిక్కులకు కార్పొరేషన్
సాక్షి, అమరావతి: సిక్కుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు కల్పించాలన్న సిక్కు మతపెద్దల విజ్ఞప్తిపై అప్పటికప్పుడు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు గురుద్వారాలపై ఆస్తి పన్నును తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన సిక్కు మత పెద్దలతో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ సభ్యుడు జితేందర్జిత్సింగ్ నేతృత్వంలో సిక్కు మతపెద్దలు ముఖ్యమంత్రిని కలిశారు. శతాబ్దం క్రితం నుంచి సిక్కులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని సిక్కుమత పెద్దలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేశారు. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థంగా అందించాలని కోరగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించారు. గురుద్వారాల్లో పూజారులైన గ్రంథీలకు ప్రయోజనాలు గురుద్వారాల్లో పూజారులైన గ్రంథీలకు పూజారులు, పాస్టర్లు, మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవురోజుగా ప్రకటించేందుకు అంగీకారం తెలిపారు. ఓ మైనార్టీ విద్యాసంస్థను నెలకొల్పేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని ప్రకటించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉండాలని నిర్దేశించారు. పది రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో.. న్యాయ పీఠంపై తొలి సిక్కు మహిళ
ఆస్టిన్: భారత సంతతికి చెందిన మన్ప్రీత్ మోనికా సింగ్ అరుదైన ఘనత సాధించారు. హ్యారిస్ కౌంటీ(టెక్సాస్) జడ్జిగా ఆమె ప్రమాణం చేశారు. తద్వారా అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 70వ దశకంలో తొలినాళ్లలో మోనికా సింగ్ తండ్రి అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్లో పుట్టి పెరిగిన ఆమె.. ప్రస్తుతం బెల్లయిరేలో నివాసం ఉంటున్నారు. ఆమె వివాహిత. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శుక్రవారం టెక్సాస్లోని హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టులో(లా నెంబర్ 4) ఆమె జడ్జిగా ప్రమాణం చేశారు. హ్యూస్టన్లోనే ట్రయల్ లాయర్గా 20 ఏళ్లపాటు పని చేసిన ఆమె.. పౌర హక్కులకు సంబంధించిన పిటిషన్లతో పాటు, జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించిన కేసుల్ని సైతం వాదించారు. తనకు దక్కిన గౌరవంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలతో మోనికా సింగ్ సిక్కు వర్గానికి ఇవి మరిచిపోలేవని క్షణాలని ఇండో-అమెరికన్ న్యాయమూర్తి రవి సందిల్ పేర్కొన్నారు. మోనికా సింగ్ ప్రమాణ కార్యక్రమానికి హాజరైన ఆయన.. టెక్సాస్కు జడ్జిగా ఎన్నికైక తొలి సౌత్ ఏషియా వ్యక్తిగా ఘనత దక్కించుకున్నారు. అమెరికాలో దాదాపు ఐదు లక్షల మంది సిక్కు జనాభా ఉందని ఒక అంచనా.. అందులో 20వేల మంది హ్యూస్టన్లో ప్రాంతంలోనే స్థిరపడినట్లు గణాంకాలు చెప్తున్నాయి. -
మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికాలో ఎన్నారైపై దాడి
అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తోన్న ఓ ప్రవాస భారతీయుడిపై న్యూయార్క్లో దాడి జరిగింది. అంతేకాదు ఎన్నారైని ఉద్దేశించి జాత్యాహాంకర వ్యాఖ్యలకు దిగాడు. దీంతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు అవగా బాధితుడికి అండగా భారతీయ సంఘాలు నిలబడ్డాయి. ఈ ఘటకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. అమెరికాలో దాడికి సంబంధించిన వివరాలను హిందూ పత్రిక ప్రచురించింది. హిందూ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్కి చెందిన ఓ యువకుడు అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. జనవరి 3న జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 దగ్గర తన కారును పార్క్ చేశారు. ఇంతలో కస్టమర్ రావడంతో కారును ముందుకు కదిపేందుకు ప్రయత్నించగా అక్కడ మరో ట్యాక్సీ నిలిపి ఉంది. వెంటనే కారు దిగిన సింగ్.. తన కారు వెళ్లేందుకు వీలుగా ముందున్న కారును పక్కకు తీయాలంటూ అందులో ఉన్న వ్యక్తిని కోరాడు. సింగ్ కారు దిగడం ఆలస్యం కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దాడికి దిగాడు. ముఖం, ఛాతిపై పంచ్లు విసిరాడు. దాడికి పాల్పడుతూనే సింగ్ తలకు ఉన్న టర్బన్ను తీసేందుకు ప్రయత్నించాడు. ‘ టర్బనేడ్ పీపుల్, గో బ్యాక్ టూ యువర్ కంట్రీ ’ అంటూ జాత్యాంహార వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి పోయాడు. జరిగిన ఘటనపై సింగ్ వెంటనే ఎయిర్పోర్టు ప్రాంగణంలో ఉన్న పోర్టు అథారిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశాడు. అయితే సింగ్పై దాడి చేసిన వ్యక్తి ఎవరనేది స్పష్టంగా తెలియడం లేదు. దీంతో ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న సిక్కు కమ్యూనిటీల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయంలో బాధితుడికి న్యాయం జరిగేందుకు వీలుగా ఒక డిటెక్టివ్, న్యాయవాదిని నియమించారు. చదవండి: దేశమేదైనా అండగా మేమున్నాం -
పాక్ మోడల్ ఫొటోలు వైరల్.. సిక్కు మతస్థుల ఆగ్రహం..
Pakistan Model Apologises After Her Photos Went Viral: సిక్కు మతస్థులు తమ మతాన్ని, సంస్కృతిని, ఆచార్యవ్యవహారాలను ఎంతో గౌరవిస్తారు. ఆలయాల్లో వారి ఆచారాలు పాటించకుండా, అగౌర్వపరిస్తే అస్సలు ఊరుకోరు. ఎదుటివారు ఎలాంటివారైనా తమదైన స్టైల్లో విరుచుకుపడతారు. ఇటీవల ఒక పాకిస్థాన్ మోడల్పై ఆ దేశ సిక్కు మతస్థులు గరంగరంగా ఉండడంతో క్షమాపణలు చెప్పింది. పంజాబ్లోని కర్తార్పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్లో మోడల్ సౌలేహ ఒట్టి తలతో (హెడ్ కవర్ లేకుండా) ఉన్న ఫొటోలను ఇన్స్టా గ్రామ్లో పంచుకుంది. అది చూసిన మతస్థులు తమ మనోభావాలు దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారికి క్షమాపణలు చెబుతూ అదే ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ పెట్టింది ఆ మోడల్. 'ఇటీవల నేను ఇన్స్టాలో ఒక ఫొటోను పోస్ట్ చేశాను. నేను చరిత్ర, సిక్కు సమాజం గురించి తెలుకోవడానికి కర్తార్పూర్కి వెళ్లాను. అంతేగానీ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే, వారి సంస్కృతిని అగౌరపరిచానని భావిస్తే నన్ను క్షమించండి. అక్కడ ఫొటోలు తీసే ప్రజలను చూశాను. నేను సిక్కు మతానికి సంబంధించిన ఫొటోలు కూడా తీసుకున్నాను. అక్కడ అలా చేయాల్సింది కాదు. నేను సిక్కు సంస్కృతిని చాలా గౌరవిస్తాను. ఈ ఫొటోలు నేను అక్కడికి వెళ్లనట్లుగా జ్ఞాపకంలో భాగం మాత్రమే. అంతకు మించి ఏమి లేదు. భవిష్యత్తులో వీటి గురించి మరింత అవగాహనతో ఉంటాను. ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటాను. అలాగే నేను ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ప్రజలు తప్పక తెలుసుకోవాలి. అది అందరికీ తెలిసేలా చేయండి.' అని మోడల్ సౌలేహ సంజాయిషీ ఇచ్చుకుంది. View this post on Instagram A post shared by Sauleha صالحہ امتیاز 🇵🇰 (@swalaaa_lala) అయితే కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా ఆలయం లోపల సోమవారం మోడల్ తల చుట్టూ ఎలాంటి వస్త్రం లేకుండా ఫోజులిచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి మంజీందర్ సింగ్ సిర్సా కూడా సౌలేహను విమర్శించారు. 'శ్రీ గురునానక్ దేవ్ జీ పవిత్ర స్థలంలో ఇలాంటి ప్రవర్తన, చర్య పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఆమె పాకిస్థాన్లోని తన మత స్థలంలో కూడా ఇలాగే చేస్తుందా ? అలా చేయడానికి ధైర్యం ఉందా ? కర్తార్పూర్ సాహిబ్ పిక్నిక్ స్పాట్ అనుకుంటున్న పాకిస్థాన్ ప్రజలు ధోరణిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది.' అని మంజీందర్ సింగ్ సిర్సా ట్వీట్ చేశారు. అయితే పాకిస్థాన్ పంజాబ్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా సిక్కులకు పవిత్రస్థలం. Such behaviour & act at pious place of Sri Guru Nanak Dev Ji is totally unacceptable! Can she dare to do the same at her religious place in Pakistan?@ImranKhanPTI @GovtofPakistan shd tk immed action to stop this trend of treating Sri Kartarpur Sahib as picnic spot by Pak people pic.twitter.com/AwyIkmqgbC — Manjinder Singh Sirsa (@mssirsa) November 29, 2021 -
‘అదేమన్నా పిక్నిక్ స్పాటా’.. మోడల్పై ప్రధానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వద్ద ఫోటోషూట్ చేయడమే కాక.. తలపై వస్త్రం ధరించనందుకు గాను పాకిస్తాన్ మోడల్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. పాకిస్తాన్కు చెందిన దుస్తుల కంపెనీ మన్నత్ కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా వద్ద ఓ యాడ్ని షూట్ చేసింది. దీనిలో నటించిన మోడల్ తలపై వస్త్రం ధరించకుండా షూట్లో పాల్గొని.. ఫోటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు కంపెనీ, మోడల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ముఖ్యంగా సిక్కు సామాజిక వర్గం వారు ఈ యాడ్పై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్ షూట్ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ విమర్శిస్తున్నారు. (చదవండి: కుక్క హెయిర్ డై కోసం 5 లక్షలు.. మోడల్ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!) ఈ నేపథ్యంలో శిరోమణి అకాళీ దల్ నేత (ఎస్ఏడీ), ఢిల్లీ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కోరారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మినిస్టర్ పవాద్ చౌదరి స్పందిస్తూ.. సదరు దుస్తుల కంపెనీ, మోడల్ తమ చర్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు) వివాదం కాస్త పెద్దదవడంతో మన్నత్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అంతేకాక ‘‘సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫోటోల ప్రకారం కర్తార్పూర్ కారిడార్ వద్ద ఫోటో షూట్ చేసింది తాము కాదని.. థర్డ్ కంపెనీ వారు తమ మన్నత్ వస్త్రాలు ధరించి.. అక్కడ యాడ్ షూట్ చేశారని’’ తెలిపారు. The Designer and the model must apologise to Sikh Community #KartarPurSahib is a religious symbol and not a Film set….. https://t.co/JTkOyveXvn — Ch Fawad Hussain (@fawadchaudhry) November 29, 2021 చదవండి: మోడల్ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి -
అమెరికాలో కాల్పులు: మృతుల్లో నలుగురు సిక్కులు
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా పొలిస్లో ఉన్న ఫెడ్ఎక్స్ ఫెసిలిటీ వద్ద గురువారం రాత్రి జరిగిన కాల్పుల్లో మొత్తం 8 మంది మరణించగా వారిలో, నలుగురు సిక్కులు ఉన్నట్లు పోలీసులు శనివారం ప్రకటించారు. ఈ దాడికి పాల్పడింది 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్గా గుర్తించారు. స్కాట్ గతేడాది వరకు ఫెడ్ఎక్స్లో పని చేశాడని తెలిపారు. 2012లో విస్కాన్సిన్లో సిక్కులపై జరిగిన దాడి అనంతరం తిరిగి అదే వర్గంపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. మరణించిన సిక్కులను అమర్జీత్ జోహాల్ (66), జస్విందర్ కౌర్ (64), అమర్జీత్ స్కోన్ (48), జస్విందర్ సింగ్లుగా గుర్తిం చారు. వీరిలో మొదటి ముగ్గురు మహిళలే కావడం గమనార్హం. అదే వర్గానికి చెందిన హర్ప్రీత్ సింగ్ గిల్ (45)కు బుల్లెట్ గాయ మైందని, ప్రస్తుతం చికిత్స పొందుతు న్నట్లు అధికారులు వెల్లడించారు. జరిగిన ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందిం చింది. బాధిత కుటుంబాలతో మాట్లాడినట్లు తెలిపింది. వారికి అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భరోసా ఇచ్చింది. సిక్కు నేత గురిందర్ సింగ్ ఖల్సా మాట్లాడుతూ.. ఈ ఘటనతో సిక్కు సమాజ మంతా ఉలిక్కిపడిందన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ.. కాల్పులు జరిగిన విషయం పోలీసులు చెప్పారన్నారు. మరణించిన వారికి నివాళిగా వైట్ హౌజ్ సహా అన్ని ఫెడరల్ భవనాలపై జాతీయ జెండా ఎత్తును సగానికి దించనున్నట్లు తెలిపింది. చదవండి: అఫ్జల్గంజ్లో భారీ అగ్ని ప్రమాదం -
అమెరికాలో చరిత్ర సృష్టించిన సిక్కు యువతి
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఆన్మోల్ నారంగ్ అరుదైన ఘనత సాధించింది. వెస్ట్పాయింట్లోని ప్రఖ్యాత అమెరికా మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి సిక్కు యువతిగా చరిత్ర సృష్టించింది. వెస్ట్పాయింట్లో నాలుగేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్న అన్మోల్.. ఓక్లహామ్లోని లాటెన్ ఫోర్ట్ సిల్లో బేసిక్ ఆఫీసర్ లీడర్షిప్ కోర్పు అభ్యసించనుంది. ఈ శిక్షణ పూర్తైన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో జపాన్లోని ఒకినావాలో ఆమెకు తొలి పోస్టింగ్ లభించే అవకాశం ఉంది. ఈ విషయం గురించి సెకండ్ లెఫ్టినెంట్ అన్మోల్ నారంగ్ మీడియాతో మాట్లాడుతూ.. వెస్ట్పాయింట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్న నా కల శనివారంతో తీరింది. (చదవండి: భూ అంతర్భాగంలో భారీ నిర్మాణం) నాకు దక్కిన ఈ గౌరవం నన్నెంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. జార్జియాలోని సిక్కు కమ్యూనిటీ సభ్యులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా సిక్కు అమెరికన్లు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలరని నిరూపించాను. ఇష్టమైన కెరీర్లో ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉంటే అసాధ్యం అనేది ఏదీ ఉండదు’’అని పేర్కొన్నారు. కాగా జార్జియాలోని రోస్వెల్లో పుట్టిపెరిగిన అన్మోల్.. తన తాతయ్య(భారత ఆర్మీలో పనిచేశారు) స్ఫూర్తితో మిలిటరీలో సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ అండర్గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. హవాయిలోని హోనలులులో ఉన్న పెరల్ హార్బర్ నేషనల్ మెమొరియల్ సందర్శించిన అనంతరం వెస్ట్పాయింట్లో చేరాలన సంకల్పించి తన ఆకాంక్ష నేటితో నెరవేర్చుకున్నారు.(హెచ్1బీ వీసా రద్దుకు ట్రంప్ ఆలోచన) -
‘ద్వేషపూరిత దాడుల్లో సిక్కులు’
అమెరికాలో 2018లో జరిగిన ద్వేషపూరిత దాడుల్లో బాధితులుగా సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం సిక్కులపై 60 దాడులు చోటు చేసుకున్నాయని పేర్కొంది. గత ఏడాది అమెరికాలో మొత్తం ద్వేషపూరితమైన దాడులు 7,120 జరిగాయని.. 2017తో పోల్చతే కొంచం తగ్గాయిని ఎఫ్బీఐ నివేదిక తెలిపింది. ద్వేషపూరితమైన దాడులు ముఖ్యంగా మతం ఆధారంగా యూదులు(835), ముస్లింలు(188), సిక్కులు (60)పై జరిగాయని పేర్కొంది. ఇతర మతాలపై ఇటువంటి దాడులు 91 అయ్యాయని తెలిపింది. ఇందులో భాగంగా హిందువులపై 12 దాడులు, బుద్ధులపై పది చోటుచేసుకున్నట్టు వెల్లడించింది. జాతి అధారంగా మొత్తం 4,047 దాడులు జరిగితే.. అందులో అత్యధికంగా అమెరికాలోని నల్లజాతి అఫ్రికన్లపై సుమారు 1,943 దాడులు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించింది. తరువాత తెల్ల జాతివారైన అమెరికన్లపై కూడా 762 దాడులు.. లాటిన్లపై 485 దాడులు జరిగాయని ఆ నివేదికలో వెల్లడైంది. కాగా 2018లో ఆసియన్లపై 148, అరబ్బులపై 82, అలాస్కా ప్రజలపై 194 ద్వేషపూరిత దాడులు జరిగినట్టు ఎఫ్బీఐ నివేదిక వెల్లడించింది. అయితే మిగతా మతస్తులపై దాడులు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ సిక్కులపై మాత్రం పెరుగుతున్నాయని.. దుండగులు దాడులకు లక్ష్యం చేసుకున్న మతాల్లో సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని ఎఫ్బీఐ నివేదిక వెల్లడించింది. -
పాకిస్తాన్లో మరో దురాగతం
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మరో దురాగతం చోటుచేసుకుంది. మైనార్టీ వర్గమైన సిక్కు పూజారి కుమార్తెను ముస్లిం యువకుడు బలవంతంగా వివాహం చేసుకున్న ఘటన మరువక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. సింధు ప్రావిన్స్లో ఓ హిందూ యువతిని బలవంతంగా మత మార్పిండి చేయించి ఓ ముస్లిం యువకుడు వివాహం చేసుకున్నాడు. యువతి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. బీబీఏ చదువుతున్న తన కుమార్తె ఆగస్ట్ 29న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. అయితే సదరు యువతిని తన క్లాస్మెట్స్ బాబార్ అమర్, మీర్జా దిల్వార్ కలిసి అపహరించుకుపోయారని, ఆ తరువాత మత మార్పిడి చేయించి అమర్ వివాహం చేసుకున్నారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చినట్ల తెలిపారు. దీనిపై యువతి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆ యువతి మాట్లాడుతూ... అమర్, మీర్జా తనను కిడ్నాప్ చేశారని, అనంతరం ఇస్లాం మతంలోకి మార్పించి బలవంతంగా పెళ్లి చేకున్నాడని తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే మీర్జా దిల్వార్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యురాలిగా తెలింది. కాగా గడిచిన వారం రోజుల్లోనే ఇలాంటి ఘటనలు రెండు జరగడం గమన్హారం. యువతలను ఎత్తుకెళ్లి మతం మార్చి ముస్లిం యువకులకు ఇచ్చి పెళ్లి చేయడం లాంటి ఘటనలు పాక్లో ఇటీవల బాగా పెరిగాయి. తాజా ఘటన వారంలో రెండోది కాగా, రెండు నెలల్లో ఇది మూడోదని పాకిస్తాన్కు చెందిన హిందూ ఎన్జీవో ఆల్ పాకిస్తాన్ హిందూ పంచాయత్ తెలిపింది. చదవండి: పాక్లో సిక్కు యువతి మత మార్పిడి! -
ఆ అమ్మాయి తిరిగి వచ్చేసిందా?!
నాంకానా సాహిబ్/ఇస్లామాబాద్ : తన ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నానని చెప్పిన సిక్కు యువతి జగ్జీత్ తిరిగి తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలని జగ్జీత్ కుటుంబ సభ్యులు కొట్టిపడేశారు. తను ఇంటికి తిరిగి రాలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు తమకు అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఈ మేరకు శిరోమణి అకాళీదళ్ ఎమ్మెల్యే మజీందర్ సింగ్ ట్విటర్లో ఓ వీడియోను షేర్ చేశారు. కాగా పాకిస్తాన్లో మైనార్టీ వర్గమైన సిక్కు మతానికి చెందిన పూజారి భగవాన్ సింగ్ కుమార్తె జగ్జీత్ కౌర్(19)ను ఓ ముస్లిం యువకుడు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అమ్మాయిని ఎత్తుకువెళ్లిన అనంతరం మతం మార్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడని మజీందర్ సింగ్ గురువారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై పంజాబ్ (భారత్) ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను కోరారు. అలాగే పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఈ వీడియోను ట్వీట్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్.. పాక్లో మైనార్టీల దుస్థితికి నిదర్శనం అని విమర్శించారు. భారత విదేశాంగ కూడా ఈ విషయంపై స్పందించాల్సిందిగా పాక్ను కోరింది. This is the recent video of the brother of Jagjit Kaur who is still not safely returned to her family in Pakistan We assure our Sikh brothers in Pakistan that we will stand with them until justice is served. Share maximum with all 🙏🏻 @ANI @Republic_Bharat @ABPNews @PTI_News pic.twitter.com/g2J9H6dVyL — Manjinder S Sirsa (@mssirsa) August 31, 2019 ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ యువతి వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో తన పేరు జగ్జీత్ కౌర్ అనీ, తాను ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని పెళ్లాడానని.. ఇందులో ఎవరి బలవంతం లేదని ఆ యువతి చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ముస్లిం భర్త ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు. కాగా తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని జగ్జీత్ తండ్రి ఫిర్యాదు చేయడం, యువతికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పంజాబ్ (పాకిస్తాన్) ముఖ్యమంత్రి సర్దార్ ఉస్మాన్ బుజ్డార్ స్పందించి విచారణకు ఆదేశించారు. ఇక గత మార్చిలో పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో ఇద్దరు హిందూ మైనర్ బాలికలను అపహరించి ముస్లిం యువకులతో బలవంతంగా పెళ్లి చేశారు. ఆ ఘటనపై నాటి విదేశాంగ మంత్రి, దివంగత నేత సుష్మాస్వరాజ్ చొరవ తీసుకొని నిష్పాక్షిక విచారణ జరిపించాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిని కోరిన విషయం తెలిసిందే. అయితే బాలికల కుటుంబీకులు కోర్టులో కేసు వేసినప్పటికీ తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది. -
పాక్లో సిక్కు యువతి మత మార్పిడి !
-
పాక్లో కలకలం; భారత్ ఆందోళన
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో మైనార్టీ వర్గమైన సిక్కు పూజారి కుమార్తె ఒకరు ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బలవంతంగా పెళ్లి చేసి మత మార్పిడి చేశారని యువతి కుటుంబీకులు ఆరోపిస్తుండగా, అలాంటిదేమీ లేదని, తన ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నాననీ ఆ యువతి చెప్తున్న వీడియో బయటికి రావడం సంచలనం రేపింది. ఈ ఘటనపై భారత్లో ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో పాకిస్తాన్ విచారణకు ఆదేశించింది. తమ కుమార్తె జగ్జీత్ కౌర్ గత మూడు రోజులుగా కనిపించడం లేదని లాహోర్లోని నంకనా సాహెబ్లోని సిక్కు పూజారి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం ఆ యువతి వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో తన పేరు జగ్జీత్ కౌర్ అనీ, తాను ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నానని.. ఇందులో ఎవరి బలవంతం లేదని ఆ యువతి చెప్పుకొచ్చింది. వీడియోలో ముస్లిం భర్త ఆమె పక్కనే ఉన్నారు. ఈ మేరకు యువతి వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో పాకిస్తాన్లోని మైనార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పంజాబ్ (పాకిస్తాన్) ముఖ్యమంత్రి సర్దార్ ఉస్మాన్ బుజ్డార్ స్పందించి విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై పంజాబ్ (భారత్) ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను కోరారు. అలాగే పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఈ వీడియోను ట్వీట్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత మార్చిలో సింధు ప్రావిన్స్లో ఇద్దరు హిందూ మైనర్ బాలికలను అపహరించి ముస్లిం యువకులతో బలవంతంగా పెళ్లి చేశారు. ఆ ఘటనపై నాటి విదేశాంగ మంత్రి, దివంగత నేత సుష్మాస్వరాజ్ చొరవ తీసుకొని నిష్పాక్షిక విచారణ జరిపించాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిని కోరారు. బాలికల కుటుంబీకులు కోర్టులో కేసు వేసినప్పటికీ తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కశ్మీర్ అంశంపై ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పర్యవసానాలు ఎలా ఉంటాయోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
వివాదంలో షారుఖ్ ‘జీరో’
ముంబై : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల మందుకు రాబోతున్న ‘జీరో’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. తమ మనోభావాలు కించపరిచే సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయని సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీ సిక్కు గురుద్వార్ కమిటీ జనరల్ సెక్రటరీ మజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ పోలీస్ స్టేషన్లో షారుఖ్తో పాటు చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ ట్రైలర్లో షారుక్ ఖాన్.. సిక్కులు పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్ ధరించాడని, అది సిక్కుల మనోభావాలు కించపరిచడమేన్నారు. ‘జీరో మూవీ ట్రైలర్లో సిక్కుల మనోభావాలు కించపరిచే సన్నివేశాలున్నాయని చాలా మంది నా దృష్టికి తీసుకువచ్చారు. సిక్కులు పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్ను షారుక్ ధరించినట్లు మూవీ టీజర్లో కనిపించింది. సిక్కుల సంప్రదాయం ప్రకారం అమ్రిత్ధరి సిక్కులు మాత్రమే అది ధరిస్తారు. కానీ ఈ మూవీలో ధరించి మా సెంటిమెంట్స్ను కించపరిచారు. వెంటనే ఈ సన్నివేశాలను తొలగించి, చిత్ర దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలి’ అని మజిందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరగుజ్జు పాత్రలో షారుఖ్ నటిస్తుండగా, కుర్చీకే పరిమితమైన దివ్యాంగురాలిగా అనుష్క శర్మ.. అతిధి పాత్రలో కత్రినా నటిస్తుండటంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. -
‘మమల్ని దేశం నుంచి వెళ్లగొడుతున్నారు’
ఇస్లామాబాద్ : సిక్కులను పాకిస్తాన్ నుంచి బలవంతగా గెంటివేస్తున్నారని పాక్కు చెందిన గూలాబ్ సింగ్ అనే వ్యక్తి పేర్కొన్నారు. సిక్కుల నుంచి పాక్ మొదటి పోలీసు అధికారిగా నియమితులైన గులాబ్ సింగ్ లాహోర్కు సమీపంలోని దేరా చహల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పోలీసు అధికారులు తనను దేశం విడిచివెళ్లాలని దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. గులాబ్ సింగ్ బుధవారం మాట్లాడుతూ ‘మా కుటుంబం 1947 నుంచి పాక్లోనే ఉంటుంది. పాక్లో ఎన్ని అల్లర్లు జరిగినా మేం దేశం విడిచిపోలేదు. ఇప్పుడు ప్రభుత్వం సిక్కులను బలవంతంగా దేశం నుంచి తరివేయాలని చుస్తోంది. ఇంటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెత్తికి చుట్టుకున్న పాగాను బలవంతంగా లాగారు. గత కొంత కాలంగా నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు’ అని గులాబ్ సింగ్ పేర్కొన్నారు. ఇంటిని ఖాళీ చేయాడానికి తమకు కొంత సమయం అడిగిన పోలీసులు ఇవ్వలేదని గులాబ్ సింగ్ తెలిపారు. కాందిశీకులకు చెందిన ఓ ట్రస్ట్ బోర్డు తమను అక్కడి నుంచి ఖాళీ చెయించిందని, ఆ సంస్థ చైర్మన్ సయ్యద్ ఆసీఫ్ ఆక్తర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో గులాబ్ సింగ్ ఫిర్యాదు చేశాడు. గురుద్వార్కు సంబంధించిన స్థలాన్ని 2011లో గులాబ్ సింగ్ అక్రమంగా కొనుగోలు చేశారని, దానిని స్వాధీనం చేసుకునే బాధ్యతను పాక్ సుప్రీంకోర్టు ట్రస్ట్ చైర్మన్కు అప్పగించినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. My house is sealed with all belongings including my slippers inside. Even this 'patka' on my head is an old rag which I just wrapped. I was harassed, beaten and my faith was disrespected: Gulab Singh, Pakistani Policeman who was forcibly evicted from his house in Lahore pic.twitter.com/va1tOGk3UM — ANI (@ANI) July 11, 2018 -
జలంధర్లో ఉద్రిక్తత
జలంధర్: సిక్కు,హిందూ మత పవిత్ర గ్రంథాలను గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో పడేయడంతో పంజాబ్ లోని జలంధర్ లో సిక్కు, హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. గురుసాహిబ్ గ్రంథ్లోని 200 పేజీలు, భగవద్గీతలోని పేజీలను జలంధర్ కపుర్తలా చౌక్లోని కాలువలో పడేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిక్కులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అసాంఘీక సంఘటనలు జరుగకుండా చూస్తున్నారు. ఘటను పంజాబ్ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్రంగా ఖండించారు.