tortured
-
‘అమ్మా’నవీయం!
జంగారెడ్డిగూడెం: బిడ్డ కాలికి ముల్లు గుచ్చుకుంటేనే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లికి ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటిది.. ఓ తల్లి తన బిడ్డల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి వారిని చిత్రహింసలకు గురిచేస్తూ పైశాచికానందం పొందింది. ప్రియుడు రోజూ సెల్ ఫోన్ చార్జింగ్ వైరుతో చిన్నారుల ఒంటిని ఛిద్రం చేస్తున్నా.. ఆ అమ్మ మనసు కరగలేదు. పైగా ఆ పచ్చి గాయాలపై కారం పోసి.. ఆ బిడ్డల నోట్లో మిరపకాయలు కుక్కింది. బిడ్డలు అల్లాడిపోతుంటే.. ప్రియుడితో కలిసి వికృతానందం పొందింది! పోలీసులతో పాటు ఆ బిడ్డలకు వైద్యం చేసిన డాక్టర్లు కూడా చిన్నారుల ఒంటి మీది గాయాలు చూసి కన్నీళ్లు పెట్టారంటే.. ఆ చిన్నారులను ఆ తల్లి ఎంత చిత్రవధకు గురిచేసిందో అర్థం చేసుకోవచ్చు. తల్లి శాడిజం.. పిల్లలకు చిత్రవధ ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన గానాల శారద కొంతకాలంగా భర్తతో విడిపోయి తన తొమ్మిదేళ్ల కుమారుడు ఉదయ్రాహుల్, ఐదేళ్ల కుమార్తె రేణుకతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు స్థానికుడు, అవివాహితుడు నల్లవెలుగుల పవన్కుమార్తో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో శారద, పవన్కుమార్లు జంగారెడ్డిగూడేనికి మకాం మార్చి సహజీవనం చేస్తున్నారు. అక్కడే హోటళ్లలో పనిచేసుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. పవన్కుమార్ రోజూ మద్యం తాగొచ్చి శారద పిల్లలైన ఉదయ్రాహుల్, రేణుకలను సెల్ఫోన్ చార్జింగ్ వైర్తో తీవ్రంగా కొట్టేవాడు. దీనికి శారద అడ్డు చెప్పక పోగా ప్రియుడికి వంతపాడేది. ఇలా పవన్కుమార్, శారదలు చిన్నారులను వైరుతో కొట్టడంతో వారి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అలా అవుతున్న గాయాలపై వారు కారం పోసేవారు. మంటను భరించలేక చిన్నారులు అల్లాడిపోతుంటే.. వారి నోట్లో కారంతో పాటు మిరపకాయలు కుక్కి రాక్షసానందం పొందేవారు. వీరు పెడుతున్న హింసలకు ఉదయ్రాహుల్కు పళ్లు ఊడిపోగా, రేణుక కంటికి తీవ్ర గాయమైంది. నా ప్రియుడిపై దెబ్బ పడితే ఊరుకోను.. ఎప్పటిలాగానే శనివారం అర్ధరాత్రి చిన్నారులను మళ్లీ చిత్రహింసలకు గురిచేశారు. ప్రియుడితో కలిసి తల్లిపెడుతున్న బాధలను తట్టుకోలేక చిన్నారులు ఇద్దరూ భయంతో బయటకు పరుగులుదీశారు. దీంతో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకుని.. పవన్కుమార్కు దేహశుద్ధి చేసే ప్రయత్నం చేశారు. అయితే తన ప్రియుడిని కొడితే ఊరుకోనంటూ శారద అడ్డుకుంది. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ జబీర్, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒంటి నిండా గాయాలతో నిండిపోయిన చిన్నారులను చూసి చలించిపోయారు. వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చిన్నారులను డీఎస్పీ రవిచంద్ర, సీఐ కృష్ణబాబు పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బేబీ కమలతో పాటు వైద్యులు, పోలీసులు కూడా చిన్నారుల దుస్థితిని చూసి కంటతడి పెట్టారు. ఈ ఘటనను కలెక్టర్ కె.వెట్రిసెల్వి తీవ్రంగా పరిగణించి బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. -
10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే
శ్రీనగర్: టీనేజీ రోజుల్లో సైన్యం జరిపిన ఒక గాలింపు చర్యల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను జమ్మూకాశ్మీర్ శాసనసభలో నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె వెల్లడించారు. అసెంబ్లీలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం జమ్షెద్ లోనె ప్రసంగించారు. ‘‘ఉగ్రవాదుల దాడులు, సైన్యం తీవ్ర గాలింపులు కొనసాగుతున్న రోజులవి. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా. మా ప్రాంతంలో నివసించే కొందరు యువకులు ఉగ్రవాదానికి ప్రభావితులై అందులో చేరిపోయారు. మా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల జాడ తెలపాలని స్థానికులను ప్రశ్నించడం మొదలెట్టింది.ఆ రోజు నాతోకలిపి 32 మంది టీనేజర్లు ఉన్నారు. మాలో ఒకొక్కరిని ఒక ఆర్మీ ఆఫీసర్ పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదంలో చేరిన స్థానికుల జాడ చెప్పాలని బెదిరించారు. స్థానికులు కాబట్టి వారెవరు నాకు తెలుసుగానీ వాళ్లు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? అనే వివరాలు నాకు తెలీదని చెప్పా. పట్టరాని ఆగ్రహంతో అ అధికారి నన్ను కొట్టారు. వివరాలు చెప్పాలని, నోరు విప్పి మాట్లాడాలని గద్దయించారు. నాకు తెలీదని మళ్లీ చెప్పడంతో మళ్లీ కొట్టారు. దీంతో ‘ఉగ్రవాదిగా మారిపోతా’అని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా. కానీ కొద్దిసేపటి భారతసైన్యంలో ఉన్నతాధికారి ఒకరు వచ్చి మాతో మాట్లాడారు. ఆయన నన్ను ‘పెద్దయితే ఏమవుతావు?’అని అడిగారు. ఉగ్రవాదిని అవుతా అని సూటిగా సమాధానం చెప్పా. హుతాశుడైన ఆ అధికారి నా నిర్ణయానికి కారణాలు అడిగారు. ఇంతకుముందే చితకబాదిన, దారుణంగా అవమానించిన విషయం చెప్పా. దాంతో ఆయన కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులు, ఆర్మీ అధికారి అంతలా ప్రవర్తించడానికి కారణాలు ఆయన విడమరిచి చెప్పారు. నన్ను కొట్టిన ఆఫీసర్ను అందరి ముందటే సైన్యాధికారి చీవాట్లు పెట్టారు. దీంతో నాకు వ్యవస్థపై నమ్మకం ఏర్పడింది. ఉగ్రవాదం వైపు మళ్లొద్దని నిర్ణయించుకున్నా. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టా. ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్యేనయ్యా. అయితే చితకబాదడం వల్లనో, ఉగ్రవాదం భావజాలం పెను ప్రభావమో తెలీదుగానీ ఆరోజు దెబ్బలు తిన్న 32 మందిలో 27 మంది తర్వాతి రోజుల్లో ఉగ్రవాదులుగా మారారు ’’అని జమ్షెద్ సభలో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోలాబ్ నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) పార్టీ తరఫున లోనె విజయం సాధించడం తెల్సిందే. సీనియర్ సైన్యాధికారి నాలో పరివర్తన తీసుకొచ్చారు అని టీనేజీ చేదుజ్ఞాపకాలను అసెంబ్లీలో గుర్తుచేసుకున్నారు కశ్మీర్ నూతన ఎమ్మెల్యే ఖైసర్ జమ్షెద్ లోనె -
దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు
-
పాకిస్తాన్లో దారుణం.. విపరీతంగా కొట్టి, కాల్చి బూడిద చేశారు
లాహోర్: పాకిస్తాన్లో దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపిస్తూ శ్రీలంక దేశస్తుడొకరిని శుక్రవారం అమానుషంగా కొట్టి చంపడంతోపాటు మృతదేహాన్ని కాల్చేశారు. పంజాబ్ ప్రావిన్స్ సియాల్కోట్కు సమీపంలోని ఓ దుస్తుల దుకాణం మేనేజర్గా శ్రీలంకకు చెందిన ప్రియంత కుమార(40)పనిచేస్తున్నారు. శుక్రవారం ఆయన తన కేబిన్కు సమీపంలో అంటించిన అతివాద పార్టీ తెహ్రీక్–ఇ–లబ్బాయక్(టీఎల్పీ) పోస్టర్ను చించివేసి, డస్ట్బిన్లో పడేశారు. ఆ పోస్టర్పై పవిత్ర ఖురాన్లోని వాక్యాలున్నాయి. ఈ విషయం బయటకు పొక్కింది. ఫ్యాక్టరీ వద్ద గుమికూడిన వందలాది మంది టీఎల్పీ కార్యకర్తలు ఆగ్రహంతో ప్రియంతను బయటకు ఈడ్చుకెళ్లి విపరీతంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అక్కడికి చేరుకోకమునుపే వారు మృతదేహాన్ని కాల్చివేశారు. ఘటనకు సంబంధించి 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
వరకట్నం కోసం భార్యకు నరకం చూపిన భర్త
-
చిత్రహింసలు పెట్టి తల్లిని చంపాడు
దుబాయ్: భార్యతో కలసి భారత్కు చెందిన ఓ వ్యక్తి తన సొంత తల్లినే చిత్రహింసలు పెట్టి చావుకు కారణమైన ఘటన దుబాయ్లో జరిగింది. చనిపోయేనాటికి తల్లి బరువు కేవలం 29 కేజీలు అని వైద్యులు వెల్లడించారు. తిండిపెట్టకుండా కడుపు మాడ్చి, శారీరకంగా హింసించడంతో ఆమె పక్కటెముకలు విరగడంతో అంతర్గత రక్తస్రావంతో ఆమె మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. ఆమె కంటి రెటీనాను పెరికివేయడంతో పాటు మరో కంటికి కూడా గాయం చేసినట్లు కోర్టు తెలిపిందని బుధవారం ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. 2018 జూలై నుంచి అక్టోబర్ వరకూ ఈ హింస కొనసాగినట్లుగా అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
యువకునిపై క్రూరత్వం
ఓ యువకుడిని దుండగులు క్రూరంగా హింసించారు. రాత్రి నుంచి ఉదయం వరకూ తీవ్రగాయాలతో కల్వర్టు వద్ద పడి ఉన్న అతడిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందా.. కుటుంబ కలహాల కారణంగా దారుణం చోటు చేసుకుందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. కళ్యాణదుర్గం: కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన సునీల్ అనే యువకుడు వ్యవసాయ పనులతోపాటు జీవాల వ్యాపారం చేసేవాడు. ఏడాది కిందట చెన్నంపల్లికి చెందిన నవితతో వివాహమైంది. వీరికి ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. సునీల్ శనివారం మధ్యాహ్నం కురాకులపల్లిలో అనంతపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి నరసింహప్పతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బెంగుళూరులో ఉన్న సోదరి విమలకు సమాచారం తెలియడంతో అదే రోజు సాయంత్రం 5.27 నిమిషాలకు సునీల్ సెల్ 95530 60686కు కాల్ చేసింది. ఫోన్ రింగైనా సమాధానం రాలేదు. తిరిగి రాత్రి 10.15 నిమిషాలకు మరోసారి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో మరింత ఆందోళనకు గురయ్యారు. చిత్రహింసలకు గురిచేసి..కల్వర్టు వద్ద పడేసి.. చెన్నంపల్లి సమీపాన తన మామ తోట దగ్గరలోని పేరూరు కెనాల్ కల్వర్టు కింద సునీల్ పడి ఉన్నాడు. చేతులు, కాళ్లు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి ఉంది. శరీరమంతా గుండు సూదులతో గుచ్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి నొప్పులతో మూలుగుతున్న సునీల్ దొర్లుకుంటూ కల్వర్టు బయటకు చేరుకున్నాడు. ఆదివారం ఉదయం చెన్నంపల్లికి చెందిన నరసింహులు, అమర్లు అయ్యంపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చి.. అక్కడి నుంచి పేరూరుకు వెళ్లే సమయంలో సునీల్ను గమనించారు. కట్లు విప్పి.. మూతికి వేసిన ప్లాస్టర్ను తీసేశారు. అనంతరం అతడి మామకు సమాచారం అందించి.. కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడు సునీల్ను సీఐ శివప్రసాద్, రూరల్ ఎస్ఐ నబీరసూల్లు వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నించినా అపస్మారకస్థితిలో ఉన్నందున ఫలితం లేకపోయింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై అనుమానాలు సునీల్పై జరిగిన దాడి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెల వ్యాపార లావాదేవీల్లో విభేదాలు తలెత్తడం వల్ల ఈ విధంగా చేశారా..? నెల కిందటే పుట్టింటికి వెళ్లిపోయిన భార్యతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా దాడి జరిగిందా.. అని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. తన బంధువైన ఓ వ్యక్తి ఆర్థికలావాదేవీల విషయంలో ఇలా చేశారంటూ స్పృహలోకి వచ్చిన తర్వాత సునీల్ చెప్పడంతో కంబదూరు ఎస్ఐ రాగిరి రామయ్య సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
పెళ్లయిన ఆరు నెలలకే..
సాక్షి, మదనపల్లె క్రైం : పెళ్లయిన ఆరు నెలలకే ఓ యువతిని తన భర్త చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. బాధలు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో స్టేషన్ వద్దే దాడి చేశాడు. గాయపడిన ఆమెను బాధితురాలి కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుతోంది. వివరాలు .. బి.కొత్తకోట బి.సి కాలనీలో కాపురం ఉంటున్న సోనియా(20) అదే కాలనీకి చెందిన ముబారక్ను ఆరు నెలల కిందట రెండో పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల పాటు వారి కాపురం సజావుగా సాగింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో ముబారక్ మొదటి భార్య జబీనా సోనియాపై కక్షపెంచుకుని వేధిపులకు పాల్పడటం ప్రారంభించింది. భర్తకు లేనిపోనివి నూరిపోసి ఇద్దరు చిత్రహింసలకు గురిచేసి దాడి చేసింది. విసిగి పోయిన సోనియా బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. గమనించిన భర్త, మొదటి భార్యలు కలసి స్టేషన్ వద్దే సోనియాపై దాడిచేసి చితక బాదారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆమె తల్లి గౌషియా చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. -
నేరం చేసానని ఒప్పుకోమని హింసిస్తున్నారు
న్యూఢిల్లీ : ‘2008, మాలేగావ్ పేలుళ్ల కేసు’లో ప్రధాన నిందుతుడుగా శిక్ష అనుభవిస్తున్న మాజీ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ గతంలో రాసిన ఒక ఉత్తరం ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్లో కలకలం రేపుతుంది. మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందుతుడిగా మహారాష్ట్ర ‘యాంటి టెర్రరిజమ్ స్క్వాడ్’(ఏటీఎస్) కస్టడీలో ఉన్న సమయంలో ఏటీఎస్ అధికారులు తనను విపరీతంగా టార్చర్ చేస్తున్నారని 2013, డిసెంబర్లో ‘జాతీయ మానవ హక్కుల కమిషన్’కు ఓ 24 పేజీల లేఖ రాసాడు పురోహిత్. నావీ ముంబై జైల్లో ఏటీఎస్ కస్టడీలో ఉన్నప్పుడు వారు తనను బలవంతంగా నేరం ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. తాను ఏ నేరం చేయలేదని కానీ ఏటీఎస్ అధికారులు మాత్రం తనను కొట్టి, హింసించి తన చేత బలవంతంగా నేరం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు లేఖలో తెలిపాడు. కేవలం ఏటీఎస్ అధికారులు మాత్రమే కాక ఆర్మీ అధికారులు కూడా తనను హింసించారని, అంతేకాక తనచేత బలవంతంగా మరో ఆరుగురు అధికారుల పేర్లను కూడా చెప్పించారని పేర్కొన్నాడు. 2008, సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, మాలేగావ్లో జరిగిన ఈ పేలుళ్లలో ఏడుగురు మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అరెస్టయిన పురోహిత్కు గతేడాది సెప్టెంబర్లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పురోహిత్ రాజకీయ కుట్రల వల్లనే తాను తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపానని తెలిపాడు. పురోహిత్ రాసిన లేఖ గురించి పోలీసు అధికారులు ‘పురోహిత్ ఈ లేఖను 2013లో రాసాడు...అప్పుడే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయాన్ని దర్యాప్తు చేసింది. అంతేకాక పురోహిత్ లేఖలో పేర్కొన్న అధికారులు కూడా పురోహిత్ ఆరోపణలపై స్పందించార’ని పోలీసు అధికారులు తెలిపారు. -
పొట్టకూటి కోసం వెళ్లి ఇరుక్కుపోయింది
-
బెంగళూరులో గ్యాంగ్ వార్
-
మరో నయవంచకుడు
► ప్రేమించి పెళ్లి చేసుకున్నాక చిన్నచూపు ►తక్కువ కులం దానివంటూ చిత్రహింసలు ►అదనపు కట్నం కోసం గెంటివేత ► గర్భవతిని చేసి వదిలించుకునేందుకు కుట్ర ప్రేమించేటప్పుడు ఆమె కులం అడ్డు రాలేదు.. పెళ్లి చేసుకునే సమయంలోనూ ఆమె కులం, గోత్రం అడ్డు కాలేదు.. నెల తప్పాక ఆమె కులం గుర్తొచ్చింది. తక్కువ కులం దానివంటూ సూటిపోటు మాటలతో ఆమెను ప్రతి రోజూ చిత్రహింసలు పెడుతున్నాడు. చివరకు అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ అడ్డం తిరిగాడు. అందుకు ఆమె నిస్సహాయత స్థితిలో ఉండిపోయింది. గర్భిణి అనే విషయం మరచి ఆమెను ఇంటి నుంచి గెంటేశాడో నయవంచకుడు .కాగా అతని కుల పెద్దలు రాజకీయ పలుకుబడితో వారిద్దరినీ విడదీయాలని చూడటంచర్చనీయాంశమైంది. - గోరంట్ల గోరంట్లలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వనజ, వాల్మీకి వర్గానికి చెందిన తలారి బాలాజీ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. చేసేది లేక ప్రేమికులు కుల పెద్దలను ఆశ్రయించారు. దళిత, గిరిజ కుల సంఘాల పెద్దలతో పాటు వాల్మీకి సంఘం పెద్దల సమక్షంలో వారి పెళ్లి గత ఏడాది ఆగస్టు 28న గోరంట్లలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరిగింది. అప్పటి నుంచి వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇప్పుడామె ఐదు నెలల గర్భిణి. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సమయంలో... వనజ కడుపులో పెరుగుతున్న తన ప్రతిరూపాన్ని ఊహించుకుని ఆనందించాల్సిన బాలాజీ ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తన భార్య కులం గుర్తొచ్చింది. తక్కువ కులం దానివంటూ హేళన చేయడం ప్రారంభించాడు. అలా రోజురోజుకు అతని ప్రవర్తన శ్రుతిమించిపోతోంది. ‘కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా.. నిన్ను వదిలించుకుంటే దండిగా డబ్బులు ఇచ్చే వారున్నారంటూ’ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయిన వారందరినీ వదులుకుని వచ్చిన ఆమెకు అప్పటికి జ్ఞానోదయం కాలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినోడి మనసులోని దుర్భుద్ధిని పసిగట్టలేకపోయింది. తెలుసుకునేలోగానే ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. తిరిగి పుట్టింటికి చేరిన ఆమె న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. భర్త బాలాజీ, అత్తమామలు చెన్నమ్మ, కదిరప్ప, ఆడబిడ్డ ఇందిరమ్మ, ఆమె భర్త నాగరాజు(వీరిద్దరిది సోమందేపల్లి)పై కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసును నీరుగార్చేందుకు బాలాజీ సామాజిక వర్గానికి చెందిన కొందరు పెద్దలు రాజకీయ పలుకుబడితో ప్రయత్నిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది -
తొమ్మిదినెలలు భర్త, మామ నరకం చూపించారు
జంషెడ్పూర్: లింగ నిష్పత్తిలో చాలా వ్యత్యాసాలున్న బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, హర్యానా, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో పెళ్లి పేరుతో జరుగుతున్న వ్యాపారం, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిదర్శనం ఈ ఘటన. 15 ఏళ్ల బాలికను పెళ్లిచేసుకున్న ఓ వ్యక్తి, తన తండ్రితో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 9 నెలల పాటు ఆమెకు నిత్యం నరకం చూపించారు. చివరికి బాధితురాలి సోదరి చొరవతో పోలీసులు బాధితురాలిని రక్షించారు. సునీత (మారుపేరు) జంషెడ్పూర్లోని ఓ మురికివాడలో పుట్టింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఈమె ఏనాడూ బడికి వెళ్లింది లేదు. సునీత తల్లి ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఈ నేపథ్యంలో హర్యానాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఆ కుటుంబాన్ని ప్రలోభపెట్టి, ఒక ఏజెంట్ ద్వారా లక్ష రూపాయలకు సునీతను కొనుక్కున్నాడు. తనకంటే 30 ఏళ్ల చిన్నదైన సునీతను బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ రాత్రి తండ్రితో కలిసి హింసించేవాడు. బెల్టుతో, చెప్పులతో తీవ్రంగా కొట్టేవారు. ఆమె హృదయ విదారకంగా రోదిస్తుంటే పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. తర్వాత ఇద్దరూ లైంగికదాడికి పాల్పడేవారు. ఇలా వారి అఘాయిత్యాలు 9 నెలల పాటు సాగాయి. చివరికి సునీతను పలకరించడానికి వచ్చిన ఆమె సోదరిపైనా దాడికి పాల్పడ్డారు. ఎలాగోలా బయటపడిన ఆమె స్థానిక స్వచ్ఛంద సంస్థ సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పెళ్లయిన మొదటి రోజు నుంచి భర్త, మామ తనను తీవ్రంగా హింసించేవారని, వారు కొట్టిన దెబ్బలతో తన ఒళ్లంతా హూనమయ్యేదని సునీత తెలిపింది. వదిలిపెట్టమని, పుట్టింటికి పంపించమని ఎంత వేడుకున్నా వినకుండా పైశాచికంగా ప్రవర్తించేవారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జార్ఖండ్ పోలీసులు ఆ మానవమృగాలను అరెస్ట్ చేయాలని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రిషికాంత్ డిమాండ్ చేశారు. ఏజెంట్ను కూడా అదుపులోకి తీసుకోవాలన్నారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక మహిళా పోలీసుస్టేషన్ అధికారి ప్రియాంక ఆనంద్ తెలిపారు. సునీతను మహిళా శిశు సంక్షేమ కమిటీ ముందు ప్రవేశపెడతామన్నారు. సునీత గర్భవతి అన్న వార్తల నేపథ్యంలో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం తరలించనున్నట్టు తెలిపారు. -
చిన్నారిపై యువకుని పైశాచికం..
మద్యం మత్తులోఒక యువకుడు ఐదేళ్ల బాలికను చిత్రహింసలకు గురి చేశాడు. చుట్టుపక్కల వారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కొత్వాల్ తెలిపిన వివరాలివీ.. రవి (22) అనే వ్యక్తి సికింద్రాబాద్లోని ఓ హోటల్లో కార్మికుడు. అతడు ధనలక్ష్మి అనే వివాహితతో సంబంధం పెట్టుకుని ఆమె కుమార్తె(5) సహా ఆదిత్యనగర్లో ఉంటున్నాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం ధనలక్ష్మి ఇంట్లో లేని సయమంలో రవి పీకలదాకా మద్యం తాగి వచ్చి ఆ చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొరుకుతూ.. రక్తం వచ్చేలా రక్కుతూ చిత్రహింసలు పెట్టాడు. బాధ తాళలేక చిన్నారి పెద్దగా ఏడవటంతో చుట్టుపక్కలవారు అక్కడికి వచ్చారు. రవి నిర్వాకాన్ని గమనించిన స్థానికులు అతడిని చితక బాదారు. అనంతరం మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోజుకు వందమంది భార్యా బాధితులు!
ఇండియాలో రేప్ కేసులకు ప్రధాన కేంద్రంగా మారిపోయిన ఢిల్లీలో ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగు చూసింది. మహిళల వేధింపులకు గురవుతున్న పురుషుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని ఈ కొత్త లెక్కలు చెప్తున్నాయి. బాధల్లో ఉన్న పురుషుల సమస్యలను తెలుసుకునేందుకు సుమారు సంవత్సరం క్రితం ఏర్పాటు చేసిన ఓ హెల్ప్ లైన్ నెంబర్ కు ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 40 ఎన్జీవో సంస్థల ద్వారా సుమారు 37 వేల ఫిర్యాదులు అందినట్లు ఆ సంస్థ చెబుతోంది. ఫిర్యాదుల్లో కొన్ని బోగస్ అయినా... రోజుకు సుమారుగా వంద కాల్స్ వస్తున్నాయని హెల్ప్ లైన్ లెక్కల్లో తేలింది. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ పేరున ఓ సంస్థ నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో చాలామంది బాధితులు తమకు చట్టబద్ధమైన పరిష్కారాలు దొరకడం లేదని చెప్పడం విశేషం. లైంగిక వేధింపులకు గురైన మగవారికి ఇండియన్ యాంటీ రేప్ చట్టం ఎటువంటి పరిష్కారం సూచించడం లేదని కౌన్సిలర్లు చెప్తున్నారు. రోజుకు దేశవ్యాప్తంగా ఫాల్స్ రేప్, ఫాల్స్ డౌరీ కేసుల్లో తమకు వస్తున్న సుమారు 110 కాల్స్ లో 65 నుంచి 70 శాతం బాధితులు కొత్తవారే అయి ఉంటున్నారని ఎస్.ఐ.ఎఫ్ కౌన్సిలర్ రిత్విక్ బిసారియా చెప్తున్నారు. తమకు వచ్చే డేటాను పరిశీలిస్తే ఎక్కువ శాతం కాల్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్నాయని, వాటిలో 55 నుంచి 60 శాతం హెల్ప్ లైన్ కు వస్తున్నాయని కౌన్సిలర్లు అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచీ వచ్చే కేసుల్లో ఎక్కువ శాతం తప్పుడు వరకట్న వేధింపుల కేసులు ఉంటున్నాయని మరో కౌన్సిలర్ అమిత్ లఖాని అంటున్నారు. అంతేకాక ఎస్.ఐ.ఎఫ్ కు వచ్చే పురుషుల కాల్స్ లో ఎక్కువ శాతం పని ప్రదేశాల్లో లైంగిక దాడులకు సంబంధించినవి కూడా అయి ఉంటున్నాయని కౌన్సిలర్లు అంటున్నారు. ''ఒక వ్యక్తి నుంచీ మాకు కాల్ వచ్చింది. అతడి భార్య.. అతడు పని చేస్తున్న సంస్థకు ఫోన్ చేసి... అతడిపై వేధింపుల కేస్ ఫైల్ చేసినట్లు చెప్పిందట. దాంతో సంస్థవారు అతడ్ని ఎటువంటి వివరాలు అడక్కుండానే రిజైన్ చేయమన్నారు'' అంటూ ఎస్.ఐ.ఎఫ్ కౌన్సిలర్ లఖాని తెలిపారు. ఢిల్లీలో న్యాయవాదిగా ఉన్న కులదీప్ బొబ్బర్ కూడా... సెక్షన్ 49-ఏ ను దుర్వినియోగం చేస్తున్న భార్యా బాధితుల కోసం ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సుమారు పది సంవత్సరాలుగా కనీసం నెలకు 50 నుంచి 60 కాల్స్ బాధితులనుంచి వస్తుంటాయని ఆయన చెప్పారు. ''ఇంటినుంచీ గెంటివేయబడ్డ ఓ వ్యక్తి నుంచీ నాకు కాల్ వచ్చింది. ఇంటిని తన పేరున మార్చుకున్న భార్య అతడిని ఇంటినుంచీ గెంటి వేసిందట. కనీసం తన పిల్లలను కూడా చూసేందుకు ఆమె...భర్తను రానివ్వడం లేదట. అంతేకాదు అతడిపై 25 వేధింపుల కేసులు కూడా బుక్ చేసిందట'' అంటూ న్యాయవాది కులదీప్ బొబ్బర్ ఓ బాధితుడి కేసును ఉదహరించారు. ఇటువంటి కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయని.. ఇప్పటికైనా పురుషులపై వేధింపుల విషయంలోనూ కళ్ళు తెరవాలని ఆయన సూచిస్తున్నారు. అలాగే ఢిల్లీకి చెందిన మరో బాధిత మహిళల హెల్స్ లైన్ కు కూడా భార్యా బాధితులు కొందరు ఫోన్లు చేస్తున్నారని చెప్తోంది. సాధారణంగా అటువంటి కాల్స్ ...ఫాల్స్ డౌరీ కేసులై ఉంటున్నాయని వాటిని మరో హెల్స్ లైన్ కు పంపిస్తున్నామని వారు చెప్తున్నారు. జర్నలిస్ట్, ఫిలిమ్ మేకర్ అయిన దీపికా భరద్వాజ్... సెక్షన్ 49-ఏ ను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఓ డాక్యుమెంటరీ కూడా తీస్తున్నారట. ఎటు చూసినా మానవ సంబంధాలు కరువైపోతున్న నేటి తరుణంలో బాధిత మహిళలకు న్యాయంపై ఎన్నో చట్టాలు ఉన్నాయని,... జీవిత భాగస్వాములైన మహిళలు, సహోద్యోగినుల వల్ల వేధింపులకు గురౌతున్న మగవారికి మాత్రం కనీస న్యాయం జరగడం లేదంటున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ బాధితులు ఎంతోమంది కాల్స్ చేస్తుంటారని, మహిళలవల్ల వేధింపులకు గురై.. న్యాయం దొరకక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నవారి శాతం నానాటికి పెరుగుతోందని ఆమె చెప్తున్నారు. అందుకే బాధిత పురుషులకు హెల్ప్ లైన్లు ఎంతో అవసరమని దీపిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
నాలుగేళ్ల బాలుడిపై బంధువు దాష్టీకం
-
పిన్ని కాదు పిశాచి!
-
బెదిరించి పది నెలలుగా లైంగిక దాడి..
బెంగళూరు: పొట్టకూటి కోసం వెళ్లిన 16 ఏళ్ల బాలికను లైంగిక బానిసగా మార్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన వ్యాపార భాగస్వామి ఇంట్లో బేబీ సిట్టర్గా పని చేస్తున్న ఆమెపై పది నెలల పాటు లైంగికంగా దాడిచేసి అమానుషంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. ఈ విషయం బయటపెడితే పేస్తానని బెదిరించి సుమారు ఏడాది పాటు ఆ బాలికకు నరకాన్ని చూపించాడు. సహనం నశించిన ఆ బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్కు చెందిన ముగ్గురు సభ్యుల పేద కుటుంబాన్ని.. ఓ మహిళా వ్యాపారవేత్త 2014 ఏప్రిల్లో బెంగళూరుకు తీసుకొచ్చింది. ఫ్యాషన్ బిజినెస్ నడిపే ఆమె తన పిల్లలను చూసుకునేందుకు బాలికను పనిలో పెట్టుకోగా, తల్లిదండ్రులు రోజువారీ కూలీ కార్మికులుగా పని చేసుకుంటున్నారు. వ్యాపార పనుల్లో భాగంగా ఆ మహిళా వ్యాపారవేత్త బెలగావ్కి మారుతూ తనతోపాటు ఆ బాలికను కూడా తీసుకెళ్లింది. అయితే ఆ మహిళకు వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న సుఖవిందర్ సింగ్ ... బాలికపై కన్నేశాడు. వ్యాపార భాగస్వామి ఇంట్లో లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. అలా పది నెలలపాటు తన దురాగతాన్ని కొనసాగించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అతని హింసను తట్టుకోలేని ఆ బాలిక తనను ఇంటికి పంపించెయ్యమని చాలాసార్లు యజమానికి మొరపెట్టుకుంది. అయినా ఆమె పట్టించుకోలేదు. పైగా పిచ్చి పిచ్చి కథలు అల్లుతున్నావని మండిపడింది. అంతేకాకుండా దొంగతనం కేసు పెట్టి ఇరికిస్తానని బెదిరించింది. దీంతో ఎలాగోలా ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. బాలికను వేధిస్తున్న ఘటన తమ దృష్టికి రావడంతో బెలగావిలోని ఇంటిపై దాడిచేసి ఆమెను రక్షించినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిపై ఐపీసీ5 (L) , పోస్కో చట్టం 376 లోని 6 తదితర సెక్షన్ల కింద నమోదు చేసినట్లు చెప్పారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని, ప్రాథమిక దర్యాప్తు అనంతరం బెలగావి పోలీసులకు కేసును బదిలీ చేస్తామని తెలిపారు. -
యువతిని నిర్బంధించి చిత్రహింసలు
నెల్లూరు(నవాబుపేట) : ఓ యువతిని నిర్బంధించిన వ్యక్తి ఆమెను చిత్రహింసలు పెట్టి బుజబుజనెల్లూరు సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లికి చెందిన ఓ యువతి(17)కి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. ఆమె తన పెదనాన్న వద్ద ఉంటూ ఆత్మకూరులోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన షేక్ బాషా, మస్తానమ్మ కుమారుడు షఫీ వివాహితుడు. అయితే కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీ నుంచి ఆమె అదృశ్యమైంది. ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ రోజు నుంచి ఆమెను షఫీ తన ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టసాగాడు. ఈ క్రమంలోనే ఆమె బుజబుజనెల్లూరు సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పురుగుల మందు తాగి పడిపోయింది. అయితే షఫీ నెల్లూరులోని తన స్నేహితుడికి ఈ విషయం చెప్పి ఆమెను ఆస్పత్రిలో చేర్పించాలని సూచిం చాడు. షఫీ స్నేహితుడు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చిన అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు నెల్లూరుకు చేరుకుని ఆమె పరిస్థితి చూసి కన్నీరుమున్నీరయ్యారు. షఫీతో పాటు అతడి తల్లిదండ్రులు, అన్నా, వదిన తమ బిడ్డను చిత్రహింసలు పెట్టారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. జుట్టును కొంత భాగం కత్తిరించడంతో పాటు చిత్రహింసలు పెట్టి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.