Venugopala Krishna
-
చంద్రబాబుది నియంత పాలన
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వ అరాచకం కట్టలు తెంచుకుంటోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎం చంద్రబాబు కక్షలతో రాజకీయ ప్రత్యర్థులను, కళాకారులను, విశ్లేషకులను అరెస్టు చేస్తూ నియంత పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. వేణుగోపాలకృష్ణ గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుతో చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు పతాక స్థాయికి చేరాయన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కొన్ని నెలల క్రితమే పోసాని ప్రకటించారని తెలిపారు. గొంతు ఆపరేషన్ చేయించుకున్నారని, అనారోగ్యంతో ఉన్నారని, అయినా చంద్రబాబు సర్కారు క్రూరంగా అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
టీడీపీ బీసీ వ్యతిరేక పార్టీ: వేణు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ఎన్నికల హామీల్లో భాగంగా కల్లుగీత కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో 20 శాతం కేటాయించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాజాగా కల్లుగీత కార్మికులకు కేవలం 10 శాతం మేరకే మద్యం దుకాణాలను కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని అన్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్లుగీత కార్మికులపై తెలుగుదేశం నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని తెలిపారు.చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇంకా ఏం మాట్లాడారంటే..:గీత కార్మికులకు చంద్రబాబు మోసం:మద్యం పాలసీలో భాగంగా ఎన్నికలకు ముందు కల్లుగీత సొసైటీలకు 20 «శాతం మద్యం దుకాణాలు కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిందాన్ని విస్మరించి కేవలం 10 శాతం దుకాణాలను మాత్రమే గీత కార్మికులకు కేటాయిస్తూ తాజాగా జీఓ జారీ చేశారు. ఇది బీసీలను అన్యాయం చేయడం, మోసం చేయడం కాదా? ఆ 10 శాతం దుకాణాలు కూడా సక్రమంగా మద్యం విక్రయాలు లేని చోట్ల, దుకాణాలకు నష్టాలు వస్తున్న చోట్లను ఎంపిక చేసీ గీత కులాలకు అంటగడుతున్నారు. మద్యం విక్రయాల్లో మార్కెట్ బాగున్న చోట్ల దుకాణాలను కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు ౖMðవసం చేసుకున్నారు.బీసీల పట్ల టీడీపీ చిన్నచూపు:కల్లుగీత సొసైటీల్లో పని చేస్తున్న గీత కార్మికులకు కల్లు విక్రయాలు తగ్గిపోయి, ఉపాధి కొరవడుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయం చూపించేందుకే మద్యం దుకాణాలను కేటాయిస్తున్నామని చెబుతున్నారు. అటువంటప్పుడు మద్యం పాలసీని ప్రకటించి, దుకాణాలకు టెండర్లు పిలిచిన సందర్భంలోనే గీత కార్మికులకు ఎందుకు దుకాణాలను కేటాయించలేదు? దీనికి ఆరు నెలల సమయం కావాల్సి వచ్చిందా? మాచర్లలో లైసెన్స్ కోసం ఒక కల్లుగీత కార్మికుడు వెడుతుంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనివాసరెడ్డి బెదిరింపులకు గురి చేసిన సంగతి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించారు.దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయింది. మద్యం దుకాణాల నుంచి పైవాళ్లకు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. మద్యం దుకాణాలకు వేలం కోసం దరఖాస్తు చేసే సమయం నుంచి వారికి కేటాయింపులు జరిగితే స్థానిక ఎమ్మెల్యేలకు లాభాల్లో వాటాలు ఇవ్వాలి. బెల్ట్ షాప్లు నిర్వహించుకునేందుకు దగ్గర ఉండి వేలం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఇప్పుడు లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్న వారిపైన కూడా దౌర్జన్యాలకు పాల్పడటం బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిన్నచూపుకు నిదర్శనం.బీసీ రిజర్వేషన్లపైనా పచ్చి అబద్దాలు:స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారంటూ ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాశారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ, ఆ సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపలేదు. 2019లో సీఎం అయిన శ్రీ వైయస్ జగన్, బీసీలకు అదే 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో చంద్రబాబు తన అనుయాయుడు సుధాకర్ రెడ్డి చేత పిల్ వేయించి రిజర్వేషన్లు దక్కుండా కుట్రలు చేయడం వల్ల 24 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిపించాల్సిన పరిస్థితి కల్పించారు. ఇప్పుడు అదే చంద్రబాబు బీసీలకు మేలు చేసే నేతగా ఎల్లో మీడియా చిత్రీకరిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో ఉంది. చంద్రబాబు బీసీల విషయంలో చెబుతున్న ప్రతిమాటా ఒక అబద్దమే.జాకీ మీడియా తప్పుడు కథనం:చంద్రబాబు అబద్దాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది. దీనిలో భాగంగానే ప్రతికలో బీసీలపై వైసీపీ కత్తి’ అనే శీర్షికన ఒక వార్తను ప్రచురించారు. తెలుగుదేశం పాలనలో బీసీలపై ఎంత నీచంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. తమ సమస్యలను ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు వివరించేందుకు ఆనాడు సచివాలయంకు వెళ్ళిన నాయీబ్రాహ్మణులను మీ తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తాను అని, మత్స్యకారులు వెడితే వారిని తోలు తీస్తాను అని చంద్రబాబు హెచ్చరించిన సంగతి రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గుర్తు చేశారు. -
సాగునీటి సంఘాల ఎన్నికల్లో ‘కూటమి’ బరితెగింపు: చెల్లుబోయిన వేణు
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో నీటిసంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా, కనీస పారదర్శకత లేకుండా నీటిసంఘాల ఎన్నికలను ఏకపక్షంగా ఈ ప్రభుత్వం నిర్వహించిందని మండిపడ్డారు.ఇంకా ఆయన ఎమన్నారంటే..రాష్ట్రంలో సాగు నీటిసంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించామంటూ కూటమి పార్టీలు చెప్పుకుంటున్నాయి. అధికార బలంతో, పోలీసు యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కనీస పారదర్శకతకు చోటు లేకుండా నిరంకుశంగా, తమకు అనుకూలంగా ఈ ఎన్నికలను నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఈ సంఘాలకు నిర్వహించే ఈ ఎన్నికల్లో ఎవరైనా రైతులు టీసీ (ప్రాదేశిక నియోజకవర్గం) సభ్యుడిగా పోటీ చేయాలనుకుంటే, నీటి బకాయిలు పూర్తిగా చెల్లించి ఉండాలి.ఆ మేరకు వీఆర్ఓ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవాలి. ఇది తప్పనిసరి. అది ఉంటేనే నామినేషన్ అనుమతిస్తారు. లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వైయస్ఆర్ సిపికి చెందిన వారు ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకు విఆర్వోలను అందుబాటులో లేకుండా చేశారు. ఎమ్మార్వో కార్యాలయాల్లో విఆర్వోలను ఉంచి, నోడ్యూస్ కోసం వచ్చిన వారిని పోలీసులతో బెదిరించి వెనక్కి పంపించారు.న్యాయస్థానం ఉత్తర్వులను కూడా గౌరవించలేదుసాగునీటి సంఘాలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా కూటమి ప్రభుత్వం గౌరవించలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీపై కక్షసాధించాలనే ఉద్దేశం, ఏదో ఒకరకంగా ఈ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రయత్నించింది. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తప్పుడు విధానాలకు వినియోగించుకుంది. దీనిని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడ్డారు. ఈ అరాచకాలను ప్రజలకు తెలియచేసేందుకు ప్రయత్నించిన మీడియాపై కర్కశంగా భౌతికదాడులకు తెగబడ్డారు. ఇటువంటి దారుణాలతో గెలిచి, ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం పాల్జేశారు. పైగా పులివెందుల్లో గెలిచామని చెప్పుకుంటూ, ఇదంతా తమ గొప్పతనంగా చాటుకోవడం సిగ్గుచేటు.ఏకగ్రీవాలే లక్ష్యంగా పనిచేశారుఇతర పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేకుండా, గ్రామసచివాలయాల్లో నోడ్యూస్ సర్టిఫికేట్ లు ఇవ్వకుండా కుట్రలకు పాల్పడ్డారు. ఇటువంటి దుర్నీతికి నిరసనగానే వైఎస్సార్సీపీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు సంబంధించి శనివారం రహస్య ఓటింగ్ పద్దతికి తిలోదకాలిచ్చి ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది.వీఆర్వోలను అందుబాటులో లేకుండా చేశారుఈ ఎన్నికలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వీఆర్ఓలు అంతా గ్రామ సచివాలయాల్లో ఉండాలి. కానీ చాలా మంది వీఆర్ఓలు ఫోన్లు స్విచాఫ్ చేసి కూర్చున్నారు. ఇంకా అందరు వీఆర్ఓలను మండల ఆఫీస్కు తీసుకుపోయి, నిర్భంధం చేశారు. బయట పోలీసులను కాపలగా పెట్టారు. వారిని రెండు రోజుల పాటు మండల ఆఫీస్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? వారిని అక్కడ జైల్లో ఖైదీలుగా ఉంచినట్లు ఉంచారు. ఏ రైతు కూడా తమ వీఆర్ఓను కలిసే వీలు లేకుండా చేశారు. అలా వీఆర్ఓలు ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కుట్ర చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్యకాండరాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యకాండను కొనసాగించింది. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కళ్లెంపూడిలో బీజేపీ నాయకుడు కోన మోహన్రావు నామినేషన్ వేసేందుకు కళ్లెంపూడి ఎంపీపీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా, ఆయన్ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలను పైకి విసిరారు. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డీఈ పి.శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా టీడీపీ నాయకుల ఒత్తిడితో డీఈ పట్టించుకోలేదు.పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరి తెగించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘును, అభ్యర్థి దగుమాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్కు తరలించి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు హుటాహుటిన స్టేషన్కు చేరుకుని, తమపార్టీ నాయకులను అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్కు తీసుకువచ్చారని నిలదీసినా ప్రయోజనం లేకపోయింది.కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నిక నామినేషన్ పత్రాలను చించేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తమ మాట వినలేదని టీడీపీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలింగ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లుమర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తొనుకుమాల రెండు చెరువులకు సంబంధించి పోటీ చేసిన రైతు చక్రపాణిరెడ్డిని అడ్డుకున్నారు. దాదాపు జిల్లా అంతటా టీడీపీ కూటమి నాయకులు చెప్పిన విధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారు. నెల్లూరు జిల్లా కుడితిపాలెంలో టీడీపీ నేతలు అరాచకాలు చేశారు. పద్మమ్మ అనే మహిళా రైతు గెలిచినా.. టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు..మాజీ ఎమ్మెల్యేపై నోరుపారేసుకున్న సీఐ ‘రే.. నువ్వు నన్నేమీ చేసుకోలేవు.. ఏమి చూస్తావు.. ఏమి చేస్తావు రా.. ఇక్కడి నుంచి దెం..యి’ అంటూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కర్నూలు సీసీఎస్ సీఐ ఇబ్రహీం దుర్భాషలాడారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది.ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడటానికి వెళ్లడంతో పోలీసులు ఇలా ‘పచ్చ’ నేతల్లా వ్యవహరించారు. దీంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైంది. కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం బ్రహ్మణదొడ్డిలో టీడీపీ నేత డి.విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలను లాక్కొని చింపి వేశారు. చేతకాని దద్దమ్మ ప్రభుత్వంఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్నికలు చేయడం చేతకానితనం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే, రైతులు ఓటు వేసి ఉంటే, టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ను చొక్కా విప్పి కూర్చోబెట్టి ఉండేవారు. మా పార్టీ సానుభూతిపరులు పోటీ చేస్తే, ఓడిపోతామని చెప్పి, రైతులకు నోడ్యూస్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. వీఆర్ఓలు గ్రామ సచివాలయాల్లో ఉండకుండా, వారిని ఎందుకు మండల ఆఫీస్ల్లో బంధించి ఉంచారు.చివరకు కవరేజ్కు వచ్చిన మీడియాపైనా వైఎస్సార్ జిల్లా వేములలో దాడి చేశారు. ఇన్ని పనులు చేసి, నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం ఎవరూ రాలేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్క పులివెందులలోనే కాదు, జమ్మలమడుగులో కూడా అదే పని చేశారు. వీఆర్ఓలు అందరినీ తీసుకెళ్లి, దేవగుడిలో బంధించారు. ఇది వాస్తవం కాదా? అధికారుల తప్పులు, వారు దగ్గరుండి చేయించిన పొరపాట్లకు శిక్ష అనుభవించక తప్పదు. సాగు నీటి ఎన్నికల్లో టీడీపీ గెలుపు అస్సలు గెలుపే కాదు.. చంద్రబాబు జీవితంలో ఇదో చీకటి అధ్యాయం.. ఎన్నికలు పెట్టకుండా.. టీడీపీ నేతలే చంద్రబాబు నామినేట్ చేసుకుని ఉంటే బాగుండేది. -
డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు ..
-
కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు, హత్యలు
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం రూరల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు.తప్పు చేయమని చంద్రబాబే చెప్తారు.. నేరాలు కట్టడి చేస్తున్నట్టు నాటకాలాడతారు.. అలా అని పచ్చ పత్రికల్లో రాయిస్తారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, కూటమి నేతలు రూ.కోట్లు కొల్లగొట్టేందుకు వారికి అనుకూలమైన మద్యం, ఇసుక పాలసీలను రూపొందించారని ఆరోపించారు. మద్యం షాపులు దక్కించుకునేందుకు టెండర్ వేసే వారి నుంచి 30 శాతం వాటా ఇవ్వాలని బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. వీటన్నింటిపై ప్రశ్నించాల్సిన పవన్ ఏమైపోయారని ప్రశ్నించారు. 80 లక్షల టన్నుల ఇసుక ఏమైంది..? రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేస్తే.. కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడ్డారని వేణు విమర్శించారు. ఇదంతా సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే జరిగిందన్నారు. నూతన మద్యం, ఇసుక పాలసీ టీడీపీ, కూటమి నేతలు బాగుపడేందుకు తెచ్చినవేగానీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సంపద సృష్టిస్తానన్న బాబు.. కార్యకర్తల బాగు కోసం సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు.కేవలం రెండు రోజుల్లోనే ఇసుక టెండర్లు ఎలా పూర్తిచేస్తారని ప్రశ్నించారు. సామాన్యులకు టెండర్లు వేసే అవకాశం లేకుండా చేశారన్నారు. గతంలో రూ.10 వేలకు వచ్చే ఇసుక.. ప్రస్తుతం రూ.30 వేలు పలుకుతుందంటే.. అది ఉచితమా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అప్పులను పదే పదే ప్రస్తావించిన చంద్రబాబు.. అప్పులతోనే ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక కొరతకు కారణమేంటన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలని సూచించారు. -
‘చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజలకు కష్టాలు’
తూర్పుగోదావరి, సాక్షి: పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచించారని, దాని వల్లే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. దీనికి తోడు తన అనాలోచిత నిర్ణయాల వల్ల మరింత నష్టం తెచ్చిపెట్టారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వేణుగోపాలకృష్ణ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వాలు జాగ్రత్తగా పని చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చటానికి తనకున్న మీడియా బలాన్ని ఉపయోగిస్తోంది. దీనివల్ల ఇబ్బంది పడేది ప్రజలే. 2014లో రాష్ట్రం కోల్పోయిన ఆదాయం పోలవరం పూర్తి అయితే వస్తుందని ఆశించాం. కానీ, అలా జరగలేదు. బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రాన్ని విడదీసేది సమయంలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. టీడీపీకి సహాయంగా ఉన్న జనసేన కూడా కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు ఇచ్చి పూర్తి చేయాలి’’ అని అన్నారాయన. చంద్రబాబుపై ఫైర్.. 2016 మే 2 న పోలవరం పనులు ప్రారంభించిన సమయంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రమే చేపడుతుందని ప్రకటించారు. పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచించారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో నష్ట పోయారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా ఆర్ అండ్ ఆర్ గురించి కూడా ఆలోచించాలి. కాపర్ డ్యామ్ చేపట్టే నాటికే స్పిల్ వే పూర్తయి ఉండాలి. కానీ, కాపర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు ను చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ నేరుగా ఆరోపించారు. చంద్రబాబు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం భారీగా ప్రజాధనాన్ని నష్టపోయింది. చంద్రబాబు ఈ ప్రాజెక్టులో వచ్చే ఆదాయాన్ని గురించి మాత్రమే ఆలోచించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండా చంద్రబాబు అనాలోచితంగా తీసుకున్న చర్యల వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అని వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు. -
జోగి రాజీవ్ అరెస్ట్ పై.. చెల్లుబోయిన వార్నింగ్
-
మేమంతా సిద్ధం బస్సుయాత్రకు విశేష స్పందన: చెల్లుబోయిన వేణు
-
ఆ మాటలు గుర్తున్నాయా చంద్రబాబూ.. మంత్రి వేణు ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు బీసీల ద్రోహి అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ‘‘నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నాడు. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నాడు. తన అన్న మాటలను మరిచిపోయి ప్రజలు దగ్గరికి వచ్చి సూక్తులు చెబుతున్నాడంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు. ‘‘తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి. ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు ఎలా చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదు. చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా?. తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా.? 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు..?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘బీసీలకు పెన్షన్ పెంపు అని చెబుతున్నావు.. ఇదో పెద్ద అబద్ధం.. జన్మభూమి కమిటీలతో నువ్వు చేసిన వికృత క్రీడలు జనం మర్చిపోలేదు. ఐదేళ్ల నీ పరిపాలన కాలంలో పెన్షన్ పెంపు గురించి ఆలోచించావా.. సీఎం జగన్ పింఛన్లు పెంచితే దానిపై అక్కసు చూపిస్తావా.. మీ పార్టీ ఏనాడైన బీసీలకు రాజ్యసభ స్థానాలు కేటాయించావా?. ఇవాళ సీఎం జగన్ నలుగురు బీసీలకు రాజ్యసభ స్థానాలు ఇచ్చారు. సోషల్ ఇంజనీరింగ్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక సీటు శెట్టిబలిజలకు కేటాయించలేకపోయాడు. రెండు సామాజిక వర్గాలను విడదీసి నీ పబ్బం గడుపుకుంటున్నావ్. కులాల మధ్య గొడవలు సృష్టించడం ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం నీ ఆలోచన. ఫీజు రీయింబర్స్మెంట్ సగానికి సగం తగ్గించి బీసీలను ఉన్నత విద్యకు దూరం చేయాలనుకున్నావు’’ అంటూ మంత్రి వేణు దుయ్యబట్టారు. -
ఈసీకి కంప్లైంట్ పై చెల్లుబోయిన ఫైర్
-
లిస్ట్ విడుదలపై చెల్లుబోయిన ఫస్ట్ రియాక్షన్
-
బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమే
-
బీసీలను అణచివేసింది చంద్రబాబే: మంత్రి వేణు
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని.. బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కీలకమైన శాఖలన్నీ బీసీల వద్దే ఉన్నాయన్నారు. సీఎం జగన్ పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో ఉన్నారన్న మంత్రి వేణు బీసీలను అణచివేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. విజయవాడ: ప్రతిపక్షాలు కూటములుగా ఏర్పడి నీచ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వారాల అబ్బాయిలాగా అప్పుడప్పుడు సినిమా సెలవుల్లో విజయవాడ వస్తాడంటూ ఎద్దేవా చేశారు. ‘‘175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని పార్టీ జనసేన. పవన్ పదేళ్ల రాజకీయ జీవితంలో అనుసరించిన ఎజెండా ఏంటో ఎవరికీ తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కేఏ పాల్తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు. ప్రజల ఎజెండా లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్.. చంద్రబాబులు. సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. రాజకీయాల్లో మాత్రం పూర్తిగా జీరో అయ్యాడు. పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్. నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదు’’ వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. -
బాబు,పవన్ను ఏకిపారేసిన చెల్లుబోయిన
-
ఓట్ల కోసం కాదు ఏపీలో కులగణనపై మంత్రి క్లారిటీ
-
చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్ట్రాంగ్ కౌంటర్
-
అందుకే చంద్రబాబు, పవన్ భయపడుతున్నారు: మంత్రి వేణు
సాక్షి, తూర్పుగోదావరి: కుల గణనపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలని, అవగాహన రాహిత్యంతో పవన్ కులగణనపై వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేస్తున్నాం. బీహార్లో కులగణనపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కులగణన జరుగుతుంది. రాష్ట్ర పౌరుల సామాజిక, విద్యా, నివాస స్థితి తెలుసుకోవడంలో తప్పేముంది?. చంద్రబాబు, పవన్ కుల గణనతో భయపడుతున్నారు. అందుకే ఇలాంటి ప్రశ్నలు చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కులగణన ఎక్కడ జరగలేదు. ఏపీలో మాత్రమే సాహసోపేతంగా చేస్తున్నాం’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. సామాజిక, న్యాయ, రూప శిల్పం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజున రాష్ట్రంలో కులగణన చేపట్టాం. రాష్ట్రంలో 67 శాతం కుల గణన పూర్తైంది. కోటి 20 లక్షల కుటుంబాలకు ఇప్పటికే కులగణన పూర్తయింది. కులగణన జరిగితే బీసీలు టీడీపీకి దూరమవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు.. జనసేన కార్యకర్తలను మోసం చేయడానికే టికెట్లు ముందు ప్రకటించారు. చంద్రబాబు ఎనౌన్స్ చేసే సీట్ల సంఖ్యకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ అదే సంఖ్య ప్రకటించే ధైర్యం ఉందా?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘15 లేదా 20 సీట్లలో పవన్ కళ్యాణ్ దిగజారి పోటీ చేస్తారు. అంతకు మించి ఏమీ లేదు. సీఎం జగన్ని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు తప్పితే ప్రజలపై చిత్తశుద్ధి లేదు’’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్ మరో నాటకం -
రోత రాతల రామోజీ.. మంచి జరిగితే నచ్చదా?: మంత్రి వేణు
సాక్షి, విజయవాడ: ఈ సమాజం ఎదగకూడదనేదే ఈనాడు పత్రిక ఆలోచన అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రామోజీకి మంచి జరిగితే నచ్చదని, చంద్రబాబుకు మద్దతుగా రాసేవన్నీ రోతరాతలేనని మత్రి దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమ్మ ఒడితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగిందని, ఈ సమాజానికి నీ రాతల వల్ల ఇచ్చే సందేశమేంటి రామోజీ.. అంటూ పశ్నించారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలను రాయడమే నీ పనా.. 2024లో నీ రోత రాతలకు కాలం చెల్లుతుంది. లక్షలాది మంది వస్తే తట్టుకోలేక తప్పుడు వార్తలు రాస్తావా? బాధ్యత మరిచి వార్తలు రాస్తున్న ఈనాడుని బహిష్కరించే రోజులు దగ్గర్లో ఉన్నాయ్. ఈనాడు వార్తలు అంబేద్కర్ను అవమానించినట్లుగానే మేం భావిస్తున్నాం. ఈనాడు పత్రిక తక్షణమే డా.బి.ఆర్.అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలి’’ అని మంత్రి వేణు మండిపడ్డారు. -
చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు: మంత్రి వేణుగోపాలకృష్ణ
-
కులగణన చారిత్రాత్మక నిర్ణయం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
-
చంద్రబాబు, టీడీపీ నేతలపై మంత్రి వేణుగోపాల కృష్ణ ఫైర్
-
ఏపీ ప్రజలకు శుభవార్త.. మరో కొత్త పథకం..!
-
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!
-
శ్రీవారి సన్నిధిలో పలువురు ప్రముఖులు..!
-
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వేణుగోపాల కృష్ణ
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ స్వాగతం పలికారు. మంత్రి ముందుగా తులాభారం మొక్కులు తీర్చుకుని, ధ్వజ స్తంభమునకు మొక్కిన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా డిప్యూటీ ఈవో తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. -
పేదవర్గాలకు భరోసాను కల్పించే అద్భుతమైన బడ్జెట్ ఇది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో గురువారం రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ 2023-24 సంవత్సరానికి 2 లక్షల 79వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద వర్గాలకు భరోసాను కల్పించే బడ్జెట్గా రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, బీసీ సంక్షేమం,, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి సిహెచ్. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదరికంపై పోరాటం చేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పేదల సంక్షేమానికి మంచి బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. ఈ బడ్జెట్ ప్రసంగాన్ని వినకుండానే బడ్జెట్ను చూడకుండానే ప్రతిపక్ష సభ్యులు సభలో గొడవ చేసి సభ నుండి సస్పెండ్ చేయించుకుని వళ్ళిపోడవం చాలా దురదృష్టకరమని దీనిని ప్రజలు గమనించాలని సూచించారు.బడ్జెట్ ప్రసంగం అయ్యాక బాధ్యత గల ప్రతిపక్షంగా వారి అభిప్రాయాలను తెలియ జేయవచ్చు గాని ఆవిధంగా చేయకుండా ముందుగానే సభ నుండి వెళ్ళిపోయారని చెప్పారు. ప్రస్తుత బడ్జెట్లో 2లక్షల 79 వేల కోట్ల రూ.లు బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని ఏకంగా 80 వేల కోట్ల రూ.లు కేటాయించడం అభినందనీయమని మంత్రి వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. అదే విధంగా వ్యవసాయ రంగానికి కూడా అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి 43వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. బడ్జెట్లో అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యతను కల్పించడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలులో ముఖ్యంగా సంక్షేమ పధకాలు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకే అందేలా ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)విధానం ద్వారా అర్హులైన పేదలందరికీ అందేలా చేయడం జరుగుతోందన్నారు.పేదరిక నిర్మూలకు ధనం,విద్య అత్యంత ప్రధానం అని భావించి ఆదిశగా పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు, మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి తగిన రీతిలో నిధులు కేటాయిండం అభినందనీయమని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బీసీలు, బడుగు బలహీన వర్గాల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఏపీ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు అంశాలకు ఆమోద ముద్ర పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. దీనిలో భాగంగా కేబినెట్ భేటీ అనంతరం మంత్రి వేణు గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి జగన్ను మంత్రులు అభినందించారని వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాట బృందానికి ముఖ్యమంత్రి కేబినెట్లో అభినందనలు తెలిపారన్నారు.. ఏప్రిల్ 1వ తేదీన ఆర్బీఐ సెలవు, రెండో తేదీన ఆదివారం కావడంతో ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ 3వ తేదీన ఉంటుందన్నారు. విశాఖను రాజధానిగా ఆహ్వానించారు పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర మంత్రులు కూడా విశాఖను రాజధానిగా ఆహ్వానించిన విషయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ మరోసారి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లోనూ విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని చెప్పారన్నారు. ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా టీడీపీ సభ్యులు ఎందుకు వెళ్లిపోయారో అర్థం కాలేదన్నారు మంత్రి. వారు రాజకీయ పరిణితి కోల్పోయినట్లు కనిపిస్తోందని, పోలవరంలో తప్పులు చేసింది చంద్రబాబేనన్నారు. ఏపీ కేబినెట్లో ఆమోదించిన పలు అంశాలు ఇవే.. జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది.. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్ అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు - 2023 కు ఆమోదం ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక నాయీ బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు. పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం -
చంద్రబాబుకు ఆ మాట చెప్పే ధైర్యం ఉందా?: మంత్రి వేణు
సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ‘‘అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే. రుణ మాఫీపై రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు?. బాబు అబద్ధాలు విని మోసపోయిన ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. చంద్రబాబు ఏనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు’’ అని మంత్రి దుయ్యబట్టారు. ‘‘పెత్తందార్ల కోసం చంద్రబాబు, ఎల్లో మీడియా పని చేస్తోంది. లోకేష్ పాదయాత్ర వలన ఎవరికీ ప్రయోజనం లేదు. పవన్, చంద్రబాబు చేసే కుట్ర రాజకీయాలను ప్రజలు గుర్తించారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను ఎంతగా పీడించారో అందరికీ గుర్తుంది. ఈ రోజు అలాంటి పరిస్థితులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందుతున్నాయి. లబ్ది పొందిన వారంతా జగన్ వెన్నంటే ఉన్నారు. లోకేష్ని సీఎం చేస్తానని చంద్రబాబు చెప్పగలడా?. లేదా పవన్ని చేస్తానని చెప్తారా? ఏదీ చెప్పే ధైర్యం లేని వారు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని’’ మంత్రి ఎద్దేవా చేశారు. చదవండి: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్ -
‘చంద్రబాబు సభ.. అధికార దాహానికి పరాకాష్ట’
సాక్షి, కోనసీమ జిల్లా/పల్నాడు జిల్లా: చంద్రబాబు ప్రచార వ్యామోహం వల్లే 8 మంది మృతి చెందారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ‘‘విజన్ గురించే మాట్లాడే చంద్రబాబుకు అసలు విజనే లేదు. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలిగొన్నారు. చంద్రబాబు అధికార వ్యామోహం తగ్గించుంటే మంచిది’’ అని మంత్రి హితవు పలికారు. చంద్రబాబు అధికార దాహానికి 8 మంది బలి: ఎమ్మెల్యే పిన్నెల్లి కందుకూరులో చంద్రబాబు సభ.. అధికార దాహానికి పరాకాష్ట అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇరుకు సందులో సభ పెట్టి తక్కువ జనం వచ్చినా.. ఎక్కువ మంది వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అధికార దాహానికి 8 మంది చనిపోయారు. చంద్రబాబు వల్ల 8 మంది పేద కుటుంబాలు రోడ్డునపడ్డాయని పిన్నెల్లి అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని: గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. ఇరుకు సందులో సభ పెట్టి డ్రోన్ కెమెరాలతో విజువల్స్ చేయించి తన సభకు బాగా జనం వచ్చారని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇరుకు సందులో సభ వల్లే తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు. చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేత ఉండటం మన ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారని గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
ప్రభుత్వ పథకాలు ఎల్లో మీడియాకు కనపడటం లేదా?: మంత్రి వేణు
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో బీసీ కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్తో పేదలకు ఉన్నత చదువులు అందుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు ఎల్లో మీడియాకు కనపడటం లేదా అంటూ మంత్రి ప్రశ్నించారు. అమ్మఒడి, చేయూత, జగనన్నతోడు వంటి పథకాలతో అండగా నిలుస్తున్నాం. వైఎస్ జగన్ పాలనలో అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఎన్టీఆర్ తెచ్చిన టీడీపీ ఇప్పుడు లేదు. చంద్రబాబు అంటే కుట్ర, వెన్నుపోటు. చంద్రబాబు కోసమే ఈనాడు తప్పుడు కథనాలు రాస్తోంది’’ అని వేణుగోపాలకృష్ణ దుయ్యబట్టారు. చదవండి: ముందస్తు ఎన్నికలపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు -
‘ఆత్మీయ సమ్మేళనానికి సీఎం జగన్ను ఆహ్వానిస్తాం’
విజయవాడ: వచ్చేనెల 8వ తేదీన విజయవాడలో జరుగనున్న బీసీల ఆత్మీయ సమ్మేళనానికి సీఎం జగన్ను ఆహ్వానిస్తామని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈరోజు(శనివారం) నగరంలో బీసీ మంత్రుల, నేతల సమావేశం జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన మంత్రి వేణుగోపాలకృష్ణ.. ‘ వచ్చే నెల8వ విజయవాడలో బీసీల ఆత్మీయ సమ్మేళనం. సమ్మేళనానికి సీఎం జగన్ను ఆహ్వానిస్తాం. చంద్రబాబు బీసీల ద్రోహి. మాది బీసీల ప్రభుత్వం. బీసీల ఆత్మరక్షకుడు సీఎం జగన్ మాత్రమే’ అని పేర్కొన్నారు. మంత్రి జయరాం మాట్లాడుతూ.. ‘56 కార్పోరేషన్లతో బీసీలకు సీఎం జగన్ ఎంతో మేలు చేశారు. బీసీల అభ్యున్నతికి సీఎం చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది. బీసీలకు రూ. 88 వేల కోట్ల సంక్షేమ పథకాలు అందాయి’ అని తెలిపారు ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ..బీసీలకు చంద్రబాబు చేసేందేమీ లేదు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు.బీసీలకు అన్ని విధాల సీఎం జగన్ అండగా నిలిచారు’ అని అన్నారు. ‘బీసీ డిక్లరేషన్లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 139 కులాలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి కులానికి ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్దే’ అని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. -
‘చంద్రబాబు హయాంలో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉన్నత చదువులు అందుతున్నాయని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్సార్ హయాంలో గీత వృత్తిదారులకు న్యాయం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్తో ఎందరో ఉన్నత చదువులు చదివారని గుర్తు చేశారు. గీత కార్మికులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతో ఉపయోగపడిందన్నారు. గీత కార్మికుల జీవిత భద్రత కోసం ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని, వారు ప్రమాదవశాత్తూ చనిపోతే 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారన్నారు. చంద్రబాబు నిర్ణయంతో పేదలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. గీత ఉపకులాల వారికి సీఎం జగన్ భరోసా ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ వచ్చాక విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పు చేశారని మంత్రి అన్నారు. ఏపీలో గీత కార్మికులకు లభిస్తున్న లబ్ది మరే రాష్ట్రంలో లేదని, ముఖ్యమంత్రి ఇప్పటికే ఈబీసీల రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నారని వేణు అన్నారు. చదవండి: హరిపురం ఘటనపై విస్తుపోయే వాస్తవాలు.. చక్రం తిప్పిన టీడీపీ నేత! -
‘వణుకుతున్నారు.. అందుకే గుంపుగా వస్తున్నారు’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ప్లీనరీ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నాలుగు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. చదవండి: పెట్టుబడులపై ఎందుకీ పగ? ‘‘పేదల జీవితం మార్పు కోసం 2017 లో ప్లీనరీ నిర్వహించాం. ఆ ప్లీనరీలో నవరత్నాల మేనిఫెస్టోని ప్రకటించారు. 2019లో 151 స్థానాల్లో గెలిచాం. గడిచిన మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చాం. వైద్య, విద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు సీఎం జగన్ నాయకత్వం పట్ల నమ్మకం పెరిగింది. మూడేళ్లలో నేరుగా లబ్ధిదారులకు 1.50 లక్షల కోట్లను డిబిటి ద్వారా అందించాం. ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా ఈ రెండేళ్ల పాలన ఉంటుంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ ఉంటుందని’’ మంత్రి పేర్కొన్నారు. ‘‘రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబుకి స్కూళ్లు అంటే నారాయణ, శ్రీచైతన్య మాత్రమే. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశారా?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు వణుకుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయలేక గుంపుగా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని ప్రతిపక్షాలకు అర్థమైందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. -
మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు
రామచంద్రపురం(కోనసీమ జిల్లా): బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం ఉదయం రామచంద్రపురంలో నడుచుకుంటూ తిరిగారు. ఖుర్ఫాన్ హోటల్ వద్ద ఆగి కష్టం సుఖం మాట్లాడారు. తానే స్వయంగా పెనం మీద దోశ వేశారు. టీ తాగుతూ అక్కడ ఉన్న వారితో కాసేపు మాట్లాడారు. చదవండి👉: నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. ఆహా ఆ రుచే వేరు.. పుంజు రూ.5 వేలు! -
‘క్లాప్.. కెమెరా.. యాక్షన్ తరహాలో పవన్ శ్రమదానం’
సాక్షి, కాకినాడ: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రజలు సమర్థించరని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మట్లాడుతూ.. శ్రమదానం ఎలా చేయకూడదో పవన్ అలా చేశారని, క్లాప్.. కెమెరా.. యాక్షన్ తరహాలోనే పవన్ శ్రమదానం ఉందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ సీజనల్ పొలిటీషియన్ అని అన్నారు. వర్ష కాలంలో ఎవరైనా రోడ్లు వేస్తారా? అని మండిపడ్డారు. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజల కోసం కాదు కెమెరాల కోసం పవన్ యాక్షన్ అన్నట్లు ఉందని మండిపడ్డారు. ప్రజాస్వాయ్య వ్యవస్థపై పవన్కు నమ్మకం లేదని.. గాంధీ జయంతి రోజు హింసను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ ఎంచుకున్న కార్యక్రమం ప్రజలు హర్షించేది కాదని, చంద్రబాబు పాలనలో వర్షాలు కురవలేదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ ఆలోచించాలన్నారు. టీడీపీ పాలకులు వేసిన రోడ్లు ఇప్పుడు పడుతున్నవర్షాలకు ధ్వంసం అయ్యాయని తెలుసుకోవాలన్నారు. తనకున్న గ్లామర్ను ప్రజలకు ఉపయోగపడేలా చేయకుండా అశాంతిని సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. తాత్కాలికంగా ఒకసారి కనిపించి ప్రజలను రెచ్చ గొట్టి లబ్ధి పొందాలన్న ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నాడని దుయ్యబట్టారు. వర్షాలు తగ్గిన వెంటనే రూ.5,600 కోట్లతో రోడ్లు మరమత్తులు చేయాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని తెలిపారు. -
కాసేపట్లో జెడ్పీ ప్రత్యేక సమావేశం
-
ఏపీ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి
రామచంద్రపురం: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రామచంద్రపురం పురపాలక పరిధిలోని చాకలిపేట మున్సిపల్ హైస్కూల్ను మంత్రి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నాడు–నేడు పనులను పరిశీలించారు. విద్యాకానుక కిట్ల పంపిణీపై ఆరా తీశారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు తెలుసుకునేందుకు స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. నాణ్యతైన ఆహారం అందిస్తున్నారని సిబ్బందిని అభినందించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రోడ్ల దుస్థితికి నాటి టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. నాణ్యతకు తిలోదకాలిచ్చిన రోడ్ల నిర్మాణాలు మూడేళ్లు తిరగకుండా ధ్వంసమయ్యాయన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.5 వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు చేయాలని ఆదేశించారన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్పర్సన్ గాధంÔð ట్టి శ్రీదేవి, వైస్ చైర్మన్లు కోలమూరి శివాజీ, చింతపల్లి నాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిల్ విప్ వాడ్రేవు సాయిప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు గుబ్బల గణ, పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్ తదితరులున్నారు. ఇవీ చదవండి: బుల్లెట్ బండికి బామ్మ స్టెప్పులు.. వామ్మో ఏ చేసింది రా బాబు ! అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ -
బీసీలకు ఇది స్వర్ణయుగం
సాక్షి, అమరావతి: దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్ నాయకత్వంలో వెనుకబడిన వర్గాలకు స్వర్ణయుగం లాంటి పాలన అందుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీసీలకు రుణాలెక్కడ?’ అంటూ ఈనాడు పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయోజనాల కోసం మభ్యపెట్టే యత్నాలను మానుకోవాలని ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 యాజమాన్యాలకు హితవు పలికారు. బీసీలను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు తన అనుకూల మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బీసీలకు కేవలం రూ.1,626 కోట్ల రుణాలు విదిల్చి రుణగ్రస్తులను చేస్తే సీఎం జగన్ 26 నెలల వ్యవధిలో రూ.69,841.67 కోట్ల మేర బీసీలకు ఆర్థిక తోడ్పాటు అందించి వెన్నెముక వర్గాలుగా నిలబెట్టారని చెప్పారు. బీసీలకు నేరుగా డబ్బులివ్వడం తప్పు అనే రీతిలో ఈనాడు పత్రిక వార్తలను వండి వార్చడం దుర్మార్గమన్నారు. బీసీలను రుణగ్రస్తులుగానే ఉంచాలనే చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీల జీవితాలను మరింత కుంగదీయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నేరుగా ఖాతాల్లోకే నగదు బీసీలను రుణాల నుంచి విముక్తులను చేసేలా మధ్యవర్తులకు తావులేకుండా ప్రతి పైసాను నేరుగా లబ్ధిదారులకే అందిస్తూ సీఎం జగన్ పారదర్శక పాలనతో దేశంలోనే ఆదర్శంగా నిలిచారని మంత్రి వేణు పేర్కొన్నారు. 26 నెలల కాలంలో 4.4 కోట్లకుపైగా బీసీ లబ్ధిదారులకు నేరుగా, పరోక్షంగా రూ. 69,841.67 కోట్లు అందించారని వివరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు కలిగిన ప్రయోజనాల్లో బీసీలకు 50.11 శాతం మేర లబ్ధి చేకూరగా సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చులో బీసీలకు 49.66 శాతం దక్కిందన్నారు. పలు సంక్షేమ పథకాల ద్వారా 3.24 కోట్ల మందికిపైగా బీసీ లబ్ధిదారులకు రూ.50,495.28 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ (డీబీటీ) చేశామన్నారు. ఏడు పథకాల ద్వారా 1,21,52,921 మంది బీసీలకు రూ.19,346.39 కోట్ల మేర పరోక్షంగా లబ్ధి చేకూరిందని వివరించారు. చరిత్రను తిరగరాస్తున్న సీఎం జగన్ బీసీలు చంద్రబాబు పాలనలో అణచివేతకు గురైతే సీఎం జగన్ పాలనలో ఎదుగుతున్నారని మంత్రి వేణు పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెన్నెముకగా నిలిపేలా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను బీసీలంతా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నామినేటెడ్ పదవులను బీసీలకు కట్టబెట్టడం, ముఖ్యంగా మహిళలకు 50 శాతానికిపైగా పదవులు దక్కడం ఒక చరిత్ర అన్నారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు ప్రతి కార్పొరేషన్కూ 12 మంది డైరెక్టర్లు ఉండేలా నియామకాలు చేశామన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లలో 29 పోస్టులు, 672 మంది డైరెక్టర్లలో 339 పదవులను మహిళలకే అప్పగించడం ద్వారా మహిళా సాధికారతలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్, మహాత్మ జ్యోతిబా పూలే బాటలో నడుస్తూ మహిళాభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సీఎం జగన్ చరిత్రలో నిలుస్తారన్నారు. వెనుకబడిన వర్గాలకు ఇన్ని పదవులు ఇవ్వటం, అందులో సగం మహిళలకు దక్కటం ఎక్కడైనా చూశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ రోజూ మహిళలకు గౌరవం ఇవ్వలేదని, బీసీలను తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించారని గుర్తు చేశారు. బాబు పాలనలో పింఛన్కూ లంచమే.. చంద్రబాబు పాలనలో లంచం ఇవ్వనిదే ఏ పని జరిగేది కాదని, జన్మభూమి కమిటీలు పింఛన్ మంజూరు కూడా లంచాలు గుంజిన సంగతి అందరికీ తెలుసని మంత్రి వేణు గుర్తు చేశారు. బీసీలకు రుణాలు, పింఛన్, ఇళ్ల స్థలం, రేషన్కార్డు ఏది కావాలన్నా లంచం ఇవ్వనిదే కనికరించిన పరిస్థితిని చంద్రబాబు హయాంలో చూశామన్నారు. చంద్రబాబు సొంత కులానికి మినహా ఇతరులకు చేసింది ఏమీ లేదన్నారు. తమకు తెలియకుండా మీటర్లు బిగించారని శ్రీకాకుళం జిల్లా జములూరు మండలానికి చెందిన రైతు కింజారపు సత్యన్నారాయణ చెప్పినట్లు ఈనాడులో ప్రచురించిన కథనంలో నిజం లేదన్నారు. ఈమేరకు రైతు సత్యన్నారాయణ ఖండనను మంత్రి వేణు విలేకరులకు వినిపించారు. -
2008లోనే పాల-ఏకరిలను వైఎస్సార్ బీసీలుగా గుర్తించారు
సాక్షి, అమరావతి : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లోనే పాల-ఏకరిలను బీసీలుగా గుర్తించారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. పాల-ఏకరి కోసం సీఎం జగన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. సోమవారం పాల-ఏకరి కార్పొరేషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీల అమలు దిశగా పాలన జరుగుతోంది. విద్య, వైద్య రంగంలో సీఎం జగన్ నూతన విప్లవం తెచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు’’ అని అన్నారు. -
బీసీల్లో పుట్టడం అదృష్టం: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, విజయవాడ: బీసీల్లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 56 బీసీ కార్పొరేషన్లతో సీఎం జగన్ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. 50 శాతానికిపైగా మహిళలకు పదవులిచ్చి పూలే ఆశయాలు నెరవేర్చారని తెలిపారు. రాజకీయ ప్రాధాన్యత కల్పించటంతో బీసీల్లో ఆత్మనూన్యతా భావం పోయిందన్నారు. ప్రతి బీసీ ఇంట్లో సీఎం జగన్ ఉంటారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును బీసీలు అసహ్యించుకోవటంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. (చదవండి: ‘టీడీపీ నిర్వాకం వల్లే రోడ్లన్నీ గుంతలు’) -
ఎన్నడూ లేని విధంగా బీసీల సంక్షేమం
సాక్షి, అమరావతి/మంగళగిరి: బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీలను రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బీసీల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి సరికొత్త నాయకత్వానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో శుక్రవారం బీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా 56 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్లను ఘనంగా సన్మానించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులను వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి వేదికపైకి ఆహ్వానించగా ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు సభకు అధ్యక్షత వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు, డైరెక్టర్లకు తిరుపతిలో ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. బీసీలకు ఆత్మస్థైర్యం కలిగించిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బీసీల కోసం చంద్రబాబు ఐదేళ్లలో రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ జగన్ ఏడాదిన్నర కాలంలోనే రూ.67 వేల కోట్లు అందించారన్నారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఎంపీలు.. పిల్లి సుభాష్ చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు.. కొలుసు పార్థసారథి, జోగి రమేశ్, మధుసూదన్ యాదవ్, కాపు రామచంద్రారెడ్డి, అదీప్రాజ్, విడదల రజని, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ శేషుబాబు, రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు పూలే ఏ సమాజాన్ని అయితే ఆశించారో.. అదే సమాజ స్థాపన దిశలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తోడు చేసుకుని సీఎం ముందుకు సాగుతున్నారని చెప్పారు. -
అర్హులందరికీ ‘వైఎస్సార్ కాపు నేస్తం’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో భాగంగా కొత్తగా అర్హులైన 95,245 మంది మహిళా లబ్ధిదారులకు రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.142.87 కోట్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నగదును రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ శనివారం విజయవాడలో ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా కొత్తగా గుర్తించిన మహిళా లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశారు. మొదటి విడతలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల దరఖాస్తు చేయని వారికి, అందుబాటులో లేని వారికి, జాబితాలో పేర్లు లేని వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా కొత్తగా 95,245 మంది మహిళా లబ్ధిదారులను గుర్తించి రూ.142.87 కోట్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు 2,35,360 మంది కాపు మహిళా లబ్ధిదారులకు రూ.353 కోట్లను విడుదల చేయడం తెలిసిందే. వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా 2019–20 సంవత్సరానికి గాను మొత్తంగా 3,30,605 మంది లబ్ధిదారులకు రూ.495.87 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సాయం కింద అందించినట్లైంది. లబ్ధిదారులకు చెక్కు ఇస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి తదితరులు అవినీతికి తావులేని విధంగా పేదలకు ఆర్థిక సాయం ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతికి తావులేని విధంగా పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శ పాలకుడిగా నిరూపించుకున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ల నుంచి 5% కాపులకు ఇస్తున్నానని చెప్పి వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. కాపులు వారి సమస్యలపై ఉద్యమిస్తే.. కేసులు పెట్టి వేలాది మందిని చంద్రబాబు జైళ్లలో పెట్టించారని, ఆ కేసులన్నీ ముఖ్యమంత్రి జగన్ ఎత్తివేశారని తెలిపారు. 16 నెలల కాలంలో కాపులకు రూ.5,542 కోట్లు నేరుగా ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్దేనన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రజా మేనిఫెస్టో అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన కాపు మహిళలు శ్రీనివాసమ్మ, రమాదేవి, పి.లక్ష్మి మాట్లాడుతూ కాపులకు వరాల జల్లు కురిపించింది వైఎస్ జగన్ ఒక్కరేనన్నారు. కాపు కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస శ్రీనరేష్ అధ్యక్షత వహించగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రుల బాధ్యతల స్వీకరణ
సాక్షి, అమరావతి: రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ మంత్రిగా శంకర్ నారాయణ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణలు బుధవారం సచివాలయంలో వేర్వేరుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ నుంచి ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చెట్లెక్కే మా చేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్లమెంట్ మెట్లెక్కించారన్నారు. ► ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ రెండు కీలక ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 వేల కి.మీ. రోడ్లు వేసేందుకు గాను రూ.6,400 కోట్లతో ఎన్డీబీతో చేసుకున్న ఒప్పందంపై సంతకం చేశారు. తూ.గో. జిల్లాలోని వృద్ధ గౌతమి నదిపై ఎదుర్లంక– జి.ముళ్లపాలెం రహదారి కొత్త వంతెన పనులకు సంబంధించి రూ.76.05 కోట్లకు అంచనాలను సవరిస్తూ ఫైల్పైనా సంతకం చేశారు. ► మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కర్నూలు జిల్లా బేతంచర్ల బీసీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, డోన్ బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ మొదటి ఫైల్పై సంతకం చేశారు. ► బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ బి.రామారావు, కాపు కార్పొరేషన్ ఎండీ సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు ధనలక్ష్మి, కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు. -
‘దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా టెస్టులు’
తూర్పు గోదావరి జిల్లా : కరోనా అదుపునకు ఇంకా అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక సంఖ్యలో మన రాష్ట్రంలోనే టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. (ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు) కొవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కరోనాను అదుపు చేయడానికి మరిన్ని చర్యలు చేపడతామన్నారు. ప్రజల్లో కరోనా పట్ల ఇంకా అవగాహన రావాల్సి ఉందని తెలిపారు. (ఏపీ: ఒక్కరోజే 3,234 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్) -
ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
-
నిడదవోలు.. టీడీపీలో విభేదాలు
సాక్షి, నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నా యి. సీటు కోసం అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. దీంతో సీటు కేటాయింపును పార్టీ అధిష్టానం పెండింగ్లో పెట్టింది. 2014 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ను బూరుగుపల్లి శేషారావుకు ఇప్పించడంలో అతడి అన్న బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ వెన్నుదన్నుగా నిలిచారు. అయితే అనంతరం కుటుంబంలో చెలరేగిన తగాదాలు రోడ్డుకెక్కడంతో ఈసారి వేణుగోపాలకృష్ణ కూడా బరి లో నిలిచారు. నిడదవోలు సీటును తనకే టాయించాలని వేణుగోపాలకృష్ణ పట్టుబట్టడం, సిట్టింగ్ స్థానాన్ని మరలా తనకే ఇవ్వాలని శేషారావు భీష్మించడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నాలుగున్నరేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తొలిసారి టికెట్ కోసం రోడ్డెక్కడం కలకలం రేపింది. వీరితో పాటు కుందుల సత్యనారాయణ కూడా సీటు ఆశించడంతో నియోజకవర్గంలో టీడీపీ మూడు వర్గాలుగా మారింది. ఇటీవల అమరావతిలో జరిగిన నియోజకవర్గ సమీక్ష సమావేశంలోనూ శేషారావుకు సీటు కేటాయించవద్దని కుందుల వర్గం ప్లకార్డులు ప్రదర్శించడం వి వాదాస్పదమైంది. ఆయా వర్గాలు అమరావతిలో మకాం వేసి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పలు విద్యాసంస్థల యాజమాన్యాలను అమరావతికి తీసుకువెళ్లి వేణుగోపాలకృష్ణ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా రు. టికెట్ ఎవరికి కేటాయిస్తే ఎలాంటి పరి ణామాలు ఎదురవుతాయోననే ఆలోచనలో నిడదవోలు పంచాయితీ అధిష్టానానికి పెను సవాల్గా మారింది. చివరిసారిగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే శేషారావు, వేణుగోపాలకృష్ణను సీటు ఎవరికి కావాలో తేల్చుకోమని అధిష్టానం చెప్పింది. అయితే వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరగకపోవడంతో విభేదాలు కొలిక్కిరాలేదు. ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తున్నా సీటు వ్యవహారంలో సస్పెన్షన్ వీడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు వైపే టీడీపీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
'ధైర్యం లేని బాబు.. ఢిల్లీకి ఎందుకు?'
గుంటూరు: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఏపీకి అదనంగా నిధులు అడిగే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు. ప్రజల వత్తిడి వల్లే చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళుతున్నారని చెప్పారు. అసలు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబునాయుడు ఏం సాధిస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. -
ఇంటి దొంగల పనిపట్టాలి
తిరుపతి(మంగళం): శేషాచల అడవులు, అటవీశాఖ కార్యాలయాల గోదాముల నుంచి ఎర్రచందనం తరలిపోకుండా ఉండేందుకు ముందుగా ఇంటి దొంగల పనిపట్టాలని అటవీశాఖాధికారులు, పోలీసులకు రాయలసీమ రేంజ్ ఇన్చార్జ్ ఐజీ వేణుగోపాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఎంఎస్టీసీ ద్వారా ఈ-టెండర్లలో వేలం నిర్వహిస్తున్న ఎర్రచందనాన్ని, వాహనాలను పరిశీలించేందుకు ఆయన ఆదివారం తిరుపతి అటవీశాఖ కార్యాలయానికి విచ్చేశారు. అయితే అక్కడకు మీడియా రావడంపై ఆయన పోలీస్ అధికారులపై మండిపడ్డారు. ఎవరినీ లోనికి అనుమతించవద్దని ఆదేశించారు. అనంతరం ఛీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీఎఫ్) కార్యాలయంలో అటవీశాఖ, టాస్క్పోర్సు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషాచల అటవీప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జరిగితే ఆ పరిధికి సంబంధించిన బీట్ ఆఫీసర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నిర్లక్ష్యం కారణంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరిగితే బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. ఇంటి దొంగల సహాయంతో గోదాముల్లోని ఎర్రచందనం తరలిపోతోందని, దానిని అరికట్టేందుకు గోదాముల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. గోదాముల వద్ద పటిష్ట భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డీఎఫ్వో శ్రీనివాసులుతెలిపారు. సమావేశంలో తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టీ, టాస్క్ఫోర్సు ఇన్చార్జ్ ఓఎస్డీ ఇలియాజ్ బాష, ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్రెడ్డి, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.