Warship
-
మధ్యప్రాచ్యంలో అలజడి...
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ బలగాల మోహరింపును అమెరికా మరింతగా పెంచుతోంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక తాజాగా మధ్యదరా సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దాంతోపాటు ఓ గైడెడ్ మిసైల్ సామర్థ్యంతో కూడిన జలాంతర్గామి యూఎస్ఎస్ జార్జియాను కూడా అగ్రరాజ్యం హుటాహుటిన మధ్యప్రాచ్యానికి పంపిస్తోంది. హమాస్, హెజ్బొల్లా అగ్ర నేతలను ఇజ్రాయెల్ ఇటీవల వరుసబెట్టి మట్టుపెట్టడంతో ఇరాన్తో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడం తెలిసిందే. ఇజ్రాయెల్పై పూర్తిస్థాయి యుద్ధానికి ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ఆదేశాలు కూడా జారీ చేశారు. దాంతో ఇజ్రాయెల్ను రక్షించేందుకు మిత్రదేశమైన అమెరికా అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఇరు దేశాలూ ఇరాన్ ప్రతి చర్య మీదా నిశితంగా కన్నేసి ఉంచాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్కు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నాయి. ఇజ్రాయెల్తో శాంతి చర్చలకు సిద్ధమేనంటూ హమాస్ ఆదివారం మరోసారి సంకేతాలిచి్చంది. ముందుగా పూర్తి యుద్ధ విరామానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవాలంటూ షరతు విధించింది. -
బ్రిటిష్ నౌకపై హౌతీల దాడి
జెరూసలేం: యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ రెచి్చపోయారు. బ్రిటిష్ చమురు ట్యాంకర్తోపాటు మొట్టమొదటిసారిగా అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ కారీ్నపైకి క్షిపణులను ప్రయోగించారు. బ్రిటిష్ చమురు నౌక మంటల్లో చిక్కుకోగా, అందులోని 22 మంది భారతీయ సిబ్బందిని కాపాడేందుకు భారత నావికా దళం ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి హుటాహుటిన తరలి వెళ్లింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఎర్ర సముద్రంలోని ఏడెన్ సింధులో చోటుచేసుకుంది. బ్రిటిష్ చమురు నౌక ఎంవీ మర్లిన్ లువాండా లక్ష్యంగా హౌతీలు ప్రయోగించిన క్షిపణితో నౌకలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. విపత్తు సమాచారం అందుకున్న భారత నేవీకి చెందిన డె్రస్టాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి చేరుకుంది. నౌకలో మంటలను ఆర్పి, సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నౌకలోని సిబ్బందిలో 22 మంది భారతీయులతోపాటు ఒక బంగ్లాదేశీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని కలగలేదని సమాచారం. ఇలా ఉండగా, ఏడెన్ సింధు శాఖలో పయనించే చమురు నౌకలే లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరిగిన నేపథ్యంలో అమెరికాకు చెందిన యుద్ధ నౌక యూఎస్ఎస్ కార్నీని మోహరించింది. ఈ నౌకపైకి శుక్రవారం హౌతీలు మొట్టమొదటిసారిగా క్షిపణిని ప్రయోగించారు. దీనిని మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా నేవీ ప్రకటించింది. -
అరేబియా సముద్రంలో నౌక హైజాక్ !
న్యూఢిల్లీ: మాల్టా దేశానికి చెందిన సరుకు రవాణా నౌక ఒకటి అరేబియా సముద్రంలో హైజాక్కు గురైంది. ఈ ఘటన జరిగినపుడు నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారు. హైజాక్ విషయం తెల్సుకున్న భారత నావికాదళాలు వెంటనే స్పందించి ఆ వైపుగా పయనమయ్యాయి. సముద్రపు దొంగలు ఆ నౌకను తమ అ«దీనంలోకి తీసుకుని నడుపుతుండగా భారత యుద్ధనౌక దానిని విజయవంతంగా అడ్డుకుంది. అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు భారత నావికాదళం శనివారం తెలిపింది. ప్రస్తుతం నౌక సోమాలియా తీరం వైపుగా వెళ్తోంది. సంబంధిత వివరాలను ఇండియన్ నేవీ వెల్లడించింది. అరేబియా సముద్ర జలాల్లో గురువారం ‘ఎంవీ రుయెన్’ నౌకను ఆరుగురు సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. పైరేట్లు నౌకలోకి చొరబడుతుండగానే నౌకలోని సిబ్బంది ఆ విషయాన్ని బ్రిటన్ సముద్ర రవాణా పోర్టల్కు అత్యవసర సందేశం(మేడే)గా తెలియజేశారు. హైజాక్ విషయం తెల్సిన వెంటనే భారత నావికా దళాలు అప్రమత్తమయ్యాయి. అదే ప్రాంతంలో గస్తీ కాస్తున్న భారత గస్తీ విమానం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద విధుల్లో ఉన్న భారత నావికాదళ యాంటీ–పైరసీ పెట్రోల్ యుద్ధనౌకలు రంగంలోకి దిగాయి. హైజాక్కు గురైన నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అటుగా దూసుకెళ్లి ఆ నౌకను శనివారం ఉదయం విజయవంతంగా అడ్డుకున్నాయి. ‘ రవాణా నౌకల సురక్షిత ప్రయాణానికి భారత నావికాదళం కట్టుబడి ఉంది. అంతర్జాతీయ భాగస్వాములు, మిత్ర దేశాలకు సాయపడటంతో ఎప్పుడూ ముందుంటుంది’ అని భారత నేవీ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకపై దాడి
దుబాయ్: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న తమ యుద్ధ నౌక యూఎస్ఎస్ కార్నీ సహా పలు వాణిజ్య నౌకలపై ఆదివారం దాడులు జరిగినట్లు అమెరికా పేర్కొంది. దాడికి కారణమెవరనే విషయం పెంటగాన్ తెలపలేదు. ఉదయం 10 గంటల సమయంలో యెమెన్ రాజధాని సనాలో మొదలైన ఈ దాడులు సుమారు 5 గంటలపాటు కొనసాగినట్లు ఓ అధికారి చెప్పారు. ఎర్ర సముద్రంలో అనుమానాస్పద డ్రోన్ దాడి, పేలుళ్లు సంభవించినట్లు అంతకుముందు బ్రిటిష్ మిలటరీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే ఓడలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతున్న యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవలి కాలంలో దాడులకు తెగబడుతున్నారు. తాజా ఘటనలపై హౌతీలు స్పందించలేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం వేళ మధ్యప్రాచ్యంలో ఈ దాడులు ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. -
నేవీ షిప్పై మొదటిసారిగా మహిళా అధికారికి బాధ్యతలు
న్యూఢిల్లీ: నావికా దళం యుద్ధ నౌకపై మొదటిసారిగా మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. మహిళా అధికారులకు ‘అన్ని ర్యాంకులు– అన్ని బాధ్యతలు’ అనే సిద్ధాంతానికి నేవీ కట్టుబడి ఉంటుందన్నారు. హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి పెరిగిన నేపథ్యంలో భారత నావికా దళం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు గత ఏడాదిగా వ్యూహాత్మకంగా చురుగ్గా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. -
యుద్ధనౌక సూరత్.. సిద్ధమైంది.!
సాక్షి, విశాఖపట్నం: తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది. అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణుల్ని తీసుకెళ్లడమే కాకుండా.. మిసైల్ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ సిద్ధమైంది. ఈ నౌక నిర్మాణంలో కీలకమైన క్రెస్ట్ (శిఖరావిష్కరణ) కార్యక్రమాన్ని సోమవారం సూరత్లో నిర్వహించనున్నారు. అనంతరం తుది దశ పరిశీలనల తర్వాత భారత నౌకాదళానికి అప్పగించనున్నారు. ముంబైలో తయారైన ఈ యుద్ధ నౌక గంటకు 56 కి.మీ. వేగంతో దూసుకుపోతూ శత్రు సైన్యంలో వణుకు పుట్టించగలదు. ప్రాజెక్టు–15బీలో చివరి యుద్ధ నౌక.. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో రూ. 35,800 కోట్లతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లని పెట్టాలని నిర్ణయించారు. తొలి షిప్ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఇప్పటికే ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరాయి. తాజాగా చివరి నౌకగా ఐఎన్ఎస్ సూరత్ వార్ షిప్ కూడా విధుల్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ షిప్కు సంబంధించి 2018 జూలైలో కీల్ నిర్మించగా.. 2022 మే 17న షిప్ తయారీ పనుల్ని బ్లాక్ కనస్ట్రక్షన్ మెథడాలజీ సాంకేతికతతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్) ప్రారంభించింది. ఈ నౌకకు తొలుత గుజరాత్లో ప్రధాన ఓడరేవు అయిన పోర్బందర్ పేరు పెట్టాలని నౌకాదళం భావించింది. తర్వాత.. రక్షణ మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఐఎన్ఎస్ సూరత్గా నామకరణం చేశారు. ఈ 4 షిప్స్ని 2024 కల్లా నౌకాదళానికి అప్పగించాలని ఒప్పందం. కాగా, తుదిదశకు ఐఎన్ఎస్ సూరత్ పనులు చేరుకున్న తరుణంలో ముఖ్యమైన క్రెస్ట్ (యుద్ధనౌకకు సంబంధించి ప్రత్యేకమైన సంప్రదాయ చిహ్నం. క్రెస్ట్ పూర్తయితే నౌక జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైనట్లే.) ఆవిష్కరణ సూరత్లో జరగనుంది. అనంతరం తుది దశ ట్రయల్స్ నిర్వహించి నౌకాదళానికి అప్పగించనున్నారు. బ్రహ్మోస్ను మోసుకెళ్లగల సామర్థ్యం విశాఖపట్నం–క్లాస్ స్టెల్త్ గైడెడ్–మిసైల్ డిస్ట్రాయర్ యర్ నౌకల్లో ఆఖరిది ఐఎన్ఎస్ సూరత్. విశాఖపట్నం క్లాస్ యుద్ధ నౌకలన్నీ బ్రహ్మోస్ క్షిపణుల్ని మోసుకెళ్లగల సామర్థ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోదగ్గ ఐఎన్ఎస్ సూరత్ను అత్యాధునిక ఆయుధ సెన్సార్లు, అధునాతన ఫీచర్లు, పూర్తిస్థాయి ఆటోమేషన్తో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ యుద్ధనౌక భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక విశేషాలు.. బరువు: 7,400 టన్నులు పొడవు: 163 మీటర్లు బీమ్: 17.4 మీటర్లు డ్రాఫ్ట్: 5.4 మీటర్లు వేగం: గంటకు 30 నాటికల్ మైళ్లు (56 కిమీ) స్వదేశీ పరిజ్ఞానం: 80 శాతం పరిధి: 45 రోజుల పాటు ఏకధాటిగా 8 వేల నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగల సత్తా సిబ్బంది– 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు– మల్టీ ఫంక్షన్ రాడార్, బ్యాండ్ ఎయిర్ సెర్చ్ రాడార్, సర్ఫేస్ సెర్చ్ రాడార్ ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు విమానాలు: రెండు వెస్ట్ల్యాండ్ సీకింగ్ విమానాలు లేదా రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాలు తీసుకెళ్లగలదు ఏవియేషన్ ఫెసిలిటీ: రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే సౌకర్యం ఎల్రక్టానిక్ వార్ఫేర్: డీఆర్డీవో శక్తి సూట్, రాడార్ ఫింగర్ ప్రింటింగ్ సిస్టమ్ ఏర్పాటు, 4 కవచ్ డెకాయ్ లాంచర్లు, 2 కౌంటర్ టార్పెడో సిస్టమ్స్. -
ఇజ్రాయెల్కు అమెరికా విమాన వాహక నౌక.. ఇక హమాస్కు చుక్కలే?
టెల్ అవివ్/జెరూసలేం: ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ ఇజ్రాయెల్లో పరిస్థితి భీతావహంగా మారింది. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన తీవ్రవాదులు వీధుల్లో జవాన్లతో తలపడుతున్నారు. హమాస్ దుశ్చర్య పట్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం పెద్ద సంఖ్యలో రాకెట్లను గాజాపై ప్రయోగించింది. మరోవైపు.. ఇజ్రాయెల్కు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు మద్దతుగా తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతానికి విమాన వాహక నౌకను పంపాలని అమెరికా నిర్ణయించింది. ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అక్కడికి వెళ్లాలని ఆదివారం పెంటగాన్ ఆదేశించినట్లు ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించారు. 5వేల నావికులు, యుద్ధ విమానాలతో కూడిన ద యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వాహక నౌకను, క్రూజ్లను, డిస్ట్రాయర్స్ను పంపనున్నట్లు తెలిపారు. The United States is moving the USS Gerald R. Ford, the world's largest aircraft carrier and largest warship, to the shores of Israel. Hamas Statement: "The relocation of the American aircraft carrier does not frighten us, and the Biden administration must understand the… pic.twitter.com/7CjUGchzSB — OLuyinka🀄️🔌 (@Luyinkacoaltt) October 9, 2023 LATEST:-Hamas fires Hundreds of rockets towards Tel Aviv Airport,, Israel.#IsraelPalestineWar #IsraelPalestineWar #hamasattack #hamasattack #FreePalastine #FreePalastine #Palestine #IStandWithPalestine #طوفان_القدس #IsraelPalestineWar pic.twitter.com/3LyEl2FJ2E — M Musharraf sheikh (@m_m_musharraf) October 9, 2023 ఇది ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడంతోపాటు హమాస్కు అదనపు ఆయుధాలను సమకూర్చే వారిపై నిఘా ఉంచనుంది. వర్జీనియా కేంద్రంగా ఉండే ఈ విమాన వాహక నౌక ప్రస్తుతం మధ్యధరా సముద్ర ప్రాంతంలోనే ఉంది. నౌకా విన్యాసాల కోసం ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ గ్రూప్లో క్రూజ్ యూఎస్ఎస్ నార్మండీ, డిస్ట్రాయర్లు యూఎస్ఎస్ థామస్ హడ్నర్, యూఎస్ఎస్ రాంపేజ్, యూఎస్ఎస్ క్యార్నీ, యూఎస్ఎస్ రూజ్వెల్ట్తోపాటు ఎఫ్-35, ఎఫ్-15, ఎఫ్-16, ఏ-10 యుద్ధ విమానాలు ఉంటాయి. Gaza is being heavily bombed at the moment. Video from today’s bombing. #GazaUnderAttack #Gaza #IsraelPalestineWar#Palestine #Hamas #Palestinian #IsraelUnderAttack #Israel #Mossad #Israel #IsraelUnderAttack #PalestinaLibre #Hizbullah #Lebanon #IsraelAtWar pic.twitter.com/4siVZpl8Mp — Pulkit Sharma (@_Pradhyumn_) October 9, 2023 ఇక, ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇవ్వడంపై టర్కీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. అనవసరంగా ఈ విషయంలో తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. 🚨BREAKING🚨 Turkey Leader🇹🇷 Tayyip Erdoĝan: "America stay away ,we will defend palestine at any price". #طوفان_القدس #جوري_المغربيه #FreePalestine #Israel #IsraelUnderAttack #Palestine #Gaza #Hamas #حماس_تنتصر #حماسpic.twitter.com/ZaHvdozUX9 — Mahad (@MahadCricket) October 9, 2023 ఇదిలా ఉండగా.. యుద్ధం తీవ్రతరం కావడం వల్ల మరణించిన వారి సంఖ్య 1,100 దాటింది. ఇజ్రాయెల్లో 700 మందికి పైగా మరణించారు. గాజాలో కనీసం 400 మంది మరణించినట్టు సమాచారం. ఇరువైపులా 2,000 మంది చొప్పున గాయపడినట్లు తెలుస్తోంది. తమ సైనిక దళాలు 400 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలియజేశాయి. చాలామందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి. Gaza is being heavily bombed at the moment. Video from today’s bombing. #GazaUnderAttack #Gaza #IsraelPalestineWar#Palestine #Hamas #Palestinian #IsraelUnderAttack #Israel #Mossad #Israel #IsraelUnderAttack #PalestinaLibre #Hizbullah #Lebanon #IsraelAtWar pic.twitter.com/4siVZpl8Mp — Pulkit Sharma (@_Pradhyumn_) October 9, 2023 బందీలపై తీవ్రవాదుల అత్యాచారాలు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లో బీభత్సం సృష్టించారు. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వీరిలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఈ బందీలను అడ్డం పెట్టుకొని పెద్ద బేరమే ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేలాది మంది పాలస్తీనావాసులు ఖైదీలుగా ఇజ్రాయెల్ ఆ«దీనంలో ఉన్నారు. వీరిని విడిపించుకోవడానికి మిలిటెంట్లు ఇజ్రాయెల్ బందీలను పావులుగా ప్రయోగించబోతున్నట్లు సమాచారం. ఇంకోవైపు చాలామంది ఇజ్రాయెల్ పౌరులను మిలిటెంట్లు అపహరించినట్లు ప్రచారం సాగుతోంది. BREAKING – Hamas militants started a new air assault on parts of Israel !!#Israel #hamasattack #GazaUnderAttack #IsraelUnderAttack #Palestine #Gaza #Israel_under_attack #IsraelPalestineWar pic.twitter.com/z0YbHdyB43 — عساف (@Sa91af) October 8, 2023 భారతీయులు క్షేమం.. ఇజ్రాయెల్, గాజాలో భారతీయులంతా ఇప్పటిదాకా క్షేమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారికి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ఇజ్రాయెల్లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. భారతీయులకు తాము అందుబాటులో ఉంటున్నామని, వారి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నామని భారత రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశాయి. మరోవైపు గాజాలో వాతావరణం భయంకరంగా ఉందని అక్కడి భారతీయులు చెప్పారు. ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఇలా ఉండగా, ఇజ్రాయెల్లోని టెల్ అవివ్కు ఈ నెల 14 దాకా తమ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
రష్యాలో కిమ్ జోంగ్ ఉన్ బిజీబిజీ
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన శనివారం రష్యా ఆయుధాగారాన్ని సందర్శించారు. రష్యా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సహిత బాంబర్లు, హైపర్సానిక్ క్షిపణులు, అత్యాధునిక యుద్ధ నౌకను పరిశీలించారు. కిమ్ తొలుత ఉత్తర కొరియా నుంచి రైలులో అరి్టయోమ్ సిటీకి చేరుకున్నారు. ఇక్కడికి సమీపంలోని ఎయిర్పోర్టులో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లు, యుద్ధ విమానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిమ్ వెంట రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉన్నారు. టు–160, టు–95–, టు–22 బాంబర్ల గురించి కిమ్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మిగ్–31 ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే హైపర్సానిక్ కింజాల్ క్షిపణుల గురించి కిమ్కు సెర్గీ వివరించారు. ఇలాంటి క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం ప్రయోగిస్తోంది. కిమ్, సెర్గీ షోయిగు కలిసి రేవు నగరం వ్లాదివోస్తోక్ చేరుకున్నారు. ఇక్కడ అత్యాధునిక యుద్ధ నౌకలను, ఆయుధాలను కిమ్ పరిశీలించారు. ఆయుధాలు, ఉపగ్రహాల తయారీ విషయంలో రష్యా నుంచి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికే కిమ్ రష్యాలో పర్యటిస్తున్నట్లు పశి్చమ దేశాలు అంచనా వేస్తున్నాయి. -
మహేంద్రగిరి జల ప్రవేశం
ముంబై: భారత నావికాదళం సామర్థ్యాన్ని మరింత పెంచే మహేంద్రగిరి యుద్ధనౌక శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ యుద్ధనౌకను జలప్రవేశం చేయించారు. మహేంద్రగిరిని ప్రారంభించడం మన నావికాదళ చరిత్రలో కీలక మైలురాయిగా ధన్ఖడ్ సందర్భంగా అభివర్ణించారు. భారత సముద్ర నావికాశక్తికి రాయబారిగా మహా సముద్ర జలాల్లో త్రివర్ణపతాకాన్ని మహేంద్రగిరి సగర్వంగా రెపరెపలాడిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) మహేంద్రగిరిని తయారు చేసింది. ప్రాజెక్ట్ 17ఏ సిరీస్లో ఇది ఏడోదని అధికారులు తెలిపారు. దేశ ఆర్థిక ప్రగతికి, ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు, సముద్ర జలాల్లో మన ప్రయోజనాలను రక్షించుకునేందుకు నావికాదళాన్ని ఆధునీకరణ చేయడం ఎంతో అవసరమన్నారు. హిందూమహా సము ద్ర ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయాలు, భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా కూడా ఈ అవసరం ఎంతో ఉందని చెప్పారు. మహేంద్రగిరిలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థల్లో 75 శాతం దేశీయంగా తయారైనవే కావడం గర్వకారణమని పేర్కొన్నారు. -
దేశ భద్రతకు‘పంచ’ కవచాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటి వరకు షిప్ రిపేర్ హబ్గా మాత్రమే కొనసాగుతున్న విశాఖపట్నం హిందూస్థాన్ షిప్యార్డ్.. త్వరలోనే షిప్ బిల్డింగ్ హబ్గా అత్యుత్తమ సేవలందించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నది. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారించిన షిప్యార్డ్ అందుకోసం భారత నౌకాదళంతో కీలక ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ క్రమంలో రూ.19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దేశ చరిత్రలో ఏ షిప్యార్డ్ నిర్మించని విధంగా ఏకంగా 44 వేల టన్నుల షిప్స్ని నిర్మించనున్న హెచ్ఎస్ఎల్... 2027 ఆగస్ట్లో తొలి యుద్ధనౌకని ఇండియన్ నేవీకి అప్పగించనుంది. యుద్ధ విన్యాసాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించేలా షిప్ డిజైన్లతో పాటు.. రక్షణ వ్యవస్థలోనే కాకుండా.. విపత్తు నిర్వహణకు వినియోగించేలా షిప్లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సింధుకీర్తి సబ్మెరైన్ మరమ్మతుల విషయంలో హిందుస్థాన్ షిప్యార్డ్ అపవాదు మూటకట్టుకుని.. తొమ్మిదేళ్లకు పూర్తి చేయడంతో షిప్యార్డ్డ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే, ఐఎన్ఎస్ సింధువీర్ మరమ్మతుల్ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి ఆ మరకని తుడిచేసుకున్న షిప్యార్డ్.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ.. ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హెచ్ఎస్ఎల్.. ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీ గణనీయంగా తగ్గించుకుంది. 40 నౌకల రీఫిట్ పనుల్ని ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి ఔరా అనిపించుకుంది. మొత్తంగా హిందుస్థాన్ షిప్యార్డ్ పనితీరుతో విశాఖ.. షిప్ బిల్డింగ్ కేంద్రంగా మారుతోంది. రూ.19 వేల కోట్లు.. 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,038 కోట్ల టర్నోవర్ సాధించిన షిప్యార్డ్ .. ఈ ఏడాది ఏకంగా రూ.19,048 కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేసింది. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి సన్నద్ధమవుతోంది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్)ను భారత నౌకాదళం, కోస్ట్గార్డు కోసం తయారు చేసేందుకు శుక్రవారం భారత రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.హైవాల్యూస్తో ఈ నౌకల నిర్మాణాలు చేపట్టనుంది. దేశంలోని ఏ షిప్యార్డ్లోనూ లేనివిధంగా ఏకంగా 44 మిలియన్ టన్నుల డిస్ప్లేస్మెంట్ సామర్థ్యమున్న నౌకల్ని తయారు చేయనుంది. ఈ నౌకల నిర్మాణాలతో 2023–24 నుంచి హెచ్ఎస్ఎల్ వార్షిక టర్నోవర్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం రూ.1,038 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న íషిప్యార్డ్ .. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 నుంచి 2 వేల కోట్ల రూపాయలకు చేరుకోనుంది. 8 సంవత్సరాల కాల పరిమితితో ఈ షిప్స్ని తయారు చేయనుంది. తొలి షిప్ని 2027 ఆగస్ట్ 24న భారత నౌకాదళానికి అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్లలో మరింత అభివృద్ధి.. పెరుగుతున్న ఒప్పందాలకు అనుగుణంగా.. షిప్యార్డ్ను ఆధునికీకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రూ.1,000 కోట్లతో యార్డుని రానున్న మూడేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం స్లిప్వేలు 190 మీటర్లుండగా వీటిని 230 మీటర్లకు పెంచనున్నారు. ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య కూడా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా మరమ్మతులు, నౌకా నిర్మాణాలకు అనుగుణంగా రూ.5 వేల కోట్లతో మెటీరియల్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 364 వెండార్ బేస్డ్ ఎంఎస్ఎంఈల సహకారం తీసుకుంటున్నారు. లక్షల మందికి ఉపాధి టెండర్లు దక్కించుకోవడంలో దూకుడు పెంచాం. తాజాగా 50 టన్స్ బొలార్డ్ పుల్ టగ్ బాల్రాజ్ మరమ్మతులు పూర్తి చేసి నేవల్ డాక్యార్డు (విశాఖపట్నం)కు అందించాం. అందుకే.. ఆర్డర్లు కూడా పెద్ద ఎత్తున సొంతం చేసుకుంటున్నాం. రక్షణ మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం.. షిప్యార్డ్ భవిష్యత్తుని మార్చబోతోంది. ఈ ఎంవోయూ ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. విశాఖ భవిష్యత్తు కూడా మారబోతుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా.. మేక్ ఇన్ ఇండియాని చాటిచెప్పేలా షిప్స్ తయారు చేస్తాం. దేశీయ నౌకల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపైనా దృష్టి సారించాం. సబ్మెరైన్ల నిర్మాణం, రీఫిట్కు సంబంధించిన సామర్థ్యం, మౌలిక సదుపాయాల కల్పనతో మరింత ఆధునికీకరించుకునేందుకు రష్యాతోనూ సమగ్ర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. – కమోడోర్ హేమంత్ ఖత్రి, హిందుస్థాన్ షిప్యార్డు సీఎండీ -
వియత్నాంకు కానుకగా మన యుద్ధనౌక
న్యూఢిల్లీ: వియత్నాంకు భారత్ అరుదైన కానుక అందించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా ఇచి్చంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. పూర్తి సామర్థ్యంతో పని చేసే యుద్ధ నౌకను ఒక మిత్రదేశానికి భారత్ కానుకగా ఇవ్వడం ఇదే తొలిసారని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శనివారం బే ఆఫ్ కామ్ రన్హ్ జలాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ కృపాణ్ను ఆ దేశానికి అందజేశారు. పూర్తిస్థాయి ఆయుధాలతో కూడిన నౌకను ఆ దేశ నేవీకి అప్పగించినట్టు వివరించారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్ఎస్ కృపాణ్ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది. -
యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్:ఈ కానుక ఏ తీరాలకి..?..ప్రత్యేకతలివే..!
► పసిఫిక్ మహా సముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతంపై తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడాన్ని సముద్రం చుట్టూ ఉన్న దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం కేవలం డ్రాగన్దేనంటే ఊరుకోబోమని అందులో తమకూ భాగం ఉందని గళమెత్తుతున్నాయి. అలాంటి దేశాల్లో వియత్నాం కూడా ఒకటి. చైనా పొరుగునే ఉన్న వియత్నాం ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనకి అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. భావసారూప్యత కలిగిన భాగస్వామ్య దేశమైన వియత్నాం నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్నది భారత్ వ్యూహంగా ఉంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం పెరుగుతున్న కొద్దీ ప్రపంచ పటంలో కొత్త మార్పులు వస్తాయన్న ఆందోళనలున్నాయి. ఇటీవల కాలంలో వియత్నాంతో మన దేశానికి ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రక్షణ రంగంలో సహకరించుకుంటున్నాం. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ పెత్తనం సహించలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్ భారతదేశ పర్యటనకు వచి్చనçప్పుడు ఈ యుద్ధ నౌకను కానుకగా ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు భారత్ ఎన్నో మిత్ర దేశాలకు మిలటరీ సాయాలు చేసింది. మాల్దీవులు, మారిషస్ వంటి దేశాలకు చిన్న చిన్న పడవలు, మిలటరీ పరికరాలు ఇచి్చంది. మయన్మార్కు ఒక జలాంతర్గామిని ఇచి్చంది. కానీ వియత్నాంకు క్షిపణిని మోసుకుపోగలిగే సామర్థ్యమున్న యుద్ధ నౌకను ఇవ్వడం వల్ల ఆ తీరంలో చైనా కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుందన్నది భారత్ ఉద్దేశంగా ఉంది. ప్రత్యేకతలివే..! ► ఐఎన్ఎస్ కృపాణ్ ఖుక్రీ క్లాస్కు చెందిన అతి చిన్న క్షిపణి యుద్ధనౌక. 1,350 టన్నుల బరువైన, సముద్రజలాలను పక్కకు తోసేస్తూ వేగంగా ముందుకు దూసుకెళ్లగల శక్తివంతమైన నౌక ఇది. ► పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజనీర్లు రూపొందించిన ఈ నౌక గత కొన్నేళ్లుగా మన నావికా దళానికి గర్వకారణంగా ఉంది. ► 1991 జనవరి 12న దీనిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.. 25 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. ► మీడియం రేంజ్ గన్స్ అంటే 30 ఎంఎం తుపాకీలను ఈ నౌకకు అమర్చవచ్చు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, చాఫ్ లాంచర్స్ వంటి వైవిధ్యమైన పనులు చేయగలదు. ► తీరప్రాంతాల్లో భద్రత, గస్తీ, కదనరంగంలో పాల్గొనడం, యాంటీ పైరసీ, విపత్తు సమయాల్లో మానవతా సాయం వంటివి చేయగల సామర్థ్యముంది. ► భారత్ నావికాదళంలో చురుగ్గా సేవలు అందిస్తున్న యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్ను కేంద్ర ప్రభుత్వం వియత్నాంకు కానుకగా ఇచ్చింది. విదేశాలకు ఒక నౌకని బహుమతిగా ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ నౌక విశాఖ నుంచి ఈ నెల 28 బుధవారం వియత్నాంకు బయల్దేరి వెళ్లింది. 2016 నుంచి భారత్, వియత్నాం మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటివరకు మనం ఎన్నో దేశాలకు మిలటరీ సాయం చేశాము. కానీ కోట్లాది రూపాయల విలువ చేసే యుద్ధ నౌకను ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు ? ఎందుకీ నిర్ణయం? దీని వల్ల భారత్కు ఒరిగేదేంటి ? దక్షిణ చైనా సముద్రం వివాదమేంటి? ► దక్షిణ చైనా సముద్రంపై సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ సముద్ర భూభాగంపై సార్వ¿ౌమాధికారాన్ని ప్రకటించుకున్న చైనా ఏకంగా కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. ఈ సముద్రంలో ఎన్నో దీవులున్నాయి. మత్స్య సంపద అపారంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 15 శాతం ఈ సముద్రంలో జరుగుతుంది. దీనిపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం ఇతర దేశాలకు మింగుడు పడడం లేదు.ఈ సముద్రంలో ఉన్న అన్ని ద్వీపాలను ఒకే రేఖ మీద చూపిస్తూ చైనా విడుదల చేసిన ‘‘నైన్ డ్యాష్ లైన్’ మ్యాప్తో తనవేనని వాదిస్తోంది. ఈ సముద్రంలో భారీగానున్న చమురు నిల్వలపై అన్వేషణ కూడా ప్రారంభం కావడంతో దేశాల మధ్య పోటీ ఎక్కువైంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రం మధ్యలో దక్షిణ చైనా సముద్రం ఉండడం వల్ల అక్కడ చైనా జోక్యం పెరిగితే భారత్కూ నష్టమే. ఈ సముద్రం చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలున్నాయి. ఇవి కూడా సముద్రంలో తమకూ వాటా ఉందని ప్రకటించాయి. మరోవైపు చైనా కృత్రిమ దీవులు, సైనిక స్థావరాలతో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య మనం పంపిన కృపాణ్ దక్షిణ చైనా జలాల్లో ఎంత మేరకు నిఘా పెడుతూ డ్రాగన్కు చెక్ పెడుతుందో వేచిచూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎంనెక్–2023కు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సాత్పురా
సాక్షి, విశాఖపట్నం: ఇండోనేసియాలో జరిగే మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ కుమడో(ఎంనెక్)–2023లో పాల్గొనేందుకు తూర్పు నౌకాదళం నుంచి ఐఎన్ఎస్ సాత్పురా యుద్ధ నౌకను భారత నేవీ పంపించింది. సాత్పురాలో మకస్సర్ తీరానికి చేరుకున్న భారత నౌకాదళ బృందానికి అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 8 వరకు ఆసియా దేశాల ఆధ్వర్యంలో విన్యాసాలు జరగనున్నాయి. సోమవారం జరిగిన సిటీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారత నౌకాదళ బృందం పాల్గొంది. అలాగే ఇండోనేసియాలో త్వరలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో సమీక్ష నిర్వహించారు. ఇందులో సముద్ర భద్రతపై చర్చించారు. చదవండి: Tanguturi Prakasam Pantulu: పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం.. పూలకు బదులు పండ్లు తెస్తే తినేవాడినంటూ -
మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు..
బ్యాంకాక్: థాయ్లాండ్ సముద్రజలాల్లో ఆ దేశ యుద్ధనౌక ఒకటి మునిగిపోయింది. ఆ ఘటనలో 75 మందిని కాపాడారు. అయితే 31 మంది నావికుల జాడ తెలియాల్సి ఉంది. వీరి కోసం థాయ్లాండ్ నావికాదళ హెలికాప్టర్లు, నౌకల్లో సైన్యం అన్వేషణ పనుల్లో నిమగ్నమైంది. ప్రచుయాప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్లోని బాంగ్సఫాన్ జిల్లాలోని సముద్ర తీరం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో హెచ్టీఎంఎస్ సుఖోథాయ్ యుద్ధనౌక గస్తీ కాస్తోంది. ఆ ప్రాంతంలో వేటకొచ్చే చేపలపడవల సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సహాయక కార్యక్రమాల బాధ్యతలను ఈ నౌక చూసుకునేది. ఆదివారం రాత్రి భారీ అలలు ఈ నౌకను అతలాకుతలం చేశాయి. సముద్రనీరు చేరడంతో నౌకలో విద్యుత్ వ్యవస్థ స్తంభించడంతో నావికులు నౌకను అదుపుచేయడంలో విఫలమయ్యారు. దీంతో పక్కకు ఒరగడం మొదలై పూర్తిగా మునిగిపోయింది. 75 మందిని కాపాడగా మిగతా వారి గాలిస్తున్నారు. చదవండి: పాకిస్తాన్లో రెచ్చిపోయిన తాలిబన్లు.. పోలీస్ స్టేషన్ను సీజ్ చేసి.. -
భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక.. ‘మర్ముగోవా’ జల ప్రవేశం
ముంబై: భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక చేరింది. శత్రుదుర్భేద్యమైన మిసైల్ విధ్వంసక యుద్ధనౌక ‘మర్ముగోవా’ జలప్రవేశం చేసింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ మర్ముగోవాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిల్లయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘ఈరోజు స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నాం. ఏడాది క్రితమే మనం సిస్టర్ షిప్ విశాకపట్నంను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టాం. గత దశాబ్దకాలంలో యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో ఈ విజయం గొప్ప పురోగతిని సూచిస్తుంది. ఈ నౌకలకు నగరాల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించాం.’ అని తెలిపారు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్. మర్ముగోవా విశేషాలు.. ► ఈ యుద్ధనౌక రెండోతరానికి చెందిన స్టీల్త్ గైడెడ్ మిసైల్ విధ్వంసక నౌక. ► ప్రాజెక్టు 15బీ కింద ఈ యుద్ధ నౌకను రూపొందించారు. గోవాలోని ప్రముఖ పోర్టు సిటీ మర్ముగోవా నగరం పేరును ఈ వార్షిప్కు పెట్టారు. ► ఈ నౌక పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు కాగా.. బరువు సుమారు 7,400 టన్నులు. అత్యధికంగా 30 నాటిక్ మైళ్ల వేగంతో దూసుకెళ్తుందు. ►భారత నౌకాదళ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 4 విశాఖపట్నం క్లాస్ విధ్వంసక నౌకల్లో ఇది రెండోది. దీనిని మజాగాన్ డాక్ నౌకానిర్మాణ సంస్థ నిర్మించింది. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
ధగధగల బంగారు నిధి.. సముద్ర గర్భంలో.. లక్ష కోట్ల విలువ!
కార్టజినా: 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. సంబంధిత ఫుటేజీని విడుదల చేసింది. కొలంబియా స్వాతంత్య్ర పోరాటానికి ముందు బ్రిటన్, స్పెయిన్ మధ్య 1708లో జరిగిన యుద్ధంలో శాన్జోస్ మునిగిపోయింది. స్పెయిన్ రాజు ఫిలిప్–5కు చెందిన ఈ నౌకలో ఘటన సమయంలో 600 మంది ఉన్నారని భావిస్తున్నారు. సముద్ర గర్భంలో 3,100 అడుగుల లోతులో ఉన్న శిథిల నౌక వద్దకు రిమోట్తో పనిచేసే యంత్రాన్ని పంపి ఫొటోలను సేకరించారు. చెల్లా చెదురుగా పడి ఉన్న బంగారు నాణేలు, వజ్రాలు, అమూల్యమైన ఖనిజాలు, పింగాణీ కప్పులు, మృణ్మయపాత్రలు అందులో కనిపిస్తున్నాయి. ఈ సంపద విలువ లక్ష కోట్లకు పైమాటేనని అంచనా. దీనిపై తమకే హక్కులున్నాయంటూ కొలంబియా అంటుండగా స్పెయిన్, ఒక అమెరికా కంపెనీతోపాటు, బొలీవియా ఆదివాసులు కూడా పోటీకి వస్తున్నారు. ఈ నౌక ఇతివృత్తంగా కొలంబియా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్కెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’ నవల నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది! -
షాక్లో రష్యా.. మరో యుద్ధ నౌకను పేల్చేసిన ఉక్రెయిన్ ఆర్మీ
కీవ్: రష్యా ఉక్రెయిన్పై మిలటరీ ఆపరేషన్ మొదలుపెట్టి రెండు నెలలు దాటింది. యుద్ధం ప్రారంభంలో వార్ వన్సైడ్గా రష్యా వైపే ఉన్నట్లు కనిపించినా రోజులు గడిచే కొద్దీ ఉక్రెయిన్ కూడా రష్యన్ బలగాలకు ధీటుగా బదులిస్తోంది. ఈ మారణహోమాని ముగింపు ఎప్పుడు పడనుందో తెలియడం లేదు. ఇప్పటికే యుద్ధం కారణంగా కోట్లలో ఆస్తులు నష్టం, లక్షల్లో నిరాశ్రయులు కాగా వేల సంఖ్యల్లో ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ సమీపంలో రష్యాకు చెందిన మరో యుద్ధ నౌకను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియోని షేర్ చేశారు. ఉక్రెయిన్ సాయుధ డ్రోన్ సాయంతో రష్యా నియంత్రణలో ఉన్న చిన్న ద్వీపంలోని సెర్నా ప్రాజెక్ట్ ల్యాండింగ్ క్రాఫ్ట్తో పాటు వారి క్షిపణి రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. రష్యాకు అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన యుద్ధనౌకలలో ఒకటిని తాము పేల్చేశామని, ఇది తమకు పెద్ద విజయమని ఉక్రెయిన్ తెలిపింది. ఈ షిప్ పేల్చినప్పుడు రికార్డ్ అయిన బ్లాక్ అండ్ వైట్ ఫూటేజ్ను ఉక్రెయిన్ అధికారులు ట్విటర్లో విడుదల చేశారు. కాగా మే మొదటి వారంలో నల్లసముద్రంలో ఉన్న రష్యన్ యుద్ధ నౌకను పేల్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించిన విషయం తెలిసిందే. Ukrainian Bayraktar TB2 destroyed another Russian ship. This time the landing craft of the "Serna" project. The traditional parade of the russian Black Sea fleet on May 9 this year will be held near Snake Island - at the bottom of the sea. pic.twitter.com/WYEPywmAwX — Defence of Ukraine (@DefenceU) May 7, 2022 చదవండి: Dmitry Rogozin: సంచలన వ్యాఖ్యలు.. మేము తలచుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం -
Russia-Ukraine war: మాస్క్వా మునిగింది
కీవ్: గురువారం భారీగా దెబ్బతిన్న రష్యా ప్రఖ్యాత యుద్ద నౌక మాస్క్వా చివరకు సముద్రంలో మునిగిపోయింది. దెబ్బతిన్న నౌకను దగ్గరలోని నౌకాశ్రయానికి తరలిస్తుండగా మధ్యలోనే మునిగిపోయినట్లు రష్యా ప్రకటించింది. బ్లాక్సీ ఫ్లీట్కే తలమానికమైన నౌక మునిగిపోవడం రష్యాకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఇకపై ఉక్రెయిన్ రాజధానిపై మరిన్ని మిసైల్ దాడులు జరుపుతామని ప్రకటించింది. రష్యా సరిహద్దు భూభాగంపై ఉక్రెయిన్ జరుపుతున్న మిలటరీ దాడులకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నామని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. మాస్క్వా మిస్సైల్ క్రూయిజర్ ప్రత్యేకతలు ► రష్యా నేవీలో ఉన్న మూడు అట్లాంటా క్లాస్ గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లలో ఇది ఒకటి ► సిబ్బంది సంఖ్య: 680 ► పొడవు: 186 మీటర్లు ► గరిష్ట వేగం: 32 నాటికల్ మైళ్లు(59 కి.మీ.) ఆయుధ సంపత్తి ► 16 యాంటీ షిప్ వుల్కన్ క్రూయిజ్ మిస్సైళ్లు ► ఎస్–300 లాంగ్ రేంజ్ మెరైన్ వెర్షన్ మిస్సైళ్లు ► షార్ట్ రేంజ్ ఒస్సా మిస్సైళ్లు ► రాకెట్ లాంచర్స్, గన్స్, టార్పెడోస్ తూర్పు ఉక్రెయిన్ వైపు రష్యా బలగాలు మరలడంతో కీవ్లో జనజీవనం సాధారణస్థాయికి చేరుకుంటోంది. అయితే తాజా హెచ్చరికల నేపథ్యంలో తిరిగి బంకర్లలో తలదాచుకోవాల్సివస్తుందని నగర పౌరులు భయపడుతున్నారు. మాస్క్వా మునకకు అగ్ని ప్రమాదమే కారణమని రష్యా పేర్కొంది. అయితే తమ మిసైల్ దాడి వల్లనే నౌక మునిగిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. వీరి వాదన నిజమైతే ఇటీవల కాలంలో ఒక యుద్ధంలో మునిగిన అతిపెద్ద నౌక మాస్క్వా కానుంది. ఇది రష్యాకు ఒకరకమైన ఓటమిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. 5 కాదు 50 రోజులు ఉక్రెయిన్ ఆక్రమణకు గట్టిగా ఐదు రోజులు పడుతుందని రష్యా భావించిందని, కానీ 50 రోజులైనా రష్యా దాడులను తట్టుకొని నిలిచామని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వీడియో సమావేశంలో చెప్పారు. మాస్క్వా మునక గురించి పరోక్షంగా ప్రస్తావించారు. పోరాడాలని ఉక్రేనియన్లు నిర్ణయించుకొని 50 రోజులైందన్నారు. యుద్ధారంభంలో చాలామంది ప్రపంచ నేతలు తనకు దేశం విడిచి వెళ్లమని సలహా ఇచ్చారని, కానీ ఉక్రేనియన్లను వారు తక్కువగా అంచనా వేశారని చెప్పారు. 50 రోజులు ఎదురునిలిచి పోరాడుతున్నందుకు దేశప్రజలు గర్వించాలన్నారు. అయితే మరోవైపు మారియూపోల్పై రష్యా పట్టుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరాన్ని రష్యా సేనలు దాదాపు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయని, అక్కడ ప్రజలు ఆహారం, నీరు దొరక్క అలమటిస్తున్నారని మీడియా వర్గాలు తెలిపాయి. నగరంలో రష్యా సైనికుల అకృత్యాలకు త్వరలో ఆధారాలు లభిస్తాయని, చాలా శవాలను రష్యన్లు రహస్యంగా ఖననం చేశారని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా సేనలు బొరోవయా ప్రాంతంలో పౌరులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపి 7గురిని పొట్టనబెట్టుకున్నారని చెప్పారు. వీటిని రష్యా ఖండించింది. మాస్క్వాకు అణు వార్హెడ్స్? గురువారం నల్ల సముద్రంలో మునిగిన రష్యా యుద్ధ నౌక మాస్క్వాపై రెండు అణు వార్ హెడ్స్ అమర్చిఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మునిగిన ప్రాంతంలో పర్యావరణ ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై వెంటనే విచారణ జరపాలన్న డిమాండ్ చేశారు. బ్రోక్ యారో ఘటన ( ఒక ప్రమాదంలో అణ్వాయుధాలుండడం)ను తేలిగ్గా తీసుకోకూడదన్నారు. సిబ్బందిలో చాలామంది మరణించే ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిలో 58 మంది మాత్రమే బతికారని, 452 మంది మునిగిపోయారని రష్యా బహిష్కృత నేత పొనొమరేవ్ ఆరోపించారు. మాస్క్వా మునకపై అడ్మిరల్ ఐగొర్ ఓసిపోవ్ను అరెస్టు చేశారని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. 20 వేల రష్యా సైనికులు మృతి? ఇప్పటిదాకా ఏకంగా 20 వేల మంది రష్యా సైనికులను చంపినట్టు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. 160కి పైగా యుద్ధ విమానాలు, 200 హెలికాప్టర్లు, 800 ట్యాంకులు, 1,500కు పైగా సాయుధ వాహనాలు, 10 నౌకను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. 2,000కు పైగా ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను తాము నాశనం చేశామని రష్యా తెలిపింది. నాటోలో చేరితే తీవ్ర పర్యవసానాలు తప్పవని ఫిన్లాండ్, స్వీడన్లను తీవ్రంగా హెచ్చరించింది. స్వదేశానికి 10 లక్షల మంది ఉక్రేనియన్లు యుద్ధం ముగియనప్పటికీ ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిన వారిలో దాదాపుగా 10 లక్షల మంది స్వదేశానికి తిరిగొచ్చారు. ఇప్పుడప్పుడే రావొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులుగా రోజుకు 30 వేల మంది దాకా తిరిగొస్తున్నట్టు సమాచారం. పోలండ్, రుమేనియా తదితర దేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్లోకి రావడానికి ప్రజలు భారీగా క్యూ కట్టారు. కీవ్ చుట్టుపక్కల 900 మందికిపైగా మృతి కీవ్: ఉక్రెయిన్ రాజధాని నగరం చుట్టూ మోహరించిన రష్యన్ సేనలు వెనక్కుమరలడంతో అక్కడ వారు చేసిన ఘోరాలు బయటపడుతున్నాయి. కీవ్ పరిసర ప్రాంతాల్లో 900 మందికి పైగా పౌరుల మృతదేహాలను కనుగొన్నట్లు స్థానిక పోలీసు అధికారి అండ్రీ చెప్పారు. చాలాచోట్ల మృతదేహాలు రోడ్లపై పడిపోయి ఉన్నాయని, కొన్ని చోట్ల అరకొర పూడ్చివేతలున్నాయని చెప్పారు. వీరిలో 95 శాతం మంది తుపాకీ గాయాలతో మరణించినట్లు తెలుస్తోందన్నారు. ఈ దేహాలను ఫొరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపారు. ఎక్కువగా కీవ్కు సమీపంలోని బుచాలో 350 మృతదేహాలు దొరికినట్లు వివరించారు. -
రష్యా యుద్ధనౌకకు భారీ నష్టం
కీవ్: రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌక మాస్కోవాను మిసైళ్లతో పేల్చామని ఉక్రెయిన్ అధికారులు గురువారం ప్రకటించారు. తమ క్షిపణుల ధాటికి నౌక మునిగిపోయిందని ఒక అధికారి చెప్పారు. అయితే తమ నౌకలో అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే నౌకలో సిబ్బందిని ఖాళీ చేయించామని తెలిపింది. ప్రమాదం పెద్దదే కానీ నౌక మునిగిపోలేదని, దాన్ని దగ్గరలోని నౌకాశ్రయానికి చేర్చామని వెల్లడించింది. ప్రమాదం జరిగినప్పుడు నౌకలో 500మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. నౌకకున్న మిసైల్ లాంచర్లు సురక్షితమేనని పేర్కొంది. మాస్కోవా నౌక ఒకేమారు 16 లాంగ్ రేంజ్ మిస్సైళ్లను మోసుకుపోతుంది. నౌకలో ఆయుధాలు పేలడంతో నిప్పంటుకుందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధం నుంచి ఈ నౌక బయటకు రావడం రష్యాకు ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. నష్టం ఎంతటిదైనా ఈ ఘటన రష్యా ప్రతిష్టకు మచ్చగా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్ తేలికపాటి హెలికాప్టర్లను తమ సరిహద్దుల్లోకి పంపి నివాస భవనాలపై బాంబులు కురిపిస్తోందని రష్యా ఆరోపించింది. ఈ దాడుల్లో 7గురు గాయపడ్డారని తెలిపింది. సరిహద్దు వద్ద శరణార్థులు దాటుతుండగా ఉక్రెయిన్ కాల్పులు జరిపిందని అంతకుముందు రష్యా సెక్యూరిటీ సర్వీస్ ఆరోపించింది. మారియుపోల్లో రష్యా ముందంజ ఉక్రెయిన్లోని కీలక నగరం మారియుపోల్లో రష్యా బలగాలు ముందంజ వేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ ప్రతినిధి ఇగార్ కొనషెంకోవ్ చెప్పారు. నగరంలోని ఒక ఫ్యాక్టరీలో 1,026 మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయారన్నారు. ఈ మేరకు రష్యా టీవీ ఒక వీడియోను విడుదల చేసింది. అయితే నగరంలో ఇంకా పోరాటం సాగుతూనే ఉందని ఉక్రెయిన్ మంత్రి వాడైమ్ డెనెసెంకో చెప్పారు. ఎంతమంది బలగాలు నగరంలో పోరాటం చేస్తున్నది తెలియరాలేదు. క్రిమియాతో భూమార్గం ఏర్పాటు చేసుకునేందుకు ఈ నగరం రష్యాకు ఎంతో కీలకం. మాస్కోవా నౌకకు నష్టం వాటిల్లడంతో రష్యా ముందంజ ఎంతమేరకు కొనసాగుతుందోనని అనుమానాలున్నాయి. ప్లానెట్ లాబ్ సంస్థ విడుదల చేసిన శాటిలైట్ ఫొటోల్లో సెవెస్టోపోల్ నౌకాశ్రయం నుంచి మాస్కోవా ఆదివారం బయటకు వచ్చినట్లు మాత్రమే కనిపిస్తోంది. నౌక ప్రస్తుత లొకేషన్ తెలుసుకునేందుకు సాంకేతిక ఆటంకాలు రావడంతో ఎవరి వాదన నిజమన్నది తెలియరాలేదు. ఉక్రెయిన్ అధికారుల్లో ఒకరు నౌకపై నెప్ట్యూన్ మిసైళ్లను ప్రయోగించడంతో భారీ నష్టం వాటిల్లిందని పేర్కొనగా, మరొక అధికారి నౌక మునిగిందని చెబుతూ ఒక వీడియోను షేర్ చేశారు. కానీ మరో సీనియర్ అధికారి దీన్ని ధ్రువీకరించకపోవడంతో ఉక్రెయిన్ ప్రకటనపై సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా సైతం ఘటనపై ఉక్రెయిన్ వాదనను ధ్రువీకరించలేదు. అయితే ఎలా జరిగినా నౌకకు నష్టం వాటిల్లడం రష్యాకు ఎదురుదెబ్బని వ్యాఖ్యానించింది. రెడ్క్రాస్ నగదు సాయం ఉక్రెయిన్లోని 20 లక్షల మంది ప్రజలకు సాయం చేసేందుకు అతిపెద్ద క్యాష్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తామని రెడ్క్రాస్ తెలిపింది. రష్యా యుద్ధంతో ప్రభావితమైనవారికి దాదాపు 10.6 కోట్ల డాలర్లను పంచుతామని సంస్థ ప్రతినిధి నికోల్ చెప్పారు. ఇప్పటికే దాదాపు 10 లక్షలమందికి దుప్పట్లు, ఇతర సామగ్రిని అందించామని చెప్పారు. తాజా నగదు సాయంతో స్థానిక ఎకానమీలో ద్రవ్య లభ్యత పెరుగుతుందన్నారు. పాశ్చాత్యదేశాలు తమనుంచి గ్యాస్ దిగుమతులు నిలిపివేస్తే అది ఆ దేశాలపై నెగెటివ్ ప్రభావం చూపుతుందని రష్యా అధిపతి పుతిన్ హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి చేసుకునే దిగుమతులు యూరప్ దేశాల ఎకానమీలను దెబ్బతీస్తాయన్నారు. పలువురు రష్యా ధనవంతులకు చెందిన 33 ఆస్తులను స్తంభింపజేసినట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. దీంతో ఇంతవరకు ఫ్రాన్స్ స్తంభింపజేసిన రష్యా కుబేరుల ఆస్తుల విలువ 2400 కోట్ల యూరోలకు చేరింది. ఉక్రెయిన్లో ఐర్లాండ్ రక్షణ, విదేశాంగ మంత్రి సైమన్ పర్యటించారు. ఉక్రెయిన్కు దాదాపు 5.8 కోట్ల డాలర్ల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. అమెరికా తాజాగా ప్రకటించిన 80 కోట్ల డాలర్ల సాయానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకింత ప్రత్యేకం? మాస్కోవా నౌక యుద్ధం ఆరంభమైన తొలిరోజుల్లో ఉక్రెయిన్ సైనికులున్న స్నేక్ ఐలాండ్ను చుట్టు ముట్టింది. దీవిలోని సైనికులను లొంగిపోవాలని హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్ సైనికులు మాత్రం ‘‘రష్యా యుద్ధ నౌకా! నిన్ను నువ్వే పేల్చుకో’’ అని ఎదురుతిరిగారని ఆ దేశం పేర్కొంది. దీనికి సంబంధించిన నిజానిజాలు తెలియరాలేదు. కానీ ఈ ఘటనను ఉక్రెయిన్ దేశస్థులు గర్వంగా చెప్పుకుంటారు. తాజాగా ఘటనను గుర్తు చేసుకుంటూ ఒక పోస్టల్స్టాంపును కూడా ఉక్రెయిన్ విడుదల చేసింది. -
ఆర్కే బీచ్ లో మిలాన్ విన్యాసాలు తిలకించనున్న సీఎం వైఎస్ జగన్
-
‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ జల ప్రవేశం.. ప్రత్యేకతలివే..
ముంబై: విశాఖపట్నం అంటే సముద్ర తీరంలోని ఓ నగరం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఓ యుద్ధ నౌక కూడా విశాఖపట్నం పేరిట నిర్మితమైంది. విశాఖ నగర ప్రాధాన్యత తో పాటు చరిత్ర ఆధారంగా నేవీ ఓ యుద్ధ నౌకకు విశాఖపట్నం నామకరణం చేసింది. ఈ యుద్ధనౌక ప్రాధాన్యతలను ఇటీవల తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైఎస్ అడ్మిరల్ ఆజేంద్ర బహదూర్ సింగ్ తాడేపల్లిలో సీఎం జగన్మోహన్రెడ్డికి కూడా వివరించారు. ఆదివారం ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ‘విశాఖపట్నం యుద్ధనౌక’ను ప్రారంభించారు. ఈ యాంటీ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక రక్షణ రంగంలో కీలక భూమిక పోషించనుంది. చదవండి: క్రికెట్కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్లో నలిగిన ఆటగాళ్లు విశాఖ నగరానికి రక్షణ రంగానికి ఎంతో అనుబంధం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి విశాఖ నగరంపై శత్రుదేశాల దృష్టితో పాటు ఈ నగరం కేంద్రంగా శత్రు దేశాలు ఎదుర్కోడానికి భారత్ రక్షణ దళం కూడా ప్రత్యేక స్థావరాలు కొనసాగించింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో కైలాసగిరి.. యారాడ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేక సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అరకులో పద్మాపురం గార్డెన్స్ నుంచి సైనికులకు కూరగాయలు ప్రత్యేకంగా సరఫరా చేసేవాళ్లు. 1971లో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించడంలో విశాఖ కేంద్రంగా కొనసాగుతున్న తూర్పు నౌకాదళం ప్రధాన భూమిక పోషించింది. దీనికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దశలో విశాఖ నగర ఖ్యాతి ప్రాధాన్యతను గుర్తిస్తూ నావికాదళం ఇటీవల విశాఖపట్నం అని పేరు పెట్టింది. 2011 జనవరి 18 నుంచి రూపకల్పన జరిగిన ఈ యుద్ధనౌక డైరెక్టర్ ఆఫ్ నావెల్ డిజైన్. ఇండియన్ నేవీ సంయుక్తంగా యుద్ధనౌక రూపకల్పన డిజైన్ చేసింది గంటకు 30 నాటికా మైళ్ల వేగంతో ప్రయాణం చేసే యుద్ధనౌక ఏకదాటిగా నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసే సామర్థ్యం పూర్తిగా 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ విశాఖపట్నం మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక సముద్రంలో ట్రయిల్ రన్ పూర్తిచేసుకుని రక్షణ రంగంలో సేవలకు సిద్ధమైంది. ముంబైలో రూపొందిన ఈ యుద్ధనౌకను గత నెల 31వ తేదీన తూర్పు నౌకాదళ అధికారులకు అప్పగించారు. ఈ దశలో ఈ యుద్ధ నౌక విశాఖ కేంద్రం సేవలు అందించనుంది. సీఎం వైఎస్ జగన్ విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన దశలో ఆ నగరం పేరిట యుద్ధనౌక రూపొందడం గొప్ప విషయంగా ప్రజలు భావిస్తున్నారు. దీన్ని లాంఛనంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు ప్రారంభించడంపై విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖ.. ఓ యుద్ధనౌక
సుందర నగరం.. సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రపంచం చూపు తన వైపు తిప్పుకుంటున్న విశాఖపట్నం పేరుని ఓ యుద్ధ నౌకకు పెట్టడం గర్వించదగ్గ విషయం. ఈ నెల 21న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం.. హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణలో కీలకంగా మారనుంది. క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా.. మిస్సైల్ డిస్ట్రాయర్గా సత్తా చాటగల సామర్థ్యం విశాఖపట్నం యుద్ధ నౌక సొంతం. ఈ యుద్ధ నౌకతో పాటు సంధ్యక్ షిప్ని కూడా డిసెంబర్లో జాతికి అంకితం చేసేందుకు నౌకాదళం సన్నద్ధమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూర కేంద్రంగా.. తూర్పు తీరంలో వ్యూహాత్మక రక్షణ ప్రాంతంగా.. విశాఖపట్నం కీలకంగా మారింది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ని ఓడించి.. జాతి గర్వించదగ్గ గెలుపునందించిన విశాఖ పేరు వింటే.. తెలుగు ప్రజల గుండె ఉప్పొంగుతుంది. మరి సముద్ర రక్షణలో శత్రువులను సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌకని విశాఖపట్నం పేరుతో పిలిచే రోజు సమీపించింది. భారత నౌకాదళం ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకని సిద్ధం చేసింది. ఈ నెల 21న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ముంబైలో జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం తూర్పు నౌకాదళం కేంద్రంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం సేవలందించనుంది. ప్రాజెక్టు–15బీలో మొదటి యుద్ధ నౌక ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలు విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లు పెట్టాలని నిర్ణయించింది. తొలి షిప్ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. 2013 అక్టోబర్లో షిప్ తయారీ పనులను వై–12704 పేరుతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్) ప్రారంభించింది. ఇది సముద్ర ఉపరితలంపైనే ఉంటుంది.. కానీ ఎక్కడి శత్రువుకి సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖ శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. సముద్ర జలాల్లోకి సంధాయక్ సాగర గర్భాన్ని శోధిస్తూ భారత భూభాగాన్ని పరిరక్షిస్తూ.. తిరుగులేని శక్తిగా సేవలందించేందుకు మరో నౌక సన్నద్ధమవుతోంది. 1981 నుంచి దేశ రక్షణలో ముఖ్య భూమిక పోషిస్తూ అనేక కీలక ఆపరేషన్లలో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని.. ఈ ఏడాది జూన్లో సేవల నుంచి ఐఎన్ఎస్ సంధాయక్ నిష్క్రమించింది. దాని స్థానంలో హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్(లార్జ్) సంధాయక్ని నిర్మిస్తున్నారు.ఈ నౌక నిర్మాణానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖకు, కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) మధ్య ఒప్పందం జరిగింది. హల్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్లో తొలిసారిగా సముద్ర జలాల్లోకి రానుంది. అనంతరం.. బేస్ ట్రయల్స్, సీ ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సంధాయక్ షిప్ల కంటే.. ఇది అతి పెద్ద సర్వే నౌకగా అవతరించబోతోంది. సముద్రలోతుల్ని, కాలుష్యాన్ని సర్వే చేయడంలో సంధాయక్ ప్రపంచంలోనే మేటి షిప్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. ఇందులో కొత్త సాంకేతికతతో కూడిన హైడ్రోగ్రాఫిక్ పరికరాలు అమర్చారు. హిందూ మహా సముద్రంలోని భౌగోళిక డేటాని సేకరించేందుకు తొలిసారిగా దీన్ని వినియోగించనున్నారు. నౌకాదళానికి కొత్తబలం హిందూ మహా సముద్ర ప్రాంతంలో మారుతున్న పవర్ డైనమిక్స్కి అనుగుణంగా విధులు నిర్వర్తించేలా ఐఎన్ఎస్ విశాఖ సత్తా చాటనుంది. ఈ యుద్ధ నౌక తూర్పు నౌకాదళ బలాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా డిజిటల్ సర్వే కచ్చితత్వ ప్రమాణాల్ని పసిగట్టేవిధంగా సంధాయక్ కూడా త్వరలోనే కమిషనింగ్కు సిద్ధమవుతోంది. డిజిటల్ సర్వే అండ్ ప్రాసెసింగ్ సిస్టమ్, ఆటోమేటెడ్ డేటా లాగిన్ సిస్టమ్, ఓషినోగ్రాఫిక్ సెన్సార్లు, సీ గ్రావి మీటర్, సైడ్ స్కాన్ సోనార్లు, మల్టీబీమ్ స్వాత్ ఎకో సౌండింగ్ సిస్టమ్లతో గతంలో ఉన్న సర్వే నౌకలకు భిన్నంగా ఇది రూపుదిద్దుకుంటోంది. – వైస్ అడ్మిరల్ అజేంద్ర బహద్దూర్ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి ► సిబ్బంది– 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది ► సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు– మల్టీ ఫంక్షన్ రాడార్, ఎయిర్ సెర్చ్ రాడార్ ► విమానాలు– రెండు వెస్ట్ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదా రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాలు తీసుకెళ్లగలదు ► ఆయుధాలు– 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు -
శత్రువుల పాలిట సింహస్వప్నం.. ‘విశాఖ’
Rajnath Singh Dedicates Ins Visakhapatnam Warship : సుందర నగరం.. సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రపంచం చూపు తన వైపు తిప్పుకుంటున్న విశాఖకు విశిష్ట గుర్తింపు లభించింది. ప్రాజెక్టు 15–బీలో భాగంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌక సిద్ధమైంది. దీన్ని ఈ నెల 21న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. ఈ యుద్ధ నౌక తూర్పు నౌకాదళ బలాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. సాక్షి, విశాఖపట్నం: సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూర కేంద్రంగా.. తూర్పు తీరంలో వ్యూహాత్మక రక్షణ ప్రాంతంగా.. విశాఖపట్నం కీలకంగా మారింది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ని ఓడించి.. జాతి గర్వించదగ్గ గెలుపునందించిన విశాఖ పేరు వింటే.. తెలుగు ప్రజల గుండె ఉప్పొంగుతుంది. మరి సముద్ర రక్షణలో శత్రువులను సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌకని విశాఖపట్నం పేరుతో పిలిచే రోజు సమీపించింది. భారత నౌకాదళం ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకని సిద్ధం చేసింది. ఈ నెల 21న రక్షణ శాఖ మంత్రి రాజ్నా«థ్ సింగ్ చేతుల మీదుగా ముంబైలో జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం తూర్పు నౌకాదళం కేంద్రంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం సేవలందించనుంది. ప్రాజెక్టు–15బీలో మొదటి యుద్ధ నౌక ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలు విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లు పెట్టాలని నిర్ణయించింది. తొలి షిప్ని విశాఖపట్నంపేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. 2013 అక్టోబర్లో షిప్ తయారీ పనులను వై–12704 పేరుతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్) ప్రారంభించింది. ఇది సముద్ర ఉపరితలంపైనే ఉంటుంది.. కానీ ఎక్కడి శత్రువుకి సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. సముద్ర జలాల్లోకి సంధాయక్ సాగర గర్భాన్ని శోధిస్తూ భారత భూభాగాన్ని పరిరక్షిస్తూ.. తిరుగులేని శక్తిగా సేవలందించేందుకు మరో నౌక సన్నద్ధమవుతోంది. 1981 నుంచి దేశ రక్షణలో ముఖ్య భూమిక పోషిస్తూ అనేక కీలక ఆపరేషన్లలో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని.. ఈ ఏడాది జూన్లో సేవల నుంచి ఐఎన్ఎస్ సంధాయక్ నిష్క్రమించింది. దాని స్థానంలో హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్(లార్జ్) సంధాయక్ని నిర్మిస్తున్నారు. ఈ నౌక నిర్మాణానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖకు, కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) మధ్య ఒప్పందం జరిగింది. హల్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్లో తొలిసారిగా సముద్ర జలాల్లోకి రానుంది. అనంతరం.. బేస్ ట్రయల్స్, సీ ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సంధాయక్ షిప్ల కంటే.. ఇది అతి పెద్ద సర్వే నౌకగా అవతరించబోతోంది. సముద్రలోతుల్ని, కాలుష్యాన్ని సర్వే చేయడంలో సంధాయక్ ప్రపంచంలోనే మేటి షిప్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. ఇందులో కొత్త సాంకేతికతతో కూడిన హైడ్రోగ్రాఫిక్ పరికరాలు అమర్చారు. హిందూ మహా సముద్రంలోని భౌగోళిక డేటాని సేకరించేందుకు తొలిసారిగా దీన్ని వినియోగించనున్నారు. నౌకాదళానికి కొత్తబలం హిందూ మహా సముద్ర ప్రాంతంలో మారుతున్న పవర్ డైనమిక్స్కి అనుగుణంగా విధులు నిర్వర్తించేలా ఐఎన్ఎస్ విశాఖపట్నం సత్తా చాటనుంది. ఈ యుద్ధ నౌక తూర్పు నౌకాదళ బలాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా డిజిటల్ సర్వే కచ్చితత్వ ప్రమాణాల్ని పసిగట్టేవిధంగా సంధాయక్ కూడా త్వరలోనే కమిషనింగ్కు సిద్ధమవుతోంది. డిజిటల్ సర్వే అండ్ ప్రాసెసింగ్ సిస్టమ్, ఆటోమేటెడ్ డేటా లాగిన్ సిస్టమ్, ఓషినోగ్రాఫిక్ సెన్సార్లు, సీ గ్రావి మీటర్, సైడ్ స్కాన్ సోనార్లు, మల్టీబీమ్ స్వాత్ ఎకో సౌండింగ్ సిస్టమ్లతో గతంలో ఉన్న సర్వే నౌకలకు భిన్నంగా ఇది రూపుదిద్దుకుంటోంది. – వైస్ అడ్మిరల్ అజేంద్ర బహద్దూర్ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి -
టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్పర్స్న్గా ప్రశాంతి ప్రమాణం
-
టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్ పర్సన్ గా ప్రశాంతి రెడ్డి ప్రమాణం..
న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ సలహామండలికి చైర్పర్సన్గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర భారతదేశంలో టీటీడీ ఆలయాల అభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలయ గర్భగుడిని అలాగే ఉంచి.. మిగిలిన ప్రాంతాన్ని పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు. అయోధ్యలో టీటీడీ ఆలయంలో గానీ, భజన మండలి నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలోని 29 పీఠాధిపతులతో తిరుమలలో గోమహా సమ్మేళనం నిర్వహిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అన్నారు. దేశంలోని ఏ గుడిలో నైనా.. గోవును అడిగితే ఉచితంగా అందజేస్తామని తెలిపారు. దేశంలో అనేక చోట్ల గోవులకు సరైన పోషణ ఉండటం లేదని ఆవేదన సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. గోసంరక్షణ కోసం అవసరమైన నిధులను కూడా.. టీటీడీ కేటాయిస్తుందని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
Warship: ఐఎన్ఎస్ విశాఖపట్నం.. ఆ పేరెందుకు పెట్టారంటే..
సాక్షి, విశాఖపట్నం: పాకిస్తాన్ పీచమణిచి.. 1971 యుద్ధంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడిన చిరస్మరణీయ విజయానికి విశాఖ కీలక వేదికగా నిలిచింది. భారత జాతి గర్వించదగ్గ గెలుపును అందించిన విశాఖ పేరు వింటేనే ఉత్తరాంధ్ర వాసులకే కాదు.. యావత్ తెలుగు ప్రజల గుండె ఉప్పొంగుతుంది. అలాంటిది.. సముద్ర రక్షణలో శత్రువుల్ని సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరు పెడితే ఆ ఆనందం సాగరమంత అవుతుంది. అందుకే.. నౌకాదళ అధికారులు ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకను సిద్ధం చేశారు. త్వరలోనే దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక విశేషాలివీ. (చదవండి: పసిడికి పెట్టింది పేరు.. నరసాపురం గోల్డ్ మార్కెట్) విశాఖపట్నం పేరెందుకు పెట్టారంటే.. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిౖసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లను పెట్టాలని సంకల్పించి తొలి షిప్ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. చదవండి: పర్యాటకానికి 'జల'సత్వం ముంబైలో తయారీ 2011 జనవరి 28న ఈ ప్రాజెక్ట్ ఒప్పందం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్, ఇండియన్ నేవీకి చెందిన అంతర్గత డిజైన్ సంస్థలు షిప్ డిజైన్లని సిద్ధం చేశాయి. 2013 అక్టోబర్లో విశాఖపట్నం యుద్ధనౌక షిప్ తయారీకి వై–12704 పేరుతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్) శ్రీకారం చుట్టింది. 2015 నాటికి హల్తో పాటు ఇతర కీలక భాగాలు పూర్తి చేసింది. తయారు చేసే సమయంలో పలుమార్లు ప్రమాదాలు కూడా సంభవించాయి. 2019 జూన్లో షిప్లోని ఏసీ గదిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించాడు. అయితే.. షిప్ తయారీలో మాత్రం ఎక్కువ నష్టం వాటిల్లలేదు. 2020లో రెండుసార్లు విజయవంతంగా సీ ట్రయల్స్ పూర్తి చేసిన అనంతరం తూర్పు నౌకాదళానికి ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను అక్టోబర్ 28న అప్పగించారు. డిసెంబర్లో దీనిని జాతికి అంకితం చేయనున్నారు. శత్రువుల పాలిట సింహస్వప్నమే ఇది సముద్ర ఉపరితలంపైనే ఉన్నా.. ఎక్కడ శత్రువుకు సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖను శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. యుద్ధ నౌక విశేషాలివీ.. బరువు 7,400 టన్నులు పొడవు 163 మీటర్లు బీమ్ 17.4 మీటర్లు డ్రాఫ్ట్ 5.4 మీటర్లు వేగం గంటకు 30 నాటికల్ మైళ్లు స్వదేశీ పరిజ్ఞానం - 75 శాతం పరిధి - ఏకధాటిన 4 వేల నాటికల్ మైళ్ల ప్రయాణం సెన్సార్స్ ,ప్రాసెసింగ్ వ్యవస్థలు- మల్టీ ఫంక్షన్ రాడార్, ఎయిర్ సెర్చ్ రాడార్ ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు విమానాలు: రెండు వెస్ట్ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదు రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాల్ని తీసుకెళ్లగలదు -
భారత నేవీకి ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలు అందిస్తాం: రోల్స్రాయిస్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ యుద్ధనౌకలను అభివృద్ధి చేయడానికి సంబంధించి భారత నౌకాదళంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై ఏరో ఇంజిన్స్ తదితర ఉత్పత్తుల తయారీ దిగ్గజం రోల్స్–రాయిస్ ఆసక్తి వ్యక్తం చేసింది. భారత నేవీకి యుద్ధ నౌకలు మొదలైన వాటిని ఆధునికీకరించేందుకు అపార అనుభవం తమకుందని కంపెనీ నేవల్ సిస్టమ్స్ విభాగం చీఫ్ రిచర్డ్ పార్ట్రిడ్జ్ తెలిపారు. నౌకలను హైబ్రిడ్ ఎలక్ట్రిక్, పూర్తి ఎలక్ట్రిక్ విధానంలో నడిపించేందుకు అవసరమైన ఉత్పత్తులను తాము అందించగలమని వివరించారు. బ్రిటన్ నేవీ కోసం ప్రపంచంలోనే తొలి హైబ్రిడ్–ఎలక్ట్రిక్ నేవల్ సిస్టమ్ డిజైనింగ్ నుంచి తయారీ దాకా తామే చేసినట్లు రిచర్డ్ పేర్కొన్నారు. త్వరలో నిర్వహించే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ టూర్లో తమ సామర్థ్యాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. -
అమెరికా యుద్ధ నౌకను తరిమికొట్టాం: చైనా
బీజింగ్: తమ దేశ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా యుద్ధ నౌకను తరిమికొట్టినట్లు చైనా మిలిటరీ ప్రకటించింది. వివాదాస్పదమైన పారాసెల్ దీవులకు సమీపంలో సోమవారం చైనా జలాల్లోకి అమెరికా యుద్ధనౌక చట్టవిరుద్ధంగా ప్రవేశించినట్లు డ్రాగన్ దేశం తెలిపింది. దక్షిణ చైనా సముద్ర జలాలాపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు తీర్పు వెల్లడించిన ఐదేళ్లకు చైనా ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. అమెరికాకు చెందిన యూఎస్ఎస్ బెన్ఫోల్డ్ యుద్ధ నౌక చైనా ప్రభుత్వ అనుమతి లేకుండా పారాసెల్స్ జలాల్లోకి ప్రవేశించిందని చైనా ఆర్మీ పీఎల్ఏ సదరన్ థియేటర్ కమాండర్ తెలిపారు. అమెరికా చర్యలు చైనా సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాక దక్షిణ చైనా సముద్రం స్థిరత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ఆరోపించించారు. అమెరికా తక్షణమే ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని కమాండర్ ఓ ప్రకటనలో కోరారు. చైనా ఆరోపణలు అవాస్తవం: అమెరికా చైనా ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు అగ్ర రాజ్య విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ స్పందిస్తూ.. ‘‘అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, పారాసెల్స్ దీవుల పరిసరాల్లో మా యుద్ధ నౌక సంచిరించింది. చైనా సార్వభౌమాత్వానికి భంగం కలిగించామనడం పూర్తిగా అవాస్తవం. అంతేకాక అంతర్జాతీయ చట్టాలు అనుమతించిన ప్రతి చోట అమెరికా ఎగురుతుంది, ప్రయాణిస్తుంది.. పనిచేస్తూనే ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును పట్టించుకోని చైనా చైనాలో జిషాగా పిలిచే పారాసెల్స్ ప్రాంతం వందలాది ద్వీపాలు, కోరల్ దీవులు, సముద్ర సంపదకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంపై తమకే హక్కుందని చైనా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనే దేశాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో 1970 లలో హైనాన్ ద్వీపానికి ఆగ్నేయంగా 220 మైళ్ళు (350 కిలోమీటర్లు), 250 మైళ్ళు (వియత్నాంకు 400 కిలోమీటర్లు) బంజరు ద్వీపాల గొలుసు అయిన పారాసెల్స్ను చైనా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతాన్ని వియత్నాం తమదిగా చెప్పుకుంటుంది. అక్కడ దీన్ని హోంగ్ సా అని పిలుస్తారు. అలానే తైవాన్ కూడా దీనిపై తమకే హక్కుందని ప్రచారం చేసుకుంటుంది. ఈ ప్రాంతం గుండా ఏదైనా సైనిక నౌక ప్రయాణించే ముందు మూడు దేశాల నుంచి అనుమతి తీసుకోవాలి. ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వాలి. అయితే ఈ వివాదంపై అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్ 2016, జూలై 12న సంచలన తీర్పు ఇచ్చింది. చైనా నైన్-డాష్ లైన్గా పిలుచుకునే పారాసెల్స్ ప్రాంతంపై బీజింగ్కు చారిత్రతకంగా ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. అంతేకాక ఫిలిప్పీన్స్కు ఉన్న చేపలు పట్టే హక్కును ఉల్లంఘిస్తోందని.. రెడ్ బ్యాంక్ వద్ద చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం మైనింగ్ చేస్తూ.. ఫిలిఫ్పీన్స్ దేశ సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తుందని తెలిపింది. -
Iran: అతిపెద్ద యుద్ధనౌక కథ విషాదాంతం
టెహ్రాన్: ఇరాన్ నావికా దళానికి చెందిన అతిపెద్ద యుద్ధ నౌక ‘ఖర్గ్’ కథ ముగిసింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో విధి నిర్వహణలో ఉన్న ఈ నౌకలో బుధవారం తెల్లవారుజామున 2.25 గంటలకు మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. చివరకు ఖర్గ్ నీట మునిగింది. ఈ యుద్ధ నౌక పొడవు 207 మీటర్లు (679 అడుగులు). సముద్రంలో ఇతర నౌకలను అవసరమైన సామగ్రిని సరఫరా చేయడానికి, శిక్షణ కోసం ఈ నౌకను ఉపయోగిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు నౌకపై 400 మంది సిబ్బంది ఉన్నారని, వారంతా ప్రాణాలతో బయటపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. దాదాపు 20 మంది గాయపడ్డారని తెలియజేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఆగ్నేయంగా 1,270 కిలోమీటర్ల దూరంలో హర్మూజ్ జలసంధికి సమీపంలో జాస్క్ పోర్టు వద్ద ఖర్గ్ నీటిలో మునిగిపోయింది. గత ఏడాది ఇరాన్ సైన్యానికి శిక్షణ ఇస్తుండగా ఓ క్షిపణి పొరపాటున జాస్క్ పోర్టు వద్ద యుద్ధ నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది నావికులు మరణించారు. 15 మంది గాయపడ్డారు. అంతకుముందు 2018లో ఇరాన్ యుద్ధనౌక కాప్సియన్ కూడా సముద్రంలో మునిగింది. (చదవండి: వైరల్: 12 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజీ.. కలవరపడుతున్న నెటిజన్లు ) -
అమెరికన్ యుద్ధ నౌకను చుట్టుముట్టిన యూఎఫ్ఓలు
వాషింగ్టన్: యూఎఫ్ఓల (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్) గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికి ఆసక్తే. ఇప్పటికే చాలా మంది తాము యూఎఫ్ఓలను చూశామని ప్రకటించారు. వీరి వ్యాఖ్యలను నమ్మే వారు ఎందరుంటారో.. కొట్టి పారేసేవారు కూడా అంతే మంది ఉంటారు. ఈ క్రమంలో యూఎఫ్ఓలు ఉన్నాయనే వాదనకు బలం చేకూర్చింది అమెరికన్ నేవీ. కొద్ది రోజుల క్రితం యూఎస్ నేవీ యూఎఫ్ఓలకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2019లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అమెరికన్ నేవీ తెలిపింది. ఈ క్రమంలో పరిశోధనాత్మక చిత్రాల దర్శకుడు జెరెమీ కోర్బెల్ అదే సంఘటనకు సంబంధించిన మరో వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. దీనిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 యూఎఫ్ఓలు ఉన్నాయి. ఇవి అమెరికన్ నేవీ యుద్ధ నౌక ఒమాహాను చుట్టుముట్టినట్లు కోర్బెల్ తెలిపాడు. వీటి వేగం గంటకు 70-250 కిలోమీటర్ల వరకు ఉందని.. ఒమాహాతో పోల్చితే మూడు రెట్లు వేగవంతమైనవని కోర్బెల్ వెల్లడించాడు. రాడార్ స్క్రీన్ మీద ఈ యూఎఫ్ఓలు కనిపించాయన్నాడు కోర్బెల్. 2019 US Navy warships were swarmed by UFOs; here's the RADAR footage that shows that. Filmed in the Combat Information Center of the USS Omaha / July 15th 2019 / this is corroborative electro-optic data demonstrating a significant UFO event series in a warning area off San Diego. pic.twitter.com/bZS5wbLuLl — Jeremy Corbell (@JeremyCorbell) May 27, 2021 కోర్బెల్ ప్రకారం, ఈ వీడియోను ఓడ కమాండ్ సెంటర్లో చిత్రీకరించారని.. ఫుటేజ్ని ఇంకా వర్గీకరించలేదన్నాడు. ఇతను గతంలో అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా టాస్క్ ఫోర్స్(యూఏపీటీఎషఫ్) దగ్గర ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. వీటిని అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, పెంటగాన్ కూడా ధ్రువీకరించింది. పెంటగాన్ ప్రతినిధి సుసాన్ గోఫ్ ఏప్రిల్లో ది బ్లాక్ వాల్ట్తో మాట్లాడుతూ.. "యూఏపీటీఎఫ్ ఈ సంఘటనలను వారి కొనసాగుతున్న పరీశోధనలలో చేర్చింది" అని వెల్లడించారు. మే 15 న కోర్బెల్ షేర్ చేసిన వీడియోలో, “గోళాకార” యూఎఫ్ఓ ఒకటి సముద్రంలో అదృశ్యమైనట్లు పెంటగాన్ మరోసారి ధ్రువీకరించింది. కోర్బెల్ గతంలో విడుదల చేసిన ఫుటేజ్ ప్రామాణికమైనదని.. టాస్క్ ఫోర్స్ యూఎఫ్ఓల కదలికలను పరిశీలిస్తున్నట్లు అమెరిక రక్షణ శాఖ తెలిపింది. చదవండి: ‘‘ఏలియన్స్ నన్ను 50 సార్లు కిడ్నాప్ చేశారు’’ -
తౌక్టే ఎఫెక్ట్ : 273 మంది ఉన్న నౌక కొట్టుకుపోయింది
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ అతి తీవ్ర తుఫాన్గా మారింది. ఇప్పటికే ఈ తుఫాన్ ధాటికి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ , గోవా, గుజరాత్, రాష్ట్రాల తీర ప్రాంతాలు విలవిలలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడుతున్నాయి. బలమైన గాలుల ధాటికి ముంబై పశ్చిమ తీరంలో 'పి 305' అనే వ్యాపార నౌక కొట్టుకుపోయింది. అందులో సుమారు 273 మంది ఉన్నట్లు సమాచారం. సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఎఆర్) వారు పంపించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కొచ్చి గాలింపు చర్యలను ప్రారంభించింది. ఈ రాత్రికి గుజరాత్లోని పోరుబందర్- మహువా మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ( చదవండి: Cyclone Tauktae: అత్యంత తీవ్ర తుపానుగా తౌక్టే ) -
INS Dhruv: ఇండియన్ జేమ్స్బాండ్.. ‘ధ్రువ్’
సాక్షి, విశాఖపట్నం: శత్రుదేశం ఎక్కుపెట్టిన క్షిపణి ఏదైనా సరే.. అదెక్కడ ఉంది.. ఎంత దూరంలో ఉంది.. దాన్ని ఛేదించేందుకు ఏం చేయాలనే వివరాల్ని రక్షణ రంగానికి చేరవేయగల సత్తాతో భారత్ అమ్ముల పొదిలో ‘ధ్రువ్’తార త్వరలో చేరబోతోంది. విభిన్న సాంకేతికతతో అత్యంత రహస్యంగా రూపొందించిన ఈ క్షిపణి (మిసైల్)గ్రాహక యుద్ధ నౌక త్వరలోనే భారత నౌకాదళంలో సేవలందించనుంది. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డు (హెచ్ఎస్ఎల్)లో రూ.1,500 కోట్ల వ్యయంతో ‘ఐఎన్ఎస్ ధ్రువ్’ రూపుదిద్దుకుంది. అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఈ సముద్ర నిఘా గూఢచారి నౌక వీసీ–11184ను నిర్మించారు. అనేక ప్రత్యేకతలు, శత్రు క్షిపణుల్ని గుర్తించగల అరుదైన సామర్థ్యం గల ఈ నౌకను రక్షణ శాఖ త్వరలోనే జాతికి అంకితం చేయనుంది. అణు క్షిపణుల్ని సైతం.. ధ్రువ్.. అనేక మిషన్లను ఒంటిచేత్తో పూర్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు, ఇండియన్ నేవీ ఇంజినీర్లు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) శాస్త్రవేత్తలు, హిందుస్థాన్ షిప్యార్డు (హెచ్ఎస్ఎల్) నిపుణులు ఈ నౌక నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్తో పాటు ఇతర భూభాగాల నుంచి మిసైల్స్ ప్రయోగిస్తే.. వాటిని ధ్రువ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. వాటి లక్ష్యాన్ని అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో ఇది సులువుగా కనిపెట్టేస్తుంది. వీటిని ఏ ప్రాంతంలో ధ్వంసం చేస్తే.. దేశానికి మేలు జరుగుతుందన్న విస్తృత సమాచారాన్ని రక్షణ శాఖకు అందించగల సామర్థ్యం దీని సొంతం. సాధారణ మిసైల్స్తో పాటు న్యూక్లియర్ మిసైల్స్ జాడల్ని కూడా సులభంగా గుర్తించేలా ధ్రువ్లో సాంకేతికతను అమర్చారు. ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ దేశం మొత్తం ఎప్పటికప్పుడు నిశిత పరిశీలన చేసే శాటిలైట్ మోనిటర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ నౌక నిర్మాణంతో అత్యాధునిక అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న పీ–5 దేశాల సరసన భారత్ చేరింది. ఇప్పటివరకూ ఈ తరహా టెక్నాలజీ నౌకలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఉన్నాయి. అందుకే భారత నౌకాదళం ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ యుద్ధనౌకను ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ అని పిలుస్తున్నారు. దీని తయారీని 2015లో ప్రారంభించారు. 2020 అక్టోబర్లో నౌక నిర్మాణం పూర్తయింది. హిందుస్థాన్ షిప్యార్డులో నిర్మితమైన అతి భారీ నౌక ఇదే కావడం విశేషం. అత్యంత రహస్యంగా దీని నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో సెన్సార్లతో కూడిన ‘త్రీ డోమ్ షేప్డ్ సరై్వలెన్స్ సిస్టమ్’ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరే రాడార్స్ టెక్నాలజీ వినియోగించారు. దీని ద్వారా 14 మెగావాట్ల విద్యుత్ను సైతం ఉత్పత్తి చేయొచ్చు. నౌక నిర్మాణం పూర్తయిన తర్వాత 6 నెలల పాటు రహస్యంగా షిప్యార్డు డ్రై డాక్లోనే ఉంచారు. ఇటీవలే ప్రయోగాత్మకంగా విధుల్లోకి తీసుకొచ్చారు. త్వరలోనే అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు. -
గ్రేట్ ఇండియన్ ‘దేజా వూ’
పరిణామాలు కొన్ని వింతగొలుపుతున్నవి. చరిత్ర పునరావృత మవుతున్నట్టుగా తోస్తున్నది. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ గతంలోనే చూసినట్టు తోచే మానసిక స్థితిని దేజా వూ అంటారు. ఇప్పుడు మస్తిష్కం నిండా దేజా వూ! అమెరికా సప్తమ నౌకా దళానికి (సెవెంత్ ఫ్లీట్) చెందిన యుద్ధనౌక ఒకటి శుక్రవారం నాడు భారత పొలిమేరల్లోకి వచ్చింది. అది కూడా స్నేహపూర్వ కంగా కాదు. ఆ నౌకాదళం విడుదల చేసిన ప్రకటన చూస్తుంటే దాని ధోరణి భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్నట్టు గానే ఉన్నది. ఏ దేశానికైనా తీరం నుంచి రెండొందల నాటికల్ మైళ్ల దూరం వరకు ప్రత్యేక వాణిజ్య హక్కులుంటాయి. ఆ పరిధి దాటి లోపలికి రావాలంటే అనుమతి అవసరం. ఇది 1976 నాటి మారిటైమ్ చట్టం ప్రకారం దేశాలకు దఖలుపడ్డ ప్రత్యేక హక్కు. ఇప్పుడా హక్కును అమెరికా సెవెంత్ ఫ్లీట్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది. మార్కెట్లో వ్యాపారుల దగ్గర మామూళ్లకోసం ముందుగా ఓ ఆకు రౌడీ వస్తాడు. మాట వినకపోతే ఆ వెనుక చాకురౌడీ వస్తాడు. గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా సెవెంత్ ఫ్లీట్ ఈ చాకు రౌడీ పాత్రను పోషిస్తున్నది. ఫిలిప్పీన్స్, కొరియా, వియత్నాంల నుంచి పడమట పర్షియన్ గల్ఫ్ వరకు పలుచోట్ల సప్తమ నౌకాదళం యుద్ధనౌకలు గతంలో లంగరేశాయి. ఎక్కడ లంగరు వేసినా సరే, అక్కడ ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టుగా ఎర్ర బారుతుంది. సూర్యుడు నెత్తురు కక్కుతున్నట్టుగా కనిపిస్తాడు. ఒక్క మాటలో సెవెంత్ ఫ్లీట్ వృత్తాంతం మొత్తం ఇదే. భారత్పై సెవెంత్ ఫ్లీట్ తాజా కవ్వింపు యాభయ్యేళ్ల కిందటి సంగతిని గుర్తు చేస్తున్నది. భారత్–పాక్ల మధ్య బంగ్లా యుద్ధంలో జరుగుతున్న రోజుల్లో కూడా సెవెంత్ ఫ్లీట్ బంగాళాఖాతంలోకి ప్రవేశించి, బెదిరించే ప్రయత్నం చేసింది. కానీ, అప్పటికే భారత్–రష్యాల మధ్య సైనిక సహకార ఒప్పందం ఉన్న కారణంగా అమెరికా ప్రయత్నం ఫలించలేదు. అప్పుడు పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) ప్రజలను పాక్ సైనిక పాలకులు రెండోశ్రేణి పౌరులుగా చులకన చూసేవారు. బెంగాలీ సంస్కృతిని చిన్న చూపు చూసేవారు. ఈ వైఖరిపై బెంగాలీ ప్రజల నిరసన జాతీ యోద్యమం రూపుదాల్చింది. ఉద్యమంపై పాక్ పాలకులు ఉక్కుపాదం మోపారు. లక్షల సంఖ్యలో తూర్పు బెంగాలీలు పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. అంది వచ్చిన అవకాశాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. పాకిస్తాన్ను చావుదెబ్బ కొట్టి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకులయ్యారు. అప్పటినుంచి ఆమె ప్రభ మధ్యందిన మార్తాండ తేజంతో వెలిగిపోయింది. నాటి జన సంఘ్ నాయకుడు వాజ్పేయి సైతం ఆమెను అపర కాళికా దేవిగా కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత బారువా ఒకడుగు ముందుకువేసి ఇందిర ఈజ్ ఇండియా–ఇండియా ఈజ్ ఇందిర’ అనే నినాదాన్ని ప్రచారంలో పెట్టాడు. బంగ్లా యుద్ధం భారత రాజకీయాలను మలుపు తిప్పింది. ఏకధ్రువ రాజకీయ వ్యవస్థకు తోడుగా, ఏకవ్యక్తి నియంతృత్వ పాలన కాంక్ష కూడా ఇందిరలో ప్రబలింది. ఇది ఎమర్జెన్సీకి దారి తీసింది. చివరకు ఇందిరమ్మ సర్కార్ ఎన్నికల్లో కుప్పకూలింది. ఇప్పుడు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్ని కలకూ భారత పొలిమేరల్లోకి వచ్చిన అమెరికా సెవెంత్ ఫ్లీట్ యుద్ధ నౌకకూ ఎటువంటి సంబంధం లేదు. ఆ నౌక బంగాళా ఖాతంలోకి కూడా రాలేదు. అరేబియా సముద్రంలో లక్షద్వీప సముదాయానికి చేరువగా వచ్చింది. కాకపోతే బెంగాల్ ఎన్నికల ఫలితాలకు మాత్రం భారత రాజకీయాలను మలుపుతిప్పే సామర్థ్యం ఉన్నది. ఒకవేళ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ బెంగాల్లో గెలిస్తే అశోకుడు కళింగ యుద్ధం గెలిచినట్టే. ఆర్యావర్తమంతటా కాషాయ ధ్వజారోహణం జరిగినట్టే. మిగిలి పోయే కొన్ని దక్షిణాది రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీల పొత్తులతో నెట్టుకురావల్సిందేనన్న అవగాహన ఆ పార్టీకి ఉన్నది. యుద్ధాల అవసరం పూర్తయిన తర్వాత అశోకుడు శేషజీవితాన్ని ధర్మ ప్రచారానికి వెచ్చించాడు. బెంగాల్ సవాల్ను బీజేపీ విజయ వంతంగా అధిగమించగలిగితే ఇక దేశంలో ఏకధ్రువ రాజకీ యాలు పునరావృతమవుతాయి. ఆరెస్సెస్ భావజాల వ్యాప్తికి మార్గం సుగమమవుతుంది. 1952 నుంచి 89 వరకు కాంగ్రెస్ నాయకత్వంలో ఏకధ్రువ రాజకీయ వ్యవస్థ కొనసాగింది. 1967లో తొమ్మిది రాష్ట్రాల్లో, 1977లో కేంద్ర స్థాయిలో కంగు తిన్నప్పటికీ 89 వరకు ఈ వ్యవస్థ నిలబడగలిగింది. అప్పటి నుంచీ పదేళ్లపాటు దేశ రాజకీయాలది ప్రయోగశీల దశ. 1999 నుంచి 2019 వరకు రెండు కూటముల ద్వయీ ధ్రువ రాజకీయాలు నడిచాయి. బెంగాల్లో గెలిస్తే మరోసారి ఏకధ్రువ వ్యవస్థకు పునాది పడుతుంది. ఈ పరిస్థితి మరోసారి నియంతృత్వ పోకడలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. ఇందిరాగాంధీలో పొడసూపిన నియంతృత్వ పోక డలు ఆమె వ్యక్తిగత స్థాయికే పరిమితం. కానీ ఇప్పుడు నడిచేది నరేంద్రమోదీ అయినా, నడిపించేది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని నియంత్రించేది సుసంఘటితమైన ఆర్ఎస్ఎస్. ఎదురు లేని అధికారం ఒకవేళ ఇప్పుడు నియంతృత్వ పోకడలకు బాటలు వేస్తే ఆ నియంతృత్వం వ్యవస్థీకృతంగా ఉంటుంది తప్ప వ్యక్తిగతం కాబోదు. సిద్ధాంతాలు, విధానాలు, ఆలోచనలు, ఆశయాలు, రాజకీ యాలన్నింటిలోనూ కాంగ్రెస్కు బీజేపీ భిన్నమైన పార్టీ. కానీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయ వలసిన అవసరం ఉంటుంది కనుక సంఘ్ భావజాలాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసే అవకాశం బీజేపీ ప్రభుత్వానికి కుదరడం లేదు. ఏకధ్రువ రాజకీయ వ్యవస్థ కుదురుకుంటే రాజ్యాంగంలో అవసరమైన సవరణలకు బీజేపీ వెనుకాడక పోవచ్చు. బలమైన కేంద్రం దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది. అందుకోసం రాష్ట్రాల అధికారాలను కత్తిరించే ప్రయత్నం చేస్తుంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షం నిర్వీర్యమైన నేపథ్యంలో పార్టీకి ముప్పు ముంచుకొచ్చే అవకాశం ప్రాంతీయ పార్టీల నుంచే గనక బలమైన రాష్ట్రాల ఉనికి రాజకీయంగా కూడా బీజేపీకి సమ్మతం కాదు. బెంగాల్ ఎన్నికల్లో గెలిస్తే ఈ దిశలో బీజేపీ ప్రయాణం వేగం పుంజుకుంటుంది. ఓడితే వేగం తగ్గుతుంది. మమతా బెనర్జీకి మాత్రం బెంగాల్ ఎన్నికలు జీవన్మరణ సమస్య. గెలిస్తే ఆమెకు జాతీయస్థాయిలో ప్రముఖ పాత్ర లభిస్తుంది. ఓడిపోతే పార్టీ మనుగడే కష్టం. ప్రభుత్వం, పోలీ సుల తోడ్పాటుతో చెలరేగడం తప్ప సంస్థాగతంగా తృణమూల్ కాంగ్రెస్కు అంత బలమైన పునాదులేమీ లేవు. పైగా ప్రతి పక్షాలపై విరుచుకుపడటం, దాడులు, దౌర్జన్యాలు చేయడం పశ్చిమ బెంగాల్ రాజకీయ సంస్కృతిలో భాగంగా మారాయి. నిర్మాణపరంగా బలమైన సీపీఎం, కాంగ్రెస్ పార్టీలే హింసా రాజకీయాల ధాటికి అల్లాడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ప్రతిపక్షంగా నిలదొక్కుకోవడం మమతకు శక్తికి మించిన కార్యంగా మారుతుంది. ఇప్పుడు గెలవడమే ఆమె పార్టీ మనుగడకు ఏకైక మార్గం. బెంగాల్లో ఏ ప్రాంతానికి వెళ్లినా ‘పరివర్తన్’ (మార్పు) అనే మాట బాగా వినపడుతున్నదని రాష్ట్రంలో పర్యటిస్తున్న వారు చెబుతున్నారు. పదేళ్ల కిందటి ఎన్నికలప్పుడు మొదటిసారిగా మమతా బెనర్జీయే ఈ మాటను ఉపయోగిం చారు. అప్పుడు జనంలో ఈ మాట మంత్రంలా మార్మోగింది. ఎన్నికల్లో నిజంగానే పరివర్తన జరిగింది. 34 ఏళ్లపాటు ఏకధాటిగా పాలించిన సీపీఎం కూటమి సర్కార్ కుప్పకూలింది. ఈసారి ఈ మాటను మోదీ ఉపయోగిస్తున్నారు. అసలు పరివ ర్తన్ (నిజమైన మార్పు) కావాలని ఆయన జనానికి చెబుతు న్నారు. జనంలోకి ఈసారి కూడా ఈ మాట బాగానే వెళ్లినట్టు కనిపిస్తున్నది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ చుట్టూ ఉన్న కోటరీలో అవినీతి ప్రబలిందనీ, వారు చేసే అరాచకాలు పెచ్చరిల్లాయని జనంలో ఒక అభి ప్రాయం ఏర్పడింది. దీనికితోడు బీజేపీ అమలుచేసిన సోషల్ ఇంజనీరింగ్ కూడా ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంపాటు బెంగాల్ రాజకీయాలపై ఆధిపత్యం చలాయించిన కమ్యూనిస్టులు కులం సమస్యను గుర్తించలేదు. వెనుకబడిన కులాల అస్తిత్వ సమస్యలను, వాటి ఆకాంక్షలను అంచనావేయలేకపోయారు. మండల్ ఆందోళన దేశాన్ని కుది పేస్తున్న రోజుల్లో కొందరు జాతీయ మీడియా ప్రతినిధులు అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసును ఈ అంశంపై ప్రశ్నించారు. అందుకాయన బదులిస్తూ ‘మా రాష్ట్రంలో రెండే కులాలున్నాయి. ఒకటి పేదల కులం, రెండు ధనికుల కులం’ అన్నారు. అదీ, కుల సమస్యపై కమ్యూనిస్టుల అవగాహన. సమాజంలో క్రీమీలేయర్గా చలామణి అయ్యే చదువుకున్న వారు, ఉన్నత–మధ్యతరగతి వర్గం ప్రజలను బెంగాల్లో భద్ర లోక్ అంటారు. కమ్యూనిస్టుల నాయకత్వ శ్రేణుల్లో కూడా ఈ భద్రలోక్ బృందమే ఎక్కువగా ఉండేది. వాళ్లలో అత్యధికులు సహజంగానే ఉన్నత కులాలకు చెందినవాళ్లే ఉండేవారు. రైతులు, వ్యవసాయ – పారిశ్రామిక కార్మికులుగా ఉండే తక్కువ కులాలవారు భద్రలోక్ నాయకత్వంలో కమ్యూనిస్టు అనుబంధ సంఘాల్లో సంఘటితమై ఉండేవారు. కానీ, నాయకత్వ శ్రేణు ల్లోకి పెద్దసంఖ్యలో చేరుకోలేకపోయేవారు. జ్యోతిబసు ముఖ్య మంత్రిగా 1978లో ప్రారంభించిన ఆపరేషన్ బర్గా (భూసంస్క రణలు) దేశంలో ఎక్కడా లేనంత పటిష్టంగా అమలైన కార ణంగా పదిహేను లక్షలమందికి కొత్తగా సేద్యపు భూమి దక్కింది. ఈ రైతులందరూ వారి జీవితకాలం పాటు ఎర్రజెండా నీడలోనే ఉండిపోయారు. కానీ తరువాతి తరం ఆకాంక్షలను గుర్తించడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. అలాగే పారిశ్రా మిక కార్మికులందరూ వామపక్ష కార్మిక సంఘాల్లో సభ్యులుగా ఉండేవాళ్లు. కనుక బెంగాల్ రాజకీయాల్లో కులం అనేది నిన్నమొన్నటివరకు ఒక సమస్యగా ముందుకు రాలేదు. కమ్యూ నిస్టుల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ రాజకీయ– సామాజిక పొందికపై పెద్దగా దృష్టిపెట్టలేదు. గడిచిన రెండు మూడేళ్లుగా భారతీయ జనతా పార్టీ బెంగాల్ సామాజిక సమీకరణాలపై బాగా దృష్టిపెట్టింది. వెనుకబడిన శూద్ర కులాల్లో, దళితుల్లో గిరిజనుల్లో ఉండే అస్తిత్వ ఆరాటాన్ని పసిగట్టి వాళ్లను నాయకత్వ శ్రేణుల్లోకి తీసుకొచ్చింది. మరోపక్క భద్రలోక్ వర్గాన్ని కూడా జాతీయవాద భావ జాలంతో ఆకర్షించగలిగింది. బీజేపీ చాపకింద నీరులా చేపట్టిన ఈ సోషల్ ఇంజనీరింగ్ను తృణమూల్ కాంగ్రెస్ ఆలస్యంగా గుర్తించింది. దాంతో బెంగాల్ సంస్కృతిని హుటాహుటిన రంగంలోకి దించారు. బెంగాల్ సంస్కృతిపై మోదీ యుద్ధం చేస్తున్నారని మమత ప్రచారాన్ని ఎత్తుకున్నారు. అయితే బెంగాల్ సంస్కృతిగా మనం పరిగణించేది ప్రధానంగా అక్కడి భద్రలోక్ సంస్కృతి. ఈ సంస్కృతి వలయానికి ఆవల వున్న విశాల శ్రామిక ప్రజానీకం ఎంతమేరకు మమత పిలుపునకు స్పందిస్తారో వేచి చూడాలి. ప్రీపోల్ సర్వేలన్నీ మమతా బెనర్జీ విజయాన్ని ఘోషిస్తున్నాయి. గాలి చూస్తే ‘పరివర్తన్’ కోరు తున్నది. మమతా బెనర్జీని బెంగాలీలు దీదీ అని పిలుచుకుంటారని తెలిసిందే. బీజేపీ వాళ్లు మాత్రం ప్రచారంలో వెటకారం చేస్తున్నారు. అరవయ్యారేళ్ల వయసులో దీదీ ఏమిటి? ‘పీషీ’ (అత్త) అనాలంటూ ప్రచారం చేస్తున్నారు. వయసు పెరిగితే మాత్రం వరస మారుతుందా? కాకపోతే బడా దీదీ (పెద్దక్క) అనొచ్చు. బడా దీదీ అనే మాట కూడా చాలా పాపులర్. సుప్ర సిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ నవలల్లో బడా దీదీ కూడా ఒకటి. శరత్ సాహిత్యం తెలుగులో ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పనక్కరలేదు. బడాదీదీ తెలుగు నవలతోపాటు ‘బాటసారి’ పేరుతో సినిమాగా కూడా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు అద్భుతంగా నటించిన సినిమాల్లో ఒకటి. ఇందులో హీరో అందుబాటులోనే ఉన్నంత కాలం భానుమతి (సినిమాలో బడా దీదీ) ఏదో చెప్పాలను కుంటూనే చెప్పలేకపోతుంది. అతడు దూరమైన తర్వాత దుఃఖిస్తూ ‘ఓ బాటసారీ... ననూ మరవకోయీ’ అని పాడు కుంటుంది. ఇప్పుడు మన బెంగాల్ బడా దీదీ ఇప్పటికే ఆ పరిస్థి తికి చేరుకున్నదా... ఆమెకు ఇంకా సమయం మిగిలే ఉన్నదా అనేది ఫలితాలతోనే తేలాల్సి ఉంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
భారత అమ్ముల పొదిలో ‘వారుణాస్త్ర’o
సాక్షి, విశాఖపట్నం: భారత రక్షణ దళం అమ్ముల పొదిలోకి శక్తివంతమైన ఆయుధం వచ్చి చేరింది. సముద్రగర్భంలో ఉన్న శత్రుదేశ సబ్మెరైన్ని ధ్వంసం చేసే అత్యంత బరువున్న టార్పెడో వారుణాస్త్రని తయారు చేసిన భారత డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) భారత నౌకాదళానికి అప్పగించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)కి చెందిన నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్) వారుణాస్త్రని డిజైన్ చేయగా, బీడీఎల్ దీన్ని తయారు చేసింది. శనివారం విశాఖలోని బీడీఎల్ని సందర్శించిన డీఆర్డీవో చైర్మన్ డా.జి.సతీష్రెడ్డి చేతుల మీదుగా వారుణాస్త్రని నేవీకి అప్పగించారు. ఈ సందర్భంగా సతీష్రెడ్డి మాట్లాడుతూ ఇటీవలే బీడీఎల్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్(క్యూర్ఎస్ఎమ్) ప్రయోగం విజయవంతం అవడం దేశానికి గర్వకారణమన్నారు. ఎన్ఎస్టీఎల్, బీడీఎల్ సంయుక్త సహకారంతో మొదటి వారుణాస్త్రని విజయవంతంగా తయారు చేసినందుకు అభినందనలు తెలిపారు. అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పెడో (ఏఎల్డబ్ల్యూటీ), ఈహెచ్డబ్ల్యూటీ తయారీలో బీడీఎల్ శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారన్నారు. వారుణాస్త్ర విశేషాలు: యుద్ధ నౌక నుంచే ఈ హెవీ వెయిట్ టార్పెడోను సముద్రంలో దాగి ఉన్న శత్రు దేశపు జలాంతర్గావిుపై ప్రయోగించవచ్చు. 95 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రపంచంలో జీపీఎస్ ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పెడోగా వారుణాస్త్ర వినుతికెక్కింది. -
సొంత నౌకను పేల్చేసిన ఇరాన్
టెహ్రాన్: నావికాదళాలు విన్యాసాలు చేస్తున్న సమయంలో ఇరాన్ పొరపాటున తన స్వంత నౌకను పేల్చేసింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శిక్షణలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పర్షియన్ గల్ఫ్ జలాల ప్రాంతంలో ఇరాన్ యుద్ధ నౌక జమరాన్ క్షిపణిని ప్రయోగించింది. ఆ క్షిపణి సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న కొనరాక్ అనే నౌకను పొరపాటున టార్గెట్ చేసి పేల్చేసింది. ఈ దాడిలో గాయపడిన సిబ్బందిని సిస్తాన్, బలూచిస్తాన్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు ఫ్రావిన్స్ మెడికల్ యూనివర్సిటీ వైద్యుడు మహమ్మద్ మెహ్రాన్ తెలిపారు. (ఆ విమానాన్ని మా రెండు క్షిపణులు కూల్చాయి: ఇరాన్ ) అయితే ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారనేది స్పష్టంగా తెలియరాలేదు. కాగా నెదర్లాండ్స్ తయారు చేసిన కొనరాక్ నౌకను 1979 సంవత్సరం కన్నా ముందే ఇరాన్ కొనుగోలు చేసింది. ఆ నాటి నుంచి దీని సేవలను వినియోగించుకుంటోంది. ఇదిలా వుండగా ఈ ఏడాది తొలినాళ్లలో టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్కు చెందిన ఎయిర్ లైన్స్ విమానాన్ని సైతం ఇరాన్ పొరపాటున పేల్చేసిన సంగతి తెలిసిందే. ఇక అమెరికా నౌకలకు అడ్డు తగిలితే ఇరాన్ నౌకలను కాల్చి పారేయాలంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలివ్వగా ఇరాన్ తన సొంత నౌకపైనే క్షిపణి ప్రయోగించింది. (కాల్చిపారేయండి: ట్రంప్ వార్నింగ్) -
చైనా నేవీకి నిధులు, వనరుల మళ్లింపు
న్యూఢిల్లీ: చైనా ఆర్మీలోని వివిధ ఇతర విభాగాల నుంచి నిధులు, వనరులను భారీ స్థాయిలో నౌకాదళానికి మళ్లించారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్వీర్ సింగ్ గురువారం చెప్పారు. ఈ విషయాన్ని భారత్ జాగ్రత్తగా గమనించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సైనిక అభివృద్ధిపై చైనా రక్షణ శాఖ బుధవారమే ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. తన మిలటరీ అభివృద్ధిని ఇండియా, అమెరికా, రష్యాల అభివృద్ధితో చైనా ఈ శ్వేతపత్రంలో పోల్చింది. అందులోని వివరాలను పరిశీలించిన మీదట కరమ్వీర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిక్కీ నిర్వహించిన ‘నౌకల నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం’ అనే కార్యక్రమంలో కరమ్వీర్ సింగ్ ప్రసంగించేందుకు వచ్చి, అక్కడి విలేకరులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘చైనా తన శ్వేత పత్రంలోనే కాదు. గతంలోనూ ఈ వివరాలు చెప్పింది. ఆర్మీలోని ఇతర విభాగాల నుంచి నిధులను, వనరులను నౌకాదళానికి వారు మళ్లించారు. ప్రపంచ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతోనే వాళ్లు ఇలా చేశారు. మనం దీనిని జాగ్రత్తగా గమనిస్తూ, మనకున్న బడ్జెట్, పరిమితుల్లోనే ఎలా స్పందించగలమో ఆలోచించాలి’ అని అన్నారు. అనంతరం వేదికపై కరమ్వీర్ ప్రసంగిస్తూ 2024 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యానికి, నౌకా నిర్మాణ రంగం ఎంతగానో చేయూతనివ్వగలదని పేర్కొన్నారు. -
నౌకలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి
ముంబై: ముంబైలోని మజ్గావ్ నౌకానిర్మాణ స్థావరంలో ఇంకా నిర్మాణంలో ఉన్న విశాఖపట్నం యుద్ధనౌకలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగి ఓ కార్మికుడు మరణించాడు. మరో కార్మికుడు గాయపడినట్లు అధికారులు చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్బిల్డర్స్ (ఎండీఎస్ఎల్) ఓ ప్రకటన విడుదల చేస్తూ, యార్డ్–12704లో సాయంత్రం నాలుగు గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందనీ, ఊపిరాడక పోవడం, శరీరం కాలడం కారణంగా బజేంద్ర కుమార్ (23) అనే కాంట్రాక్టు కార్మికుడు మరణించాడని తెలిపింది. మరో కార్మికుడికి స్వల్పంగా కాలిన గాయాలయ్యాయంది. ఇది కాస్త తీవ్రమైన ప్రమాదమేనని అగ్నిమాపక శాఖ అధికారులు అన్నారు. ఎనిమిది అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేశారు. యుద్ధనౌకలోని రెండు, మూడు అంతస్థులకు మంటలు వ్యాపించాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విచారణ జరిపి వాస్తవాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. -
అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు
వాషింగ్టన్: అమెరికా–ఇరాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్పై పలు ఆంక్షలు విధించిన అమెరికా, తాజాగా విమానవాహక యుద్ధనౌక యూఎస్ఎస్ ఆర్లింగ్టన్ను పశ్చిమాసియా సముద్రజలాల్లో మోహరిస్తున్నట్లు ప్రకటించింది. ‘పేట్రియాట్’ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను ఈ ప్రాంతానికి తరలించనున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు, బలగాలపై దాడికి ఇరాన్ పూర్తి సన్నద్ధతతో ఉందన్న నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే మోహరించిన యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ యుద్ధనౌక, బీ–52 బాంబర్ విమానాలకు ఇవి జతకలవనున్నాయి. ఇరాన్తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదనీ, కానీ తమ బలగాలను, ప్రయోజనాలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణశాఖ స్పష్టం చేసింది. ఉ.కొరియాది విశ్వాసఘాతుకం కాదు: ట్రంప్ ‘ఉ.కొరియా స్వల్పశ్రేణి క్షిపణులనే పరీక్షించింది. అవి సాధారణమైన పరీక్షలు. క్షిపణి పరీక్షలు విశ్వాసఘాతుకమని నేను అనుకోవట్లేను. ఉ.కొరియా అధినేత కిమ్తో నాకు సత్సంబంధాలు ఉన్నాƇు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. గతేడాది జూన్లో ట్రంప్తో భేటీ నేపథ్యంలో అన్నిరకాల అణు, ఖండాంతర క్షిపణి పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కిమ్ ప్రకటించారు. ఫిబ్రవరిలో ట్రంప్తో రెండో విడత చర్చలు విఫలం కావడంతో ఈ ఏడాది చివర్లోగా పద్ధతిని మార్చుకోవాలని అమెరికాను కిమ్ హెచ్చరించారు. -
భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ కిల్తాన్
విశాఖ సిటీ: భారత అమ్ములపొదిలో మరో అధునాతన యుద్ధ నౌక చేరింది. సముద్రపు అడుగు భాగం లో ఉన్న సబ్మెరైన్లనైనా గుర్తించి, మట్టుపెట్టే ఐఎన్ఎస్ కిల్తాన్ను ఈ నెల 16న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ప్రాజెక్టు–28 కింద నిర్మించ తలపెట్టిన నాలుగు యాంటీ సబ్మెరెన్ యుద్దనౌకల్లో ఇది మూడోది. ఐఎన్ఎస్ కమోర్తా, ఐఎన్ఎస్ కద్మత్ నౌకలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో నాలుగో యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవరత్తి కూడా సిద్ధం కానుంది. 1971లో ఇండో పాక్ యుద్ధ సమయంలో నిరుపమాన సేవలందించిన యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కిల్తాన్ను 1987లో డీ కమిషన్ చేశారు. మళ్లీ ఇదే పేరుతో నౌకను సిద్ధం చేసినట్లు నౌకాదళాధికారులు తెలిపారు. కిల్తాన్ ప్రత్యేకతలు.. ఐఎన్ఎస్ కమోర్తా కంటే శక్తిమంతమైనది. తొలిసారి పూర్తిస్థాయి కార్బన్ ఫైబర్ కాంపొజిట్ మెటీరియల్తో దీన్ని తయారు చేశారు. అన్ని ప్రధాన ఆయుధాల్ని, సెన్సార్లను సముద్రపు జలాల్లో ట్రయల్ రన్ నిర్వహించి.. షిప్ యార్డ్ ద్వారా నౌకాదళానికి అప్పగిస్తున్న మొదటి యుద్ధ నౌకగా పేరొందింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడం వల్ల సముద్ర జలాల్లో వెళ్తున్నప్పుడు సబ్ మెరైన్లు సైతం దీని ధ్వనితరంగాలను కనిపెట్టడం దాదాపు అసాధ్యం. 109 మీటర్ల పొడవు, 3,500 టన్నుల బరువున్న ఐఎన్ఎస్ కిల్తాన్ 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. నిరాటంకంగా 3,450 నాటికల్ మైళ్లు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం. భారీ టార్పెడోలు, ఏఎస్డబ్ల్యూ రాకెట్లు, 76 మిమీ క్యారిబర్ మీడియం రేంజ్ తుపాకీలు, క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ కలిగిన 2 మల్టీ బ్యారెల్ తుపాకీలున్న సెన్సార్ సూట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. మిస్సైల్ డెకోయ్ రాకెట్లు, ఎలక్ట్రానిక్ సపోర్ట్ మేజర్ వ్యవస్థ, ఎయిర్ సర్వైవలెన్స్ రాడార్ వ్యవస్థతో పాటు ఏఎస్డబ్ల్యూ హెలికాప్టర్ కూడా ఇందులో ఉంటుంది. -
టర్కీ బోటుపై రష్యా యుద్ధనౌక కాల్పులు!
రష్యా, టర్కీ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ యుద్ధవిమానాన్ని సిరియా సరిహద్దుల్లో టర్కీ కూల్చేయడంతో గుర్రుగా ఉన్న రష్యా.. ఆ దేశంపై కారాలు, మిరియాలు నూరుతోంది. ఈ క్రమంలో తాజాగా రష్యా యుద్ధనౌక ఒకటి టర్కీ పడవపై కాల్పులు జరపడం ఉద్రిక్తతలు మరింత పెంచింది. టర్కీ పడవ ఎదురుగా వస్తూ తమను ఢీకొనేలా ఉండటంతో రష్యా యుద్ధనౌక హెచ్చరిక కాల్పులు జరిపింది. ఆదివారం ఏజియన్ సముద్రంలో లిమ్నస్ గ్రీకు దీవులకు 22 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. తమ యుద్ధవిమానాన్ని కూల్చేసి ఇద్దరు సైనికులను టర్కీ హతమార్చిందని రష్యా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన తాజా కాల్పుల ఘటనలో టర్కీ పడవ సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా? లేదా? అన్నది ధ్రువీకరించాల్సి ఉందని ఆ దేశ విదేశాంగశాఖ తెలిపింది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై దాడుల విషయంలో అమెరికా మద్దతు ఉన్న టర్కీ.. రష్యా తీరును తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. -
వండర్ ఎట్ సీ
అబ్బురపరచిననౌకాదళ విన్యాసాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భారత తూర్పునౌకదళం తన యుద్ధపాటవాన్ని ఘనంగా ప్రదర్శించింది. నేవీ డే ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నం సముద్ర జలాల్లో మంగళవారం ‘డే ఎట్ సీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1,400మంది ప్రజలు, విద్యార్థులను యుద్ధ నౌక ఐఎన్ఎస్ జలాశ్వపై సముద్రంలోకి తీసుకువెళ్లి యుద్ధ విన్యాసాలను ప్రదర్శించారు. యుద్ధాలు, తీవ్రవాదుల దాడులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాల సమయంలో సముద్రం చిక్కుకున్నవారిని చేతక్ హెలికాప్టర్ల నుంచి నౌకాదళ సిబ్బంది ఎలా కాపాడేది ప్రదర్శించి చూపారు. నాలుగు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లపై నుంచి నౌకాదళ సిబ్బంది అబ్బురపరిచే రీతిలో యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు. ఈ విన్యాసాల్లో ఐఎన్ఎస్ జలాశ్వతోపాటు యుద్ధనౌకలు ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ సైహ్యాద్రి, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ విభూతి, చేతక్, కమోవ్, హాక్ హెలికాప్టర్లు, మిగ్ ఎయిర్క్రాఫ్ట్లు పాల్గొన్నాయి. శత్రుదేశాల జలాంతర్గాముల ఉనికిని ప్రత్యేక పరికరంతో గుర్తించి విధ్వంసం చేసే యుద్ధ విన్యాసం అందర్నీ ఆకట్టుకుంది. భారత జలాల్లోకి ప్రవేశించే శత్రుదేశ నౌకలపై యుద్ధ విమానాల నుంచి ఎలా దాడి చేసేది ప్రదర్శించారు. వారి యుద్ధ విమానాలను క్షిపణుల ద్వారా నేలకూల్చడం, యుద్ధ నౌకలకు సముద్ర జలాల్లోనే ఇంధనం నింపడం, హాక్ యుద్ధ విమానాలు అతి తక్కువ ఎత్తులో అత్యంత వేగంతో చేసిన విన్యాసాలు ఆశ్చర్యచకితులను చేశాయి. నాలుగు యుద్ధ నౌకల నుంచి క్షిపణులతో ఒకేసారి లక్ష్యాలను ఛేదించడం అబ్బురపరచింది. ఈస్ట్రన్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ ఏబీ సింగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ విన్యాసాల్లో ఐఎన్ఎస్ జలాశ్వకు కెప్టెన్ టీవీఎన్ ప్రసన్న, ఐఎన్ఎస్ శివాలిక్కు కెప్టెన్ పురువీర్దాస్, ఐఎన్ఎస్ సహ్యాద్రికి కెప్టెన్ జ్యోతిన్ రానా, ఐఎన్ఎస్ శక్తికి కెప్టెన్ విక్రమ్ మీనన్, ఐఎన్ఎస్ విభూతికి లెఫ్ట్నెంట్ కమాండర్ వి.కాశిరామన్ సారథ్యం వహించారు. యుద్ధనౌకల సందర్శనకు అవకాశం విద్యార్థులు, ప్రజలకు యుద్ధ నౌకలను సందర్శించే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఈస్ట్రన్ ఫ్లీట్ కమాండర్ ఏబీ సింగ్ తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో విద్యార్థులు ఐఎన్ఎస్ డేగాలో యుద్ధ విమానాలను సందర్శించేందుకు అనుమతిస్తామన్నారు. సాధారణ ప్రజలను 22, 23 తేదీల్లో అనుమతిస్తామన్నారు. డిసెంబర్ 4న విశాఖపట్నం బీచ్లో నేవీ డే ప్రధాన వేడుకలు నిర్వహిస్తామని ఏబీ సింగ్ తెలిపారు. అందుకు ముందుగా డిసెంబర్ 2న రిహార్సల్స్ ఉంటాయన్నారు.