ప్రశాంతంగా నీట్‌ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

Published Mon, May 6 2024 10:35 AM

ప్రశాంతంగా నీట్‌

ఆదిలాబాద్‌టౌన్‌: మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన నీట్‌ ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష కొనసాగింది. బయోమెట్రిక్‌ హాజరు ఉండడంతో విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచే కేంద్రంలోనికి అనుమతించారు. చావరా అకాడమి కేంద్రంలో 548 మందికి గాను 15 మంది గైర్హాజరయ్యారు. ఆర్యభట్ట ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కేంద్రంలో 528 మందికి గాను 14 మంది గైర్హాజరయ్యారు. ఆలాగే ఆర్యభట్ట హైస్కూల్‌లో 657 మందికి గాను 638 మంది హాజరయ్యారు. మొత్తం 48 మంది గైర్హాజరైనట్లు పరీక్ష కోఆర్డినేటర్‌ శిశీర్‌ తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement