తుమ్మపాల : ప్రధానిని నరేంద్ర మోదీ కశింకోట మండలం రాజుపాలెం గ్రామంలో ఈ నెల 6న బహిరంగ సభకు విచ్చేయు సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నట్టు ఎస్పీ కె.వి.మురళీకృష్ణ తెలిపారు. భారీ వాహనాలు, కంటైనర్లు, టిప్పర్లు లారీలు, ఇతర వాహనాలను ట్రాఫిక్ దృష్ట్యా మళ్లించడం జరుగుతుందన్నారు. సోమవారం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారీ వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. వివరాలిలా...
●విశాఖపట్నం నుంచి తుని వైపు జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనాలు విశాఖపట్నం నుంచి బయలుదేరి లంకెలపాలెం జంక్షన్ – పరవాడ – అచ్యుతాపురం – ఎలమంచిలి – రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలి.
●తుని నుండి విజయనగరం, విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లేందుకు తుని – రేగుపాలెం జంక్షన్ – యలమంచిలి బైపాస్ – అచ్యుతాపురం – పరవాడ – లంకెలపాలెం జంక్షన్– అసకపల్లి జంక్షన్ మీదుగా విజయనగరం, శ్రీకాకుళం లేదా దేశపాత్రునిపాలెం నుంచి జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నం చేరుకోవచ్చు.
●సబ్బవరం జాతీయ రహదారి మీదుగా వచ్చే వాహనాలు అసకపల్లి – లంకెలపాలెం జంక్షన్ – పరవాడ – అచ్యుతాపురం – యలమంచిలి బైపాస్ – రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని వైపు వెళ్లవచ్చు.
●చోడవరం నుంచి తుని వైపు వెళ్లే వాహనాలు అనకాపల్లి బ్రిడ్జి – మునగపాక – పూడిమడక రోడ్డు – అచ్యుతాపురం జంక్షన్ – యలమంచిలి బైపాస్– రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని వైపు వెళ్లవచ్చు.