
అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్, గురుకులాల్లో ఉండే విద్యార్థులకు మంచి ఆహారం అందించే లక్ష్యంగా డైట్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్పీ, ఎస్టీ హాస్టల్ గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డైట్ చార్జీల పెంపు ఉత్తర్వులను సీఎస్ జవహర్రెడ్డి జారీ చేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలు వివరాలు ఇలా ఉన్నాయి..
- 3,4 తరగతుల విద్యార్థుల డైట్ చార్జీలు 1150 కి పెంపు
- 5 నుండి 10 వ తరగతి విద్యార్థుల డైట్ చార్జీలు 1400 కి పెంపు
- ఇంటర్ ఆపై విద్యార్థులకు డైట్ చార్జీలు 1600 కి పెంపు
- డైట్ ఛార్జీలతో పాటు విద్యార్థులకు నెల నెలా ఇచ్చే కాస్మొటిక్ ఛార్జీ లు పెంపు
Comments
Please login to add a commentAdd a comment